Saturday, November 1, 2025

 


ఓం నమో భగవతే శ్రీ రమణాయ

    దక్షిణామూర్తివలె భక్తులందరి నడుమ మహర్షి సుఖ ఆశీనులై కూర్చొని ఉన్నారు.

  అరుణగిరి మీదనుండి ఒక కోతి చాలా కోతులని తనతోపాటు వెంటబెట్టుకుని మహర్షి సన్నిధికి వచ్చింది. భక్తులందరూ చూస్తూ ఉండగానే ఆ కోతి మహర్షి వద్దకు వెళ్లి, మహర్షి ఒడిలో కూర్చొని, మహర్షిని గట్టిగా కౌగలించుకుని పళ్ళు ఇకిలించింది; ఎదో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. అక్కడ దాదాపుగా నూరు కోతుల వరకూ ఉన్నాయి. అక్కడఉన్న భక్తులు "భగవాన్! ఆ కోతి తమతో ఏమి మాట్లాడింది?" అని అడిగారు.
       
      మహర్షి ఇలా సెలవిచ్చారు ...
  
   "ఈ రోజే తక్కిన కోతులు తనని రాజుగా చేసాయని, ఆ గోడమీద కూర్చున్న కోతుల వంక చూపించి, అది నా పట్టమహిషి; దాని ప్రక్కన ఉన్నది రెండవ రాణి; ఆ కూర్చున్నవాడు సైన్యాధిపతి; తక్కినవారు సైన్యం!" అని చెపుతుంది.
    
      మహర్షి తన ఒడిలో ఉన్న కోతిరాజు తల నిమురుతూ అసలు కథ ఇలా చెప్పారు .... 

     నేను అరుణగిరి విరూపాక్ష గుహలో ఉండగా ఈ కోతి చాలా చిన్న పిల్ల. తక్కిన కోతులు దీనిని బాగా కరచి, వదలి వెళ్లిపోయాయి. కరచిన గాయాలతో కుంటుకుంటూ వచ్చి నా దగ్గర పడిపోయింది. దీని గాయాలు నయం చేశాను; అంతవరకూ నా వద్దనే ఉన్నది. అప్పుడే అనుకున్నాను "తరువాత ఎప్పుడో ఒకప్పుడు ఇది కోతులకు రాజు కాగలదు" అని.

   సాధారణంగా మనిషిని తాకిన కోతిని తక్కిన కోతులు తమ గుంపులో కలుపుకోవు. ఈ కుంటి కోతి ఈ రోజు రాజు అయ్యారు. ఈ సంతోష విషయాన్ని చెప్పటానికి అందరితో కలిసి వచ్చారు. అంతే.

No comments:

Post a Comment