Sunday, March 29, 2026

 అంతా దైవ ప్రసాదమే!

అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవడానికి కారణం మన ఆలోచనా విధానంలో లోపం కాదు. అటు ఇటుగా కొన్ని మార్పులతో తలపెట్టిన పనులు జరుగుతుంటాయి. ప్రకృతి నూటికి నూరుపాళ్లు వ్యక్తిగత మేధస్సుకు దారి ఇవ్వదు. సమూహ ప్రయోజనం కోసం ఆలోచిస్తుంది. మనిషి తన అహంతో ఇలాగే జరగాలని ఆశిస్తాడు. అలా జరగనప్పుడు, ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తాడు. ఏది ఏమైనా ప్రసాదభావంతో స్వీకరించినప్పుడు నిరాశ, నిస్పృహ ఉండవు.

దైవానికి ఇష్టమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆయన లక్షణాలు తెలుసుకో వాలి. ఆయన పోకడలు పసిగట్టాలి. దైవానికి నిత్యం దగ్గరగా ఉన్నవాళ్లకి ఆయన ఆదేశాలు అర్థం అవుతాయి. తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండే పిల్లలే వారి బాధలను అర్థం చేసుకోగలరు. అలాగే, విశ్వానికి తల్లీ తండ్రీ అయిన ఆ అంతర్యామి గురించి మనకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసమే వేదాలు, ఉపనిషత్తులు, ముందు యుగాల చరిత్ర ఉన్నాయి. పుణ్యపురుషులు ఉన్నారు. అవతారాలున్నాయి. లోకాన్ని నడిపిస్తున్న యోగులు, జ్ఞానులు ఉన్నారు. ముఖ్యంగా మనల్ని సత్యమార్గంలో నడిపించే హృదయం ఉంది. దాని మాట వినాలి. తప్పుదారి పట్టించే మనసును ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పించాలి. పూర్తి ప్రణాళికతో ఏ పనినైనా ముందుకు నడిపించాలి. ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి. హనుమంతుడు సీతాన్వేషణకు బయల్దేరిన ప్పుడు ఎన్నో రకాలుగా సాయం లభించింది. కానీ భారతయుద్ధంలో కర్ణుడికి అన్నిచోట్లా పరిస్థితులు ఎదురుతిరిగాయి. అయినా వాళ్లు ముందుకే వెళ్లారు, అదే ధర్మం.
ఎక్కడా ఆగకూడదు. అలసిపోకూడదు. ఆందోళన చెందకూడదు. భగవంతుడి చేయి వదలకూడదు. పూర్తి శక్తియుక్తులతో పని చెయ్యాలి. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. అనుకున్న దానికి భిన్నంగా అయితే మరోవిధంగా జరిగినా వెయ్యి ఫలాలు లభించవచ్చు. ఇది చరిత్రలో జరిగింది. దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నవి జరుగుతాయి. మనిషి అనుగ్రహంతో అలా జరగడం అన్నివేళలా సాధ్యం కాదు. వసంతం కోసం కోయిల ఎదురుచూడాలి. తానే వసంతాన్ని సృష్టించి చెట్టు మీద కూర్చుని కూయాలని అనుకోకూడదు. ఉదయం సూర్యుడు వచ్చేవరకు ఎదురు చూడాలి. ఎన్ని దీపాలు తెచ్చి వెలిగించినా భానుడి తేజం సృష్టించగలమా? మనం ఎన్ని అనుకున్నా మన ఆలోచనలకు ఒక హద్దుంటుంది. గొప్పగా ఊహించడం కూడా సరిగ్గా చెయ్యలేం. అంతా నేననుకున్నట్లుగా జరగాలని దేవుణ్ని ప్రార్థించిన ప్పుడు బహుశా ఆయన నవ్వుకుంటాడు. ఎవరికి ఎప్పుడు, ఎలా ఏది, ఎక్కడ ఇవ్వాలో, ఎందుకు ఇవ్వకూడదో తెలిసింది ఆ భగవంతుడు ఒక్కడికే.

అందుకే... అనుకోవాలి. గట్టిగా అనుకోవాలి. దైవం ఏం అనుకుంటున్నాడో నీకు తెలిసేంతవరకు అనుకోవాలి. ఆ తరవాత ఎదురు చూడాలి. శరణాగతితో ముందుకు వెళ్తే మనం అనుకున్నది ఎంత పెద్దదైనా దేవుడు చేసి పెడతాడు. ఇది సత్యం.

ఆనందసాయి స్వామి
 ఇది ఫేస్‌బుక్‌లో నా మొట్టమొదటి తెలుగు పోస్ట్.

“ఏమేవ్! తోటకూరొచ్చింది. కావాల్నా?" వీధరుగుమీద విసనకర్రతో విశ్రాంతి తీసుకుంటున్న ఇంటాయన ఓ అరుపరిచాడు. 
 
“గచ్చకాయలాడుకుందాం వస్తావా?" అడిగింది శ్రీదేవి. 
“ఎక్కడా?" అన్నపూర్ణ సందేహం. 
“కరణంగారి ఇంటి అరుగుమీద. నేను, విశాల, మరో ముగ్గురు!"

“పాపం! బీదవాడండీ! పెళ్ళికెదిగిన ఇద్దరు చెల్లెళ్ళున్నార్ట! మిషను పెట్టుకుంటానంటున్నాడు మనరుగు మీద!" ఎర్రటి ఎండలో గుమ్మంలో నిలబడ్డ పేద సాయిబుని ఉద్దేశించి భర్తకి చెబుతోంది తాయారు.

అసలు అరుగుల్లేని ఇల్లే వుండేది కాదు. 

శుభానికీ, అశుభానికీ; 
కబుర్లాడుకోడానికి, కలిసి వేరుశనక్కాయలు ఒలుచుకోడానికి; 
దర్జాగా పడక్కుర్చీలో నడుంవాల్చాలన్నా, 
దర్జీకి దయజూసి చోటివ్వాలన్నా....అన్నిటికీ అరుగే! 

పెళ్లికి మూడ్రోజులు ముందే దిగబడే మేనత్త పిల్లలు, పిన్ని కొడుకులు...అంతా చేరి రాత్రి తెల్లార్లూ పేకాడుకోవాలంటే అరుగే రవీంద్రభారతి.

గాలిపటాలకి కొబ్బరీను పుల్లలు, తోకలు అంటించి ఫినిషింగ్ టచ్చిచ్చే అపర కర్మాగారాలు...అరుగులు.

మతాబాలు, జువ్వలు కుక్కడాలు..
మధ్యానంవేళ పేలు కుక్కుకోడాలు 😜
......అన్నిటికీ అరుగే ఆలంబన!

చింతగింజలు ఒలుచుకోవడం, ఒలిచినవాటితో అష్టాచెమ్మా ఆడుకోవడం....ఇవీ అరుగులమీదే!

మరింతలా మన ముందు తరాలని ఆకట్టుకున్న వీధరుగు ఎందుకిప్పుడు కనుమరుగు?

ఆమధ్య తూర్పుగోదావరి తిరగడానికెళితే ఇదిగో...ఈ అరుగులిల్లు అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళే దారిలో కనబడింది.

అక్కణ్ణించి రాబుద్ధెయ్యలేదంటే నమ్మండి.

టూ బీహెచ్ కే, త్రీ బీహెచ్ కే....
వాకింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్స్! 

బయటికెళితే ఎక్కడ పరిచయాలైపోతాయోనని మనకి మనఁవే గేటొకటి పెట్టేసుకుంటే ఎవరితోనూ మాటాడక్కర్లా! 

రావణాసురుడు కొంచెం ప్రయత్నించుంటే లక్ష్మణరేఖని దాటగలిగేసేవాడేమోగానీ... మనం మాత్రం పక్క కమ్యూనిటీకెళ్ళాలంటే చచ్చే చావే!

పేరు, నక్షత్రం, గోత్రం చెబితేగానీ వదలరు పెక్యూలియర్ సెక్యూరిటీ వాళ్ళు! 

మరలాంటప్పుడు “రా రమ్మని రారా రమ్మని" పిలుస్తున్న ఇలాంటి అరుగులిల్లు చూస్తే ముచ్చటేస్తుందా వెయ్యదా? చెప్పండి! 

          
                                
..........జగదీశ్ కొచ్చెర్లకోట
 (583) (26.03.2026)

నాన్నా నన్ను అమెరికా వెళ్ళమని అంటున్నారు
మీరేమో అనారోగ్యంతో మంచపట్టి ఉన్నారు
నేనా ఒక్కగానొక్క కొడుకుని
ఈ సమయంలో మీ దగ్గర ఉండాల్సిన వాడిని //

మీకేమో నన్ను ఉన్నత స్ధానంలో చూడాలని
నాకేమో మిమ్మల్ని చూచుకోవాలని
వైద్యులు కూడా చేతులు ఎత్తేసినారు
మీరేమో ఏమి కాదు అని అంటున్నారు //

మిమ్మల్ని వదిలి నేను వెళ్లలేను
వెళ్ళినా చదువు మీద శ్రద్ధ పెట్టలేను
ఆఖరి దశలో మీ చెంతనే ఉండాలని
మీ బాగోగులు చూచుకోవాలని //

నేనా ఈ ఇంటికి వారసుడిని
ఆపై తోబుట్టువులు అంటూ లేని వాడిని
రేపటి రోజు అవసరం వస్తే మిమ్మల్ని ఎవరు చూస్తారు
వైద్యుని దగ్గరకు ఎవరు తీసుకుని వెళతారు //

నే చదివిన చదువుకి ఇక్కడే ఓ మంచి ఉద్యోగం వస్తుంది
దగ్గరుండి మిమ్మల్ని చూచుకున్నట్టు ఉంటుంది
మీ తరువాతనే నాకూ ఏదైనా
ఈ సమయంలో  మీకు నా అవసరం ఎంతైనా //

నేను వెళితే అమ్మ ఒంటరి అవుతుంది
ప్రతి పనికి తనకి వెళ్ళడం కష్టం అవుతుంది
ఈ సమయంలో  కొడుకుగా బాధ్యత తీసుకోవాలి
 మీ కడుపున పుట్టినందుకు రుణం తీర్చుకోవాలి //

ఇంకొకసారి అమెరికా వెళ్ళమని అనకండి
ఈ సమయంలో మీకు నను దూరం చేయకండి
మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను
మీకు మటుకు దూరంగా ఉండలేను //

మధిర వెంకట రమణ, హైదరాబాద్
 ప్రమాదపుటంచులో....
(కథ )
రచన : టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర 
స్వీయ రచన.
&&&&&&&&&&&&&&&&&

ఆ రోజు శనివారం.
రిలయన్స్ మార్టుకు వెళ్ళటానికి తయారవుతున్నాడు శ్రీకాంత్.

"నాన్నా!ఈ రోజు నా ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ ఉంది." చెప్పింది గార్గి.
"ఏమన్నా గిఫ్ట్ తీసికొని వెళ్తున్నావా!" 
"వద్దు నాన్నా!గ్రీటింగ్ కార్డు చాలు!"
బయటికి వెళ్తూ కూతురుని చూశాడు.
తొడలు కనిపించే షార్ట్ వేసుకుని పైన బిగుతుగా ఉండే స్లీవులెస్ బనీను వేసుకొని ఉంది.

"ఇది నైట్ డ్రెస్స్ కదా!పార్టీకి మంచి డ్రెస్స్ వేసుకొని వెళ్ళు!"అన్నాడతడు.

"ఆలాగే నాన్నా!"తలుపేసుకొంది గార్గి.

నిట్టూర్చాడు శ్రీకాంత్.

అతడు రిలయన్స్ మార్టులో సూపర్ వైజర్. దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు. కూకట్ పల్లిలో ఉండే ఎమ్ ఐ జి బ్లాకులో నివాసం. భార్య లలిత కళామంజరి అనే బట్టల దుకాణంలో సేల్స్ ఉమెన్ గా పని చేస్తోంది. వాళ్ళ కిద్దరు పిల్లలు. గార్గి, మైత్రేయి.
గార్గి పెద్దది. గార్గి పుట్టిన ఏడేళ్లకు మైత్రేయి పుట్టింది. గార్గి ఇప్పుడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. మైత్రేయి ఎయిత్ క్లాసులో ఉంది.
ఇంజనీరింగులో చేరే దాకా గార్గి కూడా కొంచెం సంప్రదాయంగా ఉండేది. రెండేళ్లు గడిచేసరికి స్నేహితుల ప్రభావమో, సెల్లుఫోన్ ప్రభావమో తెలీదు కానీ గార్గిలో మార్పు మొదలయింది. తల్లిదండ్రులను లెక్క చేయని నిర్లక్ష్యపు ధోరణితో పాటు తన మాటే నెగ్గాలనే పట్టుదల కూడా ఎక్కువయింది. ఆ వయసు వాళ్లకు సహజంగా ఉండే కాన్ఫిడెన్స్.. దానికి తోడు తండ్రి సంపాదన అంతంత మాత్రం. తన సరదాలకు ఎక్కువ డబ్బులివ్వలేదని కోపం.. అసహనం.. వెరసి  తల్లిదండ్రులు పొట్ట కూటి కోసం కష్ట పడుతుంటే గార్గి మాత్రం పాశ్చాత్య పోకడకు అలవాటు పడుతూ ఒక సమస్యగా తయారయింది శ్రీకాంత్ దంపతులకు.

కూతురిలో వస్తున్న మార్పు శ్రీకాంతుకు బాధనే కాదు భయాన్ని కూడా కలుగచేస్తోంది.
చాలా సార్లు గార్గికి నచ్చచెప్పి చూశాడు.
"డబ్బులున్న వాళ్లు ఎలా ఉన్నా ఫర్వాలేదు. మనం రూపాయ రూపాయకు వెదుక్కునే వాళ్ళం!మనకు క్యారెక్టర్ ముఖ్యం!ఇంటికి పెద్ద పిల్లవు!బాధ్యతగా చదివి ఉద్యోగం తెచ్చుకుంటే తగిన సంబంధం చూసి పెళ్లి చేస్తాము!నేను, మీ అమ్మ రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు రాళ్లు సంపాదిస్తూ నలుగురిలో గుట్టుగా సంసారం లాగిస్తున్నాము. నువ్వు కొంచెం పధ్ధతిగా ఉంటే బాగుంటుంది!"
అంటూ కూతురికి అనునయంగా బోధించేవాడు.

అతడలా చెప్పంగానే గొడవ మొదలు పెట్టేది గార్గి.
"మా ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఉంటారు. వయసుకు తగ్గట్టుగా ఉండాలిగాని ముసలిదానిలా ఉండమంటే నా వల్ల కాదు!నా ఫ్రెండ్స్ ఉన్నట్లే నేనూ ఉన్నాను. తప్పేంటి? రాజహంసల మధ్య కాకిలాగా నేనుండలేను. వీధిలోకి చూడండి!పాతకాలం పెద్దమ్మల్లాగా ఎవరైనా ఉన్నారా?" అంటూ ఆ పూట అన్నం తినకుండా సాధించేది.

"ఇప్పుడు పిల్లలతో వాదన పెట్టుకొని గెలవగలమా? చిన్న చిన్న కారణాలకే ఇంట్లోంచి వెళ్లిపోవటాలు... లేకపోతే ఆత్మహత్యలు.. రోజూ ఎన్ని చూడటం లేదు. దానిష్ట ప్రకారం ఉండనీయండి!ఆ చదువు కాస్త పూర్తయితే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం!అప్పటికి కాస్త కుదురు వస్తుంది లెండి!"అంటూ భర్తకు సర్ది చెప్పేది లలిత.

భార్య చెప్పింది నిజమే!

వీళ్ళ కాలనీలో మూడు నెలల క్రితం ఇంటర్ చదువుతున్న పిల్లొకటి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ వాళ్ళు బయటికి చెబుతున్న కారణం డిప్రెషనని!లోపల విషయం ఏముందో తెలియదు.
పిల్ల పోయి వాళ్ళేడుస్తుంటే టీవీల వాళ్ళు వారం రోజుల పాటు ఇంటి చుట్టూ తిరిగి ఆ పిల్ల తల్లిదండ్రులని పూట కోసారి హింసించి హింసించి చంపారు.
'ఆ శిక్ష పగవాళ్లకు కూడా వద్దురా 'అని పించింది చుట్టు ప్రక్కల వాళ్లకు.

ఆలోచిస్తూ వీధిలోకి వచ్చాడు శ్రీకాంత్.

బైక్ స్టార్ట్ చేస్తుంటే ఎదురింటి అమ్మాయి కనిపించింది. చిరుగుల చిరుగుల జీన్స్ ప్యాంట్. దాని మీద పొట్ట కనిపించే బనీనొకటి. విరబోసుకున్న జుట్టు.
'సమాజమంతా ఇలాగే ఉంటే తన కూతురు మాత్రం మంచిగా ఎందుకుంటుంది? మార్పు ఎక్కడి నుండి రావాలి? సమాజం నుండా? ఇంటి నుండా? తప్పెవరిది? తల్లిదండ్రులదా? పిల్లలదా? సినిమాల్లో, టీవీల్లో, చివరకు సెల్ ఫోన్లల్లో కనిపించేది ఇలాటి చెత్త మాత్రమే అయినప్పుడు తానొక్కడు ఈ ప్రవాహానికి అడ్డంగా పరిగెత్తితే మాత్రం ఫలితముంటుందా? అలా అని కూతురు జీవితాన్ని గాలికి వదిలేయలేడు...' అనుకుంటూ భారంగా రిలయన్స్ మార్టుకు చేరుకున్నాడతడు.

ఆ రోజు మార్టులో పనెక్కువగా ఉంది.
తనిఖీ ఇన్స్పెక్టర్ సిబ్బందితో వచ్చాడు. లెక్కలన్నీ చూపించేసరికి రాత్రి తొమ్మిది.
ఇంటికి వెళ్దామనుకొంటుండగా మేనేజర్ సుందర్ పిలిచాడు.
"శ్రీకాంత్!అమీర్ పేట బ్రాంచికి వెళ్ళు!అక్కడికి సరుకు ఎంత వచ్చిందో చూసి చెప్పు!కంప్యూటరులో ప్రాబ్లం వచ్చింది."అంటూ పురమాయించాడు.
ఒక్కోసారి అంతే!అనుకోని పని వచ్చి పడుతూ ఉంటుంది.

ఇప్పుడు తొమ్మిది దాటింది. అమీర్ పేట్ బ్రాంచికి వెళ్ళిరావాలంటే ఎంత లేదన్నా పన్నెండు దాటుతుంది.

ఇంటికి ఆలస్యంగా వస్తానని లలితకు ఫోన్ చేసి అమీర్ పేటకు వెళ్ళాడు శ్రీకాంత్.

అక్కడ అంతా చెక్ చేసి వచ్చేసరికి పదకొండు. మేనేజరుకు ఫోన్ చేసి ఇంటికి బయలుదేరాడు. దారిలో సిగ్నల్ పడింది.
తాగి డ్రైవ్ చేస్తున్నారని ఒక కారులో ఉన్న అమ్మాయిల్ని ప్రశ్నిస్తున్నాడు ఇన్స్పెక్టర్.
కారులోనుండి ఒక్కొక్కరుగా అమ్మాయిలు దిగుతున్నారు. తాగి, తూలుతూ ఉన్న అమ్మాయిలు ఇన్స్పెక్టరుతో తగవులాడుతున్నారు.పచ్చి బూతులు మాట్లాడుతున్నారు.
బైకుల మీద వెళుతున్న అల్లరి కుర్రవాళ్ళు కొందరు ఈ తతంగాన్నంతా సెల్ ఫోన్లతో వీడియోలుగా తీస్తున్నారు.

'ఆడపిల్లలు... మరీ ఇంతగా తాగి రాత్రిపూట.. ఖర్మ.. ఖర్మ..' అనుకుంటూ వాళ్ళవైపు చూసి నిర్ఘాంతపోయాడు శ్రీకాంత్.
ఆ పిల్లల మధ్య గార్గి!....
గుండె గుభేలుమంది. చెమటలు పడుతున్నాయతడికి.
ఇంతలో అక్కడికొక పోలీసు జీపు వచ్చి ఆగింది.
ఆడపిల్లల్ని అందరిని అందులోకి ఎక్కించారు పోలీసులు.
కళ్ల ముందే జీపు వెళ్లిపోతోంది.
జీపు వెనకాలే బైకుతో ఫాలో అయ్యాడు శ్రీకాంత్.

పోలీసు స్టేషన్ ముందాగింది జీపు.
ఆడపిల్లల్ని లోపలికి తీసికెళ్లారు పోలీసులు.
బయట ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళాడు శ్రీకాంత్.
"ఏమిటి?" అడిగాడు కానిస్టేబుల్.
"లోపల... లోపల.. మా.. మా అమ్మాయి.." అన్నాడు శ్రీకాంత్ తడబడుతూ. అతడి నాలుక మడతపడుతోంది.
అతడి ముఖంలో దైన్యం.
" వెళ్ళు!"
లోపలికి వచ్చాడు.
లోపల ఆడపిల్లలందరు ముఖాలకు రుమాళ్ళు అడ్డం పెట్టుకొని బల్ల మీద కూర్చుని ఉన్నారు.

తండ్రిని చూడంగానే గార్గి ముఖం పాలిపోయింది. తల దించుకొంది.
ఈ లోపల కానిస్టేబుల్ లోపలికి వచ్చి 
"సార్!వీళ్ళల్లో ఇతడి కూతురు ఉందంట." అంటూ ఇన్స్పెక్టరుతో చెప్పాడు 

తీక్షణంగా శ్రీకాంత్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్.

"పిల్లల్ని ఎలా పెంచుతున్నారయ్యా? తాగి తందనాలాడుతున్నారు. పెద్దవాళ్ళసలు పట్టించుకోరా? ఇట్లాంటి వాళ్ళ వల్లే రోజు రోజుకూ క్రైం రేటు పెరుగుతోంది. అదేమంటే జనాలంతా శాంతిభద్రతలు సరిగ్గా లేవంటూ మా మీద పడిపోతారు. ఇలాగే ఉంటే వీళ్లకు ప్రమాదం!వీళ్ళ వల్ల సొసైటీకి ప్రమాదం! అనవసరపు న్యూసెన్స్!... చూశారుగా ఎలా మమ్మల్ని బూతులు తిడుతున్నారో!కాస్త సంస్కారం నేర్పించడయ్యా!..."అంటూ అరుస్తున్నాడు.

తలవంచుకొని నిలబడ్డాడు శ్రీకాంత్.

కూతురును తీసికొని స్టేషన్ నుండి బయట పడేసరికి గంట పట్టింది.

బైకు మీద కూతురిని కూర్చో బెట్టుకొని ఇంటికి బయలుదేరాడతడు.
గార్గి నుండి వచ్చే ఆల్కహాల్ ఘాటు వాసన అతడి ముక్కుపుటాలకు తగులుతోంది.

ఇంటికొచ్చారిద్దరు.
గదిలోకి వెళ్ళింది గార్గి.
భార్యకు జరిగిందంతా చెప్పాడు శ్రీకాంత్.
కూతురు పిచ్చి డ్రెస్సులు వేసుకుంటుందని లలితకు తెలుసు కానీ పిచ్చి అలవాట్లు చేసుకుందని తెలియదు. ఆ రాత్రి కూతురును వదిలిపెట్టలేదిద్దరు.
ఎవ్వరికీ నిద్రలేదు.
తెల్లవారింది. టీవీలో గార్గి వాళ్ళు చేసిన నిర్వాకం కనిపిస్తోంది.
సోఫాలో మాట్లాడకుండా కూర్చుంది గార్గి.

"చూశావుగా!మన పరువు బజారులో!ఒక్కసారి ఆలోచించు!నువ్వు వెళుతున్న డారి సరియైనదేనా? దీని వల్ల నష్టపోయేదెవరు? నువ్వు మాత్రమే!నీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ డబ్బులున్న వాళ్ళు. ఎలా అయినా పిల్లల జీవితాల్ని నిలబెడతారు. మనం పేదవాళ్ళం!మనకు నైతికత ముఖ్యం. క్యారెక్టర్ ముఖ్యం. నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి వీడియోలో అంతగా కనిపించటం లేదు. కానీ పరీక్షగా చూస్తే కనిపిస్తావు. మన బం ధువులకు తెలిస్తే రేపట్నించి నేనూ మీ అమ్మా తలెత్తుకోలేము.... విచ్చలవిడిగా తిరగటం వలన నీ కేమొస్తుందో చెప్పు!మంచి ఉద్యోగమా? దానికి చదువు తెలివితేటలు ముఖ్యం. నీ తెలివితేటలు పోలీసు స్టేషన్లలో తెల్లవారుతున్నాయి. ఆలోచించుకో!నీ ఇష్టమొచ్చినట్లు ఉండు!నీ జీవితం నీ ఇష్టం!వెళ్ళు!నీ ఫ్రెండ్స్ తో బ్రతుకు!... నేను మీ అమ్మా ఒక్క మాట కూడా మాట్లాడము!" అతడి కంఠంలో ఎన్నడూ ధ్వనించని కాఠిన్యం. కళ్ళల్లో ఎరుపు జీర.
గార్గి తలెత్త లేదు.
రెండు రోజులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇటు భర్తను అటు కూతురును సముదాయిస్తోంది లలిత.
నాలుగు రోజులు గడిచాయి.
ఉదయం పదిగంటలకు కూతురి దగ్గరికి వచ్చాడు శ్రీకాంత్.
"తయారవ్వు!వెళదాం!"అన్నాడతడు.
ఎక్కడికని అడగలేదు గార్గి.
మౌనంగా తయారయ్యి వచ్చింది.
గార్గిని తీసికొని డాక్టర్ మీనాక్షి దగ్గరికి వచ్చాడు.
ఆమె డ్రగ్స్ కు అలవాటు పడిన వాళ్ళను ట్రీట్ చేస్తూ ఉండే (Psychiatrist.) డాక్టర్.
తను ఒక్కతే గార్గితో మాట్లాడతానని శ్రీకాంతును బయటికి పంపించింది డాక్టర్.
బయట బల్లమీద కూర్చున్నాడు శ్రీకాంత్.
ఓ ఇరవై ఏళ్ల కుర్రవాడితో వచ్చాడొక మధ్యవయస్కుడు.
శ్రీకాంత్ పక్కనే కూర్చున్నాడు.
ఒకరినొకరు పలకరించుకొన్నారు.అతడి పేరు రఘు.
ఆ కుర్రవాడు ఫోనులో మాట్లాడుతూ వరండాలోకి వెళ్ళాడు 
"మా అబ్బాయికి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నాము. డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు."చెప్పాడు రఘు.
"ఇప్పుడెలా ఉన్నాడు?"అడిగాడు శ్రీకాంత్.
"ఫర్వాలేదు. చూసుకుంటూ ఉండాలి... ఏం చేద్దాం!బాధ్యత తీసికోవలసిన కొడుకు. చదువు సగంలో ఆగిపోయింది...." రఘు కళ్ళల్లో తడి.
ఓదార్పుగా రఘు భుజం మీద చెయ్యి వేశాడు శ్రీకాంత్.
"మనం పిల్లల గురించి ఎన్నో కలలు కంటుంటాం!అవన్నీ ఛిద్రమై.. ఇలా ట్రీట్ మెంట్లు ఇప్పించుకొనే దౌర్భాగ్యంలో పడి..." కన్నీళ్లు తుడుచుకొన్నాడు రఘు.
"తర్వాత తర్వాత మెల్లగా సెటిల్ అవుతాడు లెండి!" ఏదో అనాలి కాబట్టి అన్నాడు శ్రీకాంత్.
అక్కడున్న చాలా మంది తల్లిదండ్రుల పరిస్థితి అదే.
సంవత్సరం గడిచింది.
మార్టుకు వెళ్ళటానికి తయారవుతున్నాడు శ్రీకాంత్.
"నాన్నా!ఈ రోజు నుండి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి." అంటూ వచ్చింది గార్గి.
"నేను బండి మీద దించనా తల్లీ!"అంటూ పర్సులోనుంచి డబ్బులు తీసి కూతురికిచ్చాడు.
"వద్దులే నాన్నా!బస్ లో వెళ్తాను!"అంటూ అక్షింతలు తండ్రి చేతిలో పెట్టింది గార్గి.
పంజాబీ డ్రెస్స్. పైన చున్నీ. బిగించి వేసుకున్న జడ. నుదుటి మీద బొట్టు. దానికింద అప్పుడే పెట్టుకున్న దేముడి కుంకుమ.
"విజయోస్తు! విజయోస్తు! బాగా రాయి!"అంటూ కూతురి తల మీద రెండు చేతులు పెట్టి ఆశీర్వదించాడు శ్రీకాంత్.
(సమాప్తం )
 *గొప్ప సందేశం*

శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్య అడిగింది:

"రామా నువ్వే రావణుడిని సంహరించావా?"

శ్రీరాముడు చెప్పాడు "అమ్మా... రావణుడు అసాధారణ పండితుడు,మహా పరాక్రమశాలి, శివభక్తుడు, అతడు శివతాండవ స్తోత్రం రచించిన గొప్ప భక్తుడు. అతన్ని జయించింది నా బలం కాదు... అతని అహంకారమే అతన్ని ఓడించింది."

ఈ కథ మనకు చెప్పే సత్యం:ఎంత జ్ఞానం, శక్తి, ప్రతిభ ఉన్నా అహంకారం పెరిగితే అవన్నీ వృథా అవుతాయి. వినయం ఉన్నవారే నిజమైన విజేతలు.అహంకారం నాశనానికి దారి... వినయం విజయానికి పునాది. 🙏🙏🏼🙏🏻
*_స్థానాల పెంపు..ఆస్థానాల భారం!_* 

*(ఎలిశెట్టి సురేష్ కుమార్)*

ఎవరి కోసం ఈ నిర్ణయం..
ఏం సాధించాలని..
ఇప్పటికి ఉన్నవి చాలవా..
ఇంకా పెంచాలా..
పెంచుకుంటూ పోవాలా..

దేశంలో పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలు పెంచబోతున్నారట..

మామూలుగా కాదు..
సుమారుగా రెట్టింపు చేయబోతున్నట్టు సమాచారం..

ఇప్పుడున్న పార్లమెంట్
స్థానాలు 543..అంతకు అంత
పెరిగి 816 లేదా 817 
స్థానాలుగా పెరిగి
మన పార్లమెంట్ 
ఒక మహాసభగా అవతరించబోతున్నదన్న మాట..అంటే..చూడడానికి
ఇంచుమించు ఒక బహిరంగ
సభ మాదిరి రూపుదిద్దుకోబోతోంది..

ఏం సాధించడానికి ఈ పెంపు..
మహిళా రిజర్వేషన్ నిక్కచ్చిగా అమలుచేయడానికి 
ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు
చెబుతున్నారు.
ఈ లెక్కన పార్లమెంటులో
ఖచ్చితంగా 273 మంది 
మహిళలు ఉంటారు.
ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది కూడా..ఎందుకంటే జనరల్
స్థానాల్లో కూడా మహిళలు
గెలుస్తారు కదా..

ఇది మంచి నిర్ణయమే అనుకున్నా..కొన్ని ప్రశ్నలు
తలెత్తక మానవు.. ఇప్పుడున్న 
543 స్దానాల్లోనే మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయడంలో చిక్కేమిటో..
పురుషుల సంఖ్య తగ్గిపోతుందనా..
పురుషాధిపత్యానికి లోటు ఏర్పడుతుందనా..?

స్థానాలు పెంచాలన్న
నిర్ణయం..అందుకు చెబుతున్న కారణం ఎందుకో గాని
అంత సహేతుకం అనిపించడం లేదు.అలాగని మహిళా రిజర్వేషన్ కు మేమేమీ వ్యతిరేకం కాదు.ఉన్న సంఖ్యలోనే మహిళా రిజర్వేషన్ అమలు చెయ్యడంలో ఇబ్బంది ఏంటన్నది ప్రశ్న..?

ఇప్పుడు అసలు విషయం..
ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో..ప్రజాప్రతినిధులకు చెల్లిస్తున్న వేతనాలను
పరిగణనలోకి  తీసుకుంటే
సీట్ల పెంపు
దేశం మీద ఎంత భారం..
ఎంపీలు...ఎమ్మెల్యేల వేతనాలు..అలవెన్సులపై
ప్రజల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.
అందునా..వేతనాల పెంపు బిల్లుని ప్రతినిధుల సభలు
ఎంత త్వరగా హర్షధ్వానాల మధ్య ఆమోదిస్తాయో
అందరికీ తెలిసిందే.
లక్షల్లో వేతనాలు.. అలవెన్సులు అందుకుంటూ
ఎప్పటికపుడు పెంచుకుంటూ
పోవడమే ఎంపీలకు..
ఇతర ప్రజాప్రతినిధులకు
అత్యంత సులువైన..
సంబరమైన విషయం..
ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా
పెరుగుతున్న వేతనాలు
దేశంపై ఎనలేని భారంగా
పరిణమించాయి.ఈ దశలో
ప్రజాప్రతినిధుల సంఖ్య
ఇంతకు ఇంతా పెరిగితే
దేశంపై పడే అదనపు భారం 
సంగతేంటి..రేపు మళ్ళీ వేతనాలు పెంచుకుంటే
ఆ బరువు దేశంపై ఎంత మేర
పడుతుంది..ఎన్నికల్లో
ఖర్చు ఎన్ని రెట్లు ఎక్కువ
అవుతుంది..ఇంకా.. ఇంకా..
కనిపించని ఖర్చులు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయి.

కథ ఇక్కడితో ఆగేదా...
రాష్ట్రాల అసెంబ్లీలలో
స్థానాలను కూడా పెంచుతారట..ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ స్థానాలు 4123 నుంచి
6185 కి పెరుగుతాయట..
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నవ్యాంధ్రలో 263..
తెలంగాణలో 179 స్థానాలు ఉండబోతున్నాయి.

నిజంగా ఇదంతా ప్రజల
ప్రయోజనానికేనా..

వాస్తవ పరిస్థితి ఏమిటి?

ఇప్పటికే దేశంలో ఉన్న ఎంపీలు,ఎమ్మెల్యేల కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

వారి జీతాలు,అలవెన్సులు, 
ఉచిత ప్రయాణాలు, 
గన్‌మెన్‌లు, 
కార్యాలయ సిబ్బంది, 
నివాస సౌకర్యాలు, 
ఇంకా పదవీ విరమణ
తర్వాత జీవితాంతం
పెన్షన్లు..! 

ఇవన్నీ ప్రజల పన్ను డబ్బుతోనే సాగుతున్నాయన్నది అందరికీ తెలిసిన సంగతే.

ఇప్పుడు ప్రతినిధులు సంఖ్యను యాభై శాతం వరకు  పెంచితే ఖర్చులు కూడా అదే రీతిలో 
భారీగా పెరుగుతాయి..
అంతేనా..పరిపాలనా వ్యవస్థ మరింత భారంగా మారుతుంది..ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం పెరిగే అవకాశముంది..

మరి జనాభా పెరిగింది కదాని అనేవారు కూడా ఉండకపోరు..అందుకే ప్రతినిధుల సంఖ్య పెరగాలన్నది సన్నాయి నొక్కు..

ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచడం వల్ల పరిపాలన నాణ్యత పెరుగుతుందా? 

అసలు ఇప్పుడు 
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా?

అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనలో మెరుగుదల వచ్చిందా?

వ్యవస్థలో లోపాల మాటేమిటి..వీటికి కారణం ఎవరు..

నిక్కచిగా మాటాడుకోవాలంటే సంఖ్య కంటే నాణ్యత..రాశి కన్నా
వాసి ముఖ్యం..
అదే ప్రజలకు, దేశానికి అవసరం..

దేశానికి మంచి నాయకులు, బాధ్యతాయుత పాలన,
పారదర్శక వ్యవస్థ
కావాలి..

ఇవన్నీ సీట్ల పెంపు ద్వారా
సాధ్యపడతాయా..

ప్రజల డబ్బు విలువైనది. 
ప్రతి రూపాయి జాగ్రత్తగా
వినియోగించాలి.

ప్రతినిధుల సంఖ్య పెంపు వంటి నిర్ణయం తీసుకునే ముందు...

అది దేశానికి నిజంగా
లాభమా? 

లేక భారం పెంచే
చర్య మాత్రమేనా? 

అయితే ఇలాంటి నిర్ణయాలు
సభ ఆమోదంతో జరిగిపోతాయి..అధ్యయనం..
విశ్లేషణ చేశామని చెబుతారు.

వాస్తవానికి ఇలాంటి నిర్ణయాల వెనక ప్రధానంగా 
రాజకీయ కారణాలే ఉంటాయి.
రాజకీయ నిరుద్యోగం
తగ్గించడానికి..
మరింత మందికి
రాజకీయంగా ఉపాధి కల్పించడానికే ఇటువంటి నిర్ణయాలు ప్రధానంగా ఉపయోగపడతాయి.

అంతేకాదు..ఇంకా అనేక రాజకీయ కా"రణాలు"..ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి.
అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి..తమకు బలం ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు 
పెరిగితే వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు తమ ఖాతాలో జమ అవుతాయని 
లెక్కలు కట్టుకుంటారు.
ఉదాహరణకు 
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్..అక్కడ స్థానాలు
పెరిగితే ఎవరికి లాభం..
ఇలాంటి ఎన్నో సమీకరణలు
ప్రధాన కారణాలు..
ప్రజలకు మాత్రం పన్నుల తోరణాలు..!

ఉద్యోగాల సంఖ్య పెంచడానికి 
జరగని ప్రయత్నాలు..
ప్రజాప్రతినిధులు సంఖ్య పెంచడంలో మాత్రం 
యుద్ధప్రాతిపదికన జరిగిపోతాయి..
వచ్చే ఎన్నికలే నాటికే బొమ్మ పడిపోతుంది..!

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
          9948546286
          7995666286
 *తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత - 9* 
🛕

*తూర్పు గోదావరి జిల్లా* 

*చీకటి కోణం*

భీమేశ్వరస్వామిని దర్శించవలెనన్నా, పూజాభిషే కాదులు చేయవలెనన్నా. స్వామివారి ప్రాసాదం ఎక్కాలి. అక్కడ భీమేశ్వర లింగం మూల పీఠం మీద ఎనిమిది అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. లింగాగ్రం చుట్టుకైవారం మూడు అడుగులు ఉంటుంది. స్పటికచ్ఛవులు మోర్చే భీమ లింగ మంతటా శ్యామరేఖల వంటివి గోచరిస్తాయి. అది ఈశ్వరుని వ్యాఘ్రాజినధారణాన్ని సూచిస్తున్న దంటారు. లింగాగ్రమున రెండు నొక్కులు ఉన్నట్లు కనిపిస్తాయి. ముందున్న నొక్కు పార్థ ప్రహారానికి, రెండవది -మీదికి పెరిగిపోకుండా నాటిన చీలకూ, తార్కాణములైన చిన్నెలుగా అభివర్ణిస్తారు. సాధము క్రింద ఉన్న లింగమూల పీఠస్థానం 'చీకటి కోణం'. అక్కడ ఒకప్పుడు మాణిక్య దీపాలు ఉండేవట. ఆ స్థానంలో ఇప్పుడు కనపించేని రాతి భూమికలు. ఆలయ ప్రాసాదం లోని ఒక స్తంభం వ్యాస విగ్రహాన్ని ఆవిష్కరించింది. భక్తులు దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. 

కాశీలో తనకు, తన శిష్యులకు భిక్ష పుట్టని కారణంగా అలిగి శాపోద్యుక్తుడైన వ్యాసుణ్ణి విశ్వేశ్వరుడు వారణాసి విడిచి పొమ్మన్నాడు. అన్నపూర్ణ భర్తను శాంతపరిచింది. వ్యాసుడు పాప పరిహారార్థమై తీర్థ యాత్రలు చేస్తూ వచ్చి దక్షిణ కాశియైన దక్షారామంలో భీమేశ్వర సాన్నిధ్యం కలిగించుకొని చరితార్థుడైనట్లు పౌరాణిక గాథలో పాముద్రాసహితుడైన అగస్త్యుడు వ్యాసునకు దక్షారామక్షేత్ర మహత్యం భీమమండల వైభవము అభివర్ణించి చెప్పాడు.

నిరంతరమూ భక్త బృందం దక్షారామ క్షేత్రానికి వచ్చి స్వామికి అభిషేకాదులు జరుపుకొని జన్మ చరితార్థము అయిందని కలిదోష నిర్మూలనం చేసుకున్నామని ఆనందమగ్నులు అవుతూ ఉంటారు.

శ్రీ రామాయణమును ద
క్షా రామాయణము గలిమలాపహములు స
త్సారమతులు వాల్మీకికి
బారశర్యునకు వినుతి పాత్రములయ్యెన్
📖

*పశ్చిమ గోదావరి జిల్లా* 

*ద్వారకా తిరుమల : వేంకటేశ్వర స్వామి*

కృతయుగంలోని వృషశైలం తిరుమల. అదే పెద్ద తిరుపతి. త్రేతాయుగంలోని శేషశైలం ద్వారకా తిరుమల. అదే చిన్న తిరుపతి. పెద్ద తిరుపతి వెళ్ళి తీర్చుకోలేని మ్రొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకొన్న చాలును. ఇది అనూచానంగా వస్తున్న ఆచారం.

శేషుడు తన పడగల మీద భువన శ్రేణిని మోస్తున్నాడు. మహా విష్ణువునకు శయనంగా ఉండి సమస్తోచిత క్రియలు నిర్వహిస్తున్నాడు. ఆ శేషుడు ఇంద్రకీలాద్రికి పట్టిసాద్రికి మధ్యభాగంలో త్రేతాయుగమున హరిహరులను గూర్చి తపస్సు చేశాడు. హరిహరులు అతనికి సాక్షాత్కరించారు. శేషుడు తన శిరస్సునందు శ్రీమహావిష్ణువును దర్శించే భాగ్యాన్ని కల్పించమని ప్రార్ధించాడు. హరిహరులు వరాన్ని కరుణించారు.

శేషుడు త్రేతాయుగంలో విదర్భ దేశంలోని ద్వారకాపురి సమీపంలో పర్వతాకారం ధరించాడు. ఆ కొండపై కుంకుడు చెట్టు దగ్గర తొర్రలో శేషుడు నివసించాడు. శేషుని అనుగ్రహించుటకు శ్రీ వేంకటేశ్వరుడు అక్కడే పుట్టలో కాపురమున్నాడు. శివుడు మల్లిఖార్జును డై ఆ కొండపై నెలకొన్నాడు. శివకేశవులు ఈ విధంగా శేషుని అనుగ్రహించి శేషశైలంపై అధివసించారు.

ఆ శైలం త్రేతాయుగం నుండి 'శేషాద్రి'గా, 'శేషాచలం'గా 'శేషశైలం'గా, 'అనంతగిరి'గా ప్రఖ్యాతమైంది. అందుచేతనే అది 'త్రేతాయుగ శేషశైలం'. అప్పటి నుండి శ్రీ వేంకటేశ్వరుడు శేషునిచే ఆరాధింపబడి, శేషుని అనుగ్రహిస్తున్నాడు.

కృతయుగంనాటి తిరుమల, త్రేతాయుగం నాటి ద్వారకా తిరుమల సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు.

బ్రహ్మ పురాణాంతర్గతమైన ద్వారకా తిరుమల క్షేత్రకథ ఒకటి ఉన్నది. ఇందుమతీ,అజమహారాజ దంపతులు ద్వారకా తిరుమలలోని పుణ్య పురాణ దంపతులైన పద్మావతీ శ్రీనివాసులను నవ వధూవరులను చేసి కళ్యాణ వేడుకలు జరిపించుట బ్రహ్మ పురాణ కధ.

ఈ విధంగా పురాణ ప్రసిద్ధమైన 'విదర్భదేశం' కృష్ణా గోదావరీ నదుల మధ్య దేశమని వ్యక్తమైంది. ఖండేరాయుని కైకలూరు శిలా శాసనం కూడ అదే విషయాన్ని నిరూపించింది. విదర్భ విశేషించి దర్భలు లభించే దేశం. తరువాత వెల్లనాడు, వేంగినాడు అని పేరు పెట్టారు. ద్వారకుడు గొప్ప తపస్వి. అతని ధర్మపత్ని సునంద. వేంకటేశ్వరుని పాదసేవకు ఆ దంపతులు తమ జీవితాలను అంకితం కావించారు. వెంకటేశ్వర దర్శనార్థము ప్రయాణించుచున్న వారికి వేంకటేశ్వర దర్శనం కలిగింది. 

త్రేతాయుగ శేషాచలముపై తన సేవ చేసికొమ్మ న్నాడు. ఆ స్వామి చెప్పిన కుంకుడు చెట్టు వద్ద ఒక వల్మీకం (చీమల పుట్ట) గోచరించింది. ఇది ఆ చెట్టుకు ఈశాన్య భాగంలో ఉన్నది. ఆ వల్మీకంలో స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ మూర్తిని ద్వారకుడు యథాశాస్త్రీయంగా ప్రతిష్ఠించి, విధి విధానంగా పూజించాడు. ద్వారకుని మూలంగా వేంకటేశ్వరుడు, ఆ కారణంగా ఇది 'ద్వారకా తిరుమల'.. పునర్వ్యక్తమయ్యాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ద్వారకా తిరుమల మధ్యభాగంలో పంపానది పశ్చిమ దిక్కు నుండి తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉత్తర వాహినిగా గోదావరిలో కలుస్తోంది. దేవాలయానికి ఆ పంపానది ఉత్తరవాహినియై ప్రవహిస్తోంది. అదే నేటి ఎర్రకాలువ. సప్తర్షుల కోసం శ్రీహరి సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సమీపంలో ఒక తీర్థాన్ని సృష్టించాడు. అదే సుదర్శన తీర్ధం. ఇది సుదర్శన క్షేత్రం. ద్వారకా తిరుమల చిత్కలా ప్రసార కేంద్రంగా కూడ ప్రసిద్ధి చెందింది.
📖

ద్వారకా తిరుమల క్షేత్రాభివృద్ధికి తన సర్వస్వం ధారపోసిన భక్తుడు శ్రీధర్మ అప్పారావుగారు. 18వ శతాబ్దంలో ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించి గోపుర, ప్రాకార, మంటపాలు, సోపానాలు నిర్మించారు.

ఇక్కడకు వచ్చే యాత్రీకులకు ముందు 'కుంకుళ్ళమ్మ' దర్శనమిస్తుంది. ఈమె అతిథి దేవత. కొండ మల్లేశ్వరుడు క్షేత్రపాలకుడు. భక్తాంజనేయులు క్షేత్ర రక్షకుడు. కొండపై మల్లిఖార్జున స్వామి ఆలయం వుంది. ఈ స్వామి దర్శనం చేయనిదే 'ద్వారకా తిరుమల' యాత్రా ఫలితం లభించదు.

ఈ దివ్యక్షేత్రంలో ఆంజనేయాలయము, సుబ్రహ్మణ్యా లయము, గంగానమ్మగుడి దర్శించవలసినవి. మధ్యగా 'పద్మ సరోవరం' ఉంది. ఇక్కడ సుద్దగనులు ద్వారా విదేశ మారక ద్రవ్యం లభిస్తోంది. ఈ మృత్తికను భక్తులు తీసికొని ధరిస్తారు. కళ్యాణాలలో వైశాఖమాస కళ్యాణం ప్రధానమైంది. పశ్చిమ గోదావరి వేంగీ దేశ భాగం క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి నాలుగున్నర శతాబ్దాలు ఈ ప్రాంతం శాతవాహన రాజ్యానికి చేరి ఉంది. తర్వాత ఇక్ష్వాకులు, కృష్ణా గోదావరీ మధ్యభాగం 'బృహత్పలాయనులు' పాలించారు. వారి కాలంలోనే వేంగీ నగర నిర్మాణం జరిగింది. తూర్పు చాళుక్యులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, కాకతీయులు, వెలనాటి చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గోలుకొండ నవాబులు, ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు పరిపాలించిన ప్రదేశం పశ్చిమ గోదావరి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వూరు భీమడోలుకు సుమారు 14 కిలోమీటర్ల దూరములో కలదు. భీమడోలు రైలు స్టేషన్లో దిగి బస్సుపై ద్వారకా తిరుమల చేరుకొనవచ్చును.
📖

*సోమారామం: గుణుపూడి భీమవరం*

"గౌతమీ తీరంబున దక్షిణ కూలంబున గుణుపూడి అనుగ్రామంబున సోమునిచేతం ప్రతిష్ఠితంబగుటచేసి సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును" అంటూ శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో సోమారామం గూర్చి వర్ణించాడు.

అగస్త్యుడు కాశీవియోగ దుఃఖాన్ని హరించుకోవ డానికై గోదావరీ తీరభ్రమణం చేస్తూ వివిధక్షేత్రాలు దర్శించిన పిమ్మట క్షీరారామం, సోమారామాలను దర్శించి సేవించినట్లుగా కాశీఖండంలో అభివర్ణించాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
క్షీరారామేశ్వరలింగం వలె సోమేశ్వర లింగం పీఠం నుండి రెండడుగుల ఎత్తుగల స్ఫటిక లింగం. చంద్రునిచేత ప్రతిష్ఠింపబడినది. ఈ లింగం చంద్రుని వృద్ధిక్షయను ప్రతిబింబిస్తుంది.

తూర్పు చాళుక్యరాజులలో భీమనామం ధరించిన రాజులు ఎందరో ఉన్నారు. మొదటి చాళుక్య భీమ. ఆదిగాగలవారు. వారిలో భీమప్రతావ. బిరుదాంక భీమ, ముమ్మిడిభీమ మొదలైన బిరుదులు ధరించిన చాళుక్య రాజులలో విమలా దిత్యుడు గొప్పవాడు. అట్టివారి పేరుమీద ఆలయాలు, గ్రామాలు వెలసాయి. పశ్చిమ గోదావరి భీమవరం చాళుక్య భీమరాజులలో ఒకరి పేర వెలసిన గ్రామం. జటాచోళభీముని పాలనలో ఆ పేరు స్థిరపడి ఉంది. దత్తనామాత్య సోముడు, సోమారాముని 'గుడిపూండి' శాసనములు వలన అనేక విషయాలు తెలియుచున్నవి.

'ఉండి' రాజులు వీరశైవులు. వారి కాలంలో నూజివీడు, జల్లిసీమలలో, భీమవర ప్రాంతం ఎంతో శోభాయమానంగా విరాజిల్లినది. క్రీ.శ. 1434 దేవయకుమారుడు శింగన అనే భక్తుడు గుణుపూడి భీమవరం సోమేశ్వరునికి ఎన్నో బహుమానాలు చేశాడని ఆలయానికి ఎదురుగా నున్న మండప స్తంభశాసన పద్యంవలన తెలుస్తోంది. 

భీమవరంలో ప్రాచీన భీమేశ్వరాలయం కూడ ఉంది. క్రీ.శ. 10వ శతాబ్దంలో సోమేశ్వర, భీమేశ్వర దేవాలయాలు తూర్పు చాణుక్యుల కాలంలో వర్ధిల్లాయి. సోమారామం పంచారామాలలో ఒకటి.
🛕
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 *రామాయణం... ఎందుకు చదవాలి?*

*భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు... రామాయణ, భారతం, భాగవత గ్రంథాలు. రామాయణం ఆదర్శవంతమైన జీవితానికీ, భారతం మనం నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న నిజజీవితానికీ, భాగవతం దివ్యమైన జీవితం గడపడానికీ మార్గదర్శకాలుగా పెద్దలు పరిగణిస్తారు. ఈ మూడింటిలో రామాయణం ద్వారా జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాల్లో రాముడు ఎలా నడిచాడో తెలుసుకొని, వాటిని అనుసరిస్తూ ఆ సమస్యలను అధిగమించవచ్చు. రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అలవాటు చేస్తుంది. సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. వ్యక్తితో మొదలైన సంస్కారం కుటుంబంలో, సమాజంలో వికసించాలి. దానివల్ల దేశం, ప్రపంచం చక్కబడతాయి. ఈనాడు మనం చూస్తున్న కులాలూ, మతాలూ, ప్రాంతాలు అనే అసహజ భావనలు వాటంతట అవే సమసిపోతాయి. 'వసుధైక కుటుంబం' అనే వేదవాక్కుకు సార్ధకత ఏర్పడుతుంది. మనల్ని మనమే కాదు, సమాజాన్నీ, తద్వారా మానవు* *లందరినీ రక్షించుకోవడానికి తోడ్పడుతుంది. ఇది జరగాలంటే ప్రతి వ్యక్తీ రామాయణంలో ఉటంకించిన భావాలను అర్థం చేసుకోవాలి. అందుకోసం రామాయణం చదవాలి. వర్తమాన పరిస్థితులకు అన్వయించుకోదగిన ఘట్టాలు ఎన్నో రామాయణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని:*

*దాంపత్య ధర్మం తెలుసుకోవడానికి...*

*వైదిక సంస్కృతిలో దాంపత్య ధర్మం అతి పవిత్రమైనది. ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా వాల్మీకి ప్రస్తావించాడు. సీతారాముల మధ్య నెలకొన్న ప్రేమానుబంధం అపురూపమైనది, ఆదర్శవంతమైనది. వారి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమను బాలకాండలో (77-26, 27) వాల్మీకి ఇలా ఆవిష్కరించాడు-*

*"ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి*
*గుణై రూప గుణై శ్చైవ భూయ ఏవాభ్య వర్ధత*
*తస్యాశ్చ భక్తా ద్విగుణాం హృదయే పరివర్తతే"*

*అంటే రాముడికి సీత అంటే మిక్కుటమైన ప్రేమ. అందుకు కారణం తన తండ్రి దగ్గరుండి వివాహం జరిపించడం. పైగా సీతలో సహజంగా ఉన్న సౌందర్యం, సద్గుణాలు రాముడి హృదయాన్ని ఆకట్టుకోవడంతో ఆ ప్రేమ మరింతగా పెరిగింది. ఇక సీతకు రాముడి మీద ప్రేమ ద్విగుణీకృతంగా ఉంది. శివ ధనుర్భంగం చేసి, సీత హస్తాన్ని ఆయన అందుకున్నాడు మరి! అయితే తండ్రి వివాహం జరిపించడం ఏమిటి? దీనికి సమాధానం అరణ్యకాండలో సీత తన వివాహ వృత్తాంతాన్ని చెప్పినప్పుడు తెలుస్తుంది. శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసిన తరువాత “ఇదిగో నా కుమార్తెను ఇస్తున్నాను, స్వీకరించు" అని జనకుడు అంటే, తన తండ్రి అంగీకరిస్తేనే కాని పాణిగ్రహణం చేయనని రాముడు అన్నాడనీ, దశరథుని అనుమతి లభించిన తరువాతే తనను పరిణయమాడాడనీ సీత చెబుతుంది. దాంపత్యానికి ఉన్న పవిత్రత రామాయణంలో పలుచోట్ల ప్రస్తావితం అయింది. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వనవాసానికి పంపిన భర్తపై కౌసల్య కోపించకుండా, భార్యగా తన విధులను దుఃఖంలో కూడా నిర్వర్తించడం రామాయణంలో కనిపిస్తుంది. మానవుల్లోనే కాదు, రాక్షసుల్లో సైతం దాంపత్యానికి ఉన్న పవిత్రతను మండోదరి ద్వారా మనకు వాల్మీకి తెలియజేశాడు. కుటుంబానికి ధర్మబద్ధమైన దాంపత్య జీవితం మూలకందం. దాంపత్య ధర్మం గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి.*

*ఆదర్శాలు నేర్చుకోవడానికి...*

*గురుభక్తి, భాతృప్రేమ, సౌహార్దం తదితర గుణాలు కుటుంబంలోని పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమించాలి. పెద్దలు పరంపరానుగతంగా వస్తున్న సంస్కారాలను అలవరచుకొని పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. పిల్లలు తమ కర్తవ్యాన్ని విస్మరించకుండా వారికి శిక్షణ ఇవ్వాలి. 'తరాల భేదం లేకుండా ఎలా ఉంటుంది?' అని సాకులు చెబితే తమ సంతానానికే కాదు, సమాజానికి కూడా చెడు చేసినవారు అవుతారు. రామాయణంలో రాముడు ప్రదర్శించిన సుగుణాలను అనుసరించాలి. దానికోసం రామాయణం తప్పకుండా చదవాలి.*

*నిస్వార్థ ప్రవృత్తి కోసం...*

*'అర్థం అన్ని అనర్థాలకూ మూలం' అనేది నానుడి. సుఖమయ జీవితానికి అర్థం (సంపద) అవసరమే కావచ్చు. అదే పరమార్థం అనుకుంటే అంతకన్నా అనర్థం లేదు. 'రాముడు వనవాసానికి వెళ్తాడో, లేదో?' అని కైకేయి శంకిస్తుంది. అది రాజాజ్ఞ అని గుర్తు చేస్తుంది. అప్పుడు రాముడు కైకేయితో-"నాహ మర్థపరో దేవి! లోకమావస్తుముత్సహే విద్ధి మామృషిఖిస్తుల్యం విమలం ధర్మమాస్థితమ్" (అయోధ్య కాండ)*

*"ఓ దేవీ! నేను అర్థప్రధానుణ్ణి కాను. నేను మంచి మార్గంలో నడుస్తూ, జగత్తును సక్రమమైన దారిలో నడిపించాలన్నదే నా కోరిక. నేను ప్రాధాన్యమిచ్చేది ధర్మానికే. నేను ఋషితుల్యుణ్ణి అనే విషయాన్ని గుర్తుంచుకో. తండ్రి ఆజ్ఞానుసారం వనవాసానికి ఇప్పుడే వెళ్తున్నాను" అంటాడు. అర్థకామాల కన్నా ధర్మమే శ్రేష్టమని రాముని మనసులోని మాట. వాటిని పరమ ధ్యేయంగా భావించిన రావణాదుల వంటి వారు ఎలా పతనమయ్యారో రామాయణం చెబుతుంది. వర్తమానంలో సంపద కోసం, అధికారం కోసం వెంపర్లాడుతున్న వారికీ, అందుకోసం ఏది చెయ్యడానికైనా వెరవని వారు... రామభరతాదుల నిస్వార్థ ధార్మిక ప్రవృత్తిని కొంతైనా అవగాహన చేసుకుంటే, వారి వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకు రామాయణమే శిరోధార్యం.*

*వ్యక్తిత్వ వికాసానికి...*

*ఓర్పు కలిగి ఉండడం అవశ్యమని రామాయణం ప్రవచిస్తుంది. ఎంత చిన్న కష్టమైనా సహించలేక ఆత్మహత్యలకు పాల్పడడం, తమ కష్టాలకు కారకులైన వారిని హత్య చెయ్యడం ఈనాటి కొందరి ప్రవృత్తి. కష్టాలను ధైర్య సాహసాలతో ఎదుర్కోవడమే జీవితానికి ఉత్తమ ఆదర్శం. ఉదాహరణకు హనుమంతుణ్ణి, సీతనూ పేర్కొనవచ్చు. ఒకానొక సమయంలో, సీత జాడ తెలుసుకోలేక హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఒక్క క్షణం ఆలోచించి, ఆత్మహత్య ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో అర్థం చేసుకొని-* *“అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం" "దిగులు చెందకుండా ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. అదే సమస్త సుఖాలకూ మూలం" అంటాడు. అంతే కాకుండా- "వినాశే బహవే దోషా జీవన్ ప్రాప్నోతి భద్రకమ్" "మరణిస్తే ఏముంది? అన్నీ దోషాలే. జీవించి ఉంటే ఎప్పటికైనా విజయం ప్రాప్తిస్తుంది" అని అంటాడు. సుందరకాండలో హనుమ, సీతల మనస్సులను చదివితే దైవబలం ఎంతటి ధైర్యాన్నిస్తుందో అర్థమవుతుంది. ఇది తెలుసుకోవాలంటే రామాయణమే దారి చూపిస్తుంది. ఆదర్శవంతమైన జీవితానికి రామాయణం ఆటపట్టు. ఆదర్శ జీవితం గడుపుతూ, పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన శ్రీరాముడు రామరాజ్యాన్ని వ్యవస్థీకరించాడు. ఈనాటి ప్రభుత్వాలకూ, అధికారులకూ అనుసరణీయమైన ఎన్నో విషయాలను రామాయణం తెలియజేస్తుంది. అయోధ్య కాండలో- రామభరతుల సంవాదంలో పరిపాలనా సూత్రాలెన్నిటినో భరతుడికి రాముడు వివరించాడు. కథగా చెప్పుకుంటే- రాముడిలో ధైర్య స్థైర్యాలు నింపడానికి సిద్దాంతపరంగా వశిష్ఠుడు కృషి చేస్తే, దాన్ని ఎలా ఆచరణలో పెట్టి విజయం చేకూర్చుకోవచ్చు అనేది విశ్వామిత్రుడు వివరించాడు. రామాయణం చదివితే సంభాషణా నైపుణ్యం తెలుస్తుంది. వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. అన్నిటికన్నా మానసిక చైతన్యం, ధైర్య స్థైర్యాలు, ముఖ్యంగా నీతి, నిజాయతీలు, కార్యసాధనా నైపుణ్యం లాంటివి కరతలామలకం అవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ రామాయణాన్ని తప్పనిసరిగా చదవాలి.*

*┈┉┅━❀꧁హరేరామ్꧂❀━┅┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🪔🍁 🙏🕉️🙏 🍁🪔🍁
 కథ పేరు: *రెండో ఛాన్స్*
రచన: కోడూరి తిరుమల మాధవి 
స్వీయ రచన ( 7-8-25)

మధ్యాహ్నం 
పన్నెండున్నర కావస్తోంది,
నా ముందు కూర్చున్న పేషెంట్ బయటకు వెళ్లగానే, టేబుల్ మీద వున్న బెల్ నొక్కాను.

తలుపు తెరిచి ఎస్ మేడం అంటూ కమల లోపలికి వచ్చింది,
ఇంకా ఎంత మంది పేషంట్లు వున్నారు ? అని అడిగాను, ఇంకా ఇద్దరు వున్నారు మేడం ఒకరు బయట వెయిట్ చేస్తున్నారు ఇంకొకరు అరగంటలో వస్తున్నట్టు ఫోన్ చేశారు అని చెప్పింది.

సరే అయితే ఆ వెయిట్ చేస్తున్న వారిని లోనికి పంపించు అనగానే  అలాగే మేడం అని కమల తలుపు మూసి వెళ్ళిపోయింది.

వెంటనే ఆ పేషెంట్ లోనికి వచ్చారు, వారిని చూసి మాట్లాడి పంపించాక కాస్త రిలాక్స్ గా కుర్చీలో వెనక్కి వాలాను.

నా పేరు భార్గవి, నేను సైక్రియాటిస్ట్ ని నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి పదిహేను ఏండ్ల పైనే అయింది, మొదట పెద్దగా పేషంట్లు వచ్చేవారు కాదు.

మించిపోతే రోజుకు ఒకరో ఇద్దరో అంతే,
మన దేశంలో సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే అదేదో  చాలా తప్పు అన్నట్టు భావిస్తారు.

ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తే చాలు ఏమైంది నీకు సైక్రియాటిస్టు దగ్గరికి వెళ్ళవలసినంత అవసరం ఏమొచ్చింది అంటూ ఆరాలు తీస్తారు.
అలా వెళ్ళిన వాళ్ళకు పిచ్చో మరేదో వున్నట్టుగా భావిస్తారు.

కానీ ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచనల్లో కాస్త మార్పు వస్తోంది.
శరీరానికి రుగ్మతలు వున్నట్టే మానసిక రుగ్మతలు వుంటాయని వాటిని నిర్లక్ష్యం చేయకూడదు అని తెలుసుకుంటున్నారు. 
ఇది నిజంగా మంచి మార్పు.

ఇలా ఆలోచిస్తున్న నాకు "మేడం ఆ ఫోన్ చేసిన పేషెంట్ వచ్చారు లోనికి పంపమంటారా ? అన్న పిలుపుతో ఆలోచనల్లోనుండి బయటకు వచ్చి
"ఆ...ఆ....పంపించు" అన్నాను.

తలుపు తీసుకుని నా వయసే వున్న ఒక ఆవిడ లోపలికి వచ్చి నమస్తే మేడం అంటూ నా ముందు వున్న కుర్చీలో కూర్చుంది.

తనని చూసిన నా ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు నువ్వూ....నువ్వు మాలతి కదూ అన్నాను ఆనందంతో తను కూడా ఆశ్చర్య పోయి నువ్వు భా....భార్గవి కదూ అనింది, ఇద్దరం ఆనందంతో కౌగిలించు కున్నాము.

ఇలా ఇన్ని ఏండ్ల తరువాత అనుకోకుండా కలుసుకోవడం ఇద్దరికీ చెప్పలేని ఆనందంగా వుంది.

మేము పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. తరవాత ఇంటర్ లో నేను సైన్స్ గ్రూప్ తను ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంది మా ఇద్దరి కాలేజీలు కూడా వేరు వేరు కావడంతో మా దారులు వేరు అయ్యాయి.

స్కూల్ లో చదివేటప్పుడే తను అన్ని యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొనేది, చాలా ధైర్యవంతురాలు. 
మా అందరికీ తను చాలా ఇస్పిరేషన్ గా వుండేది. ఏదైనా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకునేది కాదు మేమందరం తనని లా చదివి లాయర్ అవవే నీకు బాగా సూట్ అవుతుంది అనేవాళ్ళం.

ఇలా సాగిపోతున్న ఆలోచనల నుండి బయటకు వచ్చి అది సరేగానీ మాలతి ఇప్పుడు నువ్వు ఎక్కడ వున్నావు ? ఏం చేస్తున్నావు ? ఇలా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను,

తను నవ్వుతూ "ఆగవమ్మా... డాక్టరమ్మా... అన్నీ చెప్తాను అంటూ ఒక చిన్న నిట్టూర్పు విడిచి తన గురించి చెప్పసాగింది.

డిగ్రీ అయ్యాక మీరందరూ అన్నట్లు గానే B.A B.L చదివాను "లా" ప్రాక్టీస్ కూడా చేసాను.

తరవాత పెళ్ళి అయింది. పెళ్ళయ్యాక కూడా నా లాయర్ గా కొనసాగాలి అన్నదే నా కోరిక, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అత్తగారి ఇంటికి అలవాటు పడాలి కదా అని కొన్ని రోజులు, పిల్లలు అని కొన్ని రోజులు, వారి చదువులు అని కొన్ని రోజులు ఇలా రోజులు సంవత్సరాలు గడిచి పోయాయి.

మా వారు పెద్ద బిజినెస్ మాగ్నెట్. ఆయన వ్యాపారాల నిమిత్తం ఎప్పుడూ బిజినెస్ టూర్ ల మీద వేరే ఊర్లలో వుండటం వల్ల ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత మొత్తం నేనే చూసుకోవలసి వచ్చింది. ఈ బాధ్యతల్లో పడి నేను ఒక లాయర్ అన్న సంగతే మరిచి పోయాను.

పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు అయ్యాయి ఇద్దరూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు, వారి జీవితాలు వారి హడావుడిలో వాళ్ళు వున్నారు,
ఇప్పుడు నాకు ఒంటరి  తనం ఎక్కువగా బాధిస్తోంది. ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతినింది, ఎప్పుడూ ఏదో దిగులు, భయం గా వుంటుంది. 

ఎవరితోనూ కలవలేక పోతున్నాను, మాట్లాడలేక పోతున్నాను. చాలా డిప్రెషన్ గా వుంటుంది. ఈయనతో నా బాధ చెప్పుకుందాం అంటే నేను చెప్పేవి ఏవీ ఆయనకు పెద్ద విషయాలుగానే తోచవు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు ఒక్కోసారి చాలా దిగులుగా వుంటుంది, కారణం లేకుండా ఏడుపు వస్తుంది, అందుకే ఎవరినైనా ఎవరినైనా మానసిక డాక్టర్ ని కలుద్దాము అని వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక నా ప్రియ మిత్రురాలే డాక్టర్ అవడం చెప్పలేని సంతోషంగా వుంది అనగానే
నేను చిన్నగా నవ్వుతూ ఓస్ ఇంతేనా నేను ఇంకేదో పెద్ద సమస్య అనుకున్నాను. ఈ పరిస్థితి నూటికి ఎనభై మంది ఆడవాళ్ళకు వున్నదే ఇల్లు సంసారం పిల్లలు అని బాధ్యతలు వున్నంత వరకూ వాటిలో మునిగి పోతారు, పిల్లలు పెరిగి వారి వారి జీవితాలు చూసుకునే స్థాయికి వచ్చాక మనల్ని ఒంటరి తనం పీడిస్తుంది, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ పరిస్థితి కాస్త బాగున్నా ఇంట్లోనే వుండే ఆడవాళ్ళు మాత్రం ఈ సమస్యను ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు.

మగవాళ్ళు ఇంటి కన్నా బయట ప్రపంచంతో ఎక్కువగా సంబంధం కలిగి వుంటారు కాబట్టి వారిని ఈ సమస్య పెద్దగా బాధించదు.

అయినా ఇందులో నీదే తప్పు అంటాను.
లాయర్ చదివావు,   ఇంటి బాధ్యతల వల్ల కొంతకాలం నీ ప్రాక్టీస్ కి దూరంగా వున్నా తరవాత అయినా నీ కెరీర్ ని నువ్వు తిరిగి ప్రారంభించి వుండవలసింది,

ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలు వుండేవి ఒకే ఇంట్లో అన్నదమ్ములు, తోడి కోడళ్ళు వాళ్ళ పిల్లలు ఇలా పది పదిహేను మందికి తక్కువ కాకుండా ఉండేవాళ్ళు ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు, పురుళ్ళు పుణ్యాలు అని ఎప్పుడూ ఏదో ఒకటి  జరుగుతూ వుండేది.
ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బంధువులు చుట్టాలు అంటూ ఆడవాళ్ళకు క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ పది మంది మధ్యలో వుండేవారు.

కానీ కాలం మారింది.
ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలు అయిపోయాయి.
జీవితంలో ఒక స్టేజ్ కి వచ్చాక ఒంటరితనం తప్పడం లేదు. కాబట్టి  ఆ సమస్యను మనమే ఎదుర్కోవాలి.

శరీరంతో పాటు మనసుకి కూడా మంచి వ్యాయామం కావాలి అప్పుడే ఇటువంటి నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ మన దరికి రాకుండా వుంటాయి.

 ఒంటరిగా కూర్చుని వుంటే ఏవో ఒక పనికి మాలిన ఆలోచనలు వస్తుంటాయి,
నువ్వు ఎలాగూ "లా " చేశావు కాబట్టి కోర్టు కి వెళ్ళి ప్రాక్టీస్ చేయక పోయినా నీకు వున్న జ్ఞానంతో ఒక కన్సల్టెన్సీ ప్రారంభించవచ్చు న్యాయపరమైన సమస్యలకు నీ సలహా సూచనలు ఇవ్వవచ్చు. 

ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయింది దాని ద్వారా కూడా నువ్వు ఎంతో తెలుసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు. లేదా నీకు ఇంట్రెస్ట్ వున్న ఏ విషయాన్నైనా తిరిగి మళ్ళీ మొదలుపెట్టు.

ముందు కొంచెం తడబడినా క్రమేణా పుంజుకుంటావు.
మన గురించి మనమే ఆలోచించుకోవాలి అంతే తప్ప నాకు ఎవరూ లేరు, నా అవసరం ఎవరికీ లేదు అనుకుంటూ కూర్చోవడం తప్పు.

అయినా నేను ఒంటరిని అనుకుంటూ కూర్చోవడం కంటే ఏదైనా సాధించడానికి జీవితం మనకు రెండో ఛాన్స్ ఇచ్చింది అని ఎందుకు అనుకోకూడదు ?

ఇప్పటిదాకా అందరి కోసం బ్రతికావు. ఇప్పుడు నీ కోసం నీవు బ్రతుకు, అనగానే నా మాటలు శ్రద్ధగా విన్న  మాలతి "నిజమే భార్గవి నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నాలో ఏదో కొత్త ఉత్సాహం కలుగుతోంది" అని మళ్ళీ అంతలో ఇప్పుడు ఇవన్నీ నా వల్ల అవుతాయి అంటావా! అని బేలగా  నావైపు చూసింది.

"అరె భలే దానివే మనసుంటే మార్గం ఉంటుంది" నువ్వు తప్పకుండా చేయగలుగుతావు.
నాకు తెలిసి ఇప్పుడు మీవారి నుండి కూడా నీకు పెద్దగా అభ్యంతరం వుండదు అనుకుంటున్నాను, ఒక వేళ చెప్పినా ఇప్పుడు ఇంక నువ్వు నీ ప్రయత్నం ఆపవలసిన అవసరం ఏమాత్రం లేదు.

 నిజం చెప్పాలి అంటే చిన్నప్పటి నుండీ మా అందరిలోకి నువ్వే ధైర్యవంతురాలివి
అనగానే "థాంక్స్ భార్గవి" తప్పుకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను జీవితం నాకు ఇచ్చిన రెండో ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పి బయటకు వెళుతున్న మాలతి వైపు అలాగే చూస్తూ వుండిపోయాను.

నిజమే ఒక్క మాలతి మాత్రమే కాదు సమాజంలో ఎంతో మంది ఇలాంటి మాలతిలు వున్నారు.

ఏ వ్యవస్థలో అయినా కుటుంబం, పిల్లల విషయం లో  పురుషుడి కంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత వుంటుంది. వుండాలి కూడా అప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుంది. అదే సమయంలో కుటుంబ బాధ్యతల్లో పడి స్త్రీ తన ఉనికిని కోల్పోకూడదు.

తన చదువుని, తనలో వున్న అభిరుచులను, ఆశలను వదులుకోకూడదు. తనకంటూ ఒక వ్యక్తిత్వం కలిగివుండాలి. 

ఫలానా వారి కూతురు గానో, ఫలానా వారి భార్యగానో, ఫలానా వారి తల్లిగానో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. 

లేదంటే జీవితంలో ఏదో ఒక సమయంలో నా కంటూ ఏమీ లేదా! అన్న నిరాశ, నిస్పృహ, ఒంటరినం వెంటాడి వేధిస్తాయి.

ఇలా ఆలోచిస్తున్న నేను నా ఆలోచనల నుండి బయట పడి ఇంక పేషెంట్ లు ఎవరూ లేక పోవడంతో కమలతో చెప్పి ఇంటి దారి పట్టాను 

సరిగ్గా ఆరు నెలల తరువాత మళ్ళీ మాలతి నన్ను కలవడానికి క్లినిక్ కి వచ్చింది, తనలో ఇప్పుడు ఒక కొత్త మార్పు కనపడింది, ఇంతకు ముందు వున్న దిగులు నిరాశ మాలతిలో ఇప్పుడు మచ్చుకు కూడా లేవు, ఒక కొత్త ఉత్సాహం తనలో కనపడింది.

నన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకుని థాంక్స్ భార్గవి నీ స్పూర్తి, స్నేహం నా జీవితాన్ని మార్చి వేశాయి. నువ్వు చెప్పినట్టే "లా" కన్సల్టెన్సీ పెట్టాను.

మొదట కాస్త భయపడ్డాను కానీ, ఇప్పుడు నిలదొక్కుకున్నాను. నేను చదివిన చదువును సార్థకం చేసుకున్నాను, న్యాయపరమైన ఎన్నో సమస్యల కోసం నా దగ్గరికి వచ్చే వారికి నా సహాయ సహకారాలు, సలహాలు అందిస్తున్నాను, అంతో ఇంతో సమాజానికి ఉపయోగ పడుతున్నాను అనేసరికి "వెరీ గుడ్ మాలతీ" ఇది కదా మా డేర్ అండ్ డాషింగ్ మాలతి" అంటే  అనగానే ఇద్దరం సంతోషంగా నవ్వుకున్నాము.

      *** శుభం***
 సినిమా షూటింగ్

“అమ్మా! ఎందుకే గుడిసె దులుపుతున్నావ్? ఇప్పుడు ఏ పండగ లేదు కదా! అమ్మవారి పండగ మొన్ననే అయిపోయింది కదా!”
అని ఆశ్చర్యంగా అడిగాడు రాము.
ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్న కాంతమ్మ ముఖంలో చిరునవ్వు మెరిసింది.
“ఈ నెలాఖరికి మన ఊర్లో సినిమా షూటింగ్ జరుగుతుందట రా… వాళ్లకి మనలాంటి గుడిసె అవసరం ఉంటుందట. సినిమాల్లో పని చేసే మన ఊరి అప్పారావు చెప్పాడు. మన గుడిసెను రికమెండ్ చేస్తానని డబ్బులు కూడా తీసుకుని వెళ్లాడు.”
రాము కళ్లలో అనుమానం, మాటల్లో అసహనం—
“నువ్వు వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావే! సినిమాలో వాడికే దిక్కులేదు. అయినా వాడు చెప్తే వినే వాళ్లు ఎవరు?”
కాంతమ్మ చేతులు కాసేపు ఆగిపోయాయి.

సదరు అప్పారావు సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నానని అందరికీ చెప్పుకుంటాడు. కానీ  షూటింగ్లో లైట్లు మోసుకెళ్తూ కనపడ్డాడట ఆ ఊరి వాళ్ళకి. అలాంటి వాడిని నమ్మింది కాంతమ్మ.

“అది కాదురా… గోదావరి పుష్కరాలకి మన ఊరి గుడికి రంగులు వేసి సినిమా తీశారు కదా! గత ఏడాది కరణం గారి మండువా ఇల్లు సినిమాలో ఎంత బాగుందనుకున్నావ్! ఆ రంగులు చూస్తే కళ్ళు చెదిరిపోయేవి. అలాగే మన గుడిసెను కూడా బాగు చేసి సినిమాల్లో చూపిస్తారేమో అనిపించి…” అని మృదువుగా చెప్పింది.
 పాడుపడిన గుడిసె బాగు చేయించుకోవడం కొద్దిగా కలగానే ఉండిపోయింది కాంతమ్మకి ఎన్నో ఏళ్ల నుంచి 

గోదావరి ఒడ్డున ఉన్న ఆ కోనసీమ గ్రామం ప్రతి ఏటా ఒకసారి అయినా సినిమాల సందడిని చూసేది.పెద్ద మర్రిచెట్టు కింద, గోదావరి గట్టుపై, ఊరిలోని పెద్ద ఇళ్ల అరుగుల మీద—ఎన్ని సినిమాలు తీశారో ఎవరూ లెక్కలేదు. 

సినిమా వాళ్లు ఊర్లో ఉన్నంతసేపు, ఊరు తన పనులన్నీ మరిచిపోయేది.
కాంతమ్మ కాఫీ హోటల్  మాత్రం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. 
“ఇక్కడి ఉప్మా, పెసరట్టు రుచి వేరేలా ఉంటుంది” అనే యూట్యూబ్ వీడియోతో   పక్కటౌన్ నుంచీ కూడా సినిమా వాళ్లు అక్కడికే వచ్చి తినేవారు.

పండగ రోజుల్లో తప్ప గుడి మొహం చూడని జనాలు కూడా షూటింగ్ రోజుల్లో గుడి దగ్గర గుమికూడేవారు.
దేవుడు కూడా బిజీ అయిపోయేవాడు!
పూజారి గారు అయితే గర్వంతో ఉప్పొంగేవారు. ఏళ్ల క్రితం తన మీద తీసిన ఒక చిన్న సీన్ గురించి ఇప్పటికీ అడిగినా, అడగకపోయినా చెప్పుకుంటూనే ఉండేవారు.

ఊరి బడిని కూడా ఒకసారి సినిమాకోసం రంగులు వేసి శుభ్రం చేశారు.“ఇదే మా క్లాస్ రూమ్!” అంటూ తెరపై కనిపించే చోట వేలు చూపిస్తూ, ఊరి వాళ్లు ఇప్పటికీ ఆనందంగా చెప్పుకుంటారు.

సినిమా షూటింగ్ అంటే కరణం గారి ఇంట్లో ప్రతిరోజూ విందులే.
“కోనసీమ రుచులన్నీ సినిమా వాళ్లకు చూపించేశాను!” అని మీసాలు మెలేస్తూ గర్వంగా చెప్పుకునేవాడు. డైరెక్టర్ గారితో చెప్పి సినిమా వేషాలు ఇప్పిస్తానని కుర్ర కారుకి  కబుర్లు చెప్పి సొమ్ము జేబులో వేసుకునేవాడు. ఇదో రకం సంపాదన 

కుర్రాళ్లకి అయితే సినిమా అంటే అదో రకమైన మాయ.ఒక సీన్‌లో అయినా కనిపించాలని ఆశతో తిరిగేవారు. తనని చూసి హీరో నవ్వేడని, హీరోయిన్ అచ్చు పల్లెటూరి అమ్మాయిల ఉందని—అంటూ ఎన్నో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. 

కాంతమ్మ ప్రపంచం మాత్రం ఒకే కల చుట్టూ తిరిగేది—
తన గుడిసె రంగులద్దుకుని మెరిసిపోవాలి…
తాను వాకిట్లో నిలబడి ఉండగా కెమెరా తనవైపు తిరగాలి…
చివరికి తన చేతిలో కొంత డబ్బు పెట్టాలి.
ఆ కల కోసం ఆమె ప్రతిరోజూ చెరువు గట్టుపై ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి ప్రార్థించేది—
“సినిమా వాళ్లు త్వరగా రావాలి” అని.
రోజులు గడిచాయి.
కానీ అప్పారావు నుంచి ఎలాంటి కబురు రాలేదు.
ఒక రోజు హైదరాబాద్ వెళ్లి వచ్చిన ఊరి యువకుడు ఒక వార్త తీసుకొచ్చాడు.
ఆ వార్త—ఆ ఊరి కలలన్నింటినీ ఒక్కసారిగా ఆపేసింది.
డైరెక్టర్ చెప్పిన మాటలు అతని మనసులో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి—
“ఇంత దూరం గ్రామాలకు రావడం మాకు కష్టం. బడ్జెట్ సరిపోదు. ఇప్పుడు పల్లెటూరి సెట్టింగ్స్ అన్నీ మా పట్టణంలోనే దొరుకుతున్నాయి. అక్కడికి వస్తే జనాలు గుమికూడుతారు, సెక్యూరిటీ సమస్యలు వస్తాయి. గోదావరి మీద పాట తీయాలంటే తప్ప మేము రావడం సాధ్యం కాదు.”
ఆ మాటలు ఊర్లో చక్కర్లు కొట్టేసరికి—
ఆశలు మెల్లగా మసకబారిపోయాయి.
ఆ తర్వాత ఆ ఊరికి సినిమా వాళ్లు మళ్లీ రాలేదు.
అప్పారావు కూడా తిరిగి కనిపించలేదు.
కొంతకాలానికి తెలిసింది—
కాంతమ్మ దగ్గరే కాదు…
ఇంకెన్నో గుడిసెల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడని.
సినిమా మోజులో ఉన్న ఆ యువకుడి దగ్గర కూడా.
ఒక ఉదయం…
కాంతమ్మ మళ్లీ తన గుడిసె ముందు ఊడ్చింది.
ఈసారి మాత్రం సినిమా కోసం కాదు.
వాకిట్లో నిలబడి గోదావరి వైపు చూసింది.
ఎప్పుడో తన కలల్లో మెరిసిన రంగులు—ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి.
రాము నిశ్శబ్దంగా ఆమెను చూసాడు.
కాంతమ్మ నెమ్మదిగా అనుకుంది—
“సినిమాల్లో కనిపించే రంగులు… నిజ జీవితంలో అంత సులభంగా రావు రా…”
ఆ గుడిసెకి రంగులు రాలేదు…
కానీ ఒక పాఠం మాత్రం బోధపడింది
కలలు కనడం తప్పు కాదు…
కానీ మోసపు మాటలపై ఆశలు కట్టడం మాత్రం జీవితాన్నే మసకబారుస్తుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ
 వేదాలకు భాష్యాలు మాత్రమే ఎందుకు రచించారు భాష్యకారులు? టీక, అనువాదములు వంటి ప్రక్రియలు వేదములకు ఎందుకు లేవు ?
వేదములకూ, బ్రహ్మసూత్రాలకు తదితర మంత్రాత్మకమైన వాఞ్మయానికి భరతవర్షంలో భాష్యాలు చెప్పబడినాయి. శుష్కమైన తాత్పర్యాలు లేవు.

అసలు భాష్యం అంటే ఏమిటి?

సూత్రార్థా వర్ణితం యత్ర పదై సూత్రాంత సారిభిః |

స్వపదాని చ వర్ణాంతే భాష్యం భాష్యవిదో విదుః ||

ఎక్కడైతే మంత్రములో గల శబ్దాలు స్పష్టంగా వివరింపబడి, ఆ వివరణకు ఉపయోగించిన శబ్దజాలానికి అర్థమూ వివరింపబడునో దానిని భాష్యమని భాష్యవిదులు పేర్కొంటారు.

అనగా భాష్యం - మంత్రములకు చెప్పబడుతుంది.

మంత్రములో గల ప్రతి శబ్దానికి వివరణ ఉంటుంది. దీనిని వృత్తి అంటారు.

వృత్తిని స్పష్టీకరించడమూ ఉంటుంది. దీనిని వార్తికము అంటారు. వార్తికం అంటే వృత్తిని విపులంగా చర్చించేది. (వృత్తిం వేదయతి ఇతి వార్తికం)

అంటే భాష్యం అన్నది ఒక సర్వతోముఖమైన, సమగ్రమైన ప్రక్రియ.

"మంత్రబ్రాహ్మణయోర్వేద నామధేయమ్" అని ఆపస్తంబుని సూత్రీకరణ. వేదములు అంటే మంత్రములు, ఆ మంత్రములతో కూడిన యజనక్రియలు.

వేదాంగములు ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమ్. భాష్యకారుడికి ఈ ఆరు వేదాంగములలో పావీణ్యంతో బాటు, మంత్రము యొక్క అర్థం అనుభవజ్ఞానం ఉండవలె. "సమ్యగనుభవసాధనం ప్రమాణమ్";" అనధిగతార్థగంతృప్రమాణమ్".

చిన్న వివరణ. ఉదాహరణకు "ఆకలి" అన్న శబ్దం ఉందనుకోండి. ఆ శబ్దానికి అర్థం ఆ వచనం లో లేదు. ఆకలి శబ్దానికి కేవలం "ఒక సంవేదన" అన్న శుష్కార్థంలో ఇముడదు.ఆకలి కి నిజమైన అర్థం తెలియాలంటే శబ్దజ్ఞానంతో బాటు, ఆ ఆకలి యొక్క అనుభవజ్ఞానం, అన్నం విలువ, దాని పవిత్రత, ఆహారం పెట్టినవాని దయ, ఆ అన్నాన్ని పండించిన వాడి కృషి, వీటి సమగ్రస్వరూపం తెలియాలి.

భౌతికజీవితంలోని అర్థాలకే సమగ్రత్వం ఈ విధంగా ఉన్నప్పుడు - మంత్రస్వరూపంగా వేలాది ఏళ్ళు సాంప్రదాయంలో, సంస్కృతిలో, ప్రతి క్రతువులో, కర్మలో, వ్రతంలో, అనుష్ఠానంలో మమేకమైన వేద మంత్రాలకు భాష్యార్థం ఎంతో శ్రమపడితే తక్క మహనీయులకు కూడా తెలియదు.

వేదాలకు భాష్యం రచించడానికి సాయణాచార్యుడు (మాధ విద్యారణ్యుల వారి తమ్ముడు) 24 ఏళ్ళు శ్రమపడవలసి వచ్చిందని చెప్పుకున్నాడు.

ఋగ్వేదంలో మంత్రాలకు నిరుక్తంలో భాష్యం ఉంది. నిరుక్తకారుడు యాస్కాచార్యుడు. (మనకు 9 నిరుక్తాలు ఉండేవట. ఇప్పుడు దొరికేది యాస్కాచార్యుని నిరుక్తం ఒకటే). సాయణాచార్యుడు చతుర్వేదాలకు భాష్యం రచించినాడు. ఆసక్తి పెంచుకొని ఎవరైనా చదవగలిగితే ఎంతో మంగళకరమైన, మనోజ్ఞమైన భావనలు అందు కనిపిస్తాయి.

వేదభాష్యానికి ఒక్క ఉదాహరణ. ఈ మంత్రాన్ని హిందువులయొక్క ప్రతిక్రతువులోనూ, వ్రతంలోనూ, పెళ్ళికి ముందు వధువు చేసే గౌరీపూజలోనూ పఠిస్తారు. వేల ఏళ్ళుగా భారతసంస్కృతిలో మమేకమైన అందమైన ఋగ్వేదమంత్రం ఇది.

గౌరీ (నిర్)మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |

అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||

ఈ ఋక్కుకు సాయణాచార్యుని భాష్యం ఇలా ఉంది.

వాగ్దేవి మొట్టమొదట పరమవ్యోమంలో పరబ్రహ్మలో అంతర్గతంగా వున్న గౌరిగా ఏకపది. అదే ప్రణవరూపం.

పిదప సలిల సదృశములైన వర్ణపదవాక్యములను ఆమె సృష్టించింది. వ్యాహృతి (మంత్ర) రూపంలో సావిత్రిగ ద్విపది.

తర్వాత వేదచతుష్టయ రూపంలో చతుష్పది అయినది.

అటుపై, వేదాంగములు, స్మృతి పురాణ ధర్మశాస్త్రములలో అష్టాపది;

మీమాంసా, న్యాయ సాంఖ్య, యోగ, పాంచరాత్ర, పశుపత, ఆయుర్వేద ధనుర్వేద, గాంధర్వ వేదవిద్యా రూపిణియై నవపది. తదనంతరము అనంతవాక్యరూపమున వాగ్దేవి ప్రపంచమంతా ప్రతిభాసిస్తున్నది.

అయితే యాస్కాచార్యుడు గౌరిని - మేఘాల మధ్య విద్యుత్తు అని పేర్కొన్నాడు. ఆయన భాష్యం ఈ క్రింది బొమ్మల్లో చదుకోవచ్చు.మంత్రార్థము (వృత్తి), భాష్యార్థము (వార్తికము) ఇక్కడ చూడవచ్చు.



సాంప్రదాయికంగా భరతవర్షంలో వేదాలకు భాష్యాలు ఉన్నాయని, అవి ఎంతో మనోహరమైన కృతులని చెప్పుకున్నాం.

ఆధునిక కాలంలో - వేదాలను పనిగట్టుకుని నాశనం చేసిన వారు ఆంగ్లేయులు. మనకు సంస్కృతం ఓ మోస్తరుగా కావ్యాలు చదువుకునేంత మోతాదున నేర్చుకోవడానికే జీవితకాలం పడుతుంది. వేదభాష్యాలకు సాయణాచార్యుడంతటి పండితుడికి 24 ఏళ్ళు పడితే ఆంగ్ల అనువాదకులకు యుక్తవయసుకే వేదాలు అర్థం చేసుకునేంత జ్ఞానం వచ్చిందట! అదీ ఒక్క ముక్క సాంప్రదాయం తెలియకుండానే! నిజానికి వీరికి సంస్కృతభాషలో రామ శబ్దం కూడా తెలియదు. అయితే వీరు పేద బ్రాహ్మలతో అర్థాలు చెప్పించుకుని, పెడర్థాలు తీసి "అనువాదాలు" రచించడానికి అనతికాలమే పట్టింది. వీరు చేసింది అనువాదం. అదీ కూడా అక్కడక్కడా పరమహీనమైన పద్ధతిలో ఉంది. ఈ అనువాదకుల్లో రాల్ఫ్ గ్రిఫిత్, మేక్స్ ముల్లర్ లు ముఖ్యులు.

పైన "గౌరీమిమాయ ..." కు అర్థం చూచాం. అసలా అర్థం తెలియకున్నా గౌరి అంటే భారతదేశంలో అమ్మవారు అనే భావన - అంతటా ఉంది. ఆ శ్లోకానికి రాల్ఫ్ గ్రిఫిత్ "అనువాదం" ఎలా ఉందో చూడండి.

"గొడ్డు ఒకటి మడుగులో ఒక అడుగు పెట్టింది. ఆపై రెండు కాళ్ళు, ఆపై నాలుగు; ఆపై మడుగునంతా కల్లోలం చేస్తూ ఎనిమిది, తొమ్మిది, పది అడుగులుగా మడుగులో కలియతిరిగింది."

గౌరి అంటే గొడ్డట!

దురదృష్టమేమంటే ఆ రాల్ఫ్ గ్రిఫిత్ వంటి వారి శుష్కానువాదాలే నేడు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటికే అవకాశవాద పండితుల తాన తందనా లు ఎక్కువ. వారికే అనుచరులు."బోద్ధారో మత్సరగ్రస్తాః...." మరి.

గోవు ఎదురొస్తే మంగళకరం అని అనుకొంటాం. తెల్లవాడికి గోవు ఎదురొస్తే - దాని మాంసం ఎంత రుచికరమో అని ఊహిస్తాడు. యద్భావం తద్భవతి.
 *తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -7* 
🛕

*తూర్పు గోదావరి జిల్లా* 

*మందపల్లి: మందేశ్వరుడు*

పూర్వము దధీచి మహర్షి వృత్రాసురుని సంహరించుటకు ఇంద్రునకు ఆయుధముగా తన వెన్నెముక నిచ్చెను. అదే వజ్రాయుధము. అశ్వతుడు, పిప్పలుడు అను దానవులు ఇంద్రునకు ఆయుధము నిచ్చినందుకు కోపగించి, దధీచిని హింసించిరి. ఆ ప్రాంతమున నున్న ప్రజలను, మునులను కూడ బాధించిరి. ప్రజలు అగస్త్యుని వద్దకు వెడలి తరుణోపాయమును వేడిరి, తన శిష్యుడైన శనిని ప్రార్థించమని వారికి బోధించెను. శని కరుణించి రాక్షసులను సంహరించెను. ఆ ప్రదేశమున ఈశ్వరలింగము ను ప్రతిష్ఠించెను. ఆ ఈశ్వరుడే మందేశ్వరుడు. ఈ మందేశ్వరుని అర్చించిన ప్రజలందరి పాపములు నశించి కాపాడబడునట్లు ఈశ్వరుని చే శని వరమును పొందెను.

దేశము నలుమూలల నుండి వేలాది ప్రజలు ఎన్నో వత్సరముల నుండి ఇచ్చటికి వచ్చి మందేశ్వరుని అర్చించున్నారు. తైలాభిషేకమన్న మందేశ్వరునకు ప్రీతి. మాఘ బహుళ ఏకాదశికి మందేశ్వరుని కళ్యాణము జరుగును. శనిత్రయోదశినాడు తైలాభిషేకపూజలు ఎన్నో జరుగును.

మందేశ్వరుని ఆలయ ఆవరణలో పార్వతీదేవి, బ్రహ్మేశ్వరస్వామి, నాగేశ్వరస్వామి, వేణుగోపాలు ని ఆలయములు కలవు. గౌతమీ తీరమున, రావుల పాలెమునకు 5 మైళ్ల దూరమున ఈ గ్రామము కలదు..
📖


*అంతర్వేది: లక్ష్మీనరసింహస్వామి*

ఇచ్చట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము ప్రధానమైనది. అంతర్వేది నరసింహక్షేత్రము.

నీల కంఠేశ్వరుడు క్షేత్రపాలకుడు. ఈ తీరమున బ్రహ్మ, రుద్రయాగము చేసి నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ కావించెను. విరించి చేత యజ్ఞశాలగ యీ ప్రదేశము ఉపయోగించబడినది కావున దీనికి 'అంతర్వేది' అను పేరు వచ్చినది.

ఇచటనే వశిష్ఠమహర్షి గోదావరిని సముద్రునితో కలిపి, సాగరసంగమమునకు సమీపమున ఒక ఆశ్రమము నిర్మించుకొని శ్రీహరిని గురించి తపస్సు చేసెను.

పూర్వము విరోచనుడను రాక్షసుడు వసిష్ఠుని నూర్గురు కొడుకులను సంహరించెను. అతనిని తుదముట్టించుటకు వసిష్ఠు శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చేసెను. శ్రీహరి తన సోదరి అళ్వారూఢాంబ సహాయముతో విలోచనుని సంహరించెను. ఆ సందర్భములో శ్రీహరి నారసింహావతారము ఎత్తైను. వసిష్ఠుని ప్రార్థనపై శ్రీహరి లక్ష్మీనృసింహరూపమున అంతర్వేదిలో డమర ముఖముగా సాక్షాత్కరించెను. రాక్షసుని -కళేబరము అంతర్వేది పై కెగిరి ముక్కలయ్యెను. అందువలన అంతర్వేది అనుపేరు ఆస్థలమునకు వచ్చెను.

శ్రీ రాముడు రావణ సంహారానంతరము ఈ స్థలమునకు వచ్చి శివపూజ చేసెను. మాఘ శుద్ధ దశమికి లక్ష్మినరసింహ కల్యాణము. నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి ముఖ్యఉత్సవములు. ఉత్సవము సమయములలో వచ్చు యాత్రికుల కు ఉచిత భోజన సౌకర్యము కలదు. లక్ష్మీ నరసింహుని ఆలయములో వేణుగోపాలస్వామి, సీతారామలక్ష్మణులు, రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయములు కలవు.

శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము అశ్వారూఢాంబిక ఆలయము అంతర్వేదిలోని ఇతర ఆలయములు.
📖

*సర్పవరం: భావనారాయణస్వామి*

"పరమగీర్వాణ యాగ వైభవము నెలవు నిఖిల కళ్యాణ గుణకేలి నిలయ మనఘ దివ్యములు నూట ఎనిమిది తిరుపతులకు పరపు పదమైన శ్రీ సర్పపురమునందు"

- భీమేశ్వరపురాణం: శ్రీనాధుడు

ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో సర్పవరమొకటి. ఇది కాకినాడకు 6 కిలోమీటర్ల దూరంలో వున్నది. గోదావరికి తూర్పున, తుల్యభాగకు ఉత్తరమున సముద్రతీరము గలదు.

నాగమాత కద్రువ తన కుమారులను జనమేజయుని సర్పయాగమున అగ్నికాహుతి యగుడని శపించినది. వారిలో సర్పరాజు అనంతడు ఈ ప్రదేశమునందు తపస్సు చేసి విష్ణువుని మెప్పించి ఆయనకు శయ్యగా మారెను. సర్పము తపస్సు చేసిన స్థలమగుటచే ఇది సర్పపురము- అదే సర్పవరమైనది.

నారదుని భావమాలిన్యమును తొలగించి అతని కోరికచే ఇచట భావనారాయణ స్వామి వేద విధానమున నారదునిచే ప్రతిష్ఠింపబడినాడు. భావమున తలచుకొన్న వారికి ముక్తి లభింప జేయు దేవుడగుటచే భారనారాయణుడైనాడు. నారద గుండము ముక్తికుండము నేటికినీ గలవు.

కూచిమంచి తిమ్మకవి సర్పవర మాహాత్మ్యమును గ్రంధముగా రచించెను. కలోత్తుంగ దేవుని తమిళ శాసనము, విష్ణువర్ధనుని శాసనము, కాటయ వేమారెడ్డి శాసనము దేవాలయమున గలవు. కాటయవేముని విగ్రహం ఆలయమునందు కలదు. పిఠాపురం మహారాజుల కాలమున దేవాలయము మహావైభవంతో విలసిల్లింది. నంబూద్రి బ్రాహ్మలు ఈ ప్రాంతమునుండే వలసి వెళ్లినట్లుగా చారిత్రికాధారములు గలవు.
📖

*ముక్తేశ్వరం : క్షణముక్తేశ్వరాలయం*

శ్లో|| ముక్తేశ్వరం తతస్తీర్థం శృణుష్వ సుసమాహితః యస్మిన్ తీర్థేనరా 
ముక్తిం క్షణా ద్యాంతి శివాజ్ఞయా!!

ముక్తేశ్వరము అమలాపురమునకు 12 కిలోమీటర్ల దూరంలో గౌతమీ నదీ తీరమున ఉంది.

రావణ సంహారానంతరము తనకు కలిగిన బ్రహ్మహత్యాపాపం నశించుటకు శ్రీరాముడు శివలింగములను ఎన్నిటినో పలుచోట్ల ప్రతిష్ఠించెను. ఎన్నో పుణ్య క్షేత్రములు దర్శించెను. ఒకనాడు ఈ ముక్తేశ్వర ప్రదేశముపై విమానంలో వెళ్ళుచుండగా హఠాత్తుగా విమానము ఆగిపోయింది. శ్రీరాముడు విమానం దిగి ఆ ప్రదేశమును పరిశీలించెను. ఆ అరణ్య ప్రదేశములో ఒక పుట్ట కనిపించింది. శ్రీరాముని పరివారము పుట్టను పరిశీలించారు. ఆ పుట్టలో ఒక ఆలయము ఒక జ్యోతిర్లింగము కలవు. ఆ సమీపమున జటాధారిణియైన 'శ్రమణి' యను స్త్రీ ధ్యాన నిమగ్నయై కనిపించెను. శ్రీరాముడు ఆ ఆలయమును, తపస్వినిని సందర్శించెను. ఆమె కనులుతెరచి తన శాప వృత్తాంతమును వివరించెను. శ్రీరామ దర్శనముచే శాపవిముక్తి జరిగినది.
శ్రీరాముడు జ్యోతిర్లింగమును స్తోత్రము చేసెను. పరమశివుడు ఆ లింగము నుండి ప్రత్యక్షమ య్యెను. శ్రీ రాముని కోరికపై సదాశివుడు లింగములో ఐక్యమయ్యెను. ఈశ్వర కృపచే శ్రమణి కూడా శివలింగములో ఐక్యమయ్యెను. ఆమెకి ఇచ్చట క్షణములో మోక్షము ప్రాప్తించింది. ఆ కారణమున ఈశ్వరుడు "క్షణముక్తేశ్వరుడు”. 
గా పిలవబచుండెను.
 
ఈ క్షేత్రమున కేశవస్వామి క్షేత్రపాలకుడు. విజయదశమి, కార్తికమాసము, ధనుర్మాసము లలో ముఖ్య ఉత్సవములు జరుగతాయి. మహాశివరాత్రికి కళ్యాణము జరుగతాయి.
📖

*మురమళ్ళ: శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి*

మురమళ్ళకు పూర్వనామం మునుపల్లె. ఎందరో మునులు ఇచ్చట ప్రశాంతముగా తపస్సు చేసికొనెడివారు. గౌతమీ తీరమున నిర్మలమైన ప్రదేశమిది. దక్షుని యాగధ్వంసము చేయుటకు అవతరించిన వీరభద్రుడు, ఆ యాగ విధ్వంసా నంతరము శివసంకల్పమున భద్రకాళీ సహితుడై మునిపల్లె వద్దకు వచ్చి వెలసెను. మురమళ్ళకు దగ్గరగానున్న కొమరిగిరి గ్రామ నివాసి వీరశరభ రాజు ప్రస్తుతమున్న ఆలయమును నిర్మించెను. రాజాదంతూరి జగన్నాధరాజు, శ్రీవారి నిత్య కళ్యాణం నిమిత్తము ఏబది ఎకరముల భూమిని దాన మిచ్చారు. ఇదిగాక వారి బంధువులు సుమారు 200 ఎకరములు వరకూ దానము చేసిరి.

ఆంధ్రదేశమున మరి ఏ స్వామికి నిత్యకళ్యాణము లేదు. ఈ వీరేశ్వరస్వామి వారికి నిత్య కళ్యాణము జరుగును.
📖

*పలివెల : కొప్పు లింగేశ్వరస్వామి*

వాడె మా యింటి వేల్పు పల్వల పురమున గొప్పులింగంబు ఫణిరాజు కుండలుండు-

అని కొప్పు లింగేశ్వరస్వామిని శ్రీనాధుడు భీమేశ్వర పురాణమున వర్ణించెను. కూచిమంచి సోమసుందరకవి కొప్పు లింగేశ్వర శతకము ప్రసిద్ధిమైనది. ఆ స్వామి నిలయమే పలివెల. ఇది గోదావరీ మండలమునందలి ప్రాచీన శైవక్షేత్రాల లో కొత్తపేటకు మూడు కిలొమీటర్ల దూరములో కౌశికీ తీరమునందు ఉన్నది. కోనసీమలోని అతి ప్రాచీన దేవాలయములలో నిది యొకటి. ఈ స్వామి అగస్త్వేశ్వరుడు. అగస్త్య ప్రతిష్ఠయగుటచే లింగముపై కొప్పు ఉండును. 
వేశ్యాలోలుడైన అర్చకునకు స్వామికి అలంకరించవలసిన పూలమాలలు తన ప్రియురాలికి సమర్పించుట అలవాటు. ఒకనాడు మహారాజు ఆ స్వామి దర్శనమునకు వచ్చెనని తెలిసికొని, వేశ్య ధరించిన మాలను రాజునకు ప్రసాదముగా సమర్పించెను. దానిలో ఒక శిరోజమును చూసిన రాజు ఈతని వేశ్యాలోలత్వ మును గూర్చి విని ప్రశ్నించెను.

ఈ శిరోజము స్వామిదే. ఆ స్వామి శిరస్సుపై కొప్పు కలదని చెప్పి తప్పించుకొనెను. నేడు అలంకారము పూర్తి అయినది రేపు ఉదయము వచ్చిన చూపించెదనని పల్కెను.

నాటి రాత్రి అర్చకుడు తనకు సంభవించిన క్లిష్ట పరిస్థితిని స్వామికి వివరించి వేడుకొనగా మరునాడు వచ్చిన రాజునకు కొప్పుతో అగుపించి భక్తుని రక్షించెనని కథ గలదు. ఆ పూజారికి రాజు ఇచ్చిన మాన్యములే "జాత్తుగ పాడు" మాన్యములు. ఇట్లు ఆగస్త్యేశ్వరుడు కొప్పు లింగేశ్వరుడుగా మారెను. మహాశివరాత్రికి రధోత్సవము మహా వైభవముగా జరుగును.

స్వామి ఎడమ ప్రక్క పాను వట్టము మీదనే అమ్మవారు ఉమాదేవి కలదు. మండపములో ఒక పెద్ద నంది కలదు. స్తంభ మండపములు, ఉయ్యాల మండపము, ధ్వజద్వార మండపము వివిధ శిల్పరీతులతో ప్రకాశించుచున్నవి. 12 వ శతాబ్దమునాటి నుండి రాజశాసనాలు ఈ ఆలయ స్తంభములపై గలవు.
🛕
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 చరిత్ర చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి ?
మంచి ప్రశ్న. ఓ ఉపోద్ఘాతం.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు ఓ మారు తమ గురువైన కట్టమంచి రామలింగారెడ్డి గారితో మాట్లాడుతున్నారు. ప్రస్తావవశాన రామాయణం ప్రసక్తి వచ్చిందట. బౌద్ధ దశరథజాతకం లో రాముడు, సీత అన్నాచెల్లెళ్ళు. అలాగే భార్యాభర్తలు కూడా.

దీనిని రాళ్ళపల్లి వారు గర్హిస్తే, రెడ్డి గారు అన్నారట - "ప్రాచీన గ్రీక్ రాజ్యంలో ఇలాంటి సందర్భం ఉంది. ఓ రాజు తన వారసులే, అంటే తన రక్తమే సిమ్హాసనం ఎక్కాలని చెప్పి సొంత చెల్లెల్ని పెళ్ళాడాడు".

ఆపై రాళ్ళపల్లి వారు వ్రాసుకొస్తారు.

"కేవలం వాస్తవాలు చదవడమే చరిత్ర ఆని కొందరంటారు. కానీ - ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణను వట్టి వాస్తవాల తాలూకు సమాచారజ్ఞానం మాత్రమే చెప్పజాలదు. ఆ శక్తి వాస్తవాలకు లేదు."

******

చరిత్ర ను భారత వర్షంలో ఇతిహాసం అన్నారు. ఇతిహాసం అంటే -

ధర్మార్థ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితమ్ |

పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రచక్ష్యతే ||

ధర్మాధర్మ విచక్షణే ఇతిహాసం. ధర్మం వల్లే వ్యక్తులకు, కుటుంబాలకు దేశానికి కూడా అస్తిత్వం ఏర్పడుతుంది. భాగవతంలో బలిచక్రవర్తి - ఓ ధర్మాన్ని చెప్తాడు. ఇచ్చినమాట వెనక్కు తీసుకోకూడదని ఆ ధర్మం. ఆ ధర్మం గురించి చెప్తూ బలి మహారాజు శిబిప్రముఖుల గురించి చెప్తాడు.

కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా

రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై

పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై

ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!

ఎందరో పుడతారు, గిడతారు. కానీ కొందరు ఉన్నతులే నిలుస్తారు. నిలవాలి. వారి ఔన్నత్యాన్ని భావితరాలు సంభావించాలి, అనుసరించాలి. వారి చరిత్ర ఉపాదేయం కావాలి.

*******

భారతదేశాన్ని పాలించి దారుణంగా దోచిన ఆంగ్లేయులకు, ఆపై వచ్చిన , న్యస్త స్వార్థ శక్తులకు ఈ విషయం బాగా తెలుసు. ఆ కారణానే చరిత్రని ఓ పద్ధతి ప్రకారం నాశనం చేశారు. వ్యక్తుల ఔన్నత్యం కన్నా, వ్యక్తుల ఆధార్ కార్డుల వంటి శుష్క వాస్తవాలతో నింపారు. ఈ కుట్ర ఎన్నో వందల ఏళ్ళుగా సాగుతోంది.

పాశ్చాత్యులకు చరిత్ర అంటే "విజయం". విజయం సాధించిన వారి వివరాలు. అందుకనే చెల్లెళ్ళను పెళ్ళి చేసుకున్న రాజు చారిత్రక పురుషుడయ్యాడు.

మార్క్సిస్టులకు - గత చరిత్ర మొత్తం చెత్త. "ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?" కాబట్టి - గడచిన చరిత్రని తగలెట్టండి.

ఈ రెండు ఆలోచనలే గత 300 ఏళ్ళుగా భారతదేశంలో చరిత్రని శాసిస్తున్నాయి. అనుబంధశక్తులు మరిన్ని.

ఈ విధమైన సోషియల్ సైన్స్ ను చదవడం వల్ల ప్రజల్లో మానసిక బానిసత్వం తప్ప మరే ఉపయోగమూ ఉండదు. మన ప్రస్థానం ఎక్కడికో తెలియాలంటే అస్తిత్వ మూలాలు తెలియాలి. చెట్టు ఎదగాలంటే మూలాలు స్థిరంగా ఉండి తీరాలి.

కొందరంటారు - "మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి" అని ఏదో ప్రాచీన ఔన్నత్యాన్ని చదువుకుంటే ఏం ప్రయోజనం? శాస్త్ర విజ్ఞానం పెరగాలి. అందువల్లే దేశం బాగుపడుతుంది ఆని వాదన.

చాలా తెలివైన, మోసపూరితమైన, డొల్ల వాదన ఇది. శాస్త్ర పరిశోధనలు పెరగవలసిందే. చరిత్ర, శాస్త్రపరిశోధనా ఒకదానికి ఒకటి అనుబంధమైన విషయాలు. శాస్త్ర పరిశోధనలో ఎంతో ముందంజ వేసిన జపనీసు వారు తమ సమురాయ్ జాతి ఔన్నత్యాన్ని, పౌరుషాలను పట్టించుకోక ఉండలేదు. నిజానికి వారికి కావలసిన మానసికశక్తిని వారు తమ సమురాయ్ వీరుల మొక్కవోని ధైర్యసాహసాలు, ఓటమికన్నా చావు ముఖ్యంగా భావించే తెగువ - వీటి ద్వారానే సంపాదించుకొంటారు.

భారతదేశంలో మాత్రం - ఇలా ఉండదు. చరిత్ర పాఠాల్లో ఎక్కడా దేశ ఔన్నత్యం, త్యాగం, తెగువ, వీరత్వం, కళా స్ఫూర్తి, నిష్కామత్వం - ఇవేవీ ఉండవు. పిచ్చి రాజుల పేర్లు, కాలాలు, యుద్ధాలు, పూర్తిగా అబద్ధపు సిద్ధాంతాలు - ఇవే ఉన్నాయి.

*****

ప్రశ్నకు వస్తే - ఇప్పుడు భారతదేశంలో పిల్లలు తమ పాఠ్యపుస్తకాలలో చదువుకుంటున్న చరిత్ర సబ్జెక్ట్ వల్ల ఏ ఉపయోగమూ లేదు. ఈ చరిత్ర పూర్తిగా తిరిగి వ్రాయాలి. కొత్త చరిత్ర - భారతదేశపు అస్తిత్వాన్ని చెప్పాలి. ఎవిడెన్సులు స్పష్టంగా చూపుతూ, సిద్ధాంతాలు గల అన్ని పార్శ్వాలను స్పష్టంగా ప్రస్తావించాలి. సమాధానం తెలియని ప్రశ్నలను ప్రశ్నలుగానే ఉంచాలి.

అటువంటి చరిత్ర కనుక ఒకటి ఏర్పడితే, ఆ చరిత్ర జాతికి ఇచ్చే మానసిక శక్తి - ప్రజలను అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రోత్సాహం ఇస్తుంది.

అటువంటి నెరేషన్ - భారతదేశానికి ఎప్పుడొస్తుందో ?
 *తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -8* 
🛕

*తూర్పు గోదావరి జిల్లా* 

*కోటిపల్లి: సోమేశ్వరాలయం*

కోటిపల్లికి, కోటిఫల్లి నామాంతరము. ఇక్కడి సోమేశ్వరాలయము దక్షారామములోని భీమేశ్వరునకు దక్షిణముగానున్న ప్రసిద్ధ ఆలయము దక్షారామమునకు 12 కి.మీ దూరములో కలదు. 

ఇంద్రుడు అహల్య సంగమ దోషాన్ని పరిహారము చేసికొనుటకు ఒక లింగమును ప్రతిష్ఠించి కోటి తీర్థ జలములతో అభిషిక్తము చేసెను. కావున ఈయన కోటీశ్వరుడు. ఈ లింగము పాతాళము నుండి యున్నదని ప్రతీతి. ఇది యోగలింగము. ఉత్సవములు జరుగవు. ఈ క్షేత్రమున చేసిన దానములు కోటి గుణముల ఫలమునిచ్చును.

తారాచంద్రుల ప్రణయకేళీవిలాసము వలన బుద్ధుడు జన్మించాడు. బృహస్పతి శాపంతో చంద్రుడు కళావిహీనత్వాన్ని పొందాడు. బృహస్పతిని ప్రార్థించగా కోటి తీర్థంలో నిత్యం స్నానం కావిస్తే ఆ ప్రభావంగా క్షీణసాపుడవగుదు వని శాపవిముక్తిని తెలిపాడు. చంద్రుడు శాప విముక్తికి నిత్యస్నానాన్ని ఆచరించి కోటీశ్వరునికి దక్షిణ దిశగా సోమశేఖరుని ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఛాయలను సిద్ధింపచేసిన ఈశ్వరుడగుటచే ఈయన ఛాయాసోమేశ్వరు డైనాడు.

ఈ ఆలయములో నంది చాల ఆకర్షణీయముగా నుండును. సోమేశ్వరాలయములోని శ్రీదేవి - భూదేవి సహిత జనార్ధన స్వామిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించినట్లు కలదు.

కోటిపల్లి పెద్దాపుర సంస్థానములోనిది. పూసపాటి విజయరామరాజు గారి కాలంలో విజయనగరం సంస్థానంలో చేరింది. పుష్కర సమయమున ఇక్కడ గోదావరీ సముద్ర సంగమ స్నానము సర్వపాపహరము.
📖

*ద్రాక్షారామం: భీమేశ్వరాలయం*

ప్రతాపరుద్రయశోభూషణమనే అలంకార గ్రంథం వ్రాసిన విద్యానాధుడు “శ్రీశైల కాశీశ్వర ద్రాక్షారామ నివాసినః ప్రతిదినం త్వచ్ఛేయసే జాగ్రత!" అని అన్నాడు. మనదేశానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి హేతువైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి.

ఉత్తర భారతదేశంలో వారణాసి ఎట్టిదో, దక్షిణా పధంలో ద్రాక్షారామం అట్టిది. అందుకే “దక్షిణకాశి" అనే వ్యవహార రూఢి ఏర్పడింది. 'దక్షుని నవనాగారము దక్షారామంబు” అని శ్రీనాధుడు అనడం "దక్షారామం”, అని మాత్రమే శాసనాలలో ఉండడం చూస్తే బహుశః రేఫయుక్తంగా “ద్రాక్షారామం'' అనేక్వచిద్వ్య వహారినికి హేతువు. ఒకప్పుడు ఆ గ్రామంలో ద్రాక్ష తోటలు విరివిగా ఉండేవి అని భావించవచ్చు. ఇప్పటికి తమల పాకులకు ద్రాక్షారామం పేరుపడ్డది. తములపు తీగలు, ద్రాక్షలతలు ఒకే చోట పెరగటం సామాన్యం, 'దక్షారామం' సంస్కృత పదం. కొన్ని శాసనాలలో పర్యాయంగా 'డాకరేమి' పెద డాకరే అని తెలుగు వ్యవహారం ఉన్నది.

ఆంధ్ర దేశములో పంచారామములుగా సుప్రతీ తములైన పుణ్యక్షేత్రాలలో ఇదీ ఒకటి. మిగిలిన నాలుగు కుమారారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం అనేవి. ఈ అయిదింటిలో అమరారామం కృష్ణా తీరస్థము. తక్కిసన నాల్గు గోదావరీ తీరస్థములు. కుమారా రామం సామర్లకోట భీమవరం. దీనికి స్కందా రామమని కూడా వ్యవహారము. క్షీరారామం పశ్చిమ గోదావరి మండలములోని పాలకొల్లు. ఇక్కడ రామలింగేశ్వరుడు. సోమారామం గుణుపూడి భీమవరం, గుణుపూడిలో సోమేశ్వరుడు. అమరారామం అమరావతి. ఇక్కడ అమరేశ్వరుడు.

దక్షారామ భీమేశ్వరుని పేరుతో "భీమమండలం" ఏర్పాటయినది. శ్రీనాధుని భీమేశ్వర పురాణము భీమఖండ వైశిష్ట్యమునకు, భీమనాధుని మహిమకు వైభవానికి దర్పణం పట్టిన గ్రంథం. స్కంద పురాణంలోని గోదావరీ ఖండం దానికి మూలం. భీమ మండల సీమా విభాగం తెలిసికో దగినది. దక్షారామానికి అన్ని దిక్కులందు మూడేసి యోజనాల మేరలో ఉన్న భూమిని భీమ మండలం అంటారు.

"అంబుధి మేర తూర్పునకు, సబ్దియ సీమటుయాయ్యదిగ్విభా గంబునకుం; 
బ్రతీచికిని గౌతమి సీమ యుదీచికం, 
బ్రమాణంబుత్రి యోజనంబు; సురనాధుడు 
దక్షిణ కాశి భీమలిం గంబునకీకభోగముగ గట్టడజేసె వసుంధరాస్థలిన్

శ్రీనాధుని ఈ పద్యం భీమమండలపు సరిహద్దులు స్పష్టంగా చెప్పింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
తూర్పున సముద్రపు సరిహద్దు; అనగా గౌతమి సాగర సంగమం చేసిన ప్రదేశం. భైరవపాలెం. ఇక్కడ భైరవేశ్వరుడు. వశిష్ఠాసాగర సంగమ స్థలియైన అంతర్వేది దక్షిణాబ్ది సీమ. నీలకంఠేశ్వరుడు నృసింహస్వామి అంతర్వేది తీర్థాతి దైవతాలు. భీమమండలపు పశ్చిమ సీమ అఖండగౌతమి. రాజమహేంద్రవరమున గల మార్కండేయేశ్వరుడు అక్కడి దైవతం. ఇక ఉత్తరాన సరిహద్దు మూడు యోజనాల దూరము పిఠాపురం పాదగయాక్షేత్రం. కుక్కుటేశ్వరుడు, కుంతి మాధవస్వామి ఇక్కడి దైవతములు. కుమారారామ భీమేశ్వర క్షేత్రం కూడ ఈ నడుమనే ఉన్నది.

దక్షారామ భీమనాధుడు ఇంతటి విశాలమైన మండలమునకు అధిపత్యం వహించిన దేవతా సార్వభౌముడు. ఈ మండలంలో ఉన్న అనేక దేవతలు భీమేశ్వరునకు సామంతులు. ఉప కంఠ బాంధవులు. ఆంధ్రభూమి మధ్యస్థలమైన భీమ మండలాన్ని ఒక “పుండరీకం” భావన చేసిన శ్రీనాధుని పద్యం చూడండి.

ఆంధ్ర భూభువసమధ్యము పుండరీకము సప్త గోదావర జలము తేనె బ్రహ్మ సంవేద్యాది బహుతీర్థములు రేకు లకరులు చారు దివ్య స్థలములు నాళంబులవణాబ్ధి వేలా విభాగంబు కళ్యాణ భోగ మోక్షములు తాలి దక్షవాటి మహాస్థానంబు కర్ణిక హంసంబు భీమ నాయకుడు శివుడు

గౌతమీ సింధు కౌంతేయ కణ్వనదులు తుల్యభాగయు నేతీరుద్రుమ్మికొనలు భువన సంభావ్యమైన యీ పుణ్యభూమి 
యనఘ! సంసార తాపశాం త్యౌషధంబు.

భీమనాధుని కంటె పెద్ద వేల్పు, దక్షవాటి కంటె ఉత్తమ ధామం, సప్త గోదావరం కంటె తీర్థ రాజం జగత్తులో లేదని స్కంద పురాణోక్తి. తెలుగులో శ్రీనాధుని భీమేశ్వర పురాణం భీమ ఖండానికి భౌగోళికమైన రేఖాచిత్రం రసభావ సమ్మిళితం చేసి చూపించింది.
📖

దక్షారామం ఒకప్పుడు బౌద్ధారామమని, విష్ణు కుండినుల కాలంలో శైవ క్షేత్రంగా వెలసినదని, చాళుక్యుల పలుకుబడిలో బహువిధ ప్రశస్తి పొందిందని అంటారు. చాళుక్య భీమేశ్వరుని పేరే భీమేశ్వరుడని చెపుతారు.

పౌరాణికమైన గాధ యిలా ఉంది. పూర్వం తారకాసురుని కంఠంలోని అమృత లింగాన్ని కుమారస్వామి పంచ ఖండాలుగా భేదించాడు. వానిలో రెండవ ఖండం దీక్ష వాటికలో వచ్చిపడి స్వయం ప్రతిష్ఠితమైనది. భరద్వాజాదులు సప్తర్షులు భీమలింగ ప్రతిష్ఠ చేయాలని సుముహూర్తం పెట్టుకొని తెల్లవారేలోగా గోదావరిని దక్షారామానికి తీసుకువెళ్ళాలని సంకల్పించారు. 

స్నానధ్యానాదులు నిర్వర్తించుకొని శుచులై మంత్ర పుష్పార్చనపురస్సరంగా గోదావరిని ఆహ్వానించారు. ఇంద్రుని సహాయంతో ఈ ఆహ్వానం ధవళేశ్వరం వద్ద జరిగింది. సప్తర్షులు గోదావరిని తీసుకువెడుతున్నారు. గంగమ్మ పొంగి పొరలుతూ దారిలో తనకు అడ్డు వచ్చిన ఒక ఆశ్రమాన్ని ముంచివేసింది. అది తుల్యుడనే ఒక అసుర ఋషియాగం చేస్తున్న స్థానం.

యాగభంగం జరపడంతో కుపితులై రాక్షస మునులు తమ మంత్రశక్తిచే ప్రవాహాన్ని ఆపి వేశారు. సప్త ఋషులకు, వాళ్ళకి వాదాలు పెరిగాయి. గోదావరి "శుష్కతోయ" అవుతుందని దానవులు శపించారు. శాపప్రతిశాపాలు అయిన తర్వాత చివరికి పరమార్థవేత్త అయిన తుల్య భాగుని పక్షపాత రహితమైన మధ్యవర్తిత్వము తో వ్యాసానుగ్రహంతో అంతర్వాహినియై సప్తసింధువు భీమేశ్వర క్షేత్రానికి చేరుకొంది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సప్తర్షులు దక్షారామం సుముహూర్తానికి చేరుకోలేదు. దారిలో వచ్చిన అంతరాయం కారణంగా ఆలసించి వచ్చారు. ఈలోగా శుభవేళ తప్పకుండా అమృత లింగమైన భీమనాయకుడు దక్షవాటికలో ఆత్మ సంస్థాపితుడై ఉండడం చూసి వారు అబ్బురపడ్డారు. తాము నిశ్చయించిన ప్రధాన ముహూర్తానికే భీమనాధుడు సంప్రతిష్ఠి తుడైనందుకు సంతోషం కలిగినా తాము తలపెట్టిన సంస్కారాన్ని అన్యధాకరించినందుకు సప్తర్షులు రోషావిష్ణులయ్యారు. 

అది సూర్యభగవానుడు కనిపెట్టి వారికి అభివాదం చేసి "మునీంద్రులారా! మీకు కాల విలంబనం జరిగింది. మేలు కలిగించే శోభన కాలం సరిగడవ రాదని భీమేశ్వరుడు తనకు తానే ప్రతిష్ఠితుడయ్యాడు. కారుణ్యసమున్నీ వితయతి దక్షారామ విభునకు ప్రథమారాధనం చేసే భాగథేయం నాకు కలిగింది. ఇంతే కాని మీ ప్రతిష్ఠా భంగానికి అడ్డురావడం కాదు. నా తరువాత భీమనాధుణ్ణి హరి, పరమేష్ఠి ఇద్దరూ అర్చించారు. వారి వెంబడి దేవతలు, గంధర్వులు సేవించారు. కాలయాపన చేయకుండా మీరు కూడా మీ ఆరాధనలు జరుపుకోండి."

ఇలా అనగానే, సప్తర్షులు శివసంప్రతిష్ఠాపన యోగం తమకు సిద్ధించనందుకు సంతాపపడ్డారు. అపుడు ఆకాశవాణి అన్నది "మీరు చేసిన భక్తి అల్పంకాదు. గౌతమీ మహాతరంగిణిని భీమేశ్వరుని మూర్థాభిషేకార్థమై ఇక్కడకు తెచ్చారు. అంతకంటే ఏమి కావాలి. మీరు ఏడుగురు, ప్రతిష్టారంభాభిషేకం చేసిన సూర్యుని తో మీరె నమండుగురు. దక్షారామ భీమేశ్వరుని సన్నిధిని పాశుపతులను నెలకొల్పండి. మీరు అష్టమూర్తులుగా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు"

ఈ అశరీరవాణి పలుకులు సప్తర్షులు, సూర్యుడు విన్నారు. సప్త గోదావరీ తీర్థ జలంతో భీమేశ్వరు నకు మహాన్యసాభిషేకపురస్సరంగా అర్చనలు చేశారు. సప్తర్షులచే సమాన్వితమైన నదికి సప్త గోదావరి అని పేరు. సప్త గోదావరి భీమేశ్వరుని ఆలయ ప్రాకారాన్ని ఆనుకొని ఉంటుంది.

నేటికి అష్టమూర్తులగోత్రాల వారే ఇచ్చట అర్చకులుగా ఉంటారు. ఆలయంలో నవగ్రహాలు, అష్ట దిక్పాలకులు వెలసినారు. భీమ లింగ ప్రతిష్ఠానంతరం సూర్యుడు పార్వతీపరమేశ్వరుల నాహ్వానించాడుట. మార్గశిర శుద్ధ చతుర్దశినాడు రోహిణి నక్షత్రంలో ఆది దేవుడు గౌరీ సహితుడై  భీమ లింగంలో లీనమైనట్లు చెబుతారు. ఈ క్షేత్రంలో మాఘ శుద్ధ ఏకాదశికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ పూర్ణిమనాడు రధోత్సవము.

దక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబికా సహితుడైన భీమేశ్వరుణ్ణి కొలుస్తారు. భారతదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో మాణిక్యాంబ శక్తి పీఠం ఒకటి. ఈమె భీమేశ్వరునకు ఉత్తర దిక్కున ఉన్న తిరుచుట్టు మాలెలో వెలసి ఉంది. 

భీమలింగ సన్నిధిని ఈనాడు పార్వతీదేవి విగ్రహంకి కొంచెమివతల సతీ విగ్రహం ఉన్నవి. కళ్యాణోత్సవం మాత్రం మాణిక్యాంబికాసమేతు డైన భీమేశ్వరునికే జరుగుతూ ఉంటుంది.
🛕
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 *నీతికథలు-55* 

*నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు...*

*నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు...*

*బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు...*

*నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు....*

*నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ   నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది...*
                                                            *నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది...*

*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది...*

*పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు...*

*నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు...*

*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ఏదో వ్యాధి అని చెప్పటం మొదలైనవి అన్నీ జీవితంలో భాగమైపోతాయి...*

*నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా,   చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో   నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు...*
 
*ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు...ఇలా ఎందుకు జరుగుతుంది... అంటే ఇక నీ అవసరం తీరింది కాబట్టి....నీ అవసరం ఇక వుండదు కాబట్టి..*

*ఇక్కడ తరిగింది కృతజ్ఞత , ప్రేమ , అభిమానం... పెరిగింది కృతఘ్నత , నిర్లజ్జ , అమానుషం ...*

*మీ వీధిలో, మీ కాలనీలో, మీ గ్రామంలో వున్న మీకు తెలిసిన పెద్దవారిదగ్గరకు తరచుగా వెళ్తూండండి. వారి మాటలు విసుగులేకుండా వినండి. వారికి మీ ప్రేమను పంచండి. వీలైతే చిన్నచిన్న సహాయాలు చేయండి.*

*వృద్ధోపసేవ అని భారతంలో బాగా శ్లాఘించబడిన ధర్మం ఇది. వృద్ధోపసేవ వలన మనిషి బుద్ధిమంతుడవుతాడు.....*
ఒక మిత్రుని ద్వారా..

సర్వేజనాః సుఖినోభవంతు