దేహమే దేవాలయం... జీవుడే దేవుడు... హృదయంలో ఉన్న భగవంతుడు ఎందుకు కనిపించడు?
✍️ డా. యమ్. ఎన్. చార్య.
🙏🌸🌺🪷🥀🌹🌷💐🌻🌼🍂🙏
🌈 దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం.
💫 మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు. మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళిన వారి దేహమే దేవాలయమౌతుంది.
🌈 భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు. దీనిని బట్టి మనకి తెలుస్తున్నది ఏమిటంటే...: భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం లేదు… ఎందుకనీ?
👉 మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!
🌈 మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు!
👉 "మొదటిది ‘నేను’ అనే తలంపు, ఇక రెండవది ‘నాది’ అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు."
🌈 మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడిని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి… ఎలా?
🌈 ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని – ఒకటే. అదే ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం.
🌈 ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి.
(కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).
🌈 మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములయ అనెడి ఆరు అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.
🌈 సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.
🌈 మనస్సునూ బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.
🌈 మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.
🌈 మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.
🌈 హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా, దాని గురించి ఆలోచించం.... ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.
🌈 మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది
🙏🌸🌺🪷🥀🌹🌷💐🌻🌼🍂🙏
సేకరణ
✍️ డా. యమ్. ఎన్. చార్య.
🙏🌸🌺🪷🥀🌹🌷💐🌻🌼🍂🙏
🌈 దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం.
💫 మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు. మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళిన వారి దేహమే దేవాలయమౌతుంది.
🌈 భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు. దీనిని బట్టి మనకి తెలుస్తున్నది ఏమిటంటే...: భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం లేదు… ఎందుకనీ?
👉 మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!
🌈 మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు!
👉 "మొదటిది ‘నేను’ అనే తలంపు, ఇక రెండవది ‘నాది’ అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు."
🌈 మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడిని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి… ఎలా?
🌈 ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని – ఒకటే. అదే ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం.
🌈 ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి.
(కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).
🌈 మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములయ అనెడి ఆరు అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.
🌈 సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.
🌈 మనస్సునూ బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.
🌈 మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.
🌈 మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.
🌈 హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా, దాని గురించి ఆలోచించం.... ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.
🌈 మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది
🙏🌸🌺🪷🥀🌹🌷💐🌻🌼🍂🙏
సేకరణ
No comments:
Post a Comment