*ఆచార్య సద్బోధన*
➖➖➖
మన మనస్సులను పవిత్రం చేసుకుని స్వేచ్ఛాయుతంగా తెరిచి ఉంచినప్పుడు జీవితంలో ఒడిదొడుకులు ప్రవేశించలేవు. మన అంతరంగాన్ని చీకటిలో ఉంచరాదు. అక్కడ పవిత్రాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండాలి.
వెలుతురు ఉన్నప్పుడు విషయాలనే దొంగలు ప్రవేశించలేవు. అప్పుడే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. జీవితాన్ని సామరస్యం చేసుకొంటే చెడు మననుంచి దూరంగా తొలగిపోతుంది.
కష్టాలు కలిగినప్పుడు మాత్రమే కొందరు భగవంతుని స్మరిస్తారు. అలా కాక నిరంతరం భగవంతుని ప్రార్థిస్తే కష్టాలు కలిగినా వాటంతటవే తొలగిపోతాయి.
భగవంతునికి అత్యంత సన్నిహితంగా ఉండేలాగా మన జీవితాన్ని మలచు కోవాలి. ప్రాథమిక సత్యాలను మన జీవితాలకు ఆధార భూతంగా చేసుకోవాలి.
మన జీవితంలో ఖాళీలు ఏర్పడినప్పుడు వాటిని భర్తీ చేసుకోవాలి. అయితే దానిని బాహ్యంగా ఉన్న వాటితో నింపకూడదు. మనం ఎంతగా భౌతికతలో కూరుకుపోతే అంతగా అపజయం పాలవుతాం.
ఆత్మచైతన్యంలో జీవించినప్పుడు ఏదీ మనలను పడగొట్టలేదు. అందుకే ప్రపంచం మనలను బంధించ నివ్వకుండా ఆధ్యాత్మికతను తోడు చేసుకొని జీవించాలి.`
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
➖▪️➖
No comments:
Post a Comment