*పూరీ - రథయాత్ర:*
రథయాత్రకు రెండు నెలల ముందు నుంచే రథ నిర్మాణ క్రతువు మొదలవుతుంది.
వైశాఖ బహుళ విదియ రోజు రథ నిర్మాణానికి పూరీ సంస్థానాధీశుడు ఆదేశాలు జారీ చేస్తాడు.
అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు.
అక్షయ తృతీయనాడు రథ నిర్మాణ పని మొదలుపెడతారు.
ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు.
_జగన్నాథుడి రథాన్ని *నందిఘోష అంటారు*_.
దీని ఎత్తు 45 అడుగులు. పదహారు చక్రాలు పూన్చిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్న మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
ఆ రథాన్ని లాగే అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.
_ఇక బలభద్రుడి రథాన్ని *తాళధ్వజం అంటారు*_. దీని ఎత్తు 44 అడుగులు, పద్నాలుగు చక్రాలు ఉంటాయి.
_*సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం*._ ఎత్తు 43 అడుగులు, చక్రాలు పన్నెండు.
జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు,
బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు.
పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు.
విదియ నాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
తర్వాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింపజేస్తారు, ఈ వేడుకను *‘పహాండీ’* అని పిలుస్తారు.
తర్వాత పూరీ సంస్థానాధీశులు రథం ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు.
*దీనిని ‘చెరా పహారా’ వేడుకగా చెబుతారు.*
తర్వాత పలు సంప్రదాయ క్రతువులు కొనసాగుతాయి, చివరిగా భక్తుల జయజయధ్వానాల మధ్య రథయాత్ర మొదలవుతుంది.
*‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ..’* అంటూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు, దీన్నే *ఘోషయాత్ర అంటారు*.
జగన్నాథ ఆలయం నుంచి మూడుమైళ్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి రాత్రికి గానీ రథాలు చేరుకోవు, మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచుతారు.
మర్నాడు మేళతాళాలలో గుడిలోకి తీసుకెళ్తారు,
గుండీచాదేవి.. జగన్నాథుడి పిన్నిగా చెబుతారు.
ఆ ఆలయంలో స్వామి వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు,
తర్వాత ఆషాఢ శుద్ధ దశమి నాడు పూరీకి తిరుగు ప్రయాణం అవుతాడు, *దీనిని బహుదాయాత్ర అంటారు*.
దశమి నాటి మధ్యాహ్నానికి పూరీ ఆలయానికి రథాలు చేరుకుంటాయి.
రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి.
తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలకంరిస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు.
_ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ఉంచడంతో పూరీ రథ యాత్ర ముగుస్తుంది_
*జై జగన్నాథ - జై జై జగన్నాథ 🙏🌺☘️*
No comments:
Post a Comment