Tuesday, July 26, 2022

🇮🇳🌹కార్గిల్ విజయ వీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం🌹🇮🇳

🇮🇳🌹కార్గిల్ విజయ వీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం🌹🇮🇳

వెరపులేని మీ అసమాన శౌర్యం
వెన్నుచూపని మీ అప్రతిహ ధైర్యం
భారత సరిహద్దువీరులారా వందనం దుష్టశత్రు...
వెరపులేని మీ అసమాన శౌర్యం
వెన్ను చూపని మీ అప్రతిహ ధైర్యం
భారత సరిహద్దువీరులారా వందనం
దుష్టశత్రు సంహారకులారా వందనం
శతృదేశాలకి మీరు శతఘ్నులు దేశప్రజలకి మీరు రియల్ హీరోలు భారత యువతకి ప్రేరకులయ్యారు కార్గిల్ విజయానికి సాధకులయ్యారు

కార్గిల్ యుద్ధం: దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాది పాకిస్థాన్ పై మనం సాధించిన విజయం సామాన్యమైనది కాదు. మంచుకొండలపై మాటు వేసి భారత్ దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్ విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 23ఏళ్లు పూర్తయ్యింది.

హిమాలయ పర్వతాల్లోని ఘర్కోం అనే గ్రామంలో తషీ నామ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్ సౌరభ్ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన.

శత్రు దేశం- నమ్మకద్రోహం:

భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. భూభాగానికి 14-18వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రదేశంలో ఉండే అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకుని భారత్ ను దోంగ దెబ్బతీయాలని పన్నాగం పన్నింది. ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తురుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్ కుయుక్తులు పన్నింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పెయీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లు రెండు దేశాల మధ్య శాంతి కోసం 'లాహోర్ ప్రకటన' చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఈ కుట్రకు తెరదీశారు.

ఆపరేషన్ విజయ్: భారత సైనిక శిబిరాల నుంచి ఎన్ని హెచ్చరికలు చేసినా, పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. 'ఆపరేషన్ విజయ్' పేరుతో 1999, మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' పేరుతో ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది.

అయితే 32వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్ ఫోర్స్కు ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లోనే మూడు యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో దెబ్బతిన్న బెబ్బులిలా లేచిన వాయుసేన మిరాజ్-2000 యుద్ధవిమానాల ద్వారా శత్రవులపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం వరుస దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్ కు వ్యతిరేకంగా సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత్ కు వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాకు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.

మన సైనికుల వీర పోరాటంతో హిమాలయ పర్వత శ్రేణుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా, 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ చెందిన దాదాపు 3వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది.. ఈ వేళ మనమూ వీర సైనికుల త్యాగాలను స్మరించుకుందాం. ప్రభుత్వాలు సైనికుల త్యాగాలకి తగిన ప్రాధాన్యతనివ్వాలి. వీరమరణం పొందిన కుటుంబాలకి సంపూర్ణతోడుగా నిలవాలి. అలాగే యువతరం సినిమాల్లో నటించే వారిని కాకుండా, సైనికుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఇంట్లోని చిన్న పిల్లలకి రియల్ హీరోలుగా మన వీర సైనికులను చూపెడుదాం. దేశ సార్వభౌమత్వాన్ని భారత్ సైనికులను స్మరించుకుందాం ప్రభుత్వాలు సైనికుల త్యాగాలకి తగిన ప్రాధాన్యతనివ్వాలి. వీరమరణం పొందిన కుటుంబాలకి సంపూర్ణతోడుగా నిలవాలి. అలాగే యువతరం సినిమాల్లో నటించే వారిని కాకుండా, సైనికుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఇంట్లోని చిన్న పిల్లలకి రియల్ హీరోలుగా మన వీర సైనికులను చూపెడుదాం. దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టటంలో "జనశక్తి" అత్యావశ్యకమైనది. ఆ జనశక్తిలో జాతీయభావాలు పరిపుష్టం కావాలి. అప్పుడే దేశం యొక్క సైన్యం, ఆయుధ సంపత్తి, దౌత్యనీతి, పాలనా వ్యవస్థ అన్నీ సఫలం అవుతాయి.

🙏జై హింద్🙏

⚜జై భారత్⚜

🚩భారత్ మాతా కీ జై 🚩

సేకరణ

No comments:

Post a Comment