Thursday, December 16, 2021

సప్తధాతువులు

సప్తధాతువులు:-

ఈ శరీరం సప్తధాతువులు చేత తయారు కాబడింది. అవి
1) రసం:- మనం భుజించే అన్నపానీయాలు 4 గం౹౹ల నుండి 6 గం౹౹లకు రసంగా మారును.
2) రక్తం:- రసం రక్తంగా మారుటకు 27 రోజులు పడుతుంది. (నక్షత్రాలు)
3) మాంసం:- రక్తం మాంసంగా మారుటకు 40 రోజులు పట్టును. (దీక్షలు)
4) మేధస్సు:- మాంసం మేధస్సుగా మారుటకు 52 రోజులు పట్టును. (అక్షరాలు)
5) ఎముకలు:- మేధస్సు ఎముకలుగా మారుటకు 64 రోజులు పట్టును. (కళలు)
6) మజ్జ:- ఎముకలు మజ్జగా మారుటకు 21 రోజులు పట్టును. (యజ్ఞంలో సమిధలు)
7) శుక్లము/ శోణితం (రేతస్సు/రజస్సు):- ఈ మజ్జ శుక్లము (పురుషునికి సంబంధించినది)/శోణితంగా (స్త్రీకి సంబంధించినది) మారుటకు 96 రోజులు పట్టును. ఇట్టి శుక్ల, శోణితాల కలయిక వల్లనే 84 లక్షల జీవరాశులు ఉద్భవించినవి.
ఈ శుక్లము/ శోణితం జీవునకు ఓజస్సుగా మారుటకు 108 రోజులు పట్టును. ఈ ఓజస్సే తేజస్సుగా పరిణమించును.
(ఓజస్సు= Inner Glowness, తేజస్సు= Outer Glowness)

సేకరణ

No comments:

Post a Comment