Friday, July 29, 2022

భక్తుడు అనుకునే వారి సాధన ఎలా ఉండాలి భగవంతునికి ఇష్టమైన భక్తి ఏమిటి

భక్తుడు అనుకునే వారి సాధన ఎలా ఉండాలి

భగవంతునికి ఇష్టమైన భక్తి ఏమిటి

" మానవునిలో హృదయ పరివర్తనం రానంతవరకు ఎన్ని సాధనలు చేసిననూ ప్రయోజనము లేదు "...
దయాగుణం, దానగుణం లేనిదే దైవమును ఎన్ని పూజలు చేసిననూ ఉపయోగం ఏమీ ఉండదు...
నేడు చాలామంది పుణ్యం వస్తుందని నదులలో స్నాన్నములు చేస్తుంటారు, ఉపవాసాలు చేస్తుంటారు, ప్రదక్షిణలు ,జపాలు చేస్తుంటారు...
కానీ వీటి వలన పుణ్యం రాదు, ఇవన్నీ మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి చేసే సాధనలు మాత్రమే! ...

నదులలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుందనుకుంటే, చేపలు కంటే పుణ్యాత్ములు ఈ సృష్టిలోనే ఉండవు!
ఉపవాసాలు ఉండడం వలన కోరికలు తీరుతాయి అనుకుంటే, నిత్యమూ ఆకలితో పస్తులుండే పేదవాడు ఎప్పుడో ధనవంతుడు అయ్యేవాడు! ...

మానవులను అధోగతి పాలు చేసే గుణాలు: అత్యాశ, సోమరితనం, లోభత్వం,  స్వార్థం, అహంకారం, పరనింద, ఆత్మస్తుతి, నీది కానిదానిని ఆశించడం, దానికై ఆరాటపడడం మొదలైన వాటివలన మానవుడు ఆధ్యాత్మిక పురోగతి సాధించలేక అధోగతి పాలవుతున్నాడు భ్రమకు లోనగుచున్నాడు... ఇవి క్రమక్రమంగా విడిచి పెడితేనే దైవానుగ్రహమునకు పాత్రులమౌతాము

కానీ అంతటితో ఆగిపోకుండా ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయము పరిశుద్ధం చేసుకుని పరమాత్మను అంతరాత్మలో ఆరాధించుకోవాలి,అప్పుడే ఆత్మాలో పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది

ఏనాడు మన హృదయాలు పరిశుద్ధమై పరమాత్మ కొరకు పరితపిస్తామో ఏ పనులు చేసినా అవి పరమాత్మ మెచ్చేలా చేయగలమో ఆనాటి నుంచి మనం నిజమైన పుణ్యాత్ములవుతాము... దన్యాత్ములవుతామని తెలుసుకుని ఆ ప్రకారం నడచుకోవడమే ఆధ్యాత్మిక సాధన... 

No comments:

Post a Comment