Wednesday, August 13, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
                *జ్ఞానసిద్ధి కోసం*

*భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం... ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది. భగవత్తత్వ అవగాహనలో మొదటి మెట్టు విగ్రహారాధన. భక్తికి ఒక ఆలంబన అవసరమన్నది మహర్షులు చెప్పిన మాట.*

*ప్రతిష్ఠించిన విగ్రహం వల్ల భక్తి పుడుతుంది. లక్ష్యం నిలవడానికి, ఏకాగ్రతకు ఓ రూపం అవసరం.*

*భగవంతుడు పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా అనే అయిదు తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి. ఈ అయిదింటిలో అర్చామూర్తి- విగ్రహ రూపంలో ఉంటాడు.*

*ఇటువంటి మూర్తిలోనే భక్తుడు తన ఇష్ట దైవాన్ని కొలుచుకుంటాడు. విగ్రహం వలన భక్తులు ఉపాసన* *చేసుకోవడానికి వీలవుతుంది.*

*ఉపాసకుడి కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరుడు ఓ రూపం దాల్చాడని పెద్దలు చెబుతారు.*

*పరబ్రహ్మ తత్వం అర్థమైన వారు నూటికొక్కరు ఉంటారు. అటువంటివారు 'హరిమయము విశ్వమంతయు' అనుకోగలరు. కానీ, సామాన్య భక్తులు ఇంతటి అవగాహనకు రాలేరు. వారికి నిత్యజీవిత కార్యకలాపాల్లో 'దేవుడు' ఒక భాగం. సాధారణ సాధకులు 'మూర్తి'ని దైవంగా భావించి సాధన చేస్తే మనసులోనే మహేశ్వరుడు ఉన్నాడనే దైవత్వ భావన కలుగవచ్చు. మనుషులంతా ఒకే రకమైన స్థాయిలో మానసిక పరిపక్వత ఉన్నవారు కారు. అందువల్ల ఆయా స్థాయి భేదాలు కలిగిన వారికోసం... భక్తి మార్గంలో వారు తరించడం కోసం విగ్రహారాధన తోడ్పడుతుంది. 'ప్రతిమా*

*స్వల్ప బుద్ధినాం యోగినాం హృదయే హరి:' అన్నారు పెద్దలు. ఇది అత్యంత విశాలమైన ప్రాతిపదిక కలిగిన స్వేచ్ఛాయుతమైన ఉపాసనా మార్గం. సాధకుడికి ప్రాథమిక దశలో విగ్రహారాధన అవసరం. పరిపక్వత సాధించిన వారికి మనసే మందిరమవుతుంది.*

*ఒక దేవతనే ఆరాధించమని హిందూ ధర్మం చెప్పదు. 'సర్వ దేవత నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి' అని సూక్ష్మంలో మోక్ష సూత్రం చూపారు రుషులు. రత్నం, బంగారం, శిల, మట్టి, కర్ర, స్పటికం, వెండి, రాగి ఇలా ఎనిమిది రకాల వస్తువులు ప్రతిమా రూపకల్పనకు యోగ్యమైనవి. అర్చకుడి నిష్ఠాగరిష్టతలు, శ్రద్ధాభక్తుల వల్ల శిల భగవద్రూపంగా రూపాంతరం చెందుతుంది. మంత్ర శక్తి, భక్తుడి భావనల తీవ్రత వంటివి ప్రతిమలో దైవ చైతన్యాన్ని ప్రోది చేస్తాయి. విగ్రహారాధన వల్ల జ్ఞాన సిద్ధి లభిస్తుంది. విగ్రహం అనే మాటకు విశేషంగా గ్రహించేది అనే అర్థముంది. త్యాగరాజు విగ్రహాలు దొరికినప్పుడు 'కనుగొంటిని రాముని' అన్నారు గానీ... 'కనుగొంటిని రాముని విగ్రహాన్ని' అనకపోవడం జ్ఞానానికి చిహ్నం.*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴
 *.           🔔  అనగనగా  🔔*

*ఓ ఊళ్ళోరాముడ్ని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు.*

*ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది.*

*"రాముడ్ని మన దరిద్రం తీర్చమని ప్రార్ధించరాదూ? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు".*

*"పిచ్చిదానా! మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను" అని అతను ఒప్పుకోలేదు.*

*ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి చెప్పాడు. "నీ ఇంట్లోని గూట్లో ఆరు రూపాయలు ఉన్నాయి కదా?అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది."*

*ఉదయం నిద్రలేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి, అతను సైకిలు మీద పెద్ద బజారుకి బయలు దేరాడు. ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత పది* *రూపాయలు.*

*ఇంకొంచెం ముందుకు సాగాడు, వేలంపాట వేసే ఓ హాల్లో బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలకి వెళ్ళాడు. గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి.*

*వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చారు. అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతాలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు.*

*"దీని పేరు శ్రీ రామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ళ కుర్రాడు. మా పాట అయిదు రూపాయలు."*

*చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అసహానంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలంపాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు. "మొదటిసారి అయిదు రూపాయలు... రెండవసారి... అయిదు రూపాయలు." అది రాముడి బొమ్మ అవడంతో, వెంకట్రావు గట్టిగా 'ఆరు రూపాయలు' అని అన్నాడు.*

*" ఆరు రూపాయలు, ఒకటోసారి... రెండోసారి "దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 'మూడోసారి' అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు.*

*అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూసారు.*

*"వేలంపాట మొత్తం ముగిసింది." అని చెప్పారు నిర్వాహకులు.*

*'అదేమిటి? ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా?" అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు.*

*"ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాసాడో వినండి. అకాల మృత్యువువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా అయిదు రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటిని ఉచితంగా ఇవ్వాలని రాసాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు... ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలని మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి."*

*ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి... ఆ ప్రేమని పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు...*

*┈┉┅━❀꧁ జై శ్రీరామ్ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🏹🍁 🙏🕉️🙏 🍁🏹🍁
 *శ్రీకృష్ణం ధర్మం సనాతనం.....* 

*'కృష్ణం ధర్మం సనాతనం' అని పురాణ వాక్యం. కృష్ణః అంటే అపరిమిత ఆనంద స్వరూపుడు. “పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనగా సాధు జన రక్షణ, దుష్టజన శిక్షణ, ధర్మ సంస్థాపనానికైతాను మళ్ళీమళ్ళీ అవతరిస్తాననిస్వయంగా ప్రకటించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు.*

*రామావతారంలో రాజుగా ఆర్తులను, దీనులను, భక్తులను ఆదుకున్నా అందరికీ అందుబాటులో లేని కారణంగా కృష్ణుడుగా క్షత్రియ వంశంలో పుట్టి రేపల్లెలోని గోపాలకులతో, గోపికలతో, గోవులతో కలసి మెలసి తిరిగాడు. పాపాలకు దూరంగా ఉన్న వారితోనే, వారిలోనే ఉంటానని చాటాడు. బాలునిగా ఉండి రేపల్లెలో ధర్మానికి హాని కలిగించేకంసుడు పంపిన రాక్షసులను వధించాడు. చివరికి కంసుని కూడా వధించగా ఆవైరంతో తనపై కక్షకట్టి దాడి చేసిన జరాసంధుని సైన్యాన్ని పద్దెనిమిది సార్లు హతమార్చాడు. చక్రవర్తి అయిన* *జరాసంధుడు ఎప్పుడు యుద్ధానికి వచ్చినా 23 అక్షౌహిణిల సైన్యాన్ని తీసుకొని వచ్చేవాడు. (అక్షౌహిణి అంటే 10 వేల రథాలు, ఇరవై వేల ఏనుగులు, ఇరవై వేల గుర్రాలు, 40 వేల సైన్యం). ఈ విధంగా 18 సార్లు ఓడించి అనగా 414 అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణ బలరాములు ఇద్దరు మాత్రమే వధించారు. 18 అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణుడు వెనకుండగా వధించిన అర్జునుడు, భీముడు మహా వీరులుగా కీర్తించబడితే 414 అక్షౌహిణిలను వధించిన కృష్ణుడు ధర్మ నిర్వహణ కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం.*

*కృష్ణావతారంలో ఆశ్రిత వాత్సల్యం, ఆశ్రిత పక్షపాతం, భక్తజన సౌలభ్యం ప్రస్ఫుటంగా కనపడతాయి. పాండవులకు దూత, సారథి అయి అనుక్షణం వారికి కంటికి రెప్పలాగా ఉన్నాడు. ఒక సారథిగా అర్జునుని గుర్రాల ఆలనాపాలనా చూసి, రధానికి ఉన్నదుమ్ము, దూళి తొలగించినట్లే మీ శరీరం, మనస్సులలోని మలినాలను తొలగించి గమ్యానికి చేర్చే రథసారథిని నేను అని పాండవులకు చాటినవాడు కృష్ణుడు. ధుర్యోధనుడు విందుకు పిలిస్తే కాదని విదురుని ఇంట్లో భోజనం చేసి ఆశ్రిత పక్షపాతాన్ని చాటిన ఆశ్రిత వత్సలుడు, ధర్మ వత్సలుడు శ్రీకృష్ణుడు. తప్పుచేసిన దేవతలను ఓడించి భక్తులైన గోపాలురను, గోవులను, గోపికలను అక్కున చేర్చుకున్న ధర్మ పక్షపాతి శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణం ధర్మం సనాతనం.*

*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🍁🕉️ 🙏🕉️🙏 🕉️🍁🕉️
 *ఆట అంటేనే గెలుపు ఓటములు కదా? గెలుపు ఓటములు నీ అధీనమైనా నమ్మిన వారిని గెలిపిస్తావో నమ్మకాన్ని వమ్ముచేసి ఓడిస్తావో నీ ఇష్టం.*

*నీతో ఆడి గెలవలేని నిస్సహాయత నాది అణువు ఎక్కడ? అనంతం ఎక్కడ? పరమాణువు ఎక్కడ? పర్వతం ఎక్కడ? సింధువు ఎక్కడ? సముద్రము ఎక్కడ అయినా నీ రచనలో భాగముగా ఉన్నానుగా... కానీ వరస ఓటములతో విసిగి పొతే ఆశ అడియాసగా మారితే నీ ధ్యాస మరచిపోతే నిన్ను తలచేవారెవ్వరు నిన్ను కొలిచేవారెవ్వరు నిన్ను సేవించేవారెవ్వరు...*

*ఆటే కదా అని ప్రతి సారి నమ్మినవారిని ఓటమి పాలు చేస్తే ఆటలో ఆసక్తి పోతుంది ఈశ్వరా!*

*అపుడపుడు నీ కింకరులను గెలిపించుకో సడలుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకో తరిగిపోతున్న భక్తిభావాన్ని పెంచుకో ఎప్పటికైనా నీవే కొండంత అండ అని నిన్ను నమ్మితే అంతిమ విజయమని ప్రకటించి నీ అస్థిత్వాన్ని నిరూపించుకో ఆటలో ఆనందాన్ని నీ భక్తులనీ ఆస్వాదించనీ...*

*ఇది వేడుకోలు* *కాదు సుమా పాదాలు పట్టి విడువని పంతం పట్టుదలతో సాధించుకునే మూఢ విస్వాసం. తండ్రిని గదమాయించే పిల్లల అమాయకత్వం దిక్కులేక ఆక్రోశించి వేడుకొనే వెర్రి నమ్మకం...*

*🔱IIశివోహం శివోహం శివోహంII🔱*
 *నిజమైన మరణం కంటే ముందుగానే మరణ భయం మనల్ని చంపేస్తుందని మనకు తెలుసా?*


*జీవించడంలోని కళ...కథ*


ఒక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. తన స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా అతను వ్యాపారం చేసేవాడు. పడ్డ శ్రమ ఫలించడంతో అతను బాగా సంపాదించాడు, త్వరలోనే అతని పేరు నగరంలోని పెద్ద వ్యాపారులలో లెక్కించబడ సాగింది. ఒక రాజభవనాన్ని నిర్మించుకుని, అంగరంగ వైభవంగా, తన కుటుంబ సమేతంగా నివసిస్తూ, అతని  జీవితం ఇలా చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంది.

ఒక రోజు, అతని బంధువులలో ఒకరు మరొక నగరం నుండి వచ్చాడు. సంభాషణ మధ్యలో, తన నగరం యొక్క అత్యంత సంపన్నమైన వ్యాపారి మరణించాడని అతను చెప్తూ, ఆ అభాగ్యుని ఆస్తులు, లక్షల విలువ చేసే ఆస్తి అంతా కూడా పనికిరాకుండాపోయిందని చెప్పాడు.

ఈ విషయం అతను చాలా మామూలుగా ప్రస్తావించాడు, కానీ అది వ్యాపారి మనస్సును తీవ్రంగా కదిలించింది. ఆ వ్యాపారిలాగే తాను కూడా ఏదో ఒకరోజు చనిపోతానని అనుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుంచి మృత్యుభయం అతన్ని వెంటాడడం ప్రారంభించింది. 
మృత్యువు వస్తుందని, తనని తీసుకెళ్లిపోతుందని, సంపాదించినదంతా  ఇక్కడే ఉండిపోతుందన్న ఈ ఆలోచన అతని మనసును వదలలేదు. ఆ ఆందోళన కారణంగా వ్యాపారి కృశించిపోవడం ప్రారంభించాడు.

చూసేవాళ్ళకి తనకి ఏ లోటు లేకపోయినట్లనిపించినా, తనలోని బాధ మాత్రం ఎవరికీ చెప్పుకోలేనిది. క్రమంగా, మరణం గురించిన ఆలోచన అతని శరీరాన్ని ఆక్రమించడం ప్రారంభించింది, దీనివల్ల వ్యాపారవేత్త చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ఎంత వైద్యం చేయించినా జబ్బు తగ్గకపోగా ఇంకా ముదిరిపోయింది. 

ఒకరోజు అతని ఇంటికి ఒక సాధువు వచ్చాడు. వ్యాపారి సాధువు పాదాల వద్ద ఏడుస్తూ కూర్చుని తన బాధలన్నింటినీ వివరించాడు.
వ్యాపారి కష్టాలు విన్న తర్వాత ఆ వ్యాధికి కారణమేమిటో అర్థం చేసుకుని, సాధువు నవ్వాడు. "నీ జబ్బుకి నివారణ చాలా తేలిక", అని అన్నాడు.

వ్యాపారికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయ్యింది. అతను అసహనంగా ఇలా అడిగాడు, "మహాశయా, ఆ నివారణ ఏమిటి?"
సాధువు ఇలా చెప్పాడు.. "చూడండి,రాబోయే ఏడు రోజులు మీరు ఒక మంత్రాన్ని పఠించండి.
*జీవితం ఒక అమూల్యమైన బహుమతి.నేను ప్రతీ క్షణం దానిని జీవిస్తాను*

ఏడు రోజులు, ఉదయం, సాయంత్రం, వీలైనప్పుడల్లా మీ మనస్సులో దీన్ని పునరావృతం చేయండి. మీరు ఎంత ఎక్కువ పునరావృతం చేస్తే, మీరు అంత త్వరగా బాగుపడతారు. నేను వచ్చే వారం మళ్ళీ వస్తాను."

ఏడు రోజుల తర్వాత సాధువు అక్కడికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ముఖఛాయ  ప్రకాశవంతంగా మారిపోయి, అతను ఆనందంతో ఉన్నట్లు గమనించాడు.

సాధువుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలపై పడి ఇలా అన్నాడు: "మహాశయా, మీరు నన్ను రక్షించారు! మీ మంత్రం నాపై చాలా ప్రభావం చూపింది. అసలైన మృత్యువు వచ్చిన రోజు మాత్రమే నేను చనిపోతానని అర్థం చేసుకున్నాను. దాని కంటే ముందు ప్రతీ క్షణం, నేను కేవలం మనస్ఫూర్తిగా జీవిస్తాను. మీ నిర్దేశించిన చికిత్సలో ఇంద్రజాలం ఉంది."

సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, 
*"మన ఆలోచనలలో మాయాజాలం ఉంది, మనకు జీవించాలనే ఆలోచన ఉంటే, మన జీవితంలోని ప్రతి క్షణం ఉల్లాసంగా మారుతుంది,  మనం మరణం గురించి ఆలోచించినట్లయితే, మనం నిజంగా మరణం సమీపించక ముందే చాలాసార్లు చనిపోతాం".*

*ప్రతి క్షణం మన ఆలోచనలను దైవత్వంతో అనుసంధానం చేస్తే, ప్రతి క్షణం మనం దైవత్వం వైపుకు వెళ్తాం. ఇది జీవించడంలో ఉన్న కళ. మన ఆలోచనలే మన విధిని సృష్టిస్తాయి.*
*మన దైనందిన ఆలోచనల ద్వారా మన విధిని సృష్టిస్తాం - అవి మనల్ని ఆకర్షించి, వికర్షించే మన కోరికలు, మన ఇష్టాయిష్టాలు. *దాజీ...హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం*
 *సుద్ద ముక్క ఘనత* 

సుద్దముక్కలే నని 
తీసి పారేయకు 
ఆ సుద్దముక్కలే నిర్మిస్తాయి
అందమైన సుందర దృశ్యాలు 

అవే ఉన్నాయి
అనేక రకాలు
తెలుపు ఎరుపు
పసుపు నలుపు ఎలా ఎన్నో...

వానితో 
వేస్తారు చిత్రాలు
గీస్తారు ముగ్గులు
దిద్దుతారు రంగులు

ఆ సుద్దలతోనే 
అమోఘంగా వనితలు
ముగ్గులు వేయడం 
చక్కని చిత్రాలు వేస్తూ

ఉపాధ్యాయులు నల్లబల్లపై వ్రాయుటకు
పిల్లలు అక్షరాలు వ్రాయుట దిద్దుట 
గీతలు గీయుట చేస్తారు 
ఇలా సుద్ద ముక్కలతో

ఆ దృశ్యాలు చిత్రాలు 
చూపరులకు ఇస్తాయి
అమోఖం ఆనందాలు
ఇంటికి ఇస్తాయి శోభ

సుద్ద ముక్కలతోనే 
బడులలో వ్రాయడం జరిగేది 
ఆ సుద్దలే లేకుంటే
అయ్యవారు ఏమి చేయలేరు

కొందరికి ఇస్తాయి జీవన భృతి 
కొందరు చేస్తారు వ్యాపారాలు
అలా ఎందరో బతుకులకు మూలం
*ఇదే సుద్ద ముక్క ఘనత*

*మిడిదొడ్డి చంద్రశేఖరరావు రిటైర్ ఉపాధ్యాయుడు ఒంగోలు 9908413837*

Books

 Hello Masters! Please find above list of new books added in online library.


Thanks🙏

Tuesday, August 12, 2025

 *_'వేరికోజ్ వీన్స్.'_*
*_🌹ఉబ్బిన సిరలు ఎందుకు వస్తాయి..?_*

*_మన శరీరం లో రక్తాన్ని గుండె నుండి ఇతర భాగాలకి సరఫరా చేసే వాటిని ధమనులు(arteries), అలాగే, వివిధ శరీర భాగాల నుండి గుండె కి చేరవేసే నాళాల్ని సిరలు(Veins) అనీ అంటారు._*

*_సిరలు తీసుకెళ్లే రక్తం సహజం గానే కలుషిత రక్త అవడం వల్ల అది కొంచెం డార్క్ కలర్ లోనే వుంటుంది._*

*_మనం శరీర భాగాల్లో పైకి కనిపించే వాటిలో చూసుకుంటే మనకు ఆ రంగు తేడా అనేది కనిపిస్తుంది._*

*_Varicose veins లేదా varicosities అంటే, ఎప్పుడైతే,ఆ రక్త సరఫరా విధానం లో ఇబ్బందులు తలెత్తుతాయో,అప్పుడు,అక్కడ రక్తం కొంచెం సరఫరా లో అంతరాయం ఏర్పడి అక్కడే నిల్వ ఉండిపోవడం గానీ, గడ్డ కట్టడం కానీ జరుగుతుంది._*

*_ఇది సహజం గా, కాళ్ళలోనూ, తొడల దగ్గర ఏర్పడతాయి._*

*_ఇవి ఎక్కువ గా ఏర్పడితే మనకి, అక్కడ ఉబ్బినట్లు,ఇంకా ఎక్కువ గాఢమైన రంగులోనూ(ముదురు నీలం, purple,లేదా ముదురు ఎరుపు),కనిపిస్తాయి._*

*_వీటి వల్లన వచ్చే ఇబ్బందులు,వాటి సంఖ్య,గాఢత,వెడల్పు ను బట్టి వుంటాయి._*

*_కొంతమంది కి చాలా తక్కువే వుంటాయి,అవి పెద్ద గా ఇబ్బంది పెట్టవు._*

*_కానీ, ఎక్కువ వాచినవి, సంఖ్య ఎక్కువ గా వున్నవి,చాలా నొప్పి కలిగిస్తాయి, కొంచెం బిగిసిపోయిన సెన్సేషన్ కలిగించి,నడవడానికి ఇబ్బంది కలిగిస్తాయి._*

*_ఇక్కడ రక్త సరఫరా విధానం disturb అవ్వడం, లేదా, ఆ వేయిన్స్ damage అవ్వడం ప్రధాన కారణం._*

*_ఆ నొప్పి కూడా వున్న తీవ్రత నీ బట్టి ఎక్కువ/తక్కువలు వుంటాయి._*

*_బీపీ,అధిక బరువు, హార్మోన్ల అసమతౌల్యత, రక్తం గడ్డ కట్టే కాలం లో తేడాలు, ఎక్కువ కొలెస్టరాల్, గుండె వ్యాధులు, వార్ధక్యo, ఆడవారికి అయితే మెనోపాజ్ దశలో, ముఖ్య కారణాలు._*

*_ఈ వ్యాధి మరీ ప్రాణాంతకం అయితే కాదు,కానీ,తీవ్రతను బట్టి రోజువారీ దినచర్యలో ఇబ్బంది కలిగిస్తుంది,నొప్పి కూడా తీవ్రతను బట్టి కొంచెం ఎక్కువ గానే వుండే అవకాశాలు వుంటాయి._*

*_ప్రాణహాని కాకపోయినా,ఇది వున్న తీవ్రత మనకి వున్న ఇతర అనారోగ్యాల తీవ్రతకు ఒక alarming లా చూపిస్తుంది._*

*_ఉదా:- గుండె జబ్బుకు,అధిక కొవ్వు(కొలెస్ట్రాల్/లిపిడ్స్),లేదా మన శరీరం లో రక్త గాఢత,గడ్డ కట్టే కాలం ఇలాంటి వాటిలో ఏమైనా abnormalities వుంటే,వాటికి సంకేతం అందించినట్లు గా._*

*_కనుక,అలాంటపుడు మనం తగిన పరీక్షలు,నివారణ కి తగ్గ చర్యలు తీసుకోవచ్చు._*

*_ఎక్కువ గా నిలబడి పని చేయాల్సి వచ్చే వాళ్ళకి కూడా,క్రమేణా ఆ నాళాలు బలహీనమై, ఇలా ఏర్పడవచ్చు._*

*_ఇవి వున్నవాళ్ళు,ఆయా అనారోగ్యాలు వుంటేవాటికి సంబంధించిన మందులు,జాగ్రత్తలు తీసుకోవాలి._*

*_రోజూ, కొంచెం వేడి నీళ్లలో crystal salt వేసి,అందులో రోజుకి 2-3 సార్లు కాళ్ళు పెట్టి, ఒక 15-30 నిముషాలు వుంచితే కొంచెం నొప్పులనుండి, ఉపశమనం కలగడమే కాకుండా,ఆ veins లో కూడా తేడా రావొచ్చు._*

*_పడుకొనేటపుడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకుంటే మంచిది.కూర్చున్నపుడు కూడా కాళ్ళు కొంచెం ఎత్తు మీద పెట్టుకొంటే మంచిది._*

*_బరువు వున్న వాళ్ళు ఖచ్చితం గా తగ్గాలి._*

*_అస్తమానూ కూర్చుని వుండే వాళ్ళు, కొంచెం walking కూడా చేస్తే మంచిది._*

*_ఆహారం లో,ఫైబర్, విటమిన్ K, మాంగనీస్, పొటాషియం వున్న పదార్థాలు కొంచెం ఎక్కువ వుండేవి తింటూ వుండాలి.అరటిపండు,pine Apple, క్యాబేజ్,ఆకు కూరలు,బటానీలు తింటే మంచిది.ఉప్పు/నూనె వాడకం ఎంత తగ్గితే అంత మంచిది._*

*_స్నానం అతి వేడి నీళ్ళతో చెయ్యడం మంచిది కాదు._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_-మీ.డా.తుకారాం జాదవ్.🙏🏾_*
 *_మధుమేహం{ షుగర్ వ్యాధి } గురించి అపోహలు మరియు వాస్తవాలు:-_*

 *_అపోహ 1: మధుమేహం వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుంది._*

 *_వాస్తవం: మధుమేహం పిల్లలు మరియు యువకులతో సహా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది._*

*_అపోహ 2: చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వస్తుంది._*

*_వాస్తవం: చక్కెర ఆహారాలు మరియు పానీయాలు తీసుకోవడం మధుమేహానికి దోహదం చేస్తుంది, ఇది ఏకైక కారణం కాదు.  జన్యుశాస్త్రం, జీవనశైలి కారకాలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పాత్ర పోషిస్తాయి._*

*_అపోహ 3: డయాబెటిస్ ఉన్నవారు కార్బోహైడ్రేట్లను తినలేరు._*

*_వాస్తవం: మధుమేహం ఉన్నవారికి కార్బోహైడ్రేట్లు సమతుల్య ఆహారంలో భాగంగా ఉంటాయి.  ఇది భాగం నియంత్రణ మరియు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోవడం గురించి మరింత ఎక్కువ._*

*_అపోహ 4: మధుమేహం అంటువ్యాధి._*

*_వాస్తవం: మధుమేహం అంటువ్యాధి కాదు.  ఇది జలుబు లేదా ఫ్లూ వంటి వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించదు._*

*_అపోహ 5: మధుమేహం ఉన్నవారు క్రీడలు లేదా వ్యాయామంలో పాల్గొనలేరు._*

*_వాస్తవం: మధుమేహం ఉన్నవారికి వ్యాయామం నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది._*

*_అపోహ 6:ఇన్సులిన్ మధుమేహాన్ని నయం చేస్తుంది._*

*_వాస్తవం: ఇన్సులిన్ మధుమేహానికి చికిత్స, కానీ అది పరిస్థితిని నయం చేయదు.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది._*

*_అపోహ 7: అధిక బరువు ఉన్నవారికి మాత్రమే టైప్ 2 డయాబెటిస్ వస్తుంది._*

 *_వాస్తవం: అధిక బరువు టైప్ 2 డయాబెటిస్‌కు ప్రమాద కారకం అయితే, సాధారణ బరువు ఉన్నవారు కూడా ఈ పరిస్థితిని అభివృద్ధి చేయవచ్చు._*

*_అపోహ 8: డయాబెటిస్ తీవ్రమైన వ్యాధి కాదు._*

*_వాస్తవం: మధుమేహం అనేది ఒక తీవ్రమైన పరిస్థితి, దీనిని సరిగ్గా నిర్వహించకపోతే, గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి మరియు దృష్టి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు._*

*_అపోహ 9: మధుమేహం ఉన్నవారు "డయాబెటిక్" ఆహారాన్ని మాత్రమే తినాలి._*

*_వాస్తవం: "డయాబెటిక్" ఆహారాలు తరచుగా చక్కెర ప్రత్యామ్నాయాలలో ఎక్కువగా ఉంటాయి మరియు ఇప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.  సంపూర్ణ ఆహారాలతో కూడిన సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం మంచిది._*

*_అపోహ 10: మీరు మధుమేహంతో సాధారణ జీవితాన్ని గడపలేరు._*

*_వాస్తవం: సరైన నిర్వహణతో, మధుమేహం ఉన్నవారు పూర్తి, చురుకైన జీవితాన్ని గడపవచ్చు._*

*_అపోహ 11: అధిక బరువు ఉన్నవారికి మాత్రమే టైప్ 2 డయాబెటిస్ వస్తుంది._*

*_వాస్తవం: ఊబకాయం ప్రమాద కారకం అయితే, జన్యుశాస్త్రం మరియు జీవనశైలి కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి._*

*_అపోహ 12: డయాబెటిస్ ఉన్నవారు పండ్లలో సహజమైన చక్కెర ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి._*

*_వాస్తవం: మధుమేహం ఉన్నవారికి సమతుల్య ఆహారంలో పండ్లు ఆరోగ్యకరమైన భాగం.  ఇది అవసరమైన పోషకాలు మరియు ఫైబర్ అందిస్తుంది._*

*_అపోహ 13: మధుమేహం ఉన్నవారు స్వీట్లు తినలేరు._*

*_వాస్తవం: మధుమేహం ఉన్నవారికి సమతుల్య ఆహారంలో భాగంగా స్వీట్‌లను మితంగా చేర్చవచ్చు._*

*_అపోహ 14: డయాబెటిస్ ఒత్తిడి వల్ల వస్తుంది._*

*_వాస్తవం: ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది, అయితే ఇది మధుమేహానికి ప్రధాన కారణం కాదు._*

*_అపోహ 15: డయాబెటిస్ తీవ్రమైన వ్యాధి కాదు._*

*_వాస్తవం: డయాబెటిస్‌కు జాగ్రత్తగా నిర్వహణ అవసరం మరియు సరైన చికిత్స చేయకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు._*

*_అపోహ 16: డయాబెటిస్ ఉన్నవారు పాస్తా లేదా బ్రెడ్ తినలేరు._*

*_వాస్తవం: మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో పాస్తా మరియు రొట్టెలను చేర్చుకోవచ్చు, అయితే తృణధాన్యాల ఎంపికలను ఎంచుకోవడం మరియు భాగం పరిమాణాలను చూడటం చాలా ముఖ్యం._*

*_అపోహ 17: చక్కెర ఎక్కువగా తినడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంది._*

*_వాస్తవం: టైప్ 1 మధుమేహం అనేది స్వయం ప్రతిరక్షక స్థితి, దీనిలో శరీరం ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది.  ఇది డైట్ వల్ల వచ్చేది కాదు._*

*_అపోహ 18: మధుమేహం ఎల్లప్పుడూ నివారించదగినది._*

*_వాస్తవం: జీవనశైలి మార్పులు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించగలవు, జన్యుశాస్త్రం వంటి కొన్ని కారకాలు మార్చబడవు._*

*_అపోహ 19: డయాబెటిస్ ఉన్నవారు తక్కువ కార్బ్ ఆహారాలు మాత్రమే తినాలి._*

*_వాస్తవం: సమతుల్య ఆహారంలో కార్బోహైడ్రేట్లు ముఖ్యమైన భాగం.  మధుమేహం ఉన్నవారు భాగం నియంత్రణపై దృష్టి పెట్టాలి మరియు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోవాలి._*

*_అపోహ 20: ప్రత్యామ్నాయ చికిత్సలు లేదా సప్లిమెంట్ల ద్వారా మధుమేహాన్ని నయం చేయవచ్చు._*

*_వాస్తవం: మధుమేహానికి చికిత్స లేదు.  కొన్ని ప్రత్యామ్నాయ చికిత్సలు లక్షణాలను నిర్వహించడంలో సహాయపడవచ్చు, అవి ప్రామాణిక వైద్య చికిత్సను భర్తీ చేయకూడదు._*

 *_అపోహ 21: డయాబెటిస్ తీవ్రమైన వ్యాధి కాదు._*

*_వాస్తవం: మధుమేహం సమస్యలను నివారించడానికి జాగ్రత్తగా నిర్వహించడం అవసరం, కానీ సరైన చికిత్సతో, మధుమేహం ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు._*

*_అపోహ 22: డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంపలు లేదా అన్నం తినలేరు._*

*_వాస్తవం: మధుమేహం ఉన్నవారికి సమతుల్య ఆహారంలో భాగంగా బంగాళదుంపలు మరియు అన్నం మితంగా చేర్చవచ్చు._*

*_అపోహ 23: మీకు మధుమేహం ఉంటే, మీరు అన్ని చక్కెరలను నివారించాలి._*

*_వాస్తవం: జోడించిన చక్కెరలను పరిమితం చేయాలి, మధుమేహం ఉన్న వ్యక్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించినంత కాలం వారి ఆహారంలో చక్కెరను చిన్న మొత్తంలో చేర్చవచ్చు._*

*_అపోహ 24: మధుమేహం ఎల్లప్పుడూ సరైన జీవనశైలి ఎంపికల వల్ల వస్తుంది._*

*_వాస్తవం: ఆహారం మరియు వ్యాయామం వంటి జీవనశైలి కారకాలు పాత్ర పోషిస్తుండగా, జన్యుశాస్త్రం మరియు ఇతర అంశాలు కూడా మధుమేహం అభివృద్ధికి దోహదం చేస్తాయి._*

*_అపోహ 25: మధుమేహం మరణశిక్ష._*

*_వాస్తవం: సరైన నిర్వహణతో, మధుమేహంతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు దీర్ఘకాలం, ఆరోగ్యకరమైన జీవితాలను జీవిస్తారు._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- Dr. Tukaram Jadhav.🙏🏾_*
 *_🌹దంత సమస్యలు మరియు వాటి నివారణలు._*

 *_1.దంత క్షయం:-_*

*_మంచి నోటి పరిశుభ్రత, క్రమం తప్పకుండా బ్రషింగ్, ఫ్లాసింగ్ మరియు సాధారణ దంత తనిఖీలు అవసరం.  ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఎనామెల్‌ను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది._*
  
 *_2. గమ్ డిసీజ్ (చిగురువాపు):-_*

*_రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, రోజూ ఫ్లాసింగ్ చేయడం మరియు క్రమం తప్పకుండా దంతాలను శుభ్రపరచడం చిగుళ్లవాపును నివారించడంలో మరియు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.  యాంటిసెప్టిక్ మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియాను కూడా చంపవచ్చు._*

 *_3. టూత్ సెన్సిటివిటీ:-_*

*_డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్, ఫ్లోరైడ్ చికిత్సలు మరియు బంధం, కిరీటాలు లేదా రూట్ కెనాల్ థెరపీ వంటి దంత ప్రక్రియలు సున్నితత్వాన్ని తగ్గించగలవు._*

 *_4. దుర్వాసన (హాలిటోసిస్):-_*

*_రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ మరియు నాలుక శుభ్రపరచడం సహాయపడుతుంది.  అలాగే, హైడ్రేటెడ్ గా ఉండటం మరియు నోటి దుర్వాసనకు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది._*

 *_5. పంటి నొప్పులు:-_*

*_ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ పెయిన్ రిలీవర్లు పంటి నొప్పిని తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడతాయి.  అయినప్పటికీ, సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం దంతవైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం._*

 *_6. ఓరల్ క్యాన్సర్:-_*

*_రెగ్యులర్ డెంటల్ చెక్-అప్‌లు,నోటి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.  పొగాకు మరియు మితిమీరిన మద్యపానానికి దూరంగా ఉండటం వలన ప్రమాదాన్ని తగ్గించవచ్చు._*

 *_7. కావిటీస్:-_*

*_మంచి నోటి పరిశుభ్రత మరియు క్రమం తప్పకుండా దంత సందర్శనల ద్వారా నివారణ కీలకం.  చికిత్సలలో తీవ్రతను బట్టి పూరకాలు, కిరీటాలు లేదా రూట్ కెనాల్ థెరపీ ఉంటాయి._*

 *_8. ఎనామెల్ ఎరోషన్:-_*

*_ఆమ్ల ఆహారాలు మరియు పానీయాలను నివారించడం, ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించడం మరియు బంధం లేదా కిరీటాలు వంటి దంత చికిత్సలు ఎనామెల్‌ను రక్షించడంలో సహాయపడతాయి._*

*_9.బ్రక్సిజం (టీత్ గ్రైండింగ్):-_*

*_రాత్రిపూట మౌత్‌గార్డ్ ధరించడం వల్ల దంతాల గ్రైండింగ్ వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు.  ఒత్తిడి నిర్వహణ పద్ధతులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి._*

 *_10. మిస్సింగ్ పళ్ళు:-_*

*_దంత ఇంప్లాంట్లు, వంతెనలు లేదా దంతాలు వ్యక్తి యొక్క అవసరాలు మరియు ప్రాధాన్యతలను బట్టి తప్పిపోయిన దంతాలకు సమర్థవంతమైన పరిష్కారాలుగా ఉంటాయి._*

*_మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు దంత సమస్యలను నివారించడానికి సరైన దంత సంరక్షణ మరియు దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం చాలా కీలకమని గుర్తుంచుకోండి._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_-మీ.డా,,తుకారాం జాదవ్.🙏🏾_*
 *_🌹'సంతానలేమి...'🌹_*

*_సంతానలేమి అనగా పెళ్ళయిన తర్వాత కూడా స్త్రీలు మాతృత్వానికి నోచుకోకపోవడము. ఇటువంటి స్త్రీలను గొడ్రాలు అని వ్యవహరించేవారు. కాలం మారిన తర్వాత సంతానలేమి ని ఒక వ్యాధిగా గుర్తిస్తున్నారు._*

*_సంతానలేమి.. కారణాలు:-_*

*_ఆధునిక జీవన విధానం వల్ల మహిళల్లో సంతానలేమి సమస్య పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణంగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడాలని, తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయాలనే కోరికతో మహిళలు సరైన వయసులో అనగా 18 నుండి 25 సంవత్సరాల వయసులో పెళ్ళి చేసుకోకపోవడం, ఫలితంగా రెండు పడవలపై కాళ్ళు పెట్టినచందంగా ఇల్లు - ఆఫీసు బాధత్యల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తడికి లోవవడం వంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయి. పురుషులు కూడా వ్యాపారాలు, ఉద్యోగాల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వడం వంటి సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, కాలుష్య వాతావరణంలో జీవించడం, సెల్ ఫోనులు అధికంగా ఉపయోగించడం వంటివి ఇతర సంతానలేమి కారణాలుగా చెప్పుకోవచ్చు._*

*_స్త్రీలలో ప్రధాన కారణాలు:-_*

*_ఋతుచక్రంలో మార్పులు,_*
*_కొన్ని వ్యాధుల వలన అండం సరిగా విడుదల కాకపోవడం. గర్భాశయపు నిర్మాణంలోను, ఆకృతిలోను... పుట్టుకతో వచ్చే లోపాలు._*
*_గర్భాశయ మార్గంలో కండరాలు పెరగటం లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద ఇన్‌ఫెక్షన్స్ గర్భాశయంలో గడ్డలు కొన్ని ఇన్‌ఫెక్షన్స్ వలన నాళాలు (ట్యూబ్స్) మూసుకొనిపోవటం, నాళాలలో వాపు ఏర్పడటం._*

*_ఆయుర్వేద శాస్త్ర వివరణ:-_*

*_ఆయుర్వేద శాస్త్రం గర్భధారణలో నాలుగు ప్రధాన అంశాలు ప్రస్తావించింది._*

*_ఋతువు: సాధారణంగా స్త్రీకి బహిష్టు మొదలైన 12వ రోజు నుండి 16 వ రోజు వరకు ఋతుకాలంగా పరిగణిస్తారు. 12 నుండి 16 రోజుల ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు. అలాగే స్త్రీ యొక్క వయోపరిమితిని కూడా ఋతుకాలంగా పరిగణిస్తారు. (సాధారణంగా 21 - 35 సంవత్సరాల వరకు)_*

*_క్షేత్రం: కొన్నిసార్లు గర్భాశయ మార్గాలను అవరోధించే కొన్ని వ్యాధుల కారణంగా శుక్ర కణాలు అండాన్ని చేరలేక పోవచ్చు. కనుక విత్తనం మొలకెత్తటానికి భూమి సారవంతంగా ఉన్నట్లే గర్భాశయం మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉండాలి._*

*_అంబు: గర్భపోషణకు ఉపయోగపడే పోషకాలు, గర్భాధారణకు ఉపయోగపడే హార్మోన్లను అంబు అని ఆయుర్వేదం వర్ణించింది. ఈ హార్మోన్లలో సమతుల్యత లేకపోతే గర్భం రాదు. సంతానలేమికి శుక్రధాతువు లోపాలు కూడా ప్రధానంగా ఉంటాయి._*

*_బీజం: ఆయుర్వేదంలో పురుషుల్లోని వీర్యాన్ని ‘బీజం’ అనే పదంతో సూచించారు. అండం పరిమాణం, శక్తి, శుక్ర కణంలో కదలగలిగే సామర్థ్యం, శుక్రకణం నాణ్యత మీద గర్భధారణ ఆధారపడి ఉంటుంది._*

*_మగవారిలో సంతానలేమి.._*

*_సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి. ఇది కేవలం అపోహ మాత్రమే. సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండే అవకాశం ఉంది._*

*_అసలు పురుషుల్లో సంతానలేమి ఎందుకు వస్తుంది..?_*

*_ఈ సమస్యను నిరోధించే మార్గాలేంటి...?_*

*_పరిశీలిస్తే ... కాలంతో పాటు పరిగెడుతున్న జీవితాలు, నిత్యం పలుసమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం కారణంగా సంతాన లేమి సమస్య తెలెత్తుతున్నట్లు నిర్ధార్ధించారు. మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం కష్టమే. మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. భార్యాభర్తలు ఏ గర్భనిరోధక సాధనం వాడకుండా ఒక సంవత్సర వైవాహిక జీవితం కొనసాగించిన తరువాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేదా సంతానలేమి అంటారు. ఈ సమస్య ఇప్పుడు మగవారిలో అధికంగా పెరిగిపోతోంది. ఆధునిక జీవన విధానం మగవారిలో ఈ సమస్యను పెంచుతోంది. సంతానం కలగచేసే సామర్థ్యం పురుషుల్లో క్షీణిస్తోంది. వారిలో వీర్య సామర్థ్యం తగ్గిపోతోంది. దానినే మేల్‌ ఫెర్టిలిటిగా పేర్కొంటున్నారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు. ప్రతి మగవారిలో సాధారణంగా 3-6 మిల్లీలీటర్ల వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. 80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి. మామూలు వీర్యంలో దాదాపు 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలుంటాయి. పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు. సాధారణంగా సంతాన సాఫల్య సమస్యలను పరిశీలిస్తే మగవారిలో 40 శాతంగా ఉంటుంది. ఇద్దరిలో కలిపి 10 శాతం సమస్యలు ఉంటే, తెలియని కారణాలు 10 శాతం ఉంటాయి._*

*_మగవారిలో సంతానలేమి సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయి. హార్మోన్ల లోపం, మానసిక ఒత్తిడి, వెరికోసిల్ ఒక రకం కారణాలు ఐతే, ధూమపానం, మద్యపానం మరోరకం కారణాలుగా వైద్యులు నిర్ధారించారు. బీజంలో వివిధ ఇబ్బందులు, అంగస్థంభన సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల ఇన్‌ఫెర్టిలిటీ తలెత్తుతుంది. ఇన్‌ఫెర్టిలిటీ సమస్యను తెలుసుకోవడానికి పలు పరీక్షలున్నాయి. ఆ పరీక్షల ద్వారా కారణం తెలుసుకొని వైద్యుల సలహాపై తగిన మందులు వాడితే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది._*

*_సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు సంతానలేమి.._*

*_సాఫ్ట్‌వేర్, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013 సెప్టెంబరు 15 ‘ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్- గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అబ్‌స్టెట్రిక్స్’ సంయుక్తంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ’అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు లో ఫిగో అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.అరుల్‌కుమారన్, ఫోగ్సీ అధ్యక్షురాలు డాక్టర్ హేమదివాకర్, ఫిగో ప్రెసిడెంట్ ఎలక్ట్ సీఎన్ పురందరే, ఉపాధ్యాక్షురాలు డాక్టర్ శాంతకుమారితో పాటు దేశవిదేశాల నుంచి సుమారు వెయ్యి మంది వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొని సిజేరియన్ ఆపరేషన్లు, సంతానలేమి సమస్యలపై విస్తృతంగా చర్చించారు._*

*_సదస్సులో నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు:-_*

*_ఐటీ రంగాలలో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఏడుజంటల్లో ఒక జంట సంతాన లేమితో బాధపడుతోంది._*
*_ఆలస్యపు వివాహాలు, మానసిక ఆందోళన, పని ఒత్తిడి,మారిన జీవన శైలి, ఊబకాయం, రుతుక్రమం తప్పడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం._*
*_సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ల్యాప్‌ట్యాప్‌లను ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తిపై రేడియన్ తీవ్ర ప్రభావం చూపుతోంది._*
*_ప్రతి వంద జంటల్లో 15 శాతం మందికి సంతానలే మి సమస్య వల్ల చికిత్సతీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.ఆ పదిహేను శాతంలో కూడా 40 మంది పురుషులే. ఈ పెరుగుదల రేటు ఆందోళనకరంగా ఉంది._*

*_ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం ఇన్‌ఫెర్టిలిటీ రేటు 50 శాతం పెరిగింది._*
*_దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి._*
*_మధుమేహం, రక్తపోటు, గుండెపోటు జబ్బులతో సంతాన లేమి సమస్య పోటీపడుతోంది._*
*_ఈ సమస్యకు ఆడవారినే బాధ్యులను చేయడం తగదు... స్త్రీ, పురుషులిద్దరూ ఇందుకు బాధ్యులే._*
*_18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి వీర్యకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ గా ఉంటోంది._*
*_అతిగా మద్యం సేవించిడం, పొగతాగడం కూడా ఇందుకు మరో కారణం._*

 *_ఆయుర్వేదిక చికిత్స:-_*

*_మానసిక ఒత్తిడి ఉంటే శిరోధార, హార్మోనల్ సమస్య ఉంటే నస్యకర్మ, తక్రధార, ట్యూబల్ బ్లాక్స్ లాంటివి ఉన్నట్లయితే ఉత్తరవస్తి, నీటి బుడగలు, కణతలు... ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే యోని పిచు, ఇన్‌ఫెక్షన్స్ ఉన్నట్లయితే యోని ప్రక్షాళన (ఔషధ యుక్త కషాయాల) లాంటి శాస్త్రీయ చికిత్సా విధానాలు, చక్కని పరిష్కార మార్గాలుగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినవి._* *_ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర పద్ధతిలో సత్ఫలితాలు రావాలంటే క్రమం తప్పకుండా ఒక సంవత్సరం ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పద్ధతులు పాటించవలసి ఉంటుంది._*

*_అల్లోపతిచికిత్స:-_*

*_అల్లోపతి లో సంతానలేమి ఉన్నవారికి ఇప్పుడు మూడు రకాల పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. అవి... 1) ఐ.యు.ఐ. 2) ఇక్సీ.3) ఐ.వి.ఎఫ్._*

*_ఐ.యు.ఐ. : భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాల లో పరీక్షించి, దానిలోనుంచి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కణాలను మాత్రం వేరు చేసి సిద్ధం చేస్తారు. వాటిని ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను అనుసరించడం వల్ల గర్భధారణకు 15 శాతం వరకు అవకాశం ఉంటుంది. ఇలా ఆరు రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకుంటే అప్పుడు ఐ.వి.ఎఫ్. అనే ప్రక్రియను అనుసరించవచ్చు._*

*_ఇక్సీ: స్త్రీ నుంచి సేకరించిన అండాల్లోకి, పురుషుని శుక్రకణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రో మానిప్యులేటర్ సహాయంతో ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందిస్తారు. వాటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతి ద్వారా గర్భధారణ విజయవంతం కావడానికి 40 శాతం వరకు అవకాశాలు ఉంటాయి. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రక్రియ మరింత ఉపయోగకరంగా ఉంటుంది._*

*_ఐ.వి.ఎఫ్.: -దీన్నే ‘టెస్ట్‌ట్యూబ్’ విధానం అంటారు. ముందుగా పక్వమైన అండాలను స్త్రీ నుంచి బయటకు తీసి, పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ ద్వారా సంతానం కలగడానికి 30 నుంచి 35 శాతం విజయావకాశాలు ఉంటాయి. ఇటీవలికాలంలో సంతాన సాఫల్య చికిత్సలో మరెన్నో కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలదీకరించిన పిండాలలో గర్భాశయంలోకి ప్రవేశపెట్టగా మిగిలిన పిండాలను అతి శీతల పరిస్థితుల్లో ఉంచి తరువాత వాటిని వాడతారు. అవసరాన్ని బట్టి అండాలను గాని శుక్రకణాలను గాని దాతల నుంచి స్వీకరించి వాడతారు. వీటితోపాటు పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే వినూత్నమైన సరోగసీ విధానం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది._*

*_సంతానం లేదని బాధపడకుండా, సంతానం లేకపోవడానికి కారణాలను, లోపాలను వైద్య నిపుణులను సంప్రదించి వివిధ పరీక్షలు చేయించుకొని,సంతానం పొందడం ముఖ్యం కదా!_*

*_సర్వేజనాః  సుఖినోభవంతు.. 🙏🏾_*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_-మీ.డా,,తుకారాం జాదవ్.🙏🏾_*
 *_🌹'కంటిశుక్లం శస్త్రచికిత్స'🌹_*

*_కంటిశుక్లం శస్త్రచికిత్స , లెన్స్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అని కూడా పిలుస్తారు, ఇది కంటిశుక్లం , అపారదర్శక లేదా మేఘావృతమైన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన కంటి సహజ లెన్స్‌ను తొలగించడం .కంటి సహజ లెన్స్ సాధారణంగా కృత్రిమ కంటిలోపలి లెన్స్ (IOL) ఇంప్లాంట్‌తో భర్తీ చేయబడుతుంది._*

*_కాలక్రమేణా, స్ఫటికాకార లెన్స్ ఫైబర్స్ యొక్క జీవక్రియ మార్పులు కంటిశుక్లం అభివృద్ధికి దారితీస్తాయి, ఇది బలహీనత లేదా దృష్టిని కోల్పోతుంది. కొంతమంది శిశువులు పుట్టుకతో వచ్చే కంటిశుక్లాలతో పుడతారు మరియు పర్యావరణ కారకాలు కంటిశుక్లం ఏర్పడటానికి దారితీయవచ్చు. ప్రారంభ లక్షణాలు రాత్రి సమయంలో లైట్లు మరియు చిన్న కాంతి వనరుల నుండి బలమైన కాంతి మరియు తక్కువ కాంతి స్థాయిలలో తగ్గిన దృశ్య తీక్షణతను కలిగి ఉండవచ్చు . కంటిశుక్లం శస్త్రచికిత్స సమయంలో, మేఘావృతమైన సహజ లెన్స్ పృష్ఠ గది నుండి తొలగించబడుతుంది. స్థానంలో ఎమల్సిఫికేషన్ ద్వారా లేదా దానిని కత్తిరించడం ద్వారా ఉపయోగకరమైన ఫోకస్‌ని పునరుద్ధరించడానికి IOL సాధారణంగా దాని స్థానంలో (PCIOL) లేదా చాంబర్ ముందు తక్కువ తరచుగా అమర్చబడుతుంది._*

*_కంటిశుక్లం శస్త్రచికిత్సను సాధారణంగా ఒక నేత్ర వైద్యుడు శస్త్రచికిత్సా కేంద్రం లేదా ఆసుపత్రిలో ఔట్-పేషెంట్ సెట్టింగ్‌లో నిర్వహిస్తారు .స్థానిక అనస్థీషియా సాధారణంగా ఉపయోగించబడుతుంది. ప్రక్రియ సాధారణంగా వేగంగా ఉంటుంది.మరియు తక్కువ లేదా నొప్పి మరియు చిన్న అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చాలా రోజువారీ కార్యకలాపాలకు తగినంత రికవరీ సాధారణంగా రోజులలో జరుగుతుంది. మరియు ఒక నెలలో పూర్తిగా కోలుకుంటుంది._*

*_90% కంటే ఎక్కువ ఆపరేషన్లు ఉపయోగకరమైన దృష్టిని పునరుద్ధరించడంలో విజయవంతమయ్యాయి. మరియు తక్కువ సంక్లిష్టత రేటు ఉంది. డే కేర్, హై-వాల్యూమ్, మినిమల్లీ ఇన్వాసివ్, స్మాల్-ఇసిషన్ ఫాకోఎమల్సిఫికేషన్‌తో త్వరితగతిన శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం అభివృద్ధి చెందిన ప్రపంచంలో కంటిశుక్లం శస్త్రచికిత్సలో సంరక్షణ ప్రమాణంగా మారింది ._*

*_మాన్యువల్ స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ (MSICS), ఇది సమయం, మూలధన పరికరాలు మరియు వినియోగ వస్తువులలో చాలా పొదుపుగా ఉంటుంది, కానీ పోల్చదగిన ఫలితాలను అందిస్తుంది, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజాదరణ పొందింది . రెండు విధానాలు తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని కలిగి ఉంటాయి, మరియు లెన్స్ అస్పష్టత కారణంగా దృష్టి లోపం కోసం ఖచ్చితమైన చికిత్స.కంటిశుక్లం శస్త్రచికిత్స అనేది లెన్స్ తొలగింపు శస్త్రచికిత్స యొక్క అత్యంత సాధారణ అప్లికేషన్, మరియు సాధారణంగా లెన్స్ పునఃస్థాపనతో సంబంధం కలిగి ఉంటుంది. కంటిలోని సహజ కటకం కంటిశుక్లం ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి ఉపయోగించబడుతుంది. ఇది దృష్టి లోపం కలిగించే లెన్స్‌లో మేఘావృతమైన ప్రాంతం .  కంటిశుక్లం సాధారణంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. మరియు ఒకటి లేదా రెండు కళ్లను ప్రభావితం చేస్తుంది._*

*_ప్రారంభ లక్షణాలలో వెలిసిన రంగులు, అస్పష్టమైన లేదా డబుల్ దృష్టి , లైట్ల చుట్టూ కాంతి, ప్రకాశవంతమైన లైట్ల నుండి కాంతికి సున్నితత్వం మరియు రాత్రి అంధత్వం వంటివి ఉండవచ్చు . అంధత్వమే అంతిమ ఫలితం. ఈ ప్రక్రియ సాధారణంగా ఎన్నుకోదగినది, అయితే కంటికి తీవ్రంగా గాయపడిన సందర్భాల్లో లెన్స్‌ను తొలగించడం అనేది ట్రామా సర్జరీలో భాగంగా ఉండవచ్చు. లెన్స్‌ను సాధారణంగా ఇంట్రాకోక్యులర్ ఇంప్లాంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఎందుకంటే లెన్స్‌ను తీసివేయడం వలన కంటి ఏ దూరం వద్దనైనా దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని కూడా తొలగిస్తుంది.శుక్లాలు సాధారణంగా వృద్ధాప్యం కారణంగా సంభవిస్తాయి. కానీ,గాయం లేదా రేడియేషన్ బహిర్గతం వల్ల కూడా సంభవించవచ్చు. పుట్టినప్పటి నుండి ఉండవచ్చు లేదా ఇతర ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన కంటి శస్త్రచికిత్స యొక్క సమస్యగా అభివృద్ధి చెందుతుంది.  లెన్స్‌లో ప్రోటీన్లు లేదా పసుపు-గోధుమ వర్ణద్రవ్యం యొక్క గుత్తులు పేరుకుపోయినప్పుడు కంటిశుక్లం ఏర్పడుతుంది. ఇది కంటి వెనుక రెటీనాకు కాంతి ప్రసారాన్ని తగ్గిస్తుంది. కంటి పరీక్ష ద్వారా కంటిశుక్లం నిర్ధారణ చేయబడుతుంది ._*

*_కంటిశుక్లం యొక్క ప్రారంభ లక్షణాలను తగిన అద్దాలు ధరించడం ద్వారా మెరుగుపరచవచ్చు.ఇది సహాయం చేయకపోతే, కంటిశుక్లం శస్త్రచికిత్స మాత్రమే సమర్థవంతమైన చికిత్స. ఇంప్లాంట్‌లతో కూడిన శస్త్రచికిత్స సాధారణంగా మెరుగైన దృష్టిని మరియు మెరుగైన జీవన నాణ్యతను కలిగిస్తుంది. అయినప్పటికీ, ఈ ప్రక్రియ చాలా దేశాల్లో సులభంగా అందుబాటులో లేదు._*

*_కంటిశుక్లం శస్త్రచికిత్సా విధానాల యొక్క రెండు ప్రధాన తరగతులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాధారణ ఉపయోగంలో ఉన్నాయి. ఫాకోఎమల్సిఫికేషన్ మరియు ఎక్స్‌ట్రాక్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్‌ట్రాక్షన్. లెన్స్ క్యాప్సూల్‌ని ఉంచలేని సందర్భాలు మినహా మైక్రోస్కోప్‌లో శస్త్రచికిత్స కోసం సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట ఇంట్రాక్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్‌ట్రాక్షన్ భర్తీ చేయబడింది మరియు ప్రధాన స్రవంతి వైద్యంలో కౌచింగ్ ఉపయోగించబడదు._*

*_ఫాకోఎమల్సిఫికేషన్ (ఫాకో)లో, సహజ లెన్స్ అల్ట్రాసోనిక్ ప్రోబ్ ద్వారా విభజించబడింది మరియు చూషణ ద్వారా తొలగించబడుతుంది. దీని యొక్క ఇటీవలి మరియు తక్కువ సాధారణ వైవిధ్యం, ఫెమ్టోసెకండ్ లేజర్-సహాయక ఫాకోఎమల్సిఫికేషన్ సర్జరీ, కార్నియల్ కోత చేయడానికి, లెన్స్‌కు ప్రాప్యతను అందించే క్యాప్సులోటమీని అమలు చేయడానికి మరియు లెన్స్ ఫ్రాగ్మెంటేషన్‌ను ప్రారంభించేందుకు లేజర్‌ను ఉపయోగిస్తుంది, ఇది ఫాకోమల్సిఫికేషన్ కోసం శక్తి అవసరాలను తగ్గిస్తుంది. ఫాకోఎమల్సిఫికేషన్‌లో ఉపయోగించే చిన్న కోత పరిమాణం సాధారణంగా కుట్టులేని కోతను మూసివేయడానికి అనుమతిస్తుంది._*

*_లోఎక్స్‌ట్రాక్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్‌ట్రాక్షన్ (ECCE), మరియు దాని వేరియేషన్ మాన్యువల్ చిన్న కోత కంటిశుక్లం శస్త్రచికిత్స (MSICS), లెన్స్ దాని క్యాప్సూల్ నుండి తీసివేయబడుతుంది మరియు పూర్తిగా లేదా తక్కువ సంఖ్యలో గణనీయమైన ముక్కలుగా విభజించబడిన తర్వాత కంటి నుండి మానవీయంగా సంగ్రహించబడుతుంది. ECCE యొక్క ప్రాథమిక వెర్షన్ 10–12 mm (0.39–0.47 in) పెద్ద కోతను ఉపయోగిస్తుంది మరియు సాధారణంగా కుట్లు అవసరం. ఈ ఆవశ్యకత MSICS అని పిలువబడే వైవిధ్యానికి దారితీసింది, కోత దాని జ్యామితి కారణంగా అంతర్గత ఒత్తిడిలో స్వీయ సీలింగ్‌గా ఉండాలి కాబట్టి సాధారణంగా కుట్లు అవసరం లేదు.  దట్టమైన కంటిశుక్లాలలో ఫాకోకు వ్యతిరేకంగా MSICS యొక్క తులనాత్మక ట్రయల్స్ ఫలితాలలో గణనీయమైన తేడాను కనుగొనలేదు, అయినప్పటికీ MSICS తక్కువ ఆపరేటింగ్ సమయాలను కలిగి ఉంది మరియు గణనీయంగా తక్కువ ఖర్చులను కలిగి ఉంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలలో MSICS ఎంపిక పద్ధతిగా ప్రాధాన్యత ఇవ్వబడింది, ఎందుకంటే ఇది ప్రామాణిక ECCE కంటే తక్కువ శస్త్రచికిత్స-ప్రేరిత ఆస్టిగ్మాటిజంతో అధిక-నాణ్యత ఫలితాలను అందిస్తుంది , కుట్టు-సంబంధిత సమస్యలు, త్వరిత పునరావాసం మరియు తక్కువ శస్త్రచికిత్స అనంతర సందర్శనలు. MSICS సాధారణంగా సర్జన్ కోసం సులభంగా మరియు వేగంగా నేర్చుకోవచ్చు, ఖర్చుతో కూడుకున్నది మరియు దాదాపు అన్ని రకాల కంటిశుక్లంకు వర్తిస్తుంది. ECCE అనేది శస్త్రచికిత్స సమయంలో సమస్యలను ఎదుర్కోవటానికి మరియు కష్టతరమైన వెలికితీతగా భావించే కంటిశుక్లం నిర్వహణకు ఒక పెద్ద కోతను ఉపయోగించే ఒక ఆకస్మిక ప్రక్రియగా మారింది. చాలా శస్త్రచికిత్సలలో, IOL చొప్పించబడుతుంది. ఫోల్డబుల్ లెన్స్‌లను సాధారణంగా 2–3 మిమీ (0.08–0.12 అంగుళాలు) ఫాకో కోత కోసం ఉపయోగిస్తారు, అయితే ఫోల్డబుల్ కాని లెన్స్‌లను పెద్ద ఎక్స్‌ట్రాక్యాప్సులర్ కోత ద్వారా ఉంచవచ్చు._*

*_ఇంట్రాక్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్‌ట్రాక్షన్ (ICCE) అనేది లెన్స్ మరియు చుట్టుపక్కల ఉన్న లెన్స్ క్యాప్సూల్‌ను ఒక ముక్కగా తీసివేయడం. అవసరమైన పెద్ద కోత, కప్పబడిన లెన్స్‌ను తీసివేసేటప్పుడు విట్రస్ శరీరంపై ఒత్తిడి మరియు గదుల మధ్య అడ్డంకిని తొలగించడంవల్ల క్యాప్సూల్ స్థానంలో ఉంచిన సాంకేతికతలతో పోల్చితే ఈ ప్రక్రియ చాలా ఎక్కువ సంక్లిష్టతలను కలిగి ఉంటుంది.కంటి యొక్క, పూర్వ గదిలోకి విట్రస్ సులభంగా తరలింపును అనుమతిస్తుంది. అందువల్ల ఇది చాలా వరకు భర్తీ చేయబడింది మరియు ఆపరేటింగ్ మైక్రోస్కోప్‌లు మరియు హై-టెక్నాలజీ పరికరాలు తక్షణమే అందుబాటులో ఉన్నదేశాలలో చాలా అరుదుగా ప్రదర్శించబడుతుంది . ICCE ద్వారా లెన్స్ తీసివేసిన తర్వాత, ఒక ఇంట్రాకోక్యులర్ లెన్స్ ఇంప్లాంట్‌ను ముందు గదిలో ఉంచవచ్చు లేదా సిలియరీ సల్కస్‌లోకి కుట్టవచ్చు . గమనిక  క్రయోఎక్స్‌ట్రాక్షన్ అనేది క్రయోప్రోబ్‌ని ఉపయోగించి లెన్స్‌ను తీయడానికి ICCEలో ఉపయోగించే ఒక టెక్నిక్ , దీని రిఫ్రిజిరేటెడ్ చిట్కా ద్రవ నైట్రోజన్ వంటి క్రయోజెనిక్ పదార్ధంతో గడ్డకట్టడం ద్వారా కాంటాక్ట్ పాయింట్ వద్ద లెన్స్ యొక్క కణజాలానికి కట్టుబడి ఉంటుంది. దాని తొలగింపు.  సబ్‌లక్సేటెడ్ (పాక్షికంగా స్థానభ్రంశం చెందిన) లెన్స్‌లతొలగింపు కోసం క్రియోఎక్స్‌ట్రాక్షన్ ఇప్పటికీ ఉపయోగించబడుతుంది . కంటిశుక్లం శస్త్రచికిత్స యొక్క తొలి పత్రబద్ధమైన రూపం కౌచింగ్ . ఇది కంటి లెన్స్‌ను తొలగించడం, ఆప్టికల్ యాక్సిస్ నుండి కంటిశుక్లం తొలగించడం, కానీ కంటి లోపల వదిలివేయడం వంటివి ఉంటాయి. లెన్స్ భర్తీ చేయబడలేదు మరియు కంటి ఏ దూరం వద్ద దృష్టి పెట్టదు._*

*_ఫాకోఎమల్సిఫికేషన్ అనేది అభివృద్ధి చెందిన ప్రపంచంలో అత్యంత సాధారణంగా నిర్వహించబడే కంటిశుక్లం ప్రక్రియ, అయితే ఫాకోఎమల్సిఫికేషన్ మెషిన్ మరియు సంబంధిత డిస్పోజబుల్ పరికరాల యొక్క అధిక మూలధనం మరియు నిర్వహణ ఖర్చులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ECCE మరియు MSICSలను అత్యంత సాధారణంగా నిర్వహించే విధానాలుగా మార్చాయి.  కంటిశుక్లం శస్త్రచికిత్స సాధారణంగా ఔట్-పేషెంట్ లేదా డే-కేర్ ప్రక్రియగా చేయబడుతుంది, ఇది ఆసుపత్రిలో చేరడం మరియు రాత్రిపూట బస చేయడం కంటే చౌకైనది మరియు పగటిపూట శస్త్రచికిత్స కూడా అదే విధమైన వైద్య ఫలితాలను కలిగి ఉంటుంది._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏🏾_*
 *_మహిళలకు కడుపులో నాభి నొప్పి ఎందుకు వస్తుంది...?_*

*_కడుపు నొప్పి రావడం ఒకరకంగా అండం విడుదలకు సూచన. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఈ 'బహిష్టు సమయంలో కడుపునొప్పి'. దీన్నే వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు. బహిష్టు అంటే యుక్త వయసు ఆడపిల్లలలో నెలనెలా కనిపించే రక్తస్రావం. ఇది 50-200 మిల్లీ లీటర్లు ఉంటుంది._*

*_గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై, అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు సంసిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన రక్తసరఫరాను, పోషకాలను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి తోడ్పడుతుంది._*

*_గర్భధారణ జరగని పరిస్థితులలో ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బయటకు విసర్జించబడుతుంది. దాంతోపాటు కొంత వ్యర్థ కణజాలాలు, అందులో ఉండే రక్తనాళాల కొనలు కూడా గర్భాశయ ద్వారం ద్వారా బయటకు విసర్జించబడతాయి. ఇదంతా హార్మోన్ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది._*

*_బహిష్టు సమయంలో వచ్చే ఈ నొప్పిని వైద్య పరిభాషలో 'డిస్మెనోరియా' అంటారు. ఇది సాధారణంగా రక్తస్రావంతో కానీ.. రక్తస్రావానికి కొద్ది గంటల ముందు నుంచి కానీ మొదలై ఒకట్రెండు రోజులు ఉంటుంది. కొద్దిమందిలో రక్తస్రావం మొదలు కావడానికి ఒకట్రెండు రోజుల ముందునుంచే నొప్పి వస్తుంది._*

*_దీనికి కారణం  'గర్భాశయ లోపలి పొర 'అయిన ఎండోమెట్రియమ్ విచ్ఛిన్నమై బయటకు వచ్చేటపుడు ఆ కణజాలం నుంచి విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ F2ఆల్ఫా అనే పదార్థం._*

*_దీనివల్ల గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. అప్పుడు గర్భాశయ కండరాలు ముడుచుకోవడం వల్ల రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో గర్భాశయ కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. ఫలితం కడుపు నొప్పి._*

*_గర్భాశయ ద్వారం చిన్నదిగా, సన్నగా ఉంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది._*

*_సాధారణంగా యుక్త వయసు వారిలో అంటే 14-25 ఏళ్ల మధ్య ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. రజస్వల అయిన మొదటి రెండేళ్లు నొప్పి ఉండకపోవచ్చు. ఆ సమయంలో అండం విడుదల కాకుండానే హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల వల్ల మాత్రమే బహిష్టు అవుతుంది._*

*_అనంతరం కొన్నాళ్లకు అండం కూడా విడుదల కావడం ప్రారంభమైతే కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి._*

*_ఇక మధ్య వయసు వారి విషయానికొస్తే.. ఒక్కోసారి ఇతర వ్యాధులేమైనా కూడా కారణం కావొచ్చు. ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నొప్పి వస్తుంది._*

*_లక్షణాలు ఏంటి..?_*

*_పొత్తి కడుపులో తెరలుతెరలుగా నొప్పి మొదలై వాంతులు, వికారం, నడుమునొప్పి, తొడల భాగంలో నొప్పి కూడా ఉండొచ్చు._*
*_కొద్దిమందిలో మల బద్ధకం, విరోచనాలు, ఆకలి లేకపోవడం, చిరాకు, అసహనం, నిరాసక్తత వంటి లక్షణాలూ కనిపిస్తాయి._*

*_ఈ డిస్మెనోరియాని రెండు రకాలుగా వర్గీకరిస్తారు._*

*_1) ప్రైమరీ డిస్మెనోరియా.._*

*_యుక్త వయసులో నూటికి యాభై మందిలో కనిపించే నొప్పి ఇది. దీనికి ప్రత్యేక కారణమంటూ ఉండదు. వయసు పెరిగాక, పిల్లలు కలిగాక ఈ సమస్య దానికదే తగ్గిపోతుంది._*

*_2) సెకండరీ డిస్మెనోరియా.._*

*_దీనికి కొన్ని రకాల వ్యాధులు కారణం.._*

*_ఎండోమెట్రియోసిస్:-_* 

*_ఈ వ్యాధి వల్ల కడుపునొప్పి తీవ్రంగా ఉండడమే కాకుండా సంతాన లేమికీ దారి తీయొచ్చు. దీనికి కారణం గర్భాశయ కుహరాన్ని కప్పి ఉంచే ఎండోమెట్రియమ్ పొర అసహజంగా, అసాధారణంగా గర్భాశయం వెలుపలా.. పొత్తి కడుపులోని అండాశయం తదితర అవయవాలపై వ్యాపించి ఆయా కణజాలాలలో వాపుని కలగజేసి వాటి విధులకు ఆటంకం కలిగించడం. దీనివల్ల పీరియడ్స్‌లో క్రమబద్ధత లోపించడం, సంతానోత్పత్తి దెబ్బతినడం జరుగుతాయి. కాబట్టి బహిష్టు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ కారణమేమో తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని నిర్ధరించుకోవాలి._*

*_ఫైబ్రాయిడ్స్:-_*

*_ఇవి గర్భాశయం కండరాలలో వచ్చే కణుతులు. వీటివలన గర్భాశయం పరిమాణం పెరుగుతుంది._*

*_ఎడినోమయోసిస్ :-_*

*_ఈ సమస్య ఉన్నవారిలో ఎండోమెట్రియమ్ పొర గర్భాశయ గోడలకు పరిమితం కాకుండా కండరాలలోనికి చొచ్చుకునిపోతుంది. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్తస్రావం కలుగుతాయి._*

*_జననేంద్రియ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్లు:-_* 

*_లైంగిక సంబంధాల వల్ల వ్యాపించే సుఖవ్యాధులు కూడా సెకండరీ డిస్మెనోరియాకి కారణాలు._*

*_పిల్లలు పుడితే డిస్మెనోరియా తగ్గుతుందా...?_*

*_పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం కానీ పిల్లలు పుట్టాకా, కొంత వయసు పెరిగాక తగ్గే అవకాశముంది._*

*_వ్యాధి నిర్ధారణ ఎలా..?_*

*_అనుభవజ్ఞులైన వైద్యులు రోగి నుంచి అవసరమైన సమాచారం సేకరించడం ద్వారా, కొన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధరణ చేస్తారు._*

*_దీనికి ఉపకరించే పరీక్షలు.._*

*_జననేంద్రియాల లోపలి పరీక్ష._*

*_కొన్ని రకాల రక్తపరీక్షలు._*

*_అల్ట్రాసౌండ్ స్కానింగ్._*

*_లాప్రోస్కోపీ.. ఇది ఎండోమెట్రియోసిస్‌ వ్యాధి నిర్ధరణలో, చికిత్సలో కూడా ఉపకరిస్తుంది._*

*_నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి..?_*

*_సమస్యను అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి._*

*_వేడినీళ్ల స్నానం చేయడం.._* 

*_పొత్తికడుపు, నడుము మధ్య వేడినీళ్ల బ్యాగుతో కాపడం పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది._*

*_క్రమంతప్పని వ్యాయామం.._* 

*_కాఫీ వినియోగం తగ్గించడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల రక్త సరఫరా పెరిగి నొప్పి తీవ్రత తగ్గే అవకాశముంది._*

*_సిగరెట్, ఆల్కహాల్ అలవాటుంటే వెంటనే మానేయాలి._*

*_మందులు ఉన్నాయా..?_*

*_ఇక మందుల విషయానికొస్తే నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాండిన్స్ స్థాయిని తగ్గించే మందులు సురక్షితమైనవి. వీటిని డాక్టరు సలహాపైనే వాడాలి._*

*_నొప్పి బాగా తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహాపై ఓసీ పిల్స్ కానీ, ప్రొజెస్టిరోన్ ఉన్న లూప్ కానీ వాడొచ్చు._*

*_వ్యాధుల కారణంగా వచ్చే కడుపు నొప్పికి ఆ వ్యాధిని నిర్ధారణ చేసి తగిన చికిత్స చేయాలి._*

*_బహిష్టు సమయంలో కడుపునొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అది ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన చికిత్స తీసుకుంటే మహిళలలా యొక్క ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- మీ..డా,,తుకారాం జాదవ్.🙏🏾_*
 *_Heart Diseases Angina  awareness._*
  
*_గుండెపోటు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు :-_*

*_1.మొదట మనిషి మనసును స్థిమితంగా ఉంచుకోవాలి ద్వేష భావాలు ఉండకూడదు._*

*_2.ధూమపానం మద్యపానం పూర్తిగా మానివేయాలి._*

*_3.బిపి షుగరు ఆస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు క్రమంగా మందులు వాడాలి._*

*_4.రక్తంలో కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్ధం ఉంటుంది ఆ కొవ్వు తక్కువగా ఉన్న వంటనూనె మాత్రమే వాడాలి ._*

*_4.వెన్న శాతం తక్కువగా ఉన్న పాలు వాడాలి._*

*_5.మాంసాన్ని తగ్గించి చేపలని తినవచ్చు._*

*_6.ఉల్లి వెల్లుల్లి ఎక్కువగా వాడవచ్చు._*

*_7.స్థూలకాయం ఉన్నవారికి గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు శరీర బరువు తగ్గించుకోవాలి._*

*_8.ప్రతిరోజు నడవడం క్రమంగా వ్యాయామం చేయడం చేయాలి._*

*_9.వేపుడు కూరలు తగ్గించాలి._*

*_10.గుండెపోటు లేదా అనారోగ్య సమస్యలు అనేవి దేహానికి ఎప్పుడైనా రావచ్చు ._*

*_అయితే వయసు రీత్యా కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కొంతమంది అదృష్టవంతులు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు. కారణం వారి యొక్క జీవన శైలి. సరైన జీవన శైలిని పాటించడం ద్వారా ఉన్నని రోజులు మందులు వాడకుండా, ఆరోగ్యంగా, సంతోషంగా బతకడనికి అవకాశం ఉన్నది.._*

*_సరైన జీవన శైలి ని పాటించండి✍️_*

 *_-సదా మీ శ్రేయోభిలాషి..💐_*

 *_-మీ..తుకారాం జాదవ్.🙏🏾_*
 *_పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి...?_*

*_పెద్ద ప్రేగు (పెద్దప్రేగు) ఆరోగ్యంగా ఉండడానికి ఉపకరించు ఆహారము:-_*

*_🌹ఫైబర్ పుష్కలంగా తినండి_.*

*_ఫైబర్ జీర్ణం కాదు మరియు మీ పెద్దప్రేగు ద్వారా వ్యర్థాలను తరలించడంలో సహాయపడుతుంది. మంచి వనరులలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, బీన్స్, గింజలు మరియు విత్తనాలు ఉన్నాయి. రోజుకు 25-30 గ్రాముల ఫైబర్ కోసం లక్ష్యంగా పెట్టుకోండి. కరిగే ఫైబర్ (వోట్స్, బీన్స్, సిట్రస్ పండ్లు) ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది._*

*_🌹హైడ్రేటెడ్ గా ఉండండి._*

*_మీ మలాన్ని మృదువుగా ఉంచడానికి మరియు సాధారణ ప్రేగు కదలికలకు మద్దతు ఇవ్వడానికి పుష్కలంగా ద్రవాలు, ముఖ్యంగా నీరు త్రాగండి. డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకం వస్తుంది. రోజుకు సుమారు 2 లీటర్లు (8 కప్పులు) లక్ష్యంగా పెట్టుకోండి._*

*_🌹ప్రోబయోటిక్ ఆహారాలు తినండి._*

*_ప్రోబయోటిక్స్ గట్ బ్యాక్టీరియా యొక్క ఆరోగ్యకరమైన సంతులనాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పెరుగు, కేఫీర్, సౌర్‌క్రాట్, కిమ్చీ, ఊరగాయలు మరియు టేంపే అన్నీ మంచి ప్రోబయోటిక్ మూలాలు. ప్రోబయోటిక్ ఆహారాన్ని తరచుగా తినాలని లక్ష్యంగా పెట్టుకోండి._*

*_🌹ప్రాసెస్ చేసిన మాంసాలను పరిమితంచేయండి._*

*_చేయండి - ప్రాసెస్ చేయబడిన మరియు ఎరుపు మాంసాలు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. బేకన్, సాసేజ్, డెలి మాంసాలు మరియు ఇతర ప్రాసెస్ చేసిన మాంసాలను పరిమితం చేయండి._*

*_🌹శోథ నిరోధక ఆహారాలుతినండి._*

*_ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు (సాల్మన్, ట్యూనా), యాంటీఆక్సిడెంట్లు (పండ్లు, కూరగాయలు) మరియు సుగంధ ద్రవ్యాలు (పసుపు) అధికంగా ఉండే ఆహారాలు పెద్దప్రేగులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మంటను నిర్వహించడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది._*

*_🌹చురుకుగా ఉండండి._* 

*_రెగ్యులర్ వ్యాయామం పెద్దప్రేగు ద్వారా ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది మరియు పెద్దప్రేగు సమస్యలను అవి ప్రారంభించే ముందు నివారించడంలో సహాయపడవచ్చు. రోజుకు కనీసం 30 నిమిషాలు మితమైన కార్యాచరణను లక్ష్యంగా పెట్టుకోండి._*

*_🌹ప్రాసెస్ చేయబడిన ఆహారాలు._*

*_చక్కెర మరియు సంతృప్త కొవ్వులను పరిమితం చేస్తూ పైన పేర్కొన్న ఆహారాలపై దృష్టి కేంద్రీకరించడం వలన పెద్దప్రేగు ఆరోగ్యంగా దీర్ఘకాలికంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. మీకు ఏవైనా ఇతర పెద్దప్రేగు ఆరోగ్య చిట్కాలు అవసరమైతే నాకు తెలియజేయండి._*

*_పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండాలంటే బొడ్డు దగ్గర కింద పొట్ట ఆసనాలు వేయాలి.తలకాయి మోకాళ్ళ వరకు వచ్చేటట్టు వంగుని రెండు చేతుల్లో మెడ మీదకు పెట్టుకుని పైకి లేస్తూ మల్లా వంగుని ఒక కాలు కుడిపక్కకి ఎడంపక్కకు వేసి కుడి పక్కకు వంగి మల్ల అలా రకరకాలుగా చేస్తూ ఉంటే పొట్ట గట్టిపడి పెద్ద పేగు ఆరోగ్యంగా తయారవుతుంది.దేనికైనా గాని ఎక్సర్సైజ్ కావాలి. వ్యాయామంచేయాలి.నిపుణుల పర్యవేక్షణలో తెలుసుకొని చేయాలి._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏🏾_*
 *_'సైనస్' అంటే ఏమిటి...?_*
*_'సైనసైటిస్' ఎలా వస్తుంది..?_*

*_అవగాహనా, సలహాలు మీకోసం..._*

*_సైనస్ అంటే ఏమిటి మరియు దానిని ఎలా నివారించాలి...?_*

*_సైనస్ అనేది సైనస్ కావిటీస్ యొక్క వాపు లేదా సంక్రమణను సూచిస్తుంది, ఇవి ముఖం మరియు పుర్రె యొక్క ఎముకలలో గాలితో నిండిన ఖాళీలు. సైనస్‌లు శ్లేష్మ పొరలతో కప్పబడి ఉంటాయి, ఇవి నాసికా భాగాలను తేమగా మార్చడానికి మరియు దుమ్ము మరియు అలెర్జీ కారకాల వంటి విదేశీ కణాలను బంధించడంలో సహాయపడటానికి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. సైనస్‌లు ఎర్రబడినప్పుడు లేదా ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు, అవి అదనపు శ్లేష్మంతో నిండిపోతాయి, ఇది నాసికా రద్దీ, తలనొప్పి, ముఖ నొప్పి మరియు ముఖంలో ఒత్తిడి అనుభూతి వంటి లక్షణాలకు దారితీస్తుంది._*

*_1.అక్యూట్ సైనసిటిస్:-_*

*_(సాధారణంగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది), క్రానిక్ సైనసిటిస్ (12 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది) మరియు అలర్జిక్ సైనసిటిస్ (అలెర్జెన్స్ ద్వారా ప్రేరేపించబడుతుంది) వంటి అనేక రకాల సైనసిటిస్ ఉన్నాయి._*

*_సైనసైటిస్‌ను నివారించండి ఇలా..._*

*_1.మంచి పరిశుభ్రతను పాటించండి._*

*_క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటి మంచి పరిశుభ్రతను పాటించడం వల్ల సైనసైటిస్‌కు కారణమయ్యే ఇన్ఫెక్షన్ మరియు జెర్మ్స్ వ్యాప్తిని తగ్గించవచ్చు._*

*_2.హైడ్రేటెడ్ గా ఉండండి._*

*_శ్లేష్మం సన్నగా మరియు ప్రవహించేలా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగండి, మీ సైనస్‌లు సరిగ్గా హరించడం సులభం చేస్తుంది._*

*_3.అలెర్జీ కారకాలను నివారించండి._*

*_మీకు అలెర్జీలు ఉంటే, అలెర్జీ సైనసిటిస్‌కు దారితీసే ట్రిగ్గర్‌లను గుర్తించి నివారించండి. సాధారణ అలెర్జీ కారకాలలో పుప్పొడి, పెంపుడు జంతువుల చర్మం, అచ్చు మరియు దుమ్ము పురుగులు ఉన్నాయి._*

*_4.హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి._*

*_గాలిని తేమగా ఉంచడం వలన నాసికా గద్యాలై ఎండిపోకుండా నిరోధించవచ్చు మరియు సైనసైటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయినప్పటికీ, అదనపు సమస్యలను నివారించడానికి హ్యూమిడిఫైయర్ శుభ్రంగా మరియు అచ్చు లేకుండా ఉండేలా చూసుకోండి._*

*_5.నాసికా నీటిపారుదలని ప్రాక్టీస్ చేయండి._*

*_మీ నాసికా భాగాలను సెలైన్ ద్రావణంతో కడగడం వల్ల శ్లేష్మం మరియు చికాకులను క్లియర్ చేయడం మరియు సైనస్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోజనం కోసం స్టెరైల్ సెలైన్ ద్రావణం లేదా నేతి పాట్ ఉపయోగించండి._*

*_6.పొగ మరియు చికాకులను నివారించండి._*

*_ధూమపానం మరియు సెకండ్‌హ్యాండ్ పొగకు గురికావడం వల్ల సైనస్‌లను చికాకు పెట్టవచ్చు మరియు సైనసైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. పొగ మరియు ఇతర చికాకులకు గురికావడాన్ని తగ్గించండి._*

*_7.తక్షణమే అలర్జీలకు చికిత్స చేయండి._*

*_మీకు అలెర్జీలు ఉంటే, మీ డాక్టర్ సూచించిన మందులు లేదా అలెర్జీ షాట్‌లతో వాటిని సమర్థవంతంగా నిర్వహించండి._*

*_8.నాసికా డీకోంగెస్టెంట్‌లను జాగ్రత్తగా వాడండి._*

*_నాసికా డీకంగెస్టెంట్ స్ప్రేలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల రినైటిస్ మెడికామెంటోసా అనే పరిస్థితికి దారితీయవచ్చు, ఇక్కడ నాసికా మార్గాలు స్ప్రేపై ఆధారపడి ఉంటాయి మరియు రద్దీని మరింత తీవ్రతరం చేస్తాయి._*

*_9.తక్షణ చికిత్సను పొందండి._* 

*_మీకు జలుబు లేదా శ్వాసకోశ సంక్రమణ లక్షణాలు ఉంటే, పరిస్థితి సైనసైటిస్‌గా మారకుండా నిరోధించడానికి తక్షణ చికిత్సను పొందండి._*

*_మీరు తరచుగా సైనసైటిస్‌ను అనుభవిస్తే లేదా తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటే, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం చాలా అవసరం._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్._*
 *_గర్భసంచిలో ఈ గడ్డలేంటి...?_*

*_గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశమూ లేదనే చెప్పుకోవచ్చు._*

*_గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి._*

*_గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది._*

*_ఈస్ట్రోజెన్‌ హార్మోను వీటిని ప్రభావితం చేస్తుందన్నది మాత్రం సుస్పష్టమైంది. ఇవి కొందరిలో వేగంగా మరికొందరిలో నెమ్మదిగా పెరగొచ్చు. కొన్ని ఎప్పుడూ ఒకే సైజులో ఉండొచ్చు, కొన్ని వాటంతటవే కుంచించుకుపోవచ్చు. నెలసరి నిలిచిపోయిన తర్వాత సహజంగానే ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్లు కూడా చిన్నగా అవుతాయి. కొన్నైతే రాళ్లలా గట్టిపడిపోతాయి కూడా._*

*_🌹అధిక రుతుస్రావం.. నొప్పి.._* 

*_సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి._*

*_చికిత్స ఏంటి...?_* 

*_ఫైబ్రాయిడ్లు ఉన్నా బాధలేవీ లేకపోతే ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి._*

*_సైడెఫెకక్ట్స్:-_*

*_అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల వీటిని 3-6 నెలల కన్నా ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి ప్రొజెస్టిరాన్‌ను విడుదల చేసే ఐయూడీని లోపల అమరుస్తారు. ఇది రుతుస్రావం అధికంగా కావటాన్ని తగ్గిస్తుంది. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం అబ్లేషన్‌ ప్రక్రియతో కణితికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని మూసేసే పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీంతో గడ్డ క్రమేపీ చిన్నదై, మాయమవుతుంది._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_-మీ.డా,,తుకారాం జాదవ్.🙏🏾._*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
 *_🌹"గుండె జబ్బులు, గుండె ఆరోగ్యంపై అందరికీ కలిగే సందేహాలు.. మీకోసం  వాటికి సమాధానాలు"..!_*

*_గుండె జబ్బులు ఉన్నవారికే కాదు, అవి లేని వారికి కూడా గుండె ఆరోగ్యం పట్ల అనేక సందేహాలు వస్తుంటాయి. ఫలానా ఆహారం తినాలా, వద్దా, ఏ నూనె వాడాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? వంటి అనేక ప్రశ్నలు మదిలో వస్తుంటాయి. అయితే అలాంటి ప్రశ్నలకు మీ అవగాహన కోసం సమాధానాలు  తెలుసుకుందాం...👇🏼_*

*_🫀1. "గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి"..?_*

*_పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలను తగ్గించాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు అయినా రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాలి. అపార్ట్‌మెంట్లలో ఉండే వారు, పై అంతస్తుల్లో పనిచేసే ఉద్యోగులు లిఫ్ట్‌ వాడకుండా మెట్లను వాడితే మంచిది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు మధ్యలో కొంత సేపు పనికి విరామం ఇచ్చి కాసేపు అటు, ఇటు తిరగాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. హైబీపీ, షుగర్‌ ఉన్నవారు వాటిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి._*

*_🫀2. "కొందరు ఆరోగ్యంగా కనిపించినా సడెన్‌గా గుండె పోటుతో చనిపోతుంటారు  కారణం ఏమిటి"... ?_*

*_దీన్నే సైలెంట్‌ అటాక్‌ (కార్డియాక్‌ అరెస్ట్‌) అంటారు. 30 ఏళ్లకు పైబడిన వారు ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉంటాయి._*

*_🫀3. "గుండె ఆరోగ్యం కోసం జాగింగ్‌ లేదా వాకింగ్‌, ఏది చేస్తే మంచిది"..?_*

*_ఆరోగ్యంగా ఉన్నవారు ఏదైనా చేయవచ్చు. కానీ కీళ్ల సమస్యలు ఉన్నవారు వాకింగ్‌ చేయడం ఉత్తమం._*

*_🫀4. 'చేపలు తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందా".. ?_*

*_చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువల్ల గుండెకు చేపలు మేలు చేస్తాయి. కానీ వాటిని అతిగా తీసుకోరాదు. చేపలను వేపుడుగా కన్నా కూరగా చేసుకుని తింటే మేలు._*

*_🫀5. "గుండె జబ్బులు వంశ పారంపర్యంగా వస్తాయా"..?_*

*_అవును. గుండె జబ్బులు వంశ పారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది._*

*_🫀6. "హైబీపీ ఉంటే గుండె జబ్బులు వస్తాయా"..?_*

*_వస్తాయి. కానీ ఆ అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీపీని నియంత్రణలో ఉంచుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది._*

*_🫀7. కొలెస్ట్రాల్‌ సమస్య పెద్ద వారిలోనే ఉంటుందా"..?_*

*_లేదు. యుక్త వయస్సులో ఉన్నవారిలోనూ కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండవచ్చు. దానికి వయస్సుతో సంబంధం లేదు._*

*_🫀8. "మందులు వాడకుండా కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టలేమా"..?_*

*_పెట్టవచ్చు. కానీ ఒకేసారి మందులను మానేయరాదు. డాక్టర్ల సూచన మేరకు పౌష్టికాహారం తీసుకుంటూ నెమ్మదిగా మందులను మానేయవచ్చు. కేవలం ఆహారంతోనే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది అని డాక్టర్లు నిర్దారిస్తే వారి సూచన మేరకు మందులను వాడడం మానేయవచ్చు._*

*_🫀9. "గుండె జబ్బులు రాకుండా యోగా కాపాడుతుందా"..?_*

*_అవును. యోగా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది._*

*_🫀10. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంట నూనెల్లో ఏది ఉత్తమం"..?_*

*_రీఫైన్డ్‌ అయిల్స్‌ అన్నీ ప్రమాదకరమైనవే. గానుగలో ఆడించిన నూనెలు అయితే ఉత్తమం._*

*_🫀11. "గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి"..?_*

*_తాజా కూరగాయలు, పండ్లు, నట్స్‌ తినాలి. నూనె పదార్థాలు మానేయాలి. లేదా తక్కువగా తీసుకోవాలి._*

*_🫀12. "తరచూ చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటి".. ?_*

*_షుగర్‌, కొలెస్ట్రాల్‌, బీపీ, 2డీ ఎకో, ట్రెడ్‌మిల్‌ పరీక్షలను తరచూ చేయించుకోవాలి. దీని వల్ల ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవచ్చు. లేదంటే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది._*

*_🫀13. హార్ట్‌ ఎటాక్‌ రాగానే వ్యక్తికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి"..?_*

*_హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారిని 60 నిమిషాల్లోగా హాస్పిటల్‌కు తరలించాలి. దాన్నే గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఆ సమయంలోగా హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. లేదంటే గుండెకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక హాస్పిటల్‌కు తరలించే లోపు బాధితుడికి ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా వ్యక్తిని పడుకోబెట్టాలి. తరువాత ఆస్పిరిన్‌ మాత్రను, దొరికితే సార్బిట్రేట్‌ మాత్రతోపాటు నాలుక కింద పెట్టాలి. శ్వాస ఆడకపోతే కృత్రిమ శ్వాస అందివ్వాలి. నోట్లో నోరు పెట్టి శ్వాసను అందించాలి. గుండెపై చేతులతో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ సీపీఆర్‌ చేయాలి. దీని వల్ల గుండెకు నష్టం కలగకుండా ఉంటుంది._*

*_🫀14. "గ్యాస్‌ నొప్పి, గుండె నొప్పి ఎలా కనిపెట్టాలి"..?_*

*_ఈసీజీ చేయించుకుంటే తెలిసిపోతుంది._*

*_🫀15. "గుండె ఆపరేషన్‌ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి"..?_*

*_ఆహార నియంత్రణ పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వేళకు తీసుకోవాలి. రోజూ వ్యాయామం కచ్చితంగా చేయాలి. వేళకు మెడిసిన్‌ వేసుకోవాలి. వేళకు నిద్రించాలి. పొగతాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. కొలెస్ట్రాల్‌, బీపీ, బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_మీ. డా,,తుకారాం జాదవ్.🙏🏾_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
 *_🌹ఓ. ఆర్. ఎస్ అంటే ఏంటి..?_*

*_🌹డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి...?_*

*_🌹అవగాహనా, సలహాలు మీ కోసం.._*

*_మన శరీరంలోకి ప్రవేశించే నీటి కంటే మన శరీరం నుంచి బయటికి వెళ్లిపోయే నీటి శాతం ఎక్కువైతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరంలో నీటి శాతం తగినంత లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. సాధారణంగా రొటీన్ లో కొంత నీటిని కోల్పోతాము. అదెలాగంటే, శ్వాస ద్వారా హ్యుమిడిఫైడ్ ఎయిర్ అనేది బయటికి వెళ్తుంది. అలాగే చెమట ద్వారా నీటిని కోల్పోతాము. మూత్రం అలాగే బవుల్ మూవ్మెంట్స్ ద్వారా కూడా కొంత నీటిని కోల్పోతాము._*

*_🌹డీహైడ్రేషన్ కి దారి తీసే కారణాలు:-_*

*_🌹డయేరియా:-_*

*_వాటర్ లాస్‌కి ప్రధాన కారణం డయేరియా. నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ప్రతి బవుల్ మూవ్మెంట్ తో వాటర్ లాస్ జరుగుతుంది. డయేరియా అలాగే కొనసాగితే ప్రమాదకరం. డయేరియాతో తలెత్తే డీహైడ్రేషన్ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు._*
 
*_🌹వాంతులు:-_*

*_వాంతులవల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అదేపనిగా వాంతులవుతూ ఉంటే ప్రమాదకరం కూడా. శరీరంలో ఫ్లూయిడ్ లాస్ జరుగుతుంది. వాంతులు అవుతూ ఉంటే లిక్విడ్స్ ను తాగడానికి కూడా పేషంట్స్ ఇబ్బంది పడతారు._*

*_🌹చెమట:-_*

*_చెమట ద్వారా శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియలో వాటర్ లాస్ జరుగుతుంది. వాతావరణం వల్ల శరీరం వేడిగా ఉన్నా, వేడి వాతావరణలో వ్యాయామం చేస్తున్నా, లేదా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం ఉన్నా చెమట ద్వారా శరీరం తనను తాను చల్లబరచుకోవడానికి ప్రయత్నిస్తుంది._*

*_🌹మధుమేహం:-_*

*_మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో విపరీతమైన దాహం అలాగే తరచూ యూరినేషన్ అవసరం ఏర్పడటం వంటివి సహజం. వీటి వల్ల వారిలో వాటర్ లాస్ సమస్య తలెత్తుతుంది. డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది._*

*_🌹కాలిన గాయాలు:-_*

*_శరీరంలో ఫ్లూయిడ్ అలాగే టెంపరేచర్ రెగ్యులేషన్ కు స్కిన్ పోషించే రోల్ ముఖ్యమైనది. స్కిన్ గాయాలపాలైతే ఈ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. అందుకే, కాలిన గాయాల బారిన పడినవారు డీహైడ్రేషన్ కు గురవుతారు. అలాగే, ఇతర స్కిన్ ఇన్ఫ్లమేటరీ డీసీజెస్ వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది._*

*_🌹తగినంత నీరు తాగలేకపోవడం:-_*

*_తగినంత నీరు తాగలేకపోవడం కూడా డీహైడ్రేషన్ కి దారితీసే ప్రధాన కారణం. తగినంత నీరు అందుబాటులో లేకపోవడం వల్ల కావచ్చు లేదా తగినంత నీటిని తాగలేని నిస్సహాయ స్థితి కావచ్చు వీటికి రొటీన్ వాటర్ లాస్ తో పాటు మిగతా కారణాల వల్ల వాటర్ లాస్ తోడైతే డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది._*

*_🌹ఎలా డయాగ్నోస్ చేస్తారు:-_*

*_పేషంట్ స్పృహలో ఉన్నారో లేదో చెక్ చేస్తారు._*

*_బ్లడ్ ప్రెజర్ రీడింగ్స్ ను అలాగే పల్స్ రేట్స్ ను నమోదు చేసుకుంటారు._*

*_డీహైడ్రేషన్ వల్ల పల్స్ రేట్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ పడిపోతుంది. ఎందుకంటే ఇంట్రావాస్కులర్ స్పేస్ లో నీళ్ల కొరత ఏర్పడుతుంది కాబట్టి._*

*_ఫీవర్ ఉందో లేదో తెలుసుకునేందుకు టెంపరేచర్ చెక్ చేస్తారు. చెమట పడుతుందో లేదో చెక్ చేస్తారు._*

*_అలాగే ఎలాస్టిసిటీ డిగ్రీను అంచనా వేస్తారు._*

*_డిహైడ్రేషన్ సమయంలో స్కిన్ లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఎలాస్టిసిటీ సామర్థ్యం తగ్గిపోతుంది._*

*ఇంట్లోనే డీహైడ్రేషన్ సమస్యను పరిష్కరించుకోగలమా?*

*_డిహైడ్రేషన్ సమస్య తీవ్రమైతే ఇబ్బందులు వస్తాయి. ప్రారంభదశలోనే ఈ సమస్యను గుర్తిస్తే ఇంట్లోనే పరిష్కరించుకోగలుగుతము._*

*_ఫీవర్ ను కంట్రోల్ చేసేందుకు అసెటమినొఫెన్ లేదా ఐబుప్రోఫెన్ ను వాడవచ్చు. ఐబుప్రొఫెన్ స్టమక్ ను ఇరిటేట్ చేయవచ్చు. దాంతో, వికారం అలాగే వామ్టింగ్ రావచ్చు. కాబట్టి, ఆల్రెడీ ఈ లక్షణాలున్నవారు దీన్ని జాగ్రత్తగా వాడాలి._*

*_కోల్పోయిన ఫ్లూయిట్స్ ను నోటి ద్వారా రీప్లేస్ చేసేందుకు చిన్న చిన్న మోతాదుల్లో క్లియర్ ఫ్లూయిడ్స్ ను రోగికి ఇస్తూ ఉండాలి._*

*_ఒకవేళ రోగి గందరగోళంగా అలాగే లెథర్జిక్ గా మారితే, ఫీవర్ తగ్గకపోతే,  వాంతింగ్తోపాటు విరేచనాలు కంట్రోల్ కాకపోతే వెంటనే మెడికల్ కేర్ అవసరమవుతుంది._*

*_🌹డీహైడ్రేషన్ తో వల్ల వచ్చే కాంప్లికేషన్స్.._*

*_కిడ్నీఫెయిల్యూర్, కోమా, షాక్, గుండె జబ్బులు, ఎలెక్ట్రోలైట్ లో అబ్నార్మాలిటీస్ వంటివి డీహైడ్రేషన్ తో వచ్చే కాంప్లికేషన్స్._*

*_🌹ఎలా ప్రివెంట్ చేయాలి...?_*

*_అవుట్ డోర్ ఈవెంట్స్ కి వెళ్లే ముందు మీతో పాటు తగినంత డ్రింకింగ్ వాటర్ ను తీసుకెళ్లండి. చెమట పట్టే యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే వేడి మరియు ఒత్తిడి వల్ల ఫ్లూయిడ్ లాస్ జరుగుతుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు ఫ్లూయిడ్స్ ను రీప్లేస్ చేయాలి._*

*_బయటికి వెళ్లే ముందు వెదర్ కండిషన్స్ ను గమనించండి. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం అవాయిడ్ చేయండి. వ్యాయామాన్ని కూడా అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఎండవేడికి గురవకుండా జాగ్రత్తపడండి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే బయటి యాక్టివిటీస్ ను ప్లాన్ చేసుకోండి. చిన్నపిల్లలు అలాగే వృద్ధులు డీహైడ్రేషన్ కు గురయ్యే రిస్క్ ఎక్కువ. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు వారిలో ఫ్లూయిడ్ లాస్ జరగకుండా కేర్ తీసుకోండి._*

*_ఆల్కహాల్ ను అవాయిడ్ చేయండి. ముఖ్యంగా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్ళకండి. ఆల్కహాల్ వాటర్ లాస్ కి కారణమవుతుంది._*

*_లైట్ కలర్ తో పాటు లూజ్ ఫిట్టింగ్ క్లాతింగ్ ని ప్రిఫర్ చేయండి. అవుట్ డోర్ కి వెళ్ళవలసి వస్తే పెర్సనల్ ఫ్యాన్ ను తీసుకెళ్లండి._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏🏾_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
 *_🌹అతిగా నిద్రపోవడానికి 15 కారణాలు.._*

*_🌹నివారణ మార్గాలు:-_* 

 *_🌹కారణాలు:-_*

*_1. క్రమరహిత నిద్ర షెడ్యూల్ లేదా ధ్వనించే వాతావరణంలో నిద్రపోవడం వంటి పేలవమైన నిద్ర పరిశుభ్రత._*

*_2. అధిక నిద్రకు దారితీసే ఒత్తిడి మరియు ఆందోళన._*

*_3. డిప్రెషన్ లేదా స్లీప్ అప్నియా వంటి వైద్య పరిస్థితులు._*

*_4. మగతను ప్రేరేపించే మందులు._*

*_5. రోజులో శారీరక శ్రమ లేకపోవడం._*

*_6. ఆల్కహాల్ లేదా కెఫిన్ యొక్క అధిక వినియోగం నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది._*

*_7. శక్తి స్థాయిలను ప్రభావితం చేసే పోషకాహార లోపాలు._*

*_8. నిద్రవేళకు ముందు అధిక స్క్రీన్ సమయం సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగిస్తుంది._*

*_9. పడకగదిలో చాలా వెలుతురు వంటి పర్యావరణ కారకాలు._*

*_10. దీర్ఘకాల నిద్రకు కారణమయ్యే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ లేదా ఫైబ్రోమైయాల్జియా._*

*_11. హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా మహిళల్లో._*

*_12. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) శీతాకాలంలో అతిగా నిద్రపోవడానికి దారితీస్తుంది._*

*_13. నిద్ర మేల్కొనే చక్రాన్ని ప్రభావితం చేసే సహజ సూర్యకాంతికి తగినంతగా బహిర్గతం కాదు._*

*_14. థైరాయిడ్ రుగ్మతలు వంటి అంతర్లీన వైద్య పరిస్థితులు._*

*_15. పగటిపూట అతిగా నిద్రపోవడం రాత్రిపూట నిద్రకు భంగం కలిగిస్తుంది._*

 *_🌹నివారణలు:-_*

*_1. స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను ఏర్పాటు చేయండి._*

*_2. నిద్రపోయే సమయం ఆసన్నమైందని మీ శరీరానికి సూచించడానికి ప్రశాంతమైన నిద్రవేళ దినచర్యను సృష్టించండి._*

*_3. ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి సడలింపు పద్ధతులను ప్రాక్టీస్ చేయండి._*

*_4. ఒత్తిడి మరియు ఆందోళన నిర్వహణ కోసం థెరపీ లేదా కౌన్సెలింగ్ కోరండి._*

*_5. ఏదైనా అంతర్లీన వైద్య పరిస్థితులను పరిష్కరించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి._*

*_6. నిద్రవేళకు దగ్గరగా కెఫిన్ మరియు ఆల్కహాల్ వంటి ఉద్దీపనలను నివారించండి._*

*_7. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, కానీ నిద్రవేళకు దగ్గరగా తీవ్రమైన కార్యకలాపాలను నివారించండి._*

*_8. మీ నిద్ర వాతావరణం ప్రశాంతమైన నిద్రకు (చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా) అనుకూలంగా ఉండేలా చూసుకోండి._*

*_9. పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి మరియు పరికరాల్లో బ్లూ లైట్ ఫిల్టర్‌లను ఉపయోగించండి._*

*_10. సమతుల్య ఆహారం తీసుకోండి మరియు లోపాలను గుర్తించినట్లయితే సప్లిమెంట్లను పరిగణించండి._*

*_11. నిద్ర విధానాలను ప్రభావితం చేసే మందులను పర్యవేక్షించండి మరియు సర్దుబాటు చేయండి._*

*_12. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కోసం లైట్ థెరపీని పరిగణించండి._*

*_13. పగటిపూట సహజమైన సూర్యరశ్మికి క్రమం తప్పకుండా బహిర్గతం చేయండి._*

*_14. మంచి నిద్ర భంగిమను ప్రాక్టీస్ చేయండి మరియు సౌకర్యవంతమైన mattress మరియు దిండులలో పెట్టుబడి పెట్టండి._*

*_15. ఎక్కువసేపు లేదా తరచుగా నిద్రపోవడాన్ని నివారించండి, ముఖ్యంగా రోజులో ఆలస్యం._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏🏾._*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
 *_ట్రైగ్లిజరైడ్స్ అనగా ఏమిటి..?_*

*_రక్తంలో ఎంత ఉండాలి...?_*

*_ఎక్కువైతే ఏమి చేయాలి..?_*

*_ట్రైగ్లిజరైడ్స్  అంటే.._*

*_రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థాలు._*

*_శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి._*

*_ఆహారంలోని కొవ్వుల నుండి గాని, శరీరం తయారుచేసే కొవ్వుల నుండి ఏర్పడతాయి._*

*_ఎంత ఉండాలి...?_*

 *_సాధారణ స్థాయి: 150mg/dL కంటే తక్కువ._*

*_అధికంగా లేని స్థాయి: 150mg/dL నుండి 199mg/dL._*

*_అధిక స్థాయి: 200mg/dL కంటే ఎక్కువ._*

*_చాలా అధిక స్థాయి: 500mg/dL కంటే ఎక్కువ._*

*_ఎక్కువైతే ఏం జరుగుతుంది..?_*

*_'గుండెపోటు'_*

*_'స్ట్రోక్'_*

*_ప్యాంక్రియాటైటిస్ ఎలా తగ్గించాలి..?_*

*_ఆహారంలో మార్పులు:-_*

*_కొవ్వు, క్యాలరీలు తగ్గించండి. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ కొవ్వులు పూర్తిగా తగ్గించండి. శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, చక్కెర తగ్గించండి._*

*_తృణధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు (కాయలు, కూరగాయలు) ఎక్కువ తీసుకోండి._*

*_'శారీరక శ్రమ'_*

*_క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి._*

*_బరువు తగ్గడం:-_*

 *_అధిక బరువు ఉంటే బరువు తగ్గించడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి._*

*_మందులు  వైద్యుడు సలహా మేరకు మందులు వాడవచ్చు._*

*_మరిన్ని విషయాలు:-_*

*_'మద్యపానం'_*

*_తగ్గించండి అధిక మద్యపానం ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచుతుంది._*

*_ధూమపానం  మానేయండి.._*

 *_ధూమపానం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా పెంచుతుంది._*

*_'మంచి నిద్ర '_*

*_కనీసం 7-8 గంటల నిద్ర పోవడం చాలా ముఖ్యం. నిద్ర లేమి కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచుతుంది._*

*_రక్తపోటు, మధుమేహం నియంత్రణ:-_*

*_మీ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తెలుసుకోవడానికి రక్త పరీక్ష అవసరం. మీ వైద్యుడిని సంప్రదించి, మీ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటో తెలుసుకోండి._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏🏾._*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
 *_Prostate Cancer awareness._*

*_ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి...?_*

*_దాని Existing ఎలా ఉంటాయి..?_*

*_అవగాహనా మీ కోసం..._*

*_8ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ గ్రంధిలో మొదలౌతుంది, ఇది మగవారిలో సెమినల్ ఫ్లూయిడ్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. ఈ రకమైన క్యాన్సర్ సాధారణంగా వృద్ధులలో ఎక్కువగా నిర్ధారణ చేయబడుతుంది అలాగే నెమ్మదిగా ఇది పెరుగుతుంది, దీని ప్రారంభ దశలలో లక్షణాలు పెద్దగా ఏమీ మనకు కనిపించకపోవచ్చు,కానీ పెరిగే క్రమంలో ఈ సంకేతాలు, లక్షణాలు కనపడే అవకాశం ఉంది._*

*_🌹ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క కొన్ని సాధారణ సంకేతాలు & లక్షణాలు :-_*

*_1.ముఖ్యంగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన మూత్రవిసర్జన చేయడం కష్టం అవ్వడం._*

*_2.మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట._*

*_3.మూత్రం లేదా వీర్యంలో రక్తం పడటం._*

*_4.తొడలు, తుంటి లేదా తక్కువ వీపులో దృఢత్వం లేదా నొప్పి కలగడం._*

*_5.మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం._*

*_6.మూత్రవిసర్జన తర్వాత తగినంత మూత్రాశయం ఖాళీగా ఉన్న అనుభూతిచెందటం._*

*_7.ఎముకల నొప్పి, ముఖ్యంగా వెన్నెముక, పొత్తికడుపు లేదా పక్కటెముకలలో, క్యాన్సర్ ఎముకలకు వ్యాపిస్తే గనక ఈ సమస్య రావచ్చు._*

*_ఈ లక్షణాలు, తరచూ కనిపిస్తుంటే గనక వైద్యుడిని సంప్రదించండి._*

*_ప్రారంభ దశలో ఈ క్యాన్సర్ ఎలాంటి లక్షణాలను కూడా చూపించకపోవచ్చు. కానీ క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు, వీటిలో..._*

*_మూత్ర విసర్జనలో ఇబ్బంది:-_* 

*_మూత్ర విసర్జనలో మార్పులు, మొదటి చుక్కలు పడటానికి సమయం పట్టడం, మూత్రం ఆగిపోయి మళ్ళీ మొదలు కావడం,రాత్రిపూట మూత్రవిసర్జనకు లేవడం వంటివి._*

*_మూత్రంలో రక్తం:-_*

*_కొన్నిసార్లు మూత్రంలో రక్తం కనిపించవచ్చు. మూత్రాశయం నిండుగా ఉన్న భావన,మూత్రాశయం నిండుగా ఉన్నట్లు అనిపించినప్పటికీ తక్కువ మూత్రం మాత్రమే వస్తుంది._*

*_నొప్పి:-_*

*_కొందరికి కటి ప్ప్రాంతంలో,వృషణాలలో లేదా వీపునొప్పి ఉండవచ్చు._*

*_ప్రోస్టేట్ క్యాన్సర్._*

*_ఉన్నట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వారు రక్త పరీక్షలు, డిజిటల్ రెక్టల్ పరీక్ష, బయాప్సీ వంటి పరీక్షలు చేసి క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారిస్తారు._*

*_ప్రారంభ దశలో గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. చికిత్స ఎంపిక వయసు, ఆరోగ్య పరిస్థితి, క్యాన్సర్ దశ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_మీ. డా,,తుకారాం జాదవ్.🙏🏾_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్._*
 *_'మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 15 ఆరోగ్య సమస్యలు'_* 

 *_1.రొమ్ము క్యాన్సర్:-_*

*_రొమ్ము కణజాలంపై ప్రభావం చూపే మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి._*
  
 *_2.ఆస్టియోపోరోసిస్:-_*

*_స్త్రీలకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఈ పరిస్థితి బలహీనమైన మరియు పెళుసుగా ఉండే ఎముకలు, ముఖ్యంగా రుతువిరతి తర్వాత._*
  
 *_3. గుండె జబ్బు:-_*

 *_తరచుగా పురుషులతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, గుండె జబ్బులు మహిళల్లో మరణానికి ప్రధాన కారణం, లక్షణాలు కొన్నిసార్లు పురుషుల కంటే భిన్నంగా కనిపిస్తాయి._*
  
 *_4. పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు:-_*

*_పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), ఎండోమెట్రియోసిస్ మరియు రుతుక్రమ రుగ్మతలు వంటి పరిస్థితులు మహిళల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి._*
 
*_5. ఆటో ఇమ్యూన్ వ్యాధులు:-_*

*_మహిళలు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది._*

 *_7.అండాశయ క్యాన్సర్:-_*

*_అండాశయ క్యాన్సర్ దాని అస్పష్టమైన లక్షణాల కారణంగా తరచుగా తరువాత దశలో నిర్ధారణ చేయబడుతుంది, చికిత్స చేయడం మరింత సవాలుగా మారుతుంది._*
  
 *_8.సర్వికల్ క్యాన్సర్:-_*

*_హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఇన్ఫెక్షన్ గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది, ఇది సాధారణ స్క్రీనింగ్‌లు మరియు HPV టీకా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది._*
  
*_9.యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు (UTIs)_*

*_తక్కువ మూత్ర నాళాలు మరియు హార్మోన్ల మార్పుల వంటి కారణాల వల్ల మహిళలు UTIలకు ఎక్కువగా గురవుతారు._*
  
*_10.థైరాయిడ్ రుగ్మతలు:-_*

*_హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం వంటి పరిస్థితులు మహిళల్లో సర్వసాధారణం మరియు జీవక్రియ మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి._*
  
*_11.రొమ్ము సంబంధిత సమస్యలు:-_*

*_రొమ్ము క్యాన్సర్ కాకుండా, మాస్టిటిస్, ఫైబ్రోడెనోమాస్ లేదా నిరపాయమైన రొమ్ము గడ్డలు వంటి ఇతర రొమ్ము సంబంధిత సమస్యలను మహిళలు అనుభవించవచ్చు._*
  
 *_12. పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్:-_*

*_మూత్ర ఆపుకొనలేని మరియు పెల్విక్ ఆర్గాన్ ప్రోలాప్స్ వంటి పరిస్థితులు స్త్రీలలో, ముఖ్యంగా ప్రసవం తర్వాత మరియు వయస్సుతో ఎక్కువగా ఉంటాయి._*
  
 *_13.మెనోపాజ్- సంబంధిత లక్షణాలు:-_*

*_మహిళలు మెనోపాజ్ సమయంలో వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, మూడ్ మార్పులు మరియు యోని పొడి వంటి వివిధ లక్షణాలను అనుభవిస్తారు._*
  
 *_14.తినే రుగ్మతలు:-_*

*_మహిళలు అనోరెక్సియా నెర్వోసా, బులీమియా నెర్వోసా లేదా అతిగా తినే రుగ్మత వంటి తినే రుగ్మతలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది._*
 
*_15.లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు)_*

*_స్త్రీలు వంధ్యత్వం, గర్భాశయ క్యాన్సర్ లేదా క్లామిడియా, గోనేరియా లేదా సిఫిలిస్ వంటి చికిత్స చేయని STIల నుండి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వంటి పరిణామాలను ఎదుర్కోవచ్చు._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_మీ.డా.తుకారాం జాదవ్.🙏🏾_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*

*_Cell : 7382583095,9912499108._*
 *_ఎలా మీ దేహంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు...?_*

*_అవగాహనా మీ కోసం..._*
     
*_రోగనిరోధక శక్తి అంటే…. సూక్ష్మజీవులు లేదా టాక్సిన్‌ల కారణంగా ఏర్పడే హానికరమైన ప్రభావాల నుంచి మనల్ని రక్షించి సామర్ద్యాన్ని రోగనిరోధక శక్తి అంటారు._*

*_🔸 రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి చిట్కాలు…._*

*_🔸 పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినండి._*

*_🔸 తగినంత నిద్రను పొందండి._*

*_🔸. క్రమం తప్పకుండా ఒత్తిడి స్థాయిలను నిర్వహించండి._*

*_🔸. హైడ్రేటెడ్ గా ఉండండి._*

*_🔸. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి._*

*_🔸 ధూమపానం మరియు అధిక మద్యపానం మానుకోండి._*

*_🔸 మంచి పరిశుభ్రత పాటించండి._*

*_🔸 ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలు తినండి._*

*_🔸 విటమిన్ సి మరియు జింక్ వంటి సప్లిమెంట్లను పరిగణించండి._*

*_🔸 తగినంత విటమిన్ డి పొందండి. ( సహజ సూర్యకాంతి )_*

*_🔸. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి బెర్రీలు, కాయలు మరియు ఆకుకూరలు._*

*_🔸 టీకాలు రోగనిరోధక వ్యవస్థకు ప్రధాన సహాయం చేస్తాయి._*

*_🔸. ఒత్తిడి నిర్వహణ పద్ధతులను ప్రాక్టీస్ చేయండి ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు._*

*_🔸 మూలికా సప్లిమెంట్లు ఎల్డర్‌బెర్రీ, ఎచినాసియా మరియు అల్లం వంటి కొన్ని మూలికలు._*

*_🔸. తగినంత విశ్రాంతి సరైన రికవరీని అనుమతిస్తుంది._*

*_🔸 నోటి పరిశుభ్రత బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించడాన్ని నిరోధిస్తుంది._*

*_🔸 ప్రాసెస్ చేయబడిన మరియు చక్కెర ఆహారాలను పరిమితం చేయండి._*

*_🔸 అధిక చక్కెర మరియు అనారోగ్య కొవ్వులు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి._*

*_🔸. సామాజికంగా కనెక్ట్ అయి ఉండండి._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏🏾_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*
 *_♨️ అతిగా తినొద్దు.._*

 *_నెమ్మదిగా తినండి.._*

 *_మైండ్ లెస్ ఈటింగ్ వద్దు._*
      
*_❐అందరి ఆహారపు అలవాట్లు ఒకేలా ఉండవు. కొంత మంది ఆకలైతేనే తింటారు. ఇంకొంత మంది టైం టు టైం తినాలనుకొని.. ఆకలిగా లేకపోయినా తినేస్తుంటారు. మరికొంత మంది ఆకలి కాకున్నా... ఏదో ఒకటి అతిగా తింటూనే ఉంటారు. అయితే, ఇలా అతిగా తినడం ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, అతిగా తినే అలవాటుని నియంత్రించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేమిటంటే.._*

*_❐ఫుడ్ ప్రెజెంటేషన్ కూడా తినే ఆహారంపై ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా ఎదుట ఉన్న ఆహారాన్ని గమనించి, తగిన పరిమాణంలో తినాలి. పీచుపదార్థాలు, నీరు, ప్రొటీన్లు ఉన్న పదార్థాలను బాగా తినాలి. క్యాలరీలకు దూరంగా ఉండాలి. తినే విధానాన్ని గమనించడంతో పాటు ఆ అంశాలను పుస్తకంలో రాసుకోవాలి. దానివల్ల రోజూ తింటున్న ఆహార పరిమాణం, భోజన సమయాన్ని గమనించుకోవచ్చు. 'ఆకలిగా అనిపించినప్పుడు తిందాం...' అనే ఆలోచన కూడా సరికాదు. రోజులో అప్పుడప్పుడూ పోషకాహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి._*

_🧑🏻‍💻నెమ్మదిగా తినడం._
━━━━━━━━━━━━━
*_❐టైం చూసుకుని... నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. తినే ఆహారాన్ని బాగా నమలాలి. కనీసం ఇరవై నిమిషాలు తినడానికి కేటాయిస్తే మంచిది. తినే సమయంలో మనసులోకి ఎలాంటి ఆలోచనలు, ఒత్తిళ్లు రాకుండా.. చూసుకోవాలి. దీనివల్ల 'ఎంత తింటున్నాం.... ఏం తింటున్నాం..' అనే ధ్యాస ఉంటుంది. లేదంటే తక్కువగా లేదంటే అతిగా తినే ప్రమాదం ఉంది. పని ధ్యాసలో పడి నాలుగు ముద్దలు గబగబా తినడం.. లాంటిది ఆరోగ్యానికి మంచిది కాదు._*

*_❐ఈ ప్రభావం జీర్ణవ్యవస్థపైనా పడుతుంది. జీవక్రియల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. కంగారులో సరిగా నమలకుండా తినేస్తాం. దానివల్ల తిన్న ఆహారం అరగదు.. అదే బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలు. త్వరగా రక్తంలోకి చేరతాయి. కొంతమంది సమయానికి ఏది అందుబాటులో ఉంటే అది తింటారు. సాధ్యమైనంతవరకు భోజనం సమయంలో కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా భోజన సమయంలో తేడాలు లేకుండా చూసుకోవాలి._*

_🧑🏻‍💻సరిపడా నీళ్లు.. నిద్ర._
━━━━━━━━━━━━━━
*_❐ప్రతి రోజు పది నుంచి పన్నెండు గ్లాసులు మంచినీళ్లు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఎక్కువ ప్రమాణంలో ఆహారం తినడం తగ్గుతుంది. బాగా నిద్రపోతే కణజాలం బాగుంటుంది. మెదడుపైనా ఒత్తిడి ఉండదు. అదే నిద్ర సరిగా పోకపోతే ఒత్తిడి పెరిగి ఆహారం ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంది._*

_🧎🏻తగినంత వ్యాయామం._
━━━━━━━━━━━━━
*_❏తీసుకున్న ఆహారానికి తగినంత శ్రమ లేకపోతే శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి, అధిక బరువు, నెలసరి క్రమం తప్పడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అలా అని మితిమీరి వ్యాయామం చేయడం. కూడా మంచిది కాదు. తిన్న ఆహారం, ఆరోగ్యానికి ఎంతమేరకు అవసరమో దానికి తగ్గట్టుగా ఎక్సర్ సైజులు ఉండాలి. ప్రతి రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఎనర్జిటిక్  గా ఉంటుంది_.*

_🧑🏻‍💻మైండ్ లెస్ ఈటింగ్._
━━━━━━━━━━━━━━
*_చాలామంది టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఎంత తింటున్నాం. ఏం తింటున్నాం అనే స్పృహ ఉండదు. దీనివల్ల అదనపు క్యాలరీలు లోపలికి వెళ్లిపోతాయి. మనసు అదుపులో లేకుండా తినడం (మైండ్స్ ఈటింగ్) వల్ల తీసుకున్నది కొప్పుగా మారుతుంది. అందుకే తినేప్పుడు టీవీ చూడటం, ఫోన్లు మాట్లాడటం.. లాంటివి మంచిది కాదు._*

https://chat.whatsapp.com/ClTrMNv4amTH1omf9pbjMm

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_- డా,,తుకారాం జాదవ్.🙏🏾_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*

*_Cell : 7382583095,9912499108._*
 *_🌹'హాయిగా నిద్రపోవాలంటే..'🌹_*

_ఒక సర్వే ప్రకారం భారతీయుల్లో నిద్ర శాతం తగ్గుతోంది. రోజు రోజుకీ నిద్రలేమితో బాధపడే వాళ్లు అధికమవుతున్నారు. సరైన జీవన విధానం లేకపోవటం, ఒత్తిడి, ఎక్కువ సమయం మొబైల్, కంప్యూటర్ల తెరలకు జీవితాన్ని అంకితం చేయడం, కరోనా పరిస్థితుల వల్ల నిద్ర కరువైందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి సరైన నిద్రకోసం ఏంచేయాలి...?_

*_ఎవరికైనా కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. అయితే మానసిక ఒత్తిళ్ల వల్ల నిద్ర సరిగా రావటం లేదని యువత చెబుతున్నారు. యాభై ఏళ్లు దగ్గర పడ్డ వారిలో 30 శాతం నిద్రలేమితో బాధ పడుతున్నారు. నిద్ర సరిగా పట్టకపోవడం వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, అతి బరువు, గుండెపోటు, మెదడులో నరాలు చిట్లడం.. లాంటి సమస్యలు వచ్చిపడుతున్నాయి._*

*_మంచి నిద్ర అనేది ఔషధం లాంటిదే. హాయిగా నిద్ర పోతే శారీరక సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా మానసి కంగా చురుగ్గా ఉంటారు. మొత్తానికి నిద్ర సరిగా పట్టా లంటే కొన్ని మెలకువలు పాటించాలి. తల క్రింద మెత్త లేదా తలగడ సరైనది ఉంచుకోవాలి. లేకుంటే మెడ నొప్పులు వచ్చే అవకాశాలెక్కువ. కొందరికి ఫ్యాను పడదు, మరికొందరికి బయట శబ్దాలు వస్తోంటే నిద్ర రాదు. ఇంకొందరు ఇంట్లో ఏ చిన్న శబ్దం వచ్చినా క్షణాల్లో నిద్రలేస్తారు. మొత్తానికి విషయమేంటంటే ఇలాంటి సమస్య ఉండే వాళ్లు చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉంచుకోవాలి._*

*_నిద్రపోయేముందు ప్రశాంతంగా ఉండాలి. ఇష్టమైన సంగీతం వినడం, హాస్య చిత్రాల్ని చూడాలి. సాధారణంగా వాతావరణం వేడిగా ఉండటం వల్ల శరీరం కూడా వేడి ఉంటుంది. దీనివల్ల నిద్రపోలేం. అందుకే శరీరాన్ని చల్లబ రిచే పరుపును వాడాలి. ఇక కొందరు బరువైన దుప్పటి కప్పుతుంటారు. దీనివల్ల నిద్రపట్టదు. నలభై ఐదు కేజీల బరువుండే ఒక వ్యక్తి ఆరు కిలోలకంటే బరువైన రగ్గును వాడితే నిద్రలేమితో కొట్టుమిట్టాడాల్సిందే. రోజూ ఏడు గంటలు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం, యోగా, ధ్యానం లాంటి పనులు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ అతిగా నిద్రపోతే అంటే రోజుకు తొమ్మిదిగంటలు నిద్రకు కేటాయిస్తే.. బీపీతో పాటు డయాబెటీస్ లక్షణాలు పెరుగుతాయి. మొత్తానికి నిద్రకోసం ప్రణాళిక ఉండాలి. సాధ్యమైనంత వరకూ రాత్రిపూట నిద్రపోవటమే ఉత్తమం. అందులో కూడా మెలకువలేని డీప్ స్లీప్ ఉండటం ఆరోగ్యానికి మంచిదే._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_మీ.డా,,తుకారాం జాదవ్.🙏🏾_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*

*_Cell : 7382583095,9912499108._*
 *_💁🏻‍♂️వాకింగ్ చేసినా చేయకపోయినా ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి._*
★★★★★★★★★★★

*_మీకు హిపోక్రాట్స్ తెలుసా..? ఆయ‌న ఇప్ప‌టి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవ‌త్స‌రానికి చెందిన వాడు. అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయ‌న్ను ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. స‌ద‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌న వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయ‌న అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.._*

*_1.వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి._*

*_2.నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌._*

*_3.నిత్యం ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌._*

*_4.వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి._*

*_5.డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది._* *_వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు._*

*_6.నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది._*

*_7.నిత్యం 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌._*

*_8.నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి._*

*_9.బ్యాక్ పెయిన్‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది._*

*_10.నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది._*

 *_-సదా మీ  శ్రేయోభిలాషి.. 💐_*

 *_-మీ డా. తుకారాం  జాదవ్. 🙏🏾_*
 *_🫀' గుండె వైఫల్యం'...🫀_*

*_🌹యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు..._*

*_🌹నిపుణుల తాజా హెచ్చరికలు:-_*

*_గుండె జబ్బులు వృద్ధాప్యంతో ముడిపడి ఉంటాయి అనేది పాత విషయం. ఇప్పుడు ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఎన్నో తేడాలు వచ్చాయి. దీంతోపాటు తీరిక లేకుండా గడపడం, పని ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటివి యువతలో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి_*

*_రక్తపోటు, గుండె జబ్బులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు వయసు మళ్లిన వారికే వస్తాయని చాలామంది భావిస్తారు. మలి వయసులో అవయవాల పనితీరు మందగించడం వల్ల వారికి వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో యువత కూడా ప్రమాదకరమైన, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులు వృద్ధాప్యంతో ముడిపడి ఉంటాయి అనేది పాత విషయం. ఇప్పుడు ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఎన్నో తేడాలు వచ్చాయి. దీంతోపాటు తీరిక లేకుండా గడపడం, పని ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటివి యువతలో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తరువాత ఇలాంటి అనారోగ్యాల బారిన పడుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది._*

*_హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తాన్ని సరఫరా చేయలేకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె వైఫల్యం అంటారు. గుండె పనితీరు దెబ్బతింటే శరీర కణాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ గుండె వైఫల్యం లక్షణాలు. ధమనుల గోడలపై కొవ్వు నిల్వలు పెరగడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీని వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది._*

*_🌹గుండె జబ్బులకు కారణాలు:-_*

*_పొగతాగే అలవాటు ఉన్నవారు గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అధిక రక్తపోటు, డయాబెటిస్, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె కవాటాలు దెబ్బతినడం వల్ల గుండె వైఫల్యం ఎదురవుతుంది. ఈ సమస్య ఉన్నవారు రోజువారీ పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. గుండె వైఫల్యాన్ని సరిచేయడం కష్టం. గుండె రక్తసరఫరా వ్యవస్థ బలహీనపడితే, సమస్య క్రమంగా పెరుగుతుంది. హార్మోన్లు, ఇతర వ్యవస్థలతో కలిసి దీన్ని సరిచేయడానికి శరీరం ప్రయత్నిస్తుంది. కానీ ఈ యంత్రాంగాలు విఫలమైతే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు._*


*_🌹ఎలా గుర్తించాలి...?_*

*_గుండె వైఫల్యం నాలుగు దశల్లో ఎదురవుతుందని న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ఒక్కో దశను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రారంభ దశలో జీవనశైలి, ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవడం, మందులు తీసుకోవడం వల్ల సమస్యను నివారించవచ్చు. కానీ ఆ తరువాతి దశల్లో ఈ జాగ్రత్తలు పనిచేయవు. సమస్య తీవ్రమైతే సర్జరీ చేయడం, ట్రాన్స్ ప్లాంట్, డివైజ్ ఇంప్లాంటేషన్ వంటివి అవసరమవుతాయి._*

*_🌹చికిత్స ఉందా...?_*

*_ప్రస్తుతం దశలవారీగా గుండె వైఫల్యాన్ని నివారించేందుకు వివిధ పద్ధతులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. దీంతో సాధారణ జీవితం గడపవచ్చు. కానీ ఒక్కసారి వైఫల్యమైన గుండె ఇంతకుముందు మాదిరిగా పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయదు. అందువల్ల ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స అందించాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అలవాట్లపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి._*

*_ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం, పొగ, మద్యపానం అలవాట్లు మానేయడం, ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం... వంటివి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిని ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల గుండె వైఫల్యం, ఇతర గుండె సంబంధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

*_-మీ.డా.తుకారాం జాదవ్.🙏_*

 *_" ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. "_*

*_Cell : 7382583095,9912499108._*