Thursday, March 25, 2021

దేవుడి వైపు కు నడుద్దాం

దేవుడి వైపు కు నడుద్దాం

✍️మురళీమోహన్

👌ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు , ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం , పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా ? అందుకే దేవస్థానానికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. '' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : '' నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. ''

అందుకే , శరీరానికి భోజనం [ ఆహారం ] ఎలాగో . మనసుకు దైవ ధ్యానం , దైవ నామ స్మరణ అలాగా. నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మ కు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం [ God realisation] అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment