🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఈ రోజు 83వ సారస్వత మహర్షి గురించి తెలుసుకుందాం...🌹
🌸సారస్వత మహర్షి దధీచి మహర్షి కొడుకు. సరస్వతీ నది ఇతణ్ణి పెంచి ధధీచి వల్ల వరాలు పొందింది. అన్ని నదులలోకి పవిత్రమైన నదిగా, దాంట్లో స్నానం చేసిన వాళ్ళ పాపాలు పోయి పవిత్రులయ్యేలా వరం పొందింది.
🌿దధీచి మహర్షి గురించి మనం ఇంతకు ముందే తెల్సుకున్నాం కదా ! అలాంటి గొప్ప మహర్షి కొడుకంటే ఇంకా ఎంత గొప్పవాడో మరి..!
🌸దేవతలు దధీచి మహర్షి ఎముకలతో చేసిన ఆయుధాల్లో రాక్షసులందర్నీ చంపిన తర్వాత ఒక్కసారిగా కరువు ఏర్పడి ప్రజలందరు వలస వెళ్ళిపోవడం మొదలు పెట్టారు.
🌿సారస్వతుడు సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమంలో వేదపారాయణ చేస్తూ, తన తపశ్శక్తితో కరువుని పోయేలా చేశాడు. పన్నెండు సంవత్సరాలు ఏడిపించి వదిలిన ఈ కరువు వల్ల శిష్యులు, గురువులు చెల్లాచెదరయిపోయారు.
🌸మళ్ళీ ఋషులందరూ తమ తమ ఆశ్రమాలకి చేరుకుని వేదాధ్యయనం మొదలు పెట్టారు. కాని పన్నెండు సంవత్సరాలు వదిలెయ్యడం వల్ల చెప్పేవాళ్ళకి, చెప్పుకునేవాళ్ళకి కూడా కష్టమయిపోయింది.
🌿ఒక శిష్యుడు తిరుగుతూ తిరుగుతూ, సరస్వతీ నదీ తీరంలో వేదఘోష విని అక్కడ సారస్వత మహర్షి వేదం నేర్పించడం చూసి మిగిలిన ఋషులకి చెప్పాడు. ఋషులందరూ అక్కడికి చేరారు. తమ దగ్గరకొచ్చి తమకి కూడ వేదం నేర్పమన్నారు.
🌸సారస్వతుడు గురువు దగ్గరికి వారే వచ్చి నేర్చుకోవడం ధర్మంగాని, గురువు నా దగ్గరికి రావడం ధర్మం కాదన్నాడు. ఋషులు మరి మేము వృద్ధులము నీవు బాలుడవు ఇది దోషం కాదా! అనడిగారు.
🌿వేదాల్లో చిన్నవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు నేర్చుకోకూడదనేం లేదు. ఇది గురుశిష్య సంబంధం మాత్రమే అన్నాడు సారస్వతుడు. అప్పుడు ఋషులు, శిష్యులు కూడా బారులు బారులుగా వచ్చి గురుశుశ్రూష చేస్తూ వేదం చదువుకున్నారు.
🌸ఈ రకంగా సారస్వతుడు లోకంలో కరువు బాధని పోగొట్టి, వేదాల్ని కూడా మళ్ళీ ఉద్ధరించాడు. ఇదీ సారస్వతుడి కథ..!!...
🌿రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాం ..స్వస్తి.....🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment