*ఆత్మానుభూతి*
*భగవంతుడు సృష్టించిన పదార్ధాల తో తిరిగి భగవంతుని ఆరాధించటం కాకుండా, మన మనో పుష్పాన్ని భగవంతునికి అర్పించటమే అనన్య భక్తి!
*ఈ మనో పుష్పం శుద్ధమై ఉండాలి.!
దానికి ముందు ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, శాంతి, క్షమా అహింసలు, తపము, ధ్యానం, సత్యం ఇవన్నీ సాధించాలి..
నిరంతరం తపన, సాధన చేయాలి.*
*ప్రతీ జడ, జీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే అన్న దాన్ని అనుభూతి పొందాలి.
*విశ్వం అంతటా పరమాత్మ చైతన్యమే నిండి ఉంది అని తెలుసు కొంటేనే ఆ శక్తి మనలో, జడ, జంతు జీవాలలో ఉంది అని అర్ధం అవుతుంది.
మనసు ఎపుడు కూడా బైటకే, బాహ్య వస్తువుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది.*
*అలాంటి మనసుని శుద్ధి చేసుకొని అంతర్ముఖం చేయాలి.*
*మనసు, బుద్ధి ఏకమై ఆత్మలో లయం అవ్వాలి.. లేదా మనసే ఆత్మ గా ప్రకాశించాలి.*
*చిత్త శుద్ధి పొందిన మనసుని ఆత్మ లో ప్రతిష్టించాలి!
*ఇలాంటి మనో పుష్పాన్నే భగవంతునికి సమర్పించాలి! ఇదే అనన్య భక్తి..
ఆత్మానుభూతి.*
*గృహస్తు అయినా, బ్రహ్మ చారి అయినా, సన్యాసి అయినా మనసు శుద్ధి చేసుకొంటే కానీ భక్తుడు కాలేడు.
*చిత్తశుద్ధి లేని పూజ పరమాత్మ స్వీకరించడు.
*ముక్తి పొందాలంటే భక్తి కావాలి.. భక్తి అంటే అనన్య భక్తి కావాలి..సంపూర్ణ శరణాగతి.*
*దీనికి చిత్త శుద్ధి, నిష్కామ కర్మలతో కూడిన నిరంతరం సాధన అవసరం..
ప్రతీ మానవునిలో 3 శరీరాలు ఉంటాయి.. స్థుల, సూక్ష్మ, కారణ శరీరాలు.*
*ఈ కారణ శరీరంలోనే అనేక జన్మర్జిత పాపపుణ్యాలు బీజరూపం లో నిక్షిప్తం అయివుంటాయి.. వీటి వల్లనే అనేక వికారాలు వస్తూ ఉంటాయి జీవుడికి.*
పైవికారాలు తొలగించుకోవాలి అంటే సూక్ష్మ శరీరం లో మార్పు రావాలి.*
*ఈ సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ స్థుల శరీరంతోనే ఏ సాధన అయినా చేయాలి.*
*’శరీరమాధ్యం ఖలుధర్మ సాధనం!’ కాబట్టి.. ఈ శరీరం తోనే సాధన చేయాలి.
ఇది లేకపోతే ఏమీ చేయలేము కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అన్న చందంగా..
ఈ శరీరం ఉండగానే, చిత్త శుద్ధి తో, నిష్కామ కర్మలతో, అనన్య భక్తి తో, సాధన చేస్తూ ఆత్మానుభూతి పొందాలి.*
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🦢🦢🩵🦢🦢
No comments:
Post a Comment