Saturday, September 5, 2020

సుహేల్ దేవ్ పాసి అనే రాజు పేరు తెలుసా?

మీలో ఎవ్వరికైనా సుహేల్ దేవ్ పాసి అనే రాజు పేరు తెలుసా

ఓహో తెలియదా

సరే మీకు మొహమ్మద్ గజని పేరు తెలుసా , ఆహా ఎందుకు తెలియదు బ్రహ్మాండంగా తెలుసు కదా.

మరి ఈ మొహమ్మద్ గజని సైన్యాన్ని ఓడించి అతడిని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి రాకుండా 20 సంవత్సరాలు ఆపిన ఆ సుహేల్ దేవ్ పాసి అనే వీరుడెవ్వరో తెలుసా, ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో దళితులు అని పిలవబడే పాసి కులానికి చెందిన రాజు.

ఆనాటి కాశి లోని బ్రాహ్మణులచే ఇంద్రుడి అవతారం గా కొలవబడిన ధర్మాత్ముడు, మరి మనం చదుకున్న మన దేశ చరిత్ర లో ఈయన లేకుండా కేవలం గజని నే ఎందుకున్నాడు, మనం చదివింది అసలు మన చరిత్రేనా.

గజని కి చెందిన 6 మంది సేనాధ్యక్షులని వారి సైన్యం తో సహా మట్టుబెట్టి గజని ని అవధ్ ప్రాంతాల్లోకి రాకుండా చేసిన మొదటి రాజు ఈ పాసి వీరుడు.

అలాంటి సుహేల్ దేవ్ పాసి ని గెలవడానికి గజని సైన్యం వాడిన ఆయుధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు అది ఆవులు , అవును సుహాల్ దేవ్ పాసి కి గల గోభక్తి ని అడ్డుపెట్టుకుని గజని సైన్యానికి ఎదురుగా గోవులను అడ్డుగా పెట్టుకుని, తాము బాణాలు వేస్తె ఎక్కడ గోవులు చనిపోతాయేమో అని ఆగిన సుహాల్ దేవ్ పాసి ని దగ్గరగా వచ్చి దాడి చేసి జయించారు.

ఇంతటి గొప్ప వీరుడి చరిత్ర మనకు ఈరోజున ఇరాన్ వాళ్ళ చరిత్ర పుస్తకాలలో కనబడుతుంది. వారు ఒక గొప్ప వీరుడిగా గౌరవిస్తున్న ఈ పాసి వీరుడిని మన మాత్రం ఎప్పుడో మరచిపోయాము, ఎందుకు అతను ఒక దళిత వర్గానికి చెందిన రాజు కాబట్టా.

ఇలాంటి వీరుడిని గౌరవించడానికి భారత్ దేశానికి 2018 లో తీరిక దొరికింది. 2018 లో మోడీ ప్రధానిమంత్రి అయ్యాక సుహాల్ దేవ్ పాసి పేరుమీద స్టాంపు విడుదల చేసారు.

2017 లో యోగి ఆదిత్య నాథ్ RSS వాళ్ళు నిర్వహిస్తున్న రాజా సుహాల్ దేవ్ సూర్య మందిర్ ని ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయాలనీ నిర్ణయం తీసుకుని ఆయనకు ఒక గొప్ప స్మారకం కట్టాలనే కోరికతో 50 కోట్లతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

మన ముందు తరాలకు మన నిజమైన చరిత్ర ఎప్పుడు తెలుస్తుందో.



Source - Whatsapp Message

No comments:

Post a Comment