*_కిడ్నీలో రాళ్లను సులభంగా తొలగించుకోవడానికి నివారణ ఎలా చేయాలి...?_*
*_ప్రస్తుతం కిడ్నీ స్టోన్స్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ సమస్య నుండి భయట పడాలంటే కింద చెప్పినట్లు చేస్తే ఉపశమనం పొందొచ్చు అని వై, ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు._*
*_1.కిడ్నీ లో స్టోన్స్ కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు నివారించబడటమే కాకుండా తిరిగి కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్యే ఉండదు._*
*_2.నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి._*
*_3.పుచ్చకాయలో నీరు, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి._*
*_4.నీరు, నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకుని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట._*
*_5.కిడ్నీ లో స్టోన్స్ నివారణకు వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కాని, దానిమ్మ గింజలు కాని తీసుకోవడం చాలా బెస్ట్ రెమిడీ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు._*
*_6.ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు తొలిగిపోతాయి._*
*_7.కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ రసాన్ని ఒడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు భయటకు పోతాయి. కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషదం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు._*
*_8.అలోవేర జ్యూస్ తాగితే మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడవని చెబుతున్నారు._*
*_9.అదే విధంగా రోజూ ఐదు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ ఖచ్చితంగా కరిగిపోతాయి._*
No comments:
Post a Comment