Wednesday, September 23, 2020

పరమాత్ముడిని పొందాలంటే ప్రాపంచిక ఉనికికి అతీతంగా వెళ్ళగలగాలి.

పరమాత్ముడిని పొందాలంటే ప్రాపంచిక ఉనికికి అతీతంగా వెళ్ళగలగాలి.

ఉన్నది ఒక్క పరమాత్మే అన్న గ్రహింపుతో ఈశ్వరార్పితం కావాలి.

అంటే శరణాగతి కావాలి.

శరణాగతి కలిగివుండడం అంత సులువైనది కాదు.

అలాగని అసాధ్యం కాదు.

శరణాగతితత్వం
భక్తితో,
కృతజ్ఞతతో,
ప్రార్ధనతో ముడిపడి వుంది.

భక్తి : భగవంతుని పట్ల ప్రేమే భక్తి.

స్వస్వరూప అనుసంధానమే భక్తి.

అనన్య దైవచింతనయే భక్తి.

సమస్త ఆచార వ్యవహారాలను భగవంతుడికి అర్పించడం భక్తి.

ఆత్మానుభవం పొందడానికి ఏ విషయాలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని వదిలించుకోవడమే భక్తి.

ఇటువంటి భక్తిని దాటి పొందాల్సినది శరణాగతి.

భక్తిలో మనస్సు కరిగిపోయి తీవ్రస్థాయికి రావడమే శరణాగతి.

అంటే భక్తి యొక్క పరాకాష్ఠస్థితియే శరణాగతి.

కృతజ్ఞత : ఉత్కృష్టమైన మానవజన్మనిచ్చి మనమీద అపారదయతో అన్నీ సమకూర్చుతున్న సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు యందు ప్రేమతో వుండి,

తనచే సృజింపబడిన సమస్త సృష్టి యందు ఆ భగవంతుడినే దర్శిస్తూ అన్నివేళల్లో అన్నింటా దయతో ప్రేమతో వుండడమే కృతజ్ఞత.

ప్రార్ధన : అంతరంగపు నైర్మల్యాలను తొలగించేదే ప్రార్ధన.

ప్రార్ధన అంటే అంతర్యామి ముందు అంతరంగ ఆవిష్కరణ,

అంతరశుద్ధికై పవిత్ర ప్రయత్నం, అనంతునికై అంతరంగనివేదన.

విషయజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లగలిగేదే ప్రార్ధన.

జీవాత్మను విశ్వాత్మలో విలీనం చేసేదే ప్రార్ధన.

అంతేగాని ప్రార్ధన యాచనల వుండకూడదు.

భగవంతుడు దగ్గర భక్తుడిగా వుండాలి,
భిక్షగాడుగా కాదు.

క్రమేపి భక్తి, కృతజ్ఞత, ప్రార్ధన తదితర అభ్యాసాలని దాటి భక్తుడు,
భగవంతుడు అన్న ద్వైతభావమును అధిగమించి ఉన్నది పరమాత్మ యొక్కటే అన్న ఆత్మభావన స్థితికి రావడమే శరణాగతి పొందడం.

అయితే నోటితో చెప్పడమంత తేలిక కాదు శరణాగతి... !!

Source - Whatsapp Message

No comments:

Post a Comment