Monday, June 12, 2023

జీవితాలను మనం ఎలా గడపాలి?

 *జీవితాలను మనం ఎలా గడపాలి?*
*~ఒక అద్భుతమైన సమాధానం - ‘‘మీరింక ఒక్క గంట మాత్రమే బతుకుతారని తెలిస్తే ఏం చేస్తారో ఆ స్థితిలో జీవించాలి’’ అని చెప్పారు.*
*”మరో గంటలో మరణిస్తా” అని తెలియగానే బాహ్యమైన వ్యవహారాలు వెంటనే చక్కబెడతారు. వీలునామా రాయడం, కుటుంబ సభ్యుల్నీ, మిత్రుల్నీ పిలిచి వాళ్ళకేదయినా నష్టం కలిగించి ఉంటే క్షమించాలని అడగడం, వాళ్ళు హాని చేసి ఉంటే వాళ్ళను క్షమించడంతో పాటు మనసుకు సంబంధించిన కోరికలనూ, ప్రపంచాన్ని వదిలేస్తారు.*
 *ఒకేఒక్క గంట కోసం ఇదంతా చేయగలిగినప్పుడు.. "మీరు ఉన్నంతకాలం ఎందుకు ఆ పని చేయలేరూ?” అని. మహోన్నతమైనది కదా ఈ ఆలోచన?.*
 *శ్రీరామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి అయినా, శ్రీరమణ మహర్షి పొందిన ‘సహజస్థితి’ అయినా ఈ చట్రం లోనివే కదా.*
 *”అంతఃకరణాన్నీ, ఇంద్రియాలనూ జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని వదిలిపెట్టినవాడూ ఆశారహితుడైన సాంఖ్యయోగి.. శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవిస్తాడు” అని  శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు.*
 *మన భారతీయ పౌరాణిక, ఇతిహాస గాథల్లో భోగాలను తృణప్రాయంగా త్యజించిన చక్రవర్తులు కన్పిస్తారు. రుషభుడు కేవలానందావస్థలో సర్వం త్యజించి వెళ్ళిపోయాడు. అలాగే ఎందరో మహారాజులు అధికారాలనూ, భోగాలనూ అన్నింటినీ కాలితో తన్నేసి అంతర్ముఖులై జ్ఞానులయ్యారు.*

 *నిత్యజీవనంలో ఆ స్థితిని పొంది దానిలో నిలిచి ఉండడం. అపుడు ఏమీ మనల్ని అంటుకోవు. ముక్త జీవనమంటారు దానినే.*
 *ఎవరైతే ప్రకృతి స్వభావంలో ఇరుక్కుని అహంకారం అనే పాశంలో బందీలు అవుతారో వారు ఎప్పుడూ అన్ని రకాల ఆధిపత్యాల కోసం జీవిస్తూ ఉంటారు.*  *సర్వ భూతాంతర్గతమైన ఈశ్వర దర్శనాన్ని పొందినవారికి అన్ని జీవుల్లో ‘ఆత్మదర్శనం’ కలుగుతుంది. ఆ స్థితిని నిలకడగా నిలబెట్టుకోవడాన్నే యోగమంటాం.*
 * ఏ వయసులో, ఏ పరిస్థితుల్లో మనకు ఆ దర్శనం కలిగినా అది ధారాపాతంగా కొనసాగుతూనే ఉంటుంది.*
 *చమత్కారంలా కన్పించే ఈ పరమోన్నత స్థితిని చాలా మంది మరణం తర్వాత ఆశిస్తుంటారు. కానీ, దేహం ఉండగానే ముక్తిని కలిగించే ఆ స్థితి మహోన్నతమైనది.*
  *దాన్ని తెలుసుకుంటే చాలు “జీవితం ఎలా గడపాలి?” అనే ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది.* (సేకరణ)
చివరిగా
మనం సరైన సాధన చెస్తే ఆన్ని అద్భుతాలు సాధించవచ్చు... అహం అహంకారాలు, జన్మ జన్మల చెడు కర్మల దగ్దం.. వదలవలదిన అవసరం లేనివి వదిలించుకొని కావలసిన అవసరమైన అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో పొందవచ్చు.
పరమాత్మ స్వరూపం అయిన ఆత్మ ఎక్కడో లేదు... నీ శ్వాస లోనే ఉందనే సత్యాన్ని గమనించాలి... దేహమే దేవాలయం జీవుడే దేవుడు.. ఆ దేవుడు శ్వాస లోనే ఉన్నారనే అధ్యాత్మిక సత్యాన్ని గమనించాలి... కొద్దిగా అర్ధం చేసుకొండి... శ్వాస ఉంటే శివం లేకుంటే శవం... శ్వేసే జీవుడు, జీవుడే దేవుడు.

🙏కృష్ణం వందే జగద్గురుం 🙏

No comments:

Post a Comment