Monday, June 15, 2026

 *అమ్మ పెట్టిన ముద్ద*

“ఒరేయ్ రాజూ… నీకు టిఫిన్ డబ్బా పెట్టాను. టైం దొరికినప్పుడు ఎక్కడైనా ఆగి తిను నాన్నా. పని ఉందని కడుపు మాట వినకుండా పోవద్దురా,” అని సీతమ్మ ప్రేమగా చెప్పింది.
“అలాగే అమ్మా… నువ్వు కంగారు పడకు. తింటాను,” అన్నాడు రాజు.
జొమాటో బ్యాగ్‌ను భుజాన వేసుకుని, మొబైల్‌లో యాప్ తెరిచి బైక్ స్టార్ట్ చేశాడు.
కొద్దిసేపటికే మొదటి ఆర్డర్ వచ్చింది. హోటల్ దగ్గరకు వెళ్లి ప్యాకెట్ తీసుకుని కస్టమర్ ఇంటి వద్ద అందించాడు. ఆ తర్వాత వరుసగా ఆర్డర్లు రావడం మొదలైంది.
ఉదయం నుంచి నగర వీధులన్నీ అతని బైక్ చక్రాల కింద తిరుగుతున్నాయి. ఒకవైపు ఆకలి కడుపును తొలుస్తుంటే, మరోవైపు ఎండ గొంతును ఎండబెడుతోంది.
అప్పుడే వెనుక ఉన్న టిఫిన్ డబ్బా వైపు అతని చూపు వెళ్లింది.
రోజూ ఎన్నో రకాల వంటల సువాసనలు అతని చుట్టూ తిరుగుతుంటాయి. వేడి వేడి ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, పూరీలు, బిర్యానీలు… వందల రూపాయల విలువైన వంటలు అతని చేతుల మీదుగా ఎన్నో ఇళ్ల గుమ్మాలు దగ్గరకు చేరుతాయి.
అతను కాసేపు నిట్టూర్చాడు.
“ఎంత విచిత్రం కదా ఈ జీవితం… ఎంతో మందికి ఆకలి తీర్చే భోజనం తీసుకెళ్తున్నాను. కానీ అందులో ఒక్క ముద్ద రుచి చూసే హక్కు నాకు లేదు,” అనుకున్నాడు మనసులో.
అలసిపోయి రోడ్డుపక్కన ఉన్న బస్ షెల్టర్ దగ్గర బైక్ ఆపాడు.
అమ్మ పెట్టిన టిఫిన్ డబ్బాను చేతిలోకి తీసుకున్నాడు. కడుపులో ఆకలి అలజడి మొదలైంది.
నెమ్మదిగా మూత తీశాడు.
అందులో చల్లారిన అన్నంలో కొద్దిగా పెరుగు కలిపి ఉంది. పక్కన చిన్న ఊరగాయ ముక్క.
ఒక్క క్షణం రాజు చేతులు కదలలేదు.
కొద్దిసేపటి క్రితం తన చేతుల మీదుగా వెళ్లిన బిర్యానీలు, పులావులు, స్వీట్లు, రుచికరమైన కూరలు అన్నీ అతని కళ్ల ముందు కదలాడాయి.
“నా వయసు వాళ్లు కాలేజీల్లో చదువుకుంటున్నారు. స్నేహితులతో నవ్వుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను మాత్రం వారి ఇంటి గుమ్మాల వరకు భోజనం చేరుస్తూ, ఈ అమ్మ చేతి పెరుగు అన్నంతో నా ఆకలి తీర్చుకోవాలి ,” అనిపించింది.
కళ్ల చివర తడి మెరిసింది.
కానీ వెంటనే సీతమ్మ ముఖం గుర్తుకొచ్చింది.
ఎండలోనూ, వానలోనూ ఇతరుల ఇళ్లలో పని చేస్తూ తనను పెంచిన తల్లి… రోజంతా అలసిపోయి వచ్చినా “నాన్నా, తిన్నావా ?” అని అడగడం మర్చిపోని తల్లి…
గుర్తుకొచ్చింది. అలాగే నాలుగు ముద్దలు తిని
కాసేపు బస్ షెల్టర్‌లో కూర్చుని కళ్లు మూసుకున్నాడు.
ఇంతలో ఆకాశంలో నల్లటి మేఘాలు చేరాయి. గాలి ఒక్కసారిగా చల్లబడింది. దూరంగా ఉరుముల శబ్దం వినిపించింది.
“వర్షం పడేలా ఉంది… కొద్దిసేపైనా ఆర్డర్లు ఆగిపోతే కాస్త విశ్రాంతి దొరుకుతుంది,” అనుకున్నాడు.
కానీ జీవితం మనం కోరుకున్నట్టే నడిస్తే దానికి పరీక్షల విలువ ఏముంటుంది ?
అనుకున్నట్టుగానే మొబైల్‌లో నోటిఫికేషన్ మోగింది.
“అబ్బో… ఇంత దూరమా ?” అని నవ్వుకుంటూ నిట్టూర్చాడు రాజు.
రెయిన్‌కోట్ వేసుకుని బైక్ స్టార్ట్ చేశాడు.
వర్షపు చినుకులు మొదలయ్యే సమయానికి హోటల్‌కు చేరుకుని ఆర్డర్ తీసుకున్నాడు.
అశోక్ నగర్‌లోని ఒక పాత ఇంటి ముందు బైక్ ఆపేసరికి వర్షం కుండపోతగా మారింది.
తడిసిన దుస్తులతో గుమ్మం దగ్గరకు వెళ్లి బెల్ కొట్టాడు.
కొద్దిసేపటికి డెబ్బై ఏళ్ల వృద్ధుడు తలుపు తీశాడు.
“మీ ఆర్డర్ సార్,” అంటూ రాజు ఫుడ్ ప్యాకెట్ అందించాడు.
వానలో తడిసిపోయిన రాజును చూసిన వృద్ధుడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు.
“బాబు… వర్షం తగ్గాక వెళ్దువుగానీ. లోపలికి రా,” అన్నాడు ఆప్యాయంగా.
ఆ మాటల్లో ఉన్న ప్రేమకు రాజు కాదనలేకపోయాడు.
ఇంట్లోకి అడుగుపెట్టాడు.
ఆ ఇల్లు పెద్దది. కానీ ఎక్కడో ఒంటరితనం నిండిన నిశ్శబ్దం కనిపించింది.
వృద్ధుడు వేడి టీ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు.
ఆ వేడి కప్పు తాకగానే రాజు కళ్లలో నీళ్లు మెదిలాయి.
“ఏమయ్యా బాబు… టీ బాగోలేదా ?” అని అడిగాడు.
“అది కాదు. రోజూ వందల ఇళ్ల గుమ్మాల ముందు నిలబడతాను. ప్యాకెట్ తీసుకుని తలుపులు మూసేస్తారు. కానీ ఈ రోజు మీరు ‘లోపలికి రా బాబు’ అని పిలిచి టీ ఇచ్చారు. ఎన్నాళ్లకో నేను కూడా ఒక మనిషిననే భావన కలిగింది,” అన్నాడు రాజు.
వృద్ధుడి కళ్లూ తడిశాయి.
“బాబు… ఏ పని చిన్నది కాదు. మన ఇంటికి వచ్చే ప్రతి ముద్ద వెనుక రైతు కష్టం ఉంటుంది, వంట చేసిన చేతుల శ్రమ ఉంటుంది, దాన్ని చేరవేసే నీలాంటి వారి చెమట ఉంటుంది. నీ పనిని ఎప్పుడూ చిన్నచూపు చూడకు,” అన్నాడు.
ఆ మాటలు రాజు మనసులో లోతుగా నాటుకున్నాయి.
“నీ ఇంట్లో ఎవరు ఉంటారు బాబు ?” అని అడిగాడు వృద్ధుడు.
“అమ్మ ఒక్కరే, నాన్న  చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ కష్టపడి నన్ను పెంచింది,” అన్నాడు.
వృద్ధుడు ఎదురుగా ఉన్న తన భార్య ఫోటో వైపు చూశాడు.
“ఆమె నా భార్య. ఐదేళ్ల క్రితం నన్ను వదిలి వెళ్లిపోయింది. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. డబ్బు పంపిస్తారు, ఫోన్ చేస్తారు. కానీ ‘తిన్నారా ?’ అని అడిగే స్వరం ఈ ఇంట్లో లేదు.
డబ్బుతో భోజనం కొనుక్కోవచ్చు బాబు… కానీ ప్రేమను కొనలేం. ఆప్యాయత దుకాణాల్లో దొరకదు,” అన్నాడు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నువ్వు తెచ్చే భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గుమ్మం దాటి బయటకు రాలేరు. . ఆకలి తీర్చేవాళ్ళు  ఇంటిలో ఉండక నీలాంటి వాళ్ళ మీద ఆధారపడతారు. బజారుకు వెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్లు కూడా సౌకర్యం ఉన్నప్పుడు వినియోగించుకుంటారు. ఇలా నీలాంటి వాళ్ళు ఒకరి అవసరాన్ని తీరుస్తున్నారు. మరొకరికి సౌకర్యం సమకూరుస్తున్నారు అన్నాడు ముసలాయన.

ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి.

బయట వర్షం క్రమంగా తగ్గిపోయింది.
రాజు లేచి, “వెళ్లి వస్తానండి,” అన్నాడు.
వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, “ఈ ఇంట్లో గడియారం ముళ్లు తిరుగుతుంటాయి గానీ, మనుషుల మాటలు మాత్రం చాలా రోజుల తర్వాత వినిపించాయి బాబు,” అన్నాడు.
ఆ మాట విన్న రాజు హృదయం మెల్లగా కదిలింది.
బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఆలోచించాడు —
“అన్నీ ఉన్న ఆ తాతయ్యకు ఆప్యాయంగా మాట్లాడే మనిషి లేడు. కానీ నాకు ఇంటికి వెళ్లగానే ‘తిన్నావా నాన్నా’ అని అడిగే అమ్మ ఉంది. నేను ఎంత అదృష్టవంతుడిని!”
కాసేపటి క్రితం తనకు ఇబ్బందిగా అనిపించిన ఆ వర్షమే ఇప్పుడు తన మనసులోని వేడిని చల్లార్చినట్లు అనిపించింది.
ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు.
సీతమ్మ మళ్లీ ప్రేమగా అన్నం పెట్టింది.
రాజు ఆ పెరుగన్నం ముద్దను నెమ్మదిగా నోట్లో వేసుకున్నాడు.
ఆ రోజు అతను తిన్న ఆ సాధారణమైన పెరుగన్నం అతని జీవితంలో ఎప్పుడూ తినని గొప్ప విందుగా అనిపించింది.
ఎందుకంటే ఆ ముద్దలో పెరుగు రుచి మాత్రమే లేదు…
అమ్మ ప్రేమ ఉంది.
అన్నీ ఉన్నా ఆ అపరిచిత వృద్ధుడికి లేని అదృష్టం ఉంది.
జీవితాన్ని అర్థం చేసుకునే ఒక కొత్త వెలుగు ఉంది. ఇంతకంటే ఏం కావాలి ?

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
 52b1;156f1;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀ఆ.స.493.
నేటి…

               *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️
```
*విశ్వాసం లేనివారికి అన్నీ సందేహాలే. ప్రపంచాన్ని నమ్మేంత సులువుగా పరమేశ్వరుని కూడా నమ్మడం లేదు.

*సమస్య అయితే భగవంతునితో చెప్తున్నాం కానీ వేయి సందేహాలతో ఆలోచిస్తునే ఉంటాం.

*ఇదా విశ్వాసం అంటే!! 

*భగవంతునికి కావాల్సినది పూర్తి విశ్వాసం. అది లేకపోవడం చేతనే సమస్యలు  పోవడం లేదు, కష్టాలు తీరడంలేదు.

*గుట్టల కొలదీ పేరుకుపోయిన సందేహాల వలనే ఆనందాన్ని, సంతృప్తిని  పొందలేకతున్నాం.

*దీనికి తోడు  నిందలు భగవంతునిపైకి విసురుతుంటాం.

*విశ్వాస పరంగా తప్పు మనది, నిందలు దేవునికా!!!.

*భగవంతునితో వాదించాలని చూడడం వెర్రితనం. మంచైనా చెడైనా అంతా ఆయనే చూసుకుంటాడన్న విశ్వాసంతో కార్యనిమగ్నులమై ఉన్నపుడు తప్పకుండా అంతా మంచే జరుగుతుంది.

*భగవంతుని సంకల్పాన్ని అడ్డుకునే శక్తి ఏ కాలంనందునూ లేదు. ఉండదు.ఉండబోదు..*✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
 *తెలుగు అర్థం:*

*ఈ రోజు సూక్తి 14-06-2026*

తీసుకునే ఆహారంలో శ్రద్ధ వహించడంతో పాటు, దైవ చింతన (భగవంతుని ధ్యానం) కూడా ఉండాలి. ప్రజలు భగవంతుని గురించి ఆలోచించకపోవడం వల్ల చాలా కష్టాలకు గురవుతున్నారు. దైవ చింతన లేకుండా, మానవునిలో రెండు చెడు లక్షణాలు ఉంటాయి. ఒకటి - తనలోని అనేక లోపాలను, దుర్గుణాలను దాచుకుంటాడు. రెండవది - ఇతరులలో చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి చూస్తాడు. మానవులలోని ఇలాంటి దుర్గుణాల వల్ల రోగాలు కూడా పెరుగుతున్నాయి. మానవ ప్రయత్నంతో పాటు భగవంతుని అనుగ్రహం ఉంటేనే మంచి ఫలితాలు లభిస్తాయి. సంస్కృత సూక్తి "ధర్మార్థ కామ మోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమం" అని చెబుతోంది (జీవితంలోని నాలుగు పురుషార్థాల సాధనకు మంచి ఆరోగ్యం అత్యంత అవసరం). ప్రపంచంలోని సంపదంతా ఉన్నా, ఆరోగ్యం చెడిపోతే మనిషి దుఃఖితుడే. పల్లెటూరివాడైనా, పట్టణవాసి అయినా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి పొందాల్సిన అతి ముఖ్యమైన సంపద మంచి ఆరోగ్యమే. 

*(దివ్య ప్రసంగం, జనవరి 29, 1994)*

మనిషి ఉత్తమమైన ఆలోచనలు, భావాలు, ఉదాత్తమైన భావనలను పెంపొందించుకుంటే అతని మనస్సు నిర్మలమైన పవిత్రతతో ప్రకాశిస్తుంది. మనస్సు యొక్క పవిత్రతను పెంపొందించుకోవడం ద్వారానే మన కర్మల పవిత్రతను నిర్ధారించుకోగలం. పవిత్రమైన కర్మలే పవిత్రమైన ఫలితాలను ఇస్తాయి.

*- శ్రీ సత్య సాయి బాబా*
 *ఎవరైనా ఎప్పుడైనా స్త్రీల మేధస్సును నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా?*

మనం తరచుగా మేధస్సును డిగ్రీలు, ఉద్యోగాలు లేదా హోదాలతో కొలుస్తాం. కానీ ప్రతి భారతీయ ఇంట్లో, ఉదయం నుండి రాత్రి వరకు సందడిగా ఉండే వంటగది — ప్రతిరోజూ అసాధారణమైన మేధస్సు పుట్టే ఒక సజీవ ప్రయోగశాల. అదీ ఒక్క డిగ్రీ కూడా లేకుండా.

_వంటగది అనేది కేవలం వండుకునే చోటు కాదు. అది ఒక సంపూర్ణ విశ్వవిద్యాలయం._

*గణితం:*  
ఎంతమందికి ఎంత పిండి కావాలి?  
ఉప్పు, కారం, మసాలాలు సరిగ్గా ఎంత వేయాలి?  
మిగిలిపోయిన వాటిని మరుసటి రోజు కొత్త వంటగా మార్చడం.  
ఇవన్నీ, కాగితం-కలం లేకుండానే. కేవలం అనుభవం, అంతర్ దృష్టితో.

*భౌతిక శాస్త్రం:*  
- గ్యాస్ మంటను సర్దుబాటు చేయడం.  
- నూనె వేడి సరిగ్గా ఉందో లేదో అంచనా వేయడం.  
- కుక్కర్ విజిల్‌కు సరైన టైమింగ్ తెలుసుకోవడం.  
ఇది ఉష్ణోగ్రత, పీడనం, శక్తికి సంబంధించిన ఖచ్చితమైన శాస్త్రం.

*రసాయన శాస్త్రం:*  
- మసాలాలను బ్యాలెన్స్ చేయడం.  
- పప్పు చిక్కదనం సరిగ్గా రావడం.  
- పాలు విరిగిపోకుండా చూసుకోవడం.  
- పిండిని మెత్తగా కలపడం.  
ప్రతి వంటకం ఒక రసాయన ప్రయోగం కంటే తక్కువ కాదు.

*మేనేజ్‌మెంట్:*  
ఒకేసారి 3–4 వంటలు చేయడం.  
అందరికీ సమయానికి వడ్డించడం.  
తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం.  
ఇది ఒక పెద్ద కంపెనీని నడపడం కంటే ఏమాత్రం తక్కువ కాదు.

*నిశిత పరిశీలన:*  
- పప్పు ఉడికిందా లేదా?  
- కూరలో నీళ్లు తక్కువా, ఎక్కువా?  
- రొట్టెను ఎప్పుడు తిప్పాలి?  
ఇది నిశిత పరిశీలనలో అత్యున్నత కళ.

*మల్టీ టాస్కింగ్:*  
టీ మరుగుతోంది.  
కుక్కర్ విజిల్ వేస్తోంది.  
పిల్లలకు టిఫిన్ కావాలి.  
ఫోన్ మోగుతోంది.  
అయినా కంగారు లేకుండా అన్నీ క్రమపద్ధతిలో జరుగుతాయి.

*అర్థశాస్త్రం:*  
- పరిమిత బడ్జెట్‌లోనే ఇల్లంతా కడుపునింపడం.  
- మిగిలిపోయిన వాటిని ఉత్తమంగా వాడుకోవడం.  
- కాలానుగుణ పదార్థాలను తెలివిగా వాడటం.  
ఇదే ఇంటి ఆర్థిక విధానం.

*మనస్తత్వ శాస్త్రం:*  
- ఒక్కొక్కరికి ఏది ఇష్టమో తెలుసుకోవడం.  
- ఈరోజు మూడ్ ఎలా ఉందో పసిగట్టడం.  
- ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఎవరికి తేలికైన ఆహారం కావాలి.  
వంటగదిని నడిపే స్త్రీ కేవలం వండిపెట్టదు…  
ఆమె కుటుంబం మొత్తం భావోద్వేగాలను పోషిస్తుంది.

_వంట అనేది కేవలం ఒక నైపుణ్యం కాదు. అది ప్రేమ, బాధ్యత, త్యాగం యొక్క అందమైన కలయిక. డిగ్రీ లేకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా, ఎలాంటి అధికారిక శిక్షణ లేకపోయినా._

వంటగదిని నడిపే స్త్రీ ఏ శిక్షణ పొందిన మేనేజర్‌కు తక్కువ కాదు. చాలాసార్లు, ఆమె ఇంకా సమర్థురాలు. రోజుకు మూడుసార్లు తాజాగా, వేడిగా, రుచిగా భోజనం దొరకడం అంటే అది కేవలం “తిండి” కాదు. అది ఇంట్లో లభించే దేవుడి ప్రసాదం.

_కాబట్టి తినే ముందు, ఒక్క క్షణం ఆగండి. ప్రతిరోజూ తన ప్రేమతో ఇంటిని గుడిగా మార్చే ఆ అమ్మకు, భార్యకు, అక్కకు, చెల్లికి, లేదా కూతురికి మనసారా కృతజ్ఞత చెప్పండి._

_ఎందుకంటే— వంటగదిలోని ఈ మేధస్సు, ఈ ఓర్పు, ఈ ప్రేమ శక్తిని పుస్తకం లేదా డిగ్రీతో సంపాదించలేం. అది అనుభవంతో, అంకితభావంతో, ఆప్యాయతతో మాత్రమే నేర్చుకునేది. అదే ప్రతి ఇంటిని స్వర్గంగా మారుస్తుంది.
 కూతుళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కథను చదవాల్సినచదవాల్సిందే. 

 వివాహం అనంతరం తొలిసారి పుట్టింటికి వచ్చిన కుమార్తెకు వారంరోజుల పాటు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు।
ఆ వారం రోజులూ అమ్మాయికి నచ్చినవే అన్నీ చేశారు। తిరిగి అత్తింటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఒక ఎంతో సువాసనగల అగరబత్తుల ప్యాకెట్‌ను ఆమెకు ఇస్తూ ఇలా అన్నాడు — “బిడ్డా, నువ్వు అత్తింట్లో పూజ చేసేటప్పుడు ఈ అగరబత్తిని తప్పకుండా వెలిగించు.”

అప్పుడు తల్లి చెప్పింది —
“మొదటిసారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న కూతురికి అగరబత్తులాంటి వస్తువు ఇస్తారా?”

అంతలోనే తండ్రి జేబులో చేయి వేసి, తన దగ్గర ఉన్న డబ్బంతా కూతురి చేతిలో పెట్టాడు।

అత్తింటికి చేరుకున్న తర్వాత, కోడలికి పుట్టింటి వారు ఏమిచ్చారో అని అత్తగారు చూసారు। అందులో ఆ అగరబత్తుల ప్యాకెట్ కూడా కనిపించింది। అప్పుడు ఆమె ముఖం చిట్లిస్తూ — “సరే, రేపు పూజలో ఇవి వెలిగించు” అని చెప్పింది।

మరుసటి ఉదయం అమ్మాయి పూజకు కూర్చొని అగరబత్తుల ప్యాకెట్ తెరిచింది। అందులో ఒక చిన్న లేఖ కనిపించింది।

ఆ లేఖలో ఇలా వుంది…
“బంగారం… ఈ అగరబత్తి తాను కాలిపోతూ కూడా మొత్తం ఇంటిని సువాసనతో నింపుతుంది। అంతేకాదు, చుట్టుపక్కల వాతావరణాన్నీ పరిమళభరితంగా, ఆనందంగా మారుస్తుంది…!!

ఎప్పుడైనా నీకు భర్తపై కోపం రావచ్చు, కొన్నిసార్లు అత్తమామలపై మనసు నొచ్చుకోవచ్చు। మరికొన్ని సందర్భాల్లో మరిది, మరదళ్లపై కూడా అలక రావచ్చు। కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు నిన్ను బాధించవచ్చు, లేదా పొరుగువారి ప్రవర్తనతో నీ మనసు కలత చెందవచ్చు। అలాంటి ప్రతి సమయంలో నా ఈ కానుకను గుర్తు పెట్టుకో…

ఈ అగరబత్తిలా నీవూ కాలిపోతూ, నీ బాధలను భరించుకుంటూ, అత్తింటినే నీ పుట్టింటిలా భావించి, నీ ప్రవర్తనతో, నీ మంచితనంతో ఆ ఇంటిని పరిమళభరితంగా, ఆనందభరితంగా మార్చు…”

ఆ లేఖ చదివిన కూతురు ఆపుకోలేక బిగ్గరగా ఏడవసాగింది। అత్తగారు పరుగెత్తుకుంటూ వచ్చారు। భర్త, మామగారు కూడా పూజగదిలోకి వచ్చారు।

“ఏమైంది? చేతికి ఏమైనా కాలిందా?” అని భర్త అడిగాడు।ఏమైందో చెప్పమ్మా?” అని మామగారు అన్నారు।అత్తగారు చుట్టూ ఏదైనా సమస్య ఉందేమో అని చూసారు।

అప్పుడు తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఆ లేఖ ఆమె కంటపడింది। లేఖ చదివిన వెంటనే అత్తగారు కోడలిని హత్తుకుని, ఆ లేఖను మామగారి చేతిలో పెట్టారు।

కళ్లజోడు లేకపోవడంతో మామగారు ఆ లేఖను తన కుమారుడితో చదివించారు।
మొత్తం విషయం అర్థమైన వెంటనే ఆ ఇంట్లో ఉన్న అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు।

అప్పుడు అత్తగారు అన్నారు — “ఈ లేఖకు వెంటనే ఫ్రేమ్ వేయించాలి। మా కోడలికి వచ్చిన అత్యంత విలువైన కానుక ఇదే। పూజగది పక్కనే దీనిని పెట్టాలి.”

ఆ తరువాత ఆ ఫ్రేమ్‌లోని ఆ మాటలు, వాటి అర్థం, ఆ ఇంటినే కాదు… చుట్టుపక్కల వాతావరణాన్నీ ఎప్పటికీ పరిమళభరితంగా ఉంచాయి… అగరబత్తుల ప్యాకెట్ అయిపోయిన తరువాత కూడా…

మీరు కూడా మీ కుమార్తెకు ఇలాంటి సంస్కారాలను ఇవ్వాలనుకుంటారా…?
అయితే ఇది నచ్చితే మీ ఆత్మీయులకు పంపండి… ఎవరి ఇల్లు అయినా పరిమళభరితంగా మారవచ్చు।
🙏 మీ కూతుళ్లు రెండు కుటుంబాలను పరిమళభరితం చేస్తారు..🙏

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
 *"ఇంటి పని కాదు, అది ఇంటి యోగం" – ఇది తరాల కథ* చదవండి

తెల్లవారుజామున 4 గంటలు. 65 ఏళ్ల మహిళ నిద్దుర లేచింది.
*మొదటి ఆసనం - మాలాసనం*: వంగి ముగ్గు వేస్తుంది. 21 చుక్కలు. ఒక్కో గీతకు వెన్నెముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి. డాక్టర్ చెప్పిన "Squat Exercise" బామ్మకు 60 ఏళ్లుగా తెలుసు. "ముగ్గు వేస్తే మోకాళ్ల నొప్పులు రావు" అనేది.

*రెండో ఆసనం - ఉత్కటాసనం*: బట్టలు ఉతకడం. రెండు కాళ్లూ కొంచెం వంచి, నడుము నిటారుగా పెట్టి, చేతులతో బట్టను రాయికి బాదడం. 20 నిమిషాలు. భుజాలు, చేతులు, నడుము అన్నీ ఒకేసారి వ్యాయామం. జిమ్‌లో "Chair Pose + Arm Workout" కి అవ్వ పెట్టిన పేరు - 'చీర ఉతకడం'.

*మూడో ఆసనం - త్రికోణాసనం*: తడి బట్టలు పిండి, దండెం మీద ఆరేయడం. కాలు ఒకవైపు, చేయి పైకి, నడుము వంచడం. శరీరం పక్కకి సాగుతుంది. లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి.

*నాలుగో ఆసనం - అధోముఖ శ్వానాసనం*: వంగి ఇల్లు కసువు ఊడవడం. రక్తప్రసరణ తలకు ఎక్కుతుంది. మెదడు చురుకవుతుంది.
*ఐదో ఆసనం - మార్జరాసనం*: కూర్చుని బూడిదతో గిన్నెలు తోమడం. మణికట్టు, వేళ్లు తిరుగుతాయి. ఆర్థరైటిస్ రాదు. బూడిదలో ఉన్న పొటాష్ సహజమైన క్రిమిసంహారిణి.

మనవడు రవి అడిగాడు: బామ్మ, నువ్వు పని మనిషిలా ఇన్ని పనులు ఎందుకు చేస్తావ్? ఒకరిని పెట్టుకోవచ్చుగా?"

బామ్మ నవ్వింది: "పనిమనిషా? రా, నేను కాదురా. ఇది నా *ఇంటి యోగం*. ఈ పనులు మానేసిన రోజు నా ఒళ్ళు పట్టుకుపోతుంది, మనసు పాడైపోతుంది."

లచ్చమ్మ కోడలు దీప. సాఫ్ట్‌వేర్. ఉదయం లేవగానే Washing Machine ఆన్, Dishwasher ఆన్, Robot Vacuum ఆన్.

8 గంటలు ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం. మెడ నొప్పి, నడుము నొప్పి, బీపీ, షుగర్. సాయంత్రం జిమ్‌కి 2000 రూపాయలు కట్టి వెళ్తుంది. ట్రైనర్ చెప్తాడు: "మేడం, 20 స్క్వాట్స్ చేయండి, 15 నిమిషాలు Arm Rotation చేయండి, Bend అయ్యి Sweep చేయండి."

దీపకు ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన: "అరే, ఇవన్నీ మా అత్తగారు డబ్బులు తీసుకోకుండా ఇంట్లోనే చేసేవారు కదా! మేము దాన్ని 'పని' అని హేళన చేశాం. వాళ్ళు దాన్ని 'ఆరోగ్యం' అని బతికారు."

ఆ రోజు నుంచి దీప మారింది. మెషిన్ ఉన్నా, ఆదివారం పిల్లలతో కలిసి ముగ్గు వేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. "అమ్మా, ఇది పని కాదు, ఫ్యామిలీ యోగా టైం" అని పిల్లలకు చెప్పింది.

### *3. అసలు తప్పు ఎక్కడ జరిగింది?*
మనం రెండు తప్పులు చేశాం:
తప్పు 1: పేరు మార్చేశాం.*

వంగి ముగ్గు వేస్తే 'మాలాసనం'. ఇంట్లో వేస్తే 'పనిమనిషి పని'.

బయట జిమ్‌లో చేస్తే 'Fitness'. ఇంట్లో చేస్తే 'Chores'.

పేరు మారగానే గౌరవం మారిపోయింది.

*తప్పు 2: ఉద్దేశం మర్చిపోయాం.*

అవ్వ ముగ్గు వేసింది 'ఇల్లు అందంగా ఉండాలి' అని కాదు.

*"నా కుటుంబం ఉదయం లేవగానే అందమైనది చూసి, మంచి మూడ్‌తో రోజు మొదలుపెట్టాలి"* అనే ప్రేమతో.

అన్నం వండింది 'ఆకలి తీర్చడానికి' కాదు.

*"నా చేత్తో తింటే నా బిడ్డకు నా ప్రేమ, నా శక్తి అందాలి"* అనే తపనతో.

ఇల్లు ఊడ్చింది 'దుమ్ము పోతుంది' అని కాదు.

*"నా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి రోగాలు రాకూడదు"* అనే బాధ్యతతో.

మనం 'పని'ని మాత్రమే చూశాం. దాని వెనకాల ఉన్న *'ప్రేమ'* ని చూడలేదు. అదే మన తప్పు.

### *4. యోగం అంటే ఏంటి?*

పతంజలి అష్టాంగ యోగంలో చెప్పాడు: "యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చేయడం."/

మన అవ్వలు అదే చేశారు:

ఇంటి పని యోగాసనం శరీరానికి లాభం మనసుకు లాభం

**ముగ్గు వేయడం** మాలాసనం, పద్మాసనం మోకాళ్లు, వెన్నెముక బలం ఏకాగ్రత, సృజనాత్మకత

**బట్టలు ఉతకడం** ఉత్కటాసనం, భుజంగాసనం చేతులు, భుజాలు, నడుము ఓర్పు, కష్టే ఫలి అనే తృప్తి

**కసువు ఊడవడం** అధోముఖ శ్వానాసనం రక్తప్రసరణ, జీర్ణశక్తి ఇల్లు శుభ్రం అయ్యిందనే ప్రశాంతత

**రుబ్బురోలు తిప్పడం** చక్రాసనం చేతులు, ఛాతి బలం సొంతంగా చేసుకున్నాం అనే ఆత్మవిశ్వాసం

**గిన్నెలు తోమడం** వజ్రాసనం అరిగే శక్తి, మణికట్టు కుటుంబం కోసం అనే సేవాభావం

వీళ్ళకి 'Yoga Mat' అవసరం లేదు. *నేలే యోగా మ్యాట్. ఇల్లే యోగా స్టూడియో. కుటుంబమే యోగా గురువు.*

### *చివరి మాట: నీ తప్పు కాదు, మనందరి తప్పు*

"ఇది పనిమనిషి పని" అని మనం అన్నప్పుడు, మనం ఒక తల్లి ప్రేమను అవమానించాం.

"Time Waste" అన్నప్పుడు, 5000 ఏళ్ల సైన్స్‌ను చెత్తబుట్టలో వేశాం.

*గుర్తుంచుకో:*

ఇంటి పని అనేది 'పని' కాదు. అది *'ప్రేమను పంచే పద్ధతి'*.

వంట చేయడం అంటే *'రుచిని కాదు, ఆయుష్షుని వడ్డించడం'*.

ఇల్లు శుభ్రం చేయడం అంటే *'చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం'*.

ఇకనుంచి ఎవరైనా "అమ్మా, నువ్వెందుకు ఇన్ని పనులు చేస్తావ్?" అని అడిగితే ఇలా చెప్పు:

*"నేను పనులు చేయడం లేదు నాన్నా. నేను నా ఇంటికి, నా ఒంటికి, నా వాళ్లకి యోగం చేస్తున్నాను. ఇది నా పూజ."*

ఎందుకంటే *భారతీయ సంస్కృతిలో 'పని' వేరు, 'సేవ' వేరు.*

పని చేస్తే అలసట వస్తుంది. సేవ చేస్తే ఆనందం వస్తుంది.

మన అవ్వలు 90 ఏళ్ళు బతికింది జిమ్‌కి వెళ్లి కాదు, *ఇంటినే గుడిగా, పనినే యోగంగా* మార్చుకుని.

మరి రేపటి నుంచి మీ ఇంట్లో 'పని' ఉంటుందా? లేక 'యోగం' మొదలవుతుందా? ఆలోచించండి.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
 *"ఎన్నో రోజులు, ఎంతో మంది వస్తారు, పోతారు... కానీ జన్మ-జన్మలుగా నాకు వెన్నంటే ఉండే.. "మన ప్రాణ💟ప్రియమైన🪷తండ్రి🔱శివ పరమాత్ముని✴️ ప్రేమ💟 మాత్రమే నా🧘‍♂️🍃ప్రాణాధారం✨🌱నా💁‍♀️శాశ్వత ఆధారం🌱.."*

​నీ ప్రేమ కౌగిలి.. నా ఏకైక వరము.. 
నీ హృదయంలో.. శాశ్వత స్థానాన్ని ఇవ్వు..

ప్రాణ ప్రియమైన తండ్రి శివ పరమాత్మ!
నీ ప్రేమలోనే.. నా శాశ్వత పరమానందం
అతింద్రీయ ఆనందాన్ని.. పొందాను.. 

*"​లౌకిక బంధాలన్నీ తాత్కాలికమే కానీ, ఆ పరమ🔱శివుని ప్రేమ💟 మాత్రమే నిత్య✴️ సత్యం✨.."*

*"నా ప్రాణము కంటే ప్రియమైన తండ్రి, ఓ శివ పరమాత్మా! నీ పవిత్రమైన ప్రేమలో శాశ్వతమైన పరమానందం దాగి ఉంది.. నీ ప్రేమ కౌగిలి మరియు నీ హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందడం కంటే.. నాకు వేరే ఏ వరము అక్కర్లేదు.. ఆ దివ్యమైన ప్రేమలోనే నేను ఈ లౌకిక ప్రపంచానికి అతీతమైన, వర్ణించలేని ఆనందాన్ని అనుభవిస్తున్నాను.."*

*"శివ🔱పరమాత్మని🕉పవిత్రమైన💟ప్రేమ.."*

  *"లౌకిక బంధాలన్నీ నీటి బుడగలే... నా శివయ్య పవిత్ర ప్రేమే నిత్య సత్యం, నా ఆత్మకు శాశ్వత ఆనందం."*

 *"ఓ పరమాత్మా! నీ ప్రేమ కౌగిలిలో బందీని అవ్వడమే... నా ఆత్మకు లభించే అసలైన స్వేచ్ఛ."*

 *"కళ్ళు మూసుకుంటే కనిపించేది నీ దివ్య రూపం... మనసు తెరిస్తే తెలిసేది నీ పవిత్ర ప్రేమ. నీలోనే ఉంది నా నిరంతర పరమానందం."*

 *"ఎన్నో రోజులు, ఎంతో మంది వస్తారు, పోతారు... కానీ జన్మ-జన్మలుగా నాకు వెన్నంటే ఉండే.. "మన ప్రాణ💟ప్రియమైన🪷తండ్రి🔱శివ పరమాత్ముని✴️ ప్రేమ💟 మాత్రమే నా🧘‍♂️🍃ప్రాణాధారం✨🌱నా💁‍♀️శాశ్వత ఆధారం🌱.."*

 *"నీ హృదయంలో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వు శివ🔱తండ్రీ... ఈ విశాల ప్రపంచంలో నాకు వేరే ఏ వరమూ, సింహాసనమూ అక్కర్లేదు."*

 *"ఈ సృష్టిలోని సమస్తం మారిపోవచ్చు... కానీ నా ప్రాణ ప్రియమైన శివ పరమాత్ముని ప్రేమ ఎన్నటికీ వాడిపోని ఓ దివ్య పారిజాత పుష్పం."*

 *"నీ శివ🔱నామ స్మరణలో నా అహంకారం కరిగిపోయింది... నీ ప్రేమలో💟 నా హృదయం పరిపూర్ణమైన ప్రశాంతతను చేరుకుంది."*

*"శివ పరమాత్ముని పవిత్ర ప్రేమ: శాశ్వత ఆనందం యొక్క లోతైన వివరణ"*

శివ పరమాత్ముని ప్రేమ ఒక పవిత్రమైన అనుభూతి, అది మన ఆత్మలను తాకి, జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఈ లోకంలోని బంధాలు అన్ని తాత్కాలికమైనవి, కానీ శివుని ప్రేమ శాశ్వతమైనది, నిత్య సత్యం. ఈ ప్రేమలో ఉన్న లోతును, అది ఇచ్చే ఆనందాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

**శివుని ప్రేమ యొక్క పవిత్రత:*

శివ పరమాత్ముని ప్రేమ ఏ విధమైన కోరికలు లేకుండా, నిష్కల్మషంగా ఉంటుంది. ఇది జీవులందరి పట్ల సమానంగా ఉంటుంది. శివుడు పేదవాడుకు, రాజుకు, భక్తునికి మరియు జ్ఞాని అయిన యోగికి ఒకే విధమైన ప్రేమును ఇస్తాడు. ఈ ప్రేమ మనలో ఉన్న అహంకారాన్ని, భయాన్ని, మరియు కోపాన్ని తొలగించి, పవిత్రతను నింపుతుంది.. 

**శివుని ప్రేమలో శాశ్వతత్వం:*

ఈ లోకంలోని బంధాలు కాలంతో పాటు మారిపోతాయి. మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, మరియు జీవిత భాగస్వామితో ఉన్న బంధాలు అన్ని తాత్కాలికమైనవి.. కానీ శివుని ప్రేమ శాశ్వతమైనది, కాలంతో పాటు పెరుగుతుందే కానీ తగ్గదు. శివుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, మన కష్టాలలో మరియు సుఖాలలో మనతోనే ఉంటాడు.. 

**శివుని ప్రేమలో ఆనందం:*

శివుని ప్రేమలో లభించే ఆనందం వర్ణించలేనిది, అది ఏ విధమైన భౌతిక వస్తువులతో పోల్చలేనిది. ఈ ఆనందం ఆత్మను పవిత్రం చేస్తుందని మరియు జీవితానికి అర్థాన్ని ఇస్తుందని చెప్పాలి. శివుని ప్రేమలో ఉన్నవాడు ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాడు. అతను లోకంలోని కష్టాలను మరియు సుఖాలను సమానంగా స్వీకరిస్తాడు.. 

**శివుని ప్రేమలో జీవించడం:*

శివుని ప్రేమలో జీవించడం అంటే శివుని స్మరించడం, శివుని పూజించడం, మరియు శివుని గుణాలను అనుసరించడం.. 

*"శివుని స్మరించడం ద్వారా మనం మన మనస్సును పవిత్రం చేసుకోవచ్చు. శివుని🔱ఓం🕉 మహా✴️ మంత్రం✨ జపించడం ద్వారా మనం శివుని పట్ల ఉన్న భక్తిని వ్యక్త పరచవచ్చు.."* 

శివుని గుణాలను అనుసరించడం ద్వారా మనం పవిత్రంగా, దయగలవారిగా, మరియు క్షమించేవారిగా మారవచ్చు.. 

**ముగింపు:*

*"శివ పరమాత్ముని ప్రేమ ఒక పవిత్రమైన అనుభూతి, అది మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఈ లోకంలోని బంధాలు అన్ని తాత్కాలికమైనవి, కానీ శివుని ప్రేమ శాశ్వతమైనది, నిత్య సత్యం.."* 

*"శివుని ప్రేమలో జీవించడం ద్వారా మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందవచ్చు.."*

ప్రతి వ్యక్తీ అంతర్గత సాధన చేయాలి. **సాధన (Practice): నిరంతరం పరమాత్ముని🔱 ప్రేమలో💟 ఉండి "నేను ఆత్మను" అనే స్పృహలో జీవించడమే అత్యున్నత సాధన.*

*"ఈ ప్రేమ💟 శక్తి✨ ఎంతటిదంటే✴️, అది మనలోని పాత సంస్కారాలను, దుఃఖాన్ని క్షణాల్లో భస్మం చేసి ఆనందంగా✨ మార్చగలదు. మన ప్రాణ ప్రియమైన తండ్రి🔱శివ✴️ పరమాత్మ తోడు ఉంటే, అసాధ్యమైనది ఏదీ లేదు.*

*"దుఃఖం అనేది ఒక చీకటి గది అయితే.. 'పరమాత్ముని🔱 ప్రేమ💟పూర్వక జ్ఞాపకం' అనే వెలుగు ఆ గదిని ఆనందమయంగా మారుస్తుంది."*

 *"దుఃఖాన్ని ఆనందంగా మార్చడం అంటే బయట పరిస్థితులను మార్చడం కాదు, లోపల ఉన్న మన మనోభావాలు.. మన మానసిక స్థితి 'వైబ్రేషన్స్' మార్చడమే.."*

**పరివర్తన:*

 *"ద్వేషాన్ని ప్రేమగా💟, అశాంతిని ప్రశాంతతగా🪷 మార్చే శక్తి✴️ ఒక్క ఆత్మ ప్రేమ💟 చైతన్యానికే✨ ఉంది. ఇది కళ్ళకు కనిపించదు, కానీ ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు లాంటిది. మనం నిస్వార్థ💟 ప్రేమతో, పరమాత్ముని🔱 తోడుతో, ప్రకృతి🌿 మాత🪷 పట్ల కృతజ్ఞతతో🍃 జీవిస్తే... ఈ భూమి🌏పైనే స్వర్గాన్ని🌈 అనుభూతి చెందవచ్చు.."* 

 *"ఈ సమాజంలో వస్తున్న ఈ గొప్ప మార్పులు, అద్భుతాలు బాహ్యమైనవి కావు; అవి అంతర్గత చైతన్య తరంగాలు. మనం కోరుకున్నది మనకు లభించదు, మనం ఏ స్థితిలో ఉన్నామో (State of Being) ఆ స్థితికి సంబంధించిన ఫలితాలనే విశ్వం మనకు అందిస్తుంది (ప్రతిబింబిస్తుంది).. మనము ప్రేమను💟 కోరుకుంటే✨ అది పొందటానికి మనమే మొదట ఇతరులను ప్రేమించాలి💟.. ప్రేమగా💟 జీవించాలి.. ప్రేమను💟పంచాలి"*

*"ఈ విశ్వ రహస్యాన్ని ఛేదించే ఏకైక తాళం 🔑చెవి—మనం నిరంతరం పరమాత్ముని🔱 ప్రేమలో💟 ఉండి "నేను ఆత్మను.. చైతన్యమైన✴️🕉️శివ🔱శక్తిని✨" భగవంతుని బిడ్డను అనే స్పృహలో జీవించడమే.."*

*"నీ సంకల్పాలు ఒక విత్తనం వంటివి. వాటిని ప్రేమ💟 మరియు కృతజ్ఞత🙏అనే నీటితో✨ తడిపితే, నీ జీవితం ఒక దివ్యమైన వనంగా మారుతుంది."*

*"గుర్తుంచుకోండి: మీరు కేవలం ఈ విశ్వంలో భాగం కాదు, మీలోనే ఒక అనంతమైన విశ్వం దాగి ఉంది. మీరు ప్రసారం చేసే ప్రతి ప్రేమ💟పూర్వక ఆలోచన✨, ఈ ప్రపంచాన్ని🌏 మరింత ఆనందంగా మారుస్తుంది.*

*ప్రేమ (Love):*

 *"ఏదైనా మార్చగల అత్యంత శక్తివంతమైన✨ బలం✴️ ప్రేమకు💟 మాత్రమే ఉంది.*

*మన ప్రాణ✨ ప్రియమైన💟తండ్రి🔱శివ✴️పరమాత్ముని💟తోడుగా.. శివ🔱శక్తి✨.. ప్రేమ💟ప్రకాశ✨.. శాంత🧘‍♂️శీతల🪷స్థితి💦.. ప్రకంపనలతో✨ (Vibrationsతో) ఈ విశ్వ🌏 పరివర్తనలో (లోక కళ్యాణంలో) మనమంతా భాగస్వాములం🙏 అవుదాం.."*

*​'ఓం🕉️' అనేది కేవలం మతపరమైన గుర్తు కాదు, 'ఓం🕉️' అనేది ఒక కాస్మిక్ సైన్స్ & మెడిసిన్ (Cosmic Science & medicine💊)*

 *"మనం ప్రతిరోజూ✨మన ప్రాణ💟 ప్రియమైన🕉తండ్రి శివ🔱పరమాత్ముని మీద💟ప్రేమతో.. ఏకాగ్రతతో✴️ ఓంకారాన్ని🕉️ సాధన చేయడం అంటే, మన వ్యక్తిగత వైబ్రేషన్‌ను✨విశ్వవ్యాప్తమైన పరమాత్మ🕉️ వైబ్రేషన్‌తో✨ జోడించడమే. ఈ 'వైర్‌లెస్ కనెక్షన్'- పరమాత్మునితో🕉️ ప్రేమ💟 కనెక్షన్✨ ఎంత బలంగా ఉంటే, మన జీవితం అంత ప్రశాంతంగా🪷.. శక్తివంతంగా✴️ఉంటుంది✨.."*

*"మన ప్రాణ✨ ప్రియమైన💟తండ్రి🕉️భగవంతుడు🔱శివ✴️పరమాత్మ వచ్చారు✨.. మార్పు✨మొదలైంది✨.."*
      *​"సత్యయుగ🌈 స్థాపన🪷 జరుగుతోంది⚜️🌱🍃🏆.."*
  *"అని నిశ్చయించుకున్న వారు🕉పరమాత్మకు✴️ అత్యంత ప్రియమైన వారు అవుతారు.."*

*"సత్యం శివం సుందరం"*
*🔔🔔━❀꧁🕉️ఓం🔱నమః🛕శివాయ🇮🇳🙏🕉️⚜️꧂❀┉🔔🔔*

*"ఓం🕉మండలి🛕భారత్🇮🇳మాత🛕శివ🔱శక్తి✴️ అవతార్🙏.*
🪀9573245868 🪀


 [6/13, 20:00] +91 92473 43585: పరుసవేది:- తన దగ్గరకు తెచ్చిన ఇనుప ముక్కను బంగారం ముక్కగా మార్చగలుగుతుందే కానీ, ఇంకో పరుసవేదిగా మార్చలేదు.

గురువు:- తనను ఆశ్రయించిన శిష్యుని (ఇనుప ముక్కను) సైతం గురువుగా (పరుసవేదిగా) మారుస్తాడు. అందువలనే గురువుని పరుసవేది కంటే గొప్పవాడు అని అంటారు.
[6/13, 20:00] +91 92473 43585: మోక్షం పొందాలనేవాడి (విజయకుమార్) నుండి మోక్షం (విడుదల) పొందాలి. అదే మోక్షసన్యాసయోగం.
 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀```

నరనరానా జీర్ణించుకున్న…```

                    *దేశభక్తి..!*
         ➖➖➖✍️

*ఒక లాయరు నలభై ఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు.

*లాయర్‌గారి అసిస్టెంట్‌ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు.

*అది చూసుకుని...లాయర్‌ గారు దాన్ని జేబులో పెట్టుకుని, తన వాదన కొనసాగించారు.

*ఇంతలో లంచ్‌టైం అయ్యింది.

*”వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటీ ఏమిట”ని న్యాయమూర్తి లాయర్‌ను అడిగాడు.

*“నా భార్య చనిపోయింది జడ్జి గారూ...”  అని చెప్పాడు లాయరు దీనంగా.

*జడ్జి గారు ఆశ్చర్యపోయి.. “ఇంకా ఇక్కడేం చేస్తున్నారూ? ముందు వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి!” అని అరిచినంత పనిచేశాడు జడ్జి.

*“అయ్యా! నేను వెళ్ళి నా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడ ఉండి వాదించి, నలభై ఆరు మందిని ఉరిశిక్ష నుండి రక్షించగలనేమో కదా?” అని అన్నాడు లాయర్‌ ఆశగా.

*అది విన్న బ్రిటిష్‌ జడ్జి నలభై ఆరు మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

*ఆ నలభై ఆరు మంది స్వాతంత్య్ర సమరయోధులు!

*ఆ లాయరు మరెవరో కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్!

*ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ దేశభక్తులకు కనీసం అర్థమవుతుందా?

*ఏమో? అనుమానమే.

*సర్దార్ వల్లభాయ్ పటేల్ సాక్షిగా ఆలోచనాపరులు మొదలు పెట్టిన శాంతి ఉద్యమ కాగడాను ప్రజలు అంది పుచ్చుకోవాల్సి ఉంది.✍️```
              🇮🇳జైహింద్🇮🇳
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
        🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
 🕉️🕉️🕉️🕉️🕉️ 

       ఒకరు ఏదో *అన్నారని* మనకు *ఇష్టమైన* వాళ్ళను వదులుకోవడం *తప్పు*..
మంచి చెడులను *తెలుసుకోని*  యే నిర్ణయం అయినా *తీసుకోవాలి*,  కానీ ఇంకెవరి *అభిప్రాయమో* నీ నిర్ణయం కాకూడదు..!

      నా *అనుకున్నప్పుడు* అన్నీ *సమాధానాలే*.. *నాకెందుకు* అనుకున్నప్పుడు..
అన్నీ *ప్రశ్నార్థకాలే*.. 
నాలుగు రోజుల *జీవితం* నలుగురితో *ఆనందమయం* కావాలి...!!

        వెలిగే *దీపమే* ఇతర దీపాలను *వెలిగించటానికి* తోడ్పడినట్టు... నిరంతరం *నేర్చుకునే* వారే *జ్ఞానం* పంచటానికి *అర్హులు*...!!

      *ఆగ్రహము* తో మనుషులు *దూరం* అవుతారు, *మొహం* లో అందం..ఆనందం *కోల్పోతుంది*.. అనుగ్రహం తో మనుషులు *దేగ్గెరవుతారు*.. మొహం ప్రశాంతంగా.. అందంగా..ఆనందంగా *కనపడుతుంది*.. మరి మీ దారేటో? అందం ఆనందం చేరుస్తారో..తీసేస్తారో.

*ప్లాస్టిక్* పూలు ఎంత అందంగా ఉన్నా *తుమ్మెదలు* వాలవు.. మనిషి ఎంత *అందంగా* ఉన్నా *మంచితనం* లేకపోతె ఎవరు మన *దేగ్గెరకు* రారు..

*వేదం* చదివితే *ధర్మం* తెలుస్తుంది, *వైద్యం* చదివితే *రోగం* తెలుస్తుంది, *లోకాన్ని* చదివితే *బతకడం* తెలుస్తుంది
కానీ *నిన్ను నువ్వు* చదివగలిగితే  నీలో ఉండే *లోపాలు*  తెలుస్థాయి
ప్రతి ఒక్కరు నిద్ర పోయేముందు  ఒక 5నిముషాలు *మనల్ని* మనం *చదువుకోగలిగితే* గొడవలు లేకుండా జీవితం హాయిగా గడుస్తుంది 

 తెల్ల *కాగితాన్ని* *ప్రభుత్వం* వాడితే డబ్బులు గా మారతాయి..
 *విద్యార్థి* ఉపయోగిస్తే *జీవితం* మారుతుంది..
*లాయర్* ఉపయోగిస్తే *న్యాయం* గెలుస్తుంది
*డాక్టర్* ఉపయోగిస్తే *ఆరోగ్యం* బాగుపడుతుంది
*ఇంజినీర్* ఉపయోగిస్తే *రహదారులు* ఏర్పడతాయి
కానీ *తప్పు* చేయటానికి ఉపయోగిస్తే *జీవితం చెల్లు చీటి (నాశనం)* అవుతుంది
🙏🙏🙏🙏
 *🍁🕉️పంచీకరణం*🕉️🍁

✍️ మురళీ మోహన్

👌👌👌👁‍🗨 ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం ●శబ్దం.

👁‍🗨– వాయువుకు ఉన్నగుణాలు రెండు
●శబ్దము, 
●స్పర్శ.

👁‍🗨– అగ్నికి ఉన్న గుణాలు మూడు…
●శబ్ద, 
●స్పర్శ, 
●రూపములు.

👁‍🗨– జలముకు ఉన్న గుణాలు నాలుగు
●శబ్ద, 
●స్పర్శ, 
●రూప, 
●రసము(రుచి)లు.

👁‍🗨– భూమికి ఉన్న గుణాలు ఐదు
●శబ్ద, 
●స్పర్శ,
●రూప, 
●రస,
●గంథాలు.
ఈ ఐదు గుణాలూ… 
"°పాంచభౌతిక తత్త్వాలు°" గల మన శరీరానికి ఉన్నాయి.
కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

■– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగానీ.., మనం బంధించలేము.

■– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

■– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

■– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

★° ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. 
దాన్ని తెరవాలంటే…, 
పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…!
ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. 
అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. 
అదే ‘ *అహం బ్రహ్మాస్మి* ’ అంటే.
 *‘నిన్ను నీవు తెలుసుకోవడమే’* దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే...!°🤘
 చేసిన పాపానికి పరిహారం ఎలా ? పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా ?


కపిలమహర్షి తన తల్లి దేవహూతితో

తస్మాత్ పురైవాద్దిహ
పాప నిష్కృతౌ
యతేత మృత్యో
రవిపధ్యరాత్మనా " - కపిలగీత

" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.

రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. పూజలు, జపాలు, తీర్థయాత్రలు, వ్రతాలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.

వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. ఏఏ వ్రతాలు చేసుకోవాలి, ఏఏ సమయాలలో ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను గరుడపురాణంలో విశేషంగా ప్రస్తుతించారు. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.

వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.

సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.

" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు.

శుభమస్తు
 ఏకాంతంగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి తేడా ఏమైనా ఉందా?
పాత జానపద సినిమాలో పౌరణికాలో చూస్తో ఒక సాధారణ సంభాషణ ఉంటుంది. రాజు గారు ఏకాంతంలో ఉన్నారు లేడా మహర్షులవారు ఏకాంతంలో ఉన్నారు అంటారు. దేవుడికి కూడా ఏకాంత సేవ ఉంటుంది. కొరియన్ జపనీస్ చైనీస్ రాజసంస్కృతులలో కూడా రాజుగారి అనుమతి లేకుండా భార్య, పిల్లలు కూడా కలవకూడదు. వారిది కూడా ఏకాంతమే. విశ్రాంతి, భోజనం, ఆలోచనలు అన్ని ఏకాంతంలోనే చేస్తారు.

ఒంటరితనం ఇందుకు పూర్తి విరుద్దం, అందరూ మనల్ని వదిలివేయడం, ఎవ్వరూ మనల్ని దగ్గరకి రానీయకపోవడం వంటివి ఒంటరితనంకి లక్షణాలు. మాకు నలుగురు స్నేహితులు ఉన్నారు అనుకుందాం, అందరికీ మందు సిగరెట్ అలవాటు ఉండి మనకు లేకపోతే వారు మనల్ని ఎక్కువగా కలుపుకోరు. అలా కలుపుకోవాలి అంటే లేని వ్యసనాలు అలవాట్లు చేసుకోవాలు. లేదంటే మీకు మిగిలేది ఒంటరితనం. అలా కాకుండా వాళ్ళ సాంగత్యం మీకే నచ్చక వాళ్ళు పిలిచినా వెళ్ళక సముద్రం ఒడ్డునో లైబ్రరీ లోనో మీరే ఒక్కరూ ఉండి మీ ఆలోచనలను ప్రశాంతతను ఇష్టపడితే అది ఏకాంతం అవుతుంది.

విధి మిమ్మల్ని ఒంటరి చేయగలదు, మిమ్మల్ని మీరు ఏకాంతప్రియులు గా మార్చుకోవచ్చు. నేను ఒక్కోసారి మూడు రోజులు నాలుగు రోజులు ఇంట్లో ఒక్కడినే ఉండటానికి ఇష్టపడతాను. ఎంత ఏకాంతం అంటే గుమ్మం దాటి కాలు బయట పెట్టకుండా తలుపు వేసుకుని ఇంట్లోనే వండుకోవడం, టీవి చూడటం, పుస్తకాలు చదువుకోవడం, ఇలా కోరా లో ఏదో ఒకటి రాసుకోవడం, బొమ్మలు వేయడం వంటివి అన్ని ఏకాంతపు లక్షణాలే. అలా బ్రతకడం వస్తే మీకు ఎవ్వరి కంపెనీ అక్కరలేదు, మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేయడమే ఏకాంతం.
 P. Saroja.             9866521414.

అమృత కర్రీ  సెంటర్.

నుదుట ను పట్టిన చెమట తుడుచు కుంటూ, గేటు తీసుకుని లోపలికి వచ్చింది తులసి. 
       వీధి గదిలో కూర్చున్న  భర్త నారాయణ కేసి చుస్తూ,,,,
ఎంత సే పయ్యింది, వచ్చి అని అడుగుతూ,, ఎదురుగా వున్న కుర్చీ లో కూర్చుంటూ,, ఏ మయ్యింది?వెళ్ళిన పని?,,,,జగన్నాధాన్ని, కలిసారా?...అంటూ,, భర్త  కేసి ప్రస్నార్ధకంగా చూసింది.

జగన్నాధాన్ని కలిసాను. పరిస్థితి అంతా చెప్పాను. ఏ వన్నా వుంటే ఫోన్ చెస్తా నన్నాదు. అక్కడి నుండి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను. ఇప్పటి కిప్పుడు వుద్యొగ మంటే, ఎక్కడ దొరుకు తుంది, చుస్తాన్లె, అన్నాడు. 
   మన బాధ వాళ్ళ కేం తెలుస్తుంది. వాళ్ళు వడ్డున వున్నారు, మనం నడి సముద్రం లో వున్నాం.,,,,, 

సరేలే !ఒకర్ని అనుకోవడం దేనికి.
ఇంతకీ,,,, ఇంత ఎండ ,లో నువ్వెక్కడ కి వెళ్ళావు.??

టీ పొడి అయిపోయింది.  ఎండన పడి వచ్చే మిమ్మల్ని మళ్ళీ బయటికి పంపడం ఎందుకని, సందు చివర శెట్టి, కొట్టు వరకూ వెళ్ళాను.
వస్తూ , వస్తూ, ఒక సారి పక్కనే వున్న మాస్టారు గారి ఇంటికి వెళ్ళాను. పిన్నిగారు ఎలా వున్నారొ, ఒక్కసారి పలకరించి వద్దామని వెళ్ళే సరికి, పిన్నిగారు జ్వరం వచ్చి పడుకున్నారు. మాస్టారు, వంటి ట్లో కాఫీ పెట్టడానికి, అవస్త పడుతుంటే కాస్త కాఫీ పెట్టి  శాంతమ్మ గారికి ఇచ్చి,మందులెసి కాస్సెపు కుర్చొని కబుర్లు చెప్పి ,,,,, ఇలా వచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది.
   అన్న ట్టు మర్చి పోయాను. మాస్టారు గారికి భోజనం పంపిస్తా నన్నాను. కాస్త సర్ది ఇస్తాను, పట్టుకెళ్ళి  ఇస్తారా??? ,,అంటూ,,, వంటి ట్లోకి  వెళుతున్న  భార్య తులసి కేసి ఆనందంగా చూసాడు, 
నారాయణ. 

భార్య లో వుండే ఈ గుణం చాలా ఇష్టం నారాయణ కి. 
   పెద్ద వాళ్ళం టే గౌరవమ్, అడగ కుండా నే అవతలి వాళ్ళ అవసరం గుర్తించి,, వాళ్ళ కు సాయపడే మనస్తత్వం, అన్నీ బాగా నచ్చు తాయి.
  నారాయణ ఆలోచనల్లో ఉండ గానే , అన్నం, పప్పు, కూర,  సర్ది  
ఒక బుట్టలో పెట్టి, నారాయణ చేతిలో, పెట్టింది.

మీ ఫోన్ నెంబర్ మాస్టారు కు ఇచ్చి రండి. ఏ దన్నా అవసరం అయితే ఫోన్ చెయ్య మనం డి,,, అంటూ , వెనకనుండి తులసి చెప్పే మాటలకి అల్లాగే,, ,,అంటూ బైటికి కదిలాడు నారాయణ.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

అత్తయ్యా!భోజనానికి రండి, అంటూ ఏమీ తోచక , నడుం వాల్చిన, అత్తగారిని లేపి భోజనం వడ్డి స్తూ, మళ్ళీ స్టవ్ మీద అన్నం పడేసి, అట్టా కోడలు, ఇద్దరూ కబుర్లలో, పడ్డారు.  కబుర్లు శాంతమ్మ గారి సంసారం మీదకు వెళ్లా యి.
మాస్టారు పేరు రామచంద్ర కీర్తి. అదే వూళ్ళో మాస్తారుగా పనిచేసి ,రిటైరు  ,అయి ,అదే ఊళ్ళో స్తిర పడ్డారు. మాస్టరు గారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. 
అందరికి పెళ్ళిళ్ళు అయి,తలో చోట, వుద్యొగాల్లొ వున్నారు.  మనవలు కూడా పెద్దవాళ్ళు అయి చదువుల్లొ, వున్నారు. 
   వీళ్ళు ఇద్దరే ఇక్కడ వుంటారు.  ఎవరి సంసారాలు వాళ్ళ వి.
వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ గొడవల్లో వాళ్ళు వుంటారు. 
కోడళ్ళు ఉద్యోగాలు చెస్తు న్నారు. 
పెద్దవాళ్ళ  నిద్దరిని "రండి మాదగ్గర ఉండండి," అనే ధయిర్యమ్ ఎవరూ చేయరు. ఎందుకంటే, వీళ్ళకి వేళ కి అన్నీ చేసి పెట్టె ఓపిక లేక.
  పెద్దవాళ్ళు వస్తే, తమ స్వేచ్చ పోతుందేమో ,అనే భయం కొంతా,
సొంత ఇల్లు, అక్కడ వున్న సదుపాయమ్ ఇక్కడ వుండదు, అంటూ,,ఏది  యెమయినా అక్కడ వాళ్ళు బానే వున్నారు అంటూ, అడగని వాళ్ళకు, అడిగిన వాళ్ళకు , తమ కనుకూలమయిన మాటలు చెబుతూ,,, తప్పించుకు తిరిగే పిల్లలను, ఏమీ అనలేక, వాళ్ళు రమ్మని అతనప్పుడు, వాళ్ళ దగ్గరకు వెళ్ళడం ఎందుకు, అనిపెద్ద వాళ్ళు ఇద్దరూ ఇక్కడే, కాలం వెళ్ళ  దీస్తున్నారు.
     మాస్టారు గారికి 78 ఏళ్ళు. చూపు తగ్గింది. కొద్దిగా మతి మరుపు వచ్చింది. శాంతమ్మ గారికి 72 ఏళ్ళు.
    భర్త అవసరాలు ఎప్పటికప్పుడు చూసే శాంతమ్మ కి కూడా ఈ మధ్య 
తనని కూర్చో పెట్టి, ఎవరయినా కాస్త అన్నం వండి పెడితే బాగుండును, అని అనిపిస్తుంది.
 కానీ జరగదు. 
      ప్రస్తుతం వంట్లో బాగుండ క పడుకుంది,, కానీ, భర్త తనకోసం పడుతున్న, ఆరాటం, అలవాటు లేక పడుతున్న అవస్త చూస్తూ, విల విల లాడి పోతున్న సమయం లో తులసి రాక,,,, సాయం,,, ఆవిడకు  ఎంతో స్వాంతన నిచ్చింది.

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

ఒకే వీధి. చిన్న పరిచయం.  కనిపించి నప్పుడల్లా" బాగున్నారా పిన్నిగారు "అంటూ  ఆత్మీయంగా ,,, అభిమానంగా, పలకరించే ,,, చిన్న పలకరింపు,,
అదే ఈ రోజు ఆసరా అయ్యింది కదా! అనుకుంటుంది శాంతమ్మ. నిజానికి శాంతమ్మ పెద్దగా ఎక్కడికి వెళ్ళదు. తులసె ఎప్పుడయినా వచ్చి ,, కాస్సెపు కుర్చొని, నాలుగు కాలక్షేపం కబుఇంట్లోవున, వెళుతూ వుంటుంది.

నాల్గు రోజుల్లొ తులసి,, నారాయణ,
ల సాయం వలన, జ్వరం తగ్గి ,
 తేరుకుంది, శాంతమ్మ. ఇన్ని రోజులు,  మాస్టరు భోజనం, టిఫిను అన్నీ నారాయణ, తులసె చూసు కున్నారు.
నాల్గు సార్లు తిరగ వలసి వచ్చినా, బాధ పడలేదు. మా కెందుకు,,,,, అని అనుకోలేదు. 
 ముఖ్యంగా, తులసి చేతి వంట అమృత మే,. ఎవరన్నా కూర్చో బెట్టి కాస్త అన్నం వండి పెడితే బాగుండు నన్న కోరిక ఈ విధం గా తీరింది.

జ్వరం తగ్గి మూడు రోజు లయినా  తులసి  శాంతమ్మ ని వండు కొనివ్వ లేదు.
నాల్గు రోజులు కాస్త ఓపిక రానివ్వంది అంటూ  ,,, తనే  రోజు భోజనం తెచ్చి పెడు తోంది. 
టైమ్ పన్నెండు అయ్యింది.  జ్వరం తగ్గి న, నీ రసంతొ హాల్లో కార్చుని 
 ,T.V. చూస్తోంది శాంతమ్మ.
తులసి భోజనం కెరెజ్ తెచ్చి లోపలికి వెళ్ళి డై నింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది, వచ్చి ఆలా వుందమ్మా ఒంట్లో?అంటూ,,, ఎదురుగా కూర్చుంది. 
   కడుపున పుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా ఆదుకున్నావు తులసి. 
నీ చేతి వంట తిన్నాకా  ఇంకా, తేరు 
కొకుండా ఉంటా నా??
అయినా ఎండలొ నువ్వెందుకు వచ్చావ్  తులసి? నారాయణ చేత పంపక పొయావా,?

నారాయణ లేరమ్మా!!రైస్ మిల్లు లో పని పోయింది కదా! ఉద్యోగం కోసం ఎరుగున్న వాళ్లని కాలవ డానికి వెళ్లారు.

అదే ఇన్నాళ్లు నాకు చెప్పావు కాదె. 
ఎందుకు పోయింది ఉద్యోగంరైస్ మిల్లు ఓనర్ పోయి ఏదాది అయ్యిందమ్మ. వాళ్ళ పిల్లలు  ఎక్కడెక్కడో ఉద్యోగాలు చెస్తున్నారు. వాళ్ళకి  ఎవరికీ ఈ బిజినెస్స్ చేసె ఉద్దేశ్యం లేదు.  ఆరు కోట్లకి రైస్ మిల్ వున్న స్థలం అమ్మెసారు. దాంతొ మాఆయన ఉద్యోగం పొయిందమ్మా!
మీ ఆరోగ్యం బాగుండ నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పడం, అని చెప్పలెదమ్మా! అప్పటినుండి ఉద్యోగం కోసం తిరుగుతూనె వున్నారు. 
ఇప్పు డు ఏ వుద్యొగానికి వెళ్ళినా 
కంప్యూటర్ వచ్చా అంటున్నా  రమ్మ. 
నిజమేలే ఇప్పుడు రెండు ,నాలుగు కలపాలన్న కంప్యూటర్ కావాలి.
మునుపు,పాలమ్మెవాడు,పనిమనిషి
కూడా వేళ్ళతో లెక్కలు చెప్పెవారు, 
ఇప్పుడూ ,,M.A,,,, ,చదివినా, లాభం లేదు. మాస్టారు అదే తిడతారు. 
    సరే !!నేనూ మాస్తారితొ మాట్లాడు తాలె. 
ఏదో ఒకటి దొరక్క పోదు . కంగారు పడకు. 
వస్తానమ్మా!భోంచెయ్యండి, అంటూ
ఇంటికి,బయలు దేరింది, తులసి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

"భొంచెద్దామ్ రండి. "పడుకుని పుస్తకం చదువు కుంటున్న 
మాస్థార్ని పిలిచింది శాంతమ్మ.

ఇద్దరూ   భోజనం చెస్తున్నారు.
అరటి కాయ ఆవ బెట్టి న కూరా, 
మ జ్జిగ పులుసు, దొసకాయ పచ్చడి 
అన్నం,.
తులసి వంట చాలా రుచిగావుంది,
శాంతా!!!
అన్నం తింటూ భర్త అన్న మాటలకు చిన్నగా తలూపుతూ,,
అవును,,,,,మంచి చెయ్యి,!
యేం వండి నా చాలా రుచిగా వుంటాయి. కానీ, ఇప్పుడే చెప్పింది. 
నారాయణ ఉద్యోగం పోయింది ట. 
కొత్త ఉద్యోగ వేటలో వున్నారు. 

వింటే చాలా బాధని పించింది. 
మనమే మన్నా సాయం చేయ గలమెమొ ఆలో చించం డి. 

ఒక్కనిముషమ్ , మోనం తరువాత, ఒక పని చెద్దామా శాంతా? అన్నారు మాస్టారు. 
ఏమీ ట న్న ట్లు, చూసింది ,శాంతమ్మ

నీ కా ఓపిక తగ్గింది. చేసి నాన్నాళూ, చెసావ్. ఇక వంట పనికి, విస్రాంతి నిచ్చి,మనం ఎప్పటి లాగే రోజు మనకి, కే రెజ్  తెచ్చి యిమ్మందామ్.
నీకు చాలాపని తగ్గు తుంది. కాస్త  రెస్ట్ కూడా దొరుకు తుంది. వాళ్ళు అడిగిన దాని కంటే కాస్త ఎక్కువే ఇద్దాం. ఈ వంకన వాళ్ళకి, సాయం చేసినట్లు , వుంటుంది.,,,

బాగానే వుంది. కానీ ఏమను కుంటా రో. తప్పు గా అర్ధం చెసు కోరు కదా!

వాళ్ళు చిన్న బుచ్చు కునే లా చెబుతామా?,,
అయినా!ఈ రోజుల్లో మనలాం టి పెద్దవాళ్ళు, చేసుకో లేని వాళ్ళు, వీధికి నలుగురు, ఉంటున్నారు.
నెమ్మది నెమ్మదిగా, ఇల్లు పెంచు
కుంటే,ఇంట్లో కూర్చుని వాళ్ళే సంపాదించు కోగలరు. 
సాయంత్రం తులసి, నారాయణ ,తో
 మాట్లాడు  దాం.
అయినా !!ఈ  పదిరొజులకి డబ్బు లిద్దామను కుంటున్నాం, కదా!
అవి ఇస్తూ,ఈ విషయం ప్రస్తావిద్దామ్.

సరే !అలాగే చెద్దామ్.
,🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

సాయంత్రం భోజనం తెచ్చి నప్పుడు 
నారాయణ ను కూడా రమ్మని ఫోన్ చేశారు, కీర్తి మాస్టారు.
తులసి లోపలికి వెళ్ళి ఫలహారమ్ బాక్స్ లు టేబుల్  మీద పెట్టి, ఉదయం ఇచ్చిన కే రెజ్  తీసుకుని వచ్చింది. 
నారాయణ,మాస్టారు ఎదురుగా కూర్చుని మాట్లా డు తున్నాదు.
నారాయణా,, ఇంత వరకూ మీరిద్దరూ చేసిన సాయం,మీకు మేము ఏ  మిచ్చినా,, మీ రుణం మేం తీర్చుకొ లేము. 

కన్న బిడ్డల కంటే ఎక్కువగా, మాగురించి ఆలొచించారు. మాకెంతొ  వెన్ను దన్ను గా నిలబడ్డారు.  
ఇన్ని వుపొద్గాతాలు వద్దు నారాయణ! మిఆవిద చేతి వంట ఇంకా కొన్నాళ్ళు తినా లని వుందయ్యా!నీకు తులసికి అబ్య్ంతరమ్ లేకుంటే, ఇంకా కొన్నాళ్ళు మాకు నీ ఇంటి నుండే కెరెజ్ రావాలని అనుకుంటున్నా ము

మాపిల్లలు మాదగ్గర ఉండి మా అవసరాలు తిర్చలెరు.కష్ట సమయం లో మాదగ్గర వున్న మీరే, మా పిల్లలు,. ఏ  మంటావు?

ని ఆర్ధిక పరిస్థితి ఆసరా చేసుకుని ఇలా అడిగానని ఏ మీ అనుకోకండి
భర్త  మాటలకు మాట కాలిపింది, శాంతమ్మ.

యేం చెప్పాలొ తెలియక , భార్య ముఖం లోకి చుసా డు నారాయణ. 
ఏం చెప్పాలొ తెలియక ఆలోచిస్తోంది, తులసి.  కష్టం తన ది అయినప్పుడు నేనేం చెబుతాను మాస్టారు.  తననే అడగండి. 
అయ్యో!!పెద్దవాళ్ళు. మీకు చేయడం, మాకు ఎప్పు డూ ఆనందమె మాస్టారు.
తన అంగికారమ్ తెలిపింది తులసి. మాస్టారు లేచి లోపలికి వెళ్ళి కొంత డబ్బు తెచ్చి, తులసి చేతిలో పెట్టి,

ఇక మీద ట కొన్నాళ్ళు మాకు కెరెజ్ మీ ఇంటి నుండే రావాలి, అన్నారు. 

అలా అనుకోకుండా మొదలెట్టిన ప్రయాణం, రెండు ఏళ్ళు తిరిగే సరికి పదింత లయ్యి, ఆదంపతు లిద్దరి చేత," అమృత  కేటరింగ్ సర్విసెస్స్"
అని,బోర్డు పెట్టించింది.

శాంతమ్మ, మాస్టారు  లాంటి  వృద్ధ దంపతులకి  కొంతమందికి  రోజు కెరెజ్ పంపిస్తుంది తులసి. 
సాయానికి ఒక మనిషిని పెట్టుకుంది. రెండేళ్ళు తిరిగే సరికి బిజినెస్సు బాగా పెరిగింది.  
నెలకి ఖ్ర్చులు పోను, యాభై వేలు వరకూ, మిగులు తుంది. 

రెండు సంవత్సరాల తరువాత,,,,

నారాయణ, తులసి, పిల్లలని తీసుకుని మాస్టారు ఇంటికి వచ్చారు. 
మాస్టారు, శాంతమ్మ, ఇద్దరుT.V.
చుస్తూ చాగం టి వారి ప్రవచనాలు వింటున్నారు. 

లోపలికి వచ్చిన దంపతుల కేసి సంతిషమ్ గా చుస్తూ, రండి అని సాదరమ్ గా ఆహ్వానించారు. 

తులసి నారాయణ, తమ తో బాటు తెచ్చిన బట్టలు, దంపతు లిద్దరికి పెట్టి, కాళ్ళకి దండం పెట్టారు. తులసి, పిల్లలచెత కూడా ఆ పెద్ద వాళ్ళకి దండ పెట్టించింది. 

ఏమిటి ది నారాయణ?ఆశ్చర్య పోయారు, మాస్టారు, భార్య. 

"""మాకు అన్నం పెట్టారు. మాస్టారు".
కళ్ళనీళ్ళు తిరుగు తుం డగా,ఇద్దరూ ఒక్క సారె అన్నారు.

లేదు. నారాయణా!మీ దంపతులె మాకందరికి అన్నం పెడుతున్నారు. 
ఆశీర్వదిస్తూ,,,,, అక్కున చెర్చు కున్నారు మాస్టారు, శాంతమ్మ.
        🌹సుభమ్,🌹
 *ఆకుపచ్చని సూర్యోదయం*

                                                      *- డా. ఎమ్. సుగుణరావు*

విశాఖపట్నంలో బీచ్ దగ్గరున్న ఒక కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీషు టీచర్ గా చేరింది సునంద. స్కూల్ ప్రిన్సిపాల్ సునందను, తన రూమ్ లోకి పిలిచి ఒక విషయం చెప్పింది.

“మన స్కూల్లో ఉన్న టీచర్లలో అందరూ ముప్ఫైఏళ్ళ వయసు పైబడినవారే, మీరు తప్ప. అందువల్ల మీకు ఒక ప్రత్యేకమైన ఎస్సైన్మెంట్ ఇస్తున్నాను” అంది.

“ఏంటి మేడమ్?” అంది సునంద ఉత్సాహంగా.

"ప్రతినెలా ఒక వాల్ మేగ్జైన్ తీసుకొద్దామనుకుంటున్నాం. దీనికి మీరు ఎడిటర్గా ఉండాలి. పిల్లలు మీకు తాము రాసిన చిన్న చిన్న కథలు, కవితలు వంటివి అందజేస్తారు. వాటిని పరిశీలించి, బాగున్న వాటిని వారిచేతనే ఆ వాల్ పేపర్మీద మీరు రాయించాలి.”

ప్రిన్సిపాల్ ఆమెకు ఆ విషయం చెప్పగానే, సునంద చాలా సంతోషపడింది. ఎందుకంటే సునందకు లిటరేచర్మీద చాలా అభిరుచి ఉంది.

“అలాగే మేడం” అంది.

ఆమె ఎమ్.ఏ. తర్వాత బి.ఇడి. చేసింది. భర్త ఉద్యోగరీత్యా చాలా ఊర్లలో అతను పనిచేయడంతోపాటు, కూతురుకు ఐదేళ్ళ వయసు వచ్చేవరకు ఆమెకు ఇష్టమైన టీచర్ ఉద్యోగం చేయడానికి వీలు కుదరలేదు. ఇప్పుడు భర్తకు వైజాగ్ ట్రాన్స్ఫర్ కావడంతో, అతను కొన్నేళ్ళపాటు వైజాగ్లో ఉండేలా పరిస్థితులు అనుకూలించడంతో, ఆమె ఆ స్కూల్లో చేరింది. కూతుర్ని అక్కడే చేర్పించింది.

తర్వాత రోజే ప్రిన్సిపాల్ స్కూల్లోని పిల్లలకు నోటీసు పంపించింది. స్కూల్ మంత్లీ వాల్ పేపర్ కోసం చిన్న చిన్న ఆర్టికల్స్ పిల్లలంతా పంపాలని, వారి రచనలు ప్రిన్సిపాల్ రూమ్ పక్కనున్న బాక్స్లో వేయాలని, పిల్లలందరికీ వర్తమానం పంపించారు.

నోటీసు పంపిన రెండు రోజుల తర్వాత ఒక పేజీ మీద రాసిన చిన్న ఆర్టికల్ మాత్రమే వచ్చింది. ఇంగ్లీషులో రాసిన ఆర్టికల్ అది. సునంద ఇంటికెళ్ళిన వెంటనే చదవడం మొదలెట్టింది.

"భూమిపైన మనం ఎన్నో లక్షల చెట్లను చూస్తుంటాం. వందల సంవత్సరాల నుండి ఉన్న చెట్లు కూడా ఉంటాయి. అవి ఎలా ఏర్పాడ్డావో తెలుసా మీకు? అవన్నీ కాకతాళీయంగా నాటబడినవే! అవును, అది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఉడుతలు విత్తనాలను భూమిలో దాచిపెడతాయి. ఆ తర్వాత ఎక్కడ దాచాయో మర్చిపోతాయి. అలా మీరూ ఒక మంచిపని చేయండి. దానిగురించి మర్చిపోండి. మీరు చేసిన ఆ మంచిపని ఒకరోజు మహావృక్షమై మీ కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది”

ఆ చిన్న రచనను చదవగానే సునందకు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి.

'ఈ స్టూడెంట్ ఎవరో పర్యావరణ పరిరక్షణ గురించి చాలా కొత్తగా చెప్పారు' అనుకుంది. ఆ ఆర్టికల్ పేరు ‘ఉడుత సాయం'. అది రాసింది ఉదయ. అంటే ఒక అమ్మాయి. చదివేది ఆరో తరగతి. ఆ తర్వాత రెండు రోజులకు డబ్బాలో మరో ఆర్టికల్ కనిపించింది. అది కూడా ఉదయ రాసిందే. ఆ చిన్న కథ పేరు 'కానుక'.

"వరదలు వచ్చి ఒక ఊళ్ళో అంతా సర్వం కోల్పోయారు. వేరే ప్రాంతానికి వలసబాట పట్టారు. ఒక కావడి మీద ఒకవైపు సామాను, ఇంకోవైపు ఒక ఐదేళ్ళ మనవడిని మోసుకుంటూ వెళుతున్నాడు ఒక వృద్ధుడు. మార్గమధ్యంలో ఆహారం అమ్మే దుకాణం దగ్గర ఆగాడు. మనవడి కోసం ఆహారం కొని, తినిపించాడు. 'మరి నీకో?' అన్నాడు దుకాణదారుడు. 'నాకెందుకులే బాబు? నాకోసం కొనుక్కునే ఆహారానికి అయ్యే డబ్బుతో విత్తనాలు కొనడం మంచిది.' అన్నాడు. 'విత్తనాలు దేనికి?' అన్నాడు ఆ దుకాణదారుడు. 'తిండి లేక నేను చనిపోయినా, భవిష్యత్తులో ఈ విత్తనాలు నాటడానికి నా మనవడు ఉండాలి కదా! పంటలు పండించాలి కదా!' అనుకుంటూ ఆ ముసలాయన ముందుకు సాగిపోయాడు.”

సునందకు ఆ చిన్న కథ ఎంతో హృద్యంగా అనిపించింది. రేపటి తరాల క్షేమాన్ని, కోరుకునే ఆ కథలోని ముసలాయన మీద గౌరవం కలిగింది.

వరుసగా ఇలా పర్యావరణ పరిరక్షణ మీద కథలు రాస్తున్న ఆ అమ్మాయి ఉదయని చూడాలనిపించింది సునందకు. అయితే ఆ అమ్మాయి చదివేది ఆరో తరగతి. తను వారికి క్లాసులు తీసుకోదు.

రెండు రోజుల తర్వాత, ఓ ఆదివారంపూట సాయంత్రపు నడక ముగించుకుని తనింటికి దగ్గరలో ఉన్న షాపు దగ్గర సరుకులు కొనడానికి వెళ్ళింది సునంద. షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గరకు వచ్చింది. కౌంటర్లోని అమ్మాయి, "సంచి తెచ్చుకున్నారా మేడమ్? ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించారు కదా. మీరు సంచులను తెచ్చుకోవాలి” అంది.

“అయ్యో! ఇప్పుడెలా?” అంది సునంద.

“మా షాపు పక్కనే ఒకమ్మాయి గుడ్డ సంచుల్ని అమ్ముతోంది. మీరు చూడలేదా?” అంది.

“అలాగా...” అంటూ షాపులోంచి బయటకు వచ్చింది.

ఆ షాపు పక్కనే ఒకమ్మాయి నుంచుంది. దాదాపు పది పదకొండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. సన్నగా, పొడుగ్గా ఉంది.

ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించింది సునందకు.

ఆ అమ్మాయి చేతిలో ఒక అట్ట, దానిమీద 'మన భూమిని

మనమే రక్షించుకుందాం' అని ఉంది.

ఆ అమ్మాయిని చూసి, “సంచి కావాలి” అంది సునంద. “నమస్తే మేడమ్...” అంటూ అక్కడున్న సంచి తీసి ఇచ్చింది. సునంద పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వబోతుంటే, “ఫర్వాలేదు మేడమ్” అంది. థాంక్స్ చెప్పి, షాపులోకెళ్ళి తన సామాను తెచ్చేసుకుంది సునంద. అమ్మాయిది, తను పనిచేసే స్కూలేమో! ఏం పేరో తెలుసుకోవాలనుకుంది సునంద. అంతలో సెల్ రింగవడంతో గబగబా అక్కడినుంచి కదిలి, ఇంటికొచ్చేసింది.

✡✡✡

వారం రోజుల తర్వాత స్కూల్లో పిల్లలకు డిబేట్ క్లాస్. ఆ డిబేట్ పిరియడ్లో అన్ని క్లాసులవారూ పాల్గొంటారు. పిల్లలు తమకు నచ్చిన విషయం మీద మాట్లాడవచ్చు. ఆరోజు ఆ డిబేట్ పిరియడ్ నిర్వహించేది సునంద. మధ్యాహ్నం రెండు కల్లా లంచ్ బ్రేక్ ముగిసిన తర్వాత డిబేట్ పిరియడ్ జరిగే హాల్లో పిల్లలంతా వచ్చి కూర్చున్నారు. ఆ పిల్లల్లో తను షాపు దగ్గర చూసిన అమ్మాయి కనిపించింది సునందకి.

వరుసగా పిల్లలు వచ్చి, తమకు నచ్చిన సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారు. నలుగురు విద్యార్థులు మాట్లాడిన తర్వాత తను షాపులో చూసిన అమ్మాయి స్టేజిమీదకు వచ్చి, చెప్పడం మొదలెట్టింది.

“నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్... 'పర్యావరణ పరిరక్షణ'. నా పేరు ఉదయ, సిక్త్ క్లాస్" అంది ఆ అమ్మాయి.

“ఓహ్...” అంటూ ఆశ్చర్యంగా చూసింది సునంద.

తమ స్కూల్ గోడ పత్రికకు ఆర్టికల్స్ పంపించేది ఎవరో సునందకు అర్థమైపోయింది.

“మనదేశంలో పారిశ్రామికీకరణ వల్ల నేల, నీరు కలుషితమౌతున్నాయి. నీటిలో యురేనియం, ఆర్సనిక్ వంటి ప్రమాదకరమైన లోహాలు ఆనవాళ్ళుగా మిగులుతున్నాయి. ఈ కలుషిత నీటిని తాగితే, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు పాడవుతాయి. వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు నీటి ఆవిరితో కలిసి ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇది మన పర్యావరణానికే ముప్పు. మన భూమి చరిత్ర ఐదు యుగాలు దాటి ముందుకు సాగుతోంది. ఈ యుగాల్లో అనేక ప్రాణులు పరిణామం చెందితే, కొన్ని ప్రాణులు పతనమైనాయి. అలా ఐదు యుగాల్లోనూ జీవులు అంతరించిపోయే విషయంలో మనిషి ప్రమేయం లేదు. కాని ఆరవ యుగంలో మనిషి ప్రమేయంతో మనిషి కూడా అంతర్ధానమయ్యే పరిస్థితి వస్తోంది.”

ఉదయ ఆ మాటలు మాట్లాడగానే అందరూ చప్పట్లు కొట్టారు.

"ఇప్పుడు పర్యావరణం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. మనుషులు, జంతువులు ఎవరి బతుకు వాళ్ళు బతకాలి. ఒకరి ఆవరణలోకి వేరేవారు వెళ్ళకపోవడమే జీవ వైవిధ్యం. అంటే బయో డైవర్సిటీ. మనకు చిన్న చిన్న ప్రాణులు ఎంతో మేలు చేస్తున్నాయి. వానపాము తన జీవితకాలంలో ఒక పావు ఎకరం ఎరువు తయారు చేస్తుంది. ఇసుకలో, పంటచేలలోని పురుగులను తినడం ద్వారా పంటలను కాపాడుతుంది. నత్త, తాబేలు, జలగ... నీటిలోని క్రిమికీటకాలను తిని, నీటి కాలుష్యాన్ని అరికడతాయి. అయితే మనషి ఏం చేస్తున్నాడు? ఈ ప్రాణుల్ని నాశనం చేసి, తన ముప్పు తానే తెచ్చుకుంటున్నాడు. ఈ సృష్టిలోని మిగతా జీవుల్లాగే మనిషి ఒక ప్రాణి. అంతే. ప్రాణికన్నా మనిషి ఎక్కువ కాదు. అది తెలుసుకుని మనం నడుచుకోగలిగితే కొన్ని సంవత్సరాల్లో ఆక్సిజన్ సిలెండర్ లేకుండా ఇంట్లోంచి బయటకు రాలేకపోయే ప్రమాదాన్ని ఎదుర్కోగలం” అని చెప్పడం ముగించింది ఉదయ.

ఉదయ చెప్పడం ముగించగానే, పిల్లలంతా లేచి చప్పట్లు కొట్టారు. సునంద ఆరోజు డిబేట్ పిరియడ్లో ఉదయకు ప్రథమ బహుమతి ప్రకటించింది.

✡✡✡

ఓ ఆదివారం ఉదయమే బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత, భర్తతో, కూతురుతో కలిసి బీచు వచ్చింది సునంద. కూతురు ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతూ ఆడుతోంది. సునంద, ఆమె భర్త పక్కనే కూర్చుని కబుర్లలో పడ్డారు. కొంచెం దూరంలో ఏదో హడావుడి కనిపించింది సునందకు.

అక్కడ చాలామంది నేవీ అధికారులు కూడా ఉన్నారు. ఆ జనాల మధ్య తమ స్కూలు పిల్లలు కూడా కనిపించారు సునందకు.

“ఏమిటో ఒకసారి చూసి వస్తాను. పాపను చూసుకోండి" అంటూ ఆవైపు అడుగులు వేసింది సునంద. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తమ స్కూలు పిల్లలంతా "గుడ్ మార్నింగ్ మేడమ్.. గుడ్ మార్నింగ్ మేడమ్..” అంటూ విష్ చేశారు.

“ఏమైంది మీరంతా ఇక్కడకు వచ్చారు?" అంది సునంద.

"మన స్కూల్ అమ్మాయి ఉదయ స్క్యూబా డైవింగ్ చేస్తోంది" అన్నాడు ఒక అబ్బాయి ఉత్సాహంగా.

“మైగాడ్ అంత చిన్నమ్మాయా?" అంది సునంద.

"ఉదయ డాడీ కూడా సముద్రంలోకి వెళ్ళారు మేడమ్" అంది ఇంకో అమ్మాయి.

పక్కనే ఉన్న నేవీ అధికారివైపు సునంద చూసి -

"చిన్నపిల్లలు ఇలా స్యూబా డైవింగ్ చేయడం రిస్క్ కదా సార్?” అంది సునంద.

"ఈ అమ్మాయి మెరైన్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం పనిచేస్తోంది. ఈమె తండ్రి కూడా ప్రొఫెషనల్ స్క్యూబా డ్రైవర్.

అలాగే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. చెన్నైలో కూడా సముద్రంలో ఈది, చాలా ప్లాస్లిక్ ని బయటకు తీసుకొచ్చింది ఈ అమ్మాయి ఉదయ" అన్నాడతను.

ఆ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సునంద.

దాదాపు అరగంట తర్వాత ఉదయ, ఆమె తండ్రి సముద్రంలోంచి బయటకు వచ్చారు. ఆ చుట్టుపక్కలున్న ప్రెస్ రిపోర్టర్లు ఉదయ చుట్టూ మూగారు.

“ఇంత చిన్న వయసులో ధైర్యంగా ఎలా మీ అమ్మాయిని సముద్రంలోకి డ్రైవింగ్కి పంపుతున్నారు?” అన్నాడు ఒక ప్రెస్ రిపోర్టర్ ఉదయ తండ్రితో.

“ఉదయ పుట్టిన నెల రోజుల్లోనే మా ఇంట్లోని టబ్లో దింపాను. మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈదడం నేర్చుకుంది. ఎనిమిదో సంవత్సరంలో మొదటిసారి స్యూబా డైవింగ్ చేసింది.”

ఇంకో ప్రెస్ రిపోర్టర్, ఉదయ వంక చూసి “సముద్రంలోకి వెళ్ళడానికి భయం వేయలేదా?” అంది.

ఆ మాటలకు ఆమె నవ్వుతూ “ఒక మంచి పని చేయడానికి భయపడకూడదు. మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ అంతా సముద్రాల్లో పేరుకుపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 కల్లా సముద్రంలో ఒక చేప కూడా కనిపించదు అంటున్నారు శాస్త్రవేత్తలు. మన పర్యావరణం సమతుల్యతతో సాగాలంటే సముద్రాలను రక్షించుకోవాలి. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులు వాడాలి. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ప్రతి ఆదివారం సముద్రంలో పేరుకొన్న ప్లాస్టిక్ని తొలగించేందుకు నేను ఇక్కడకు వస్తున్నాను.”

ఉదయ చెప్పడం ముగించింది.

ఆమె అలా చెబుతుంటే సునంద చాలా సంతోషపడింది. ఆమెచుట్టూ విలేకర్లు, బీచ్ సందర్శకులు మూగి ఉండడంతో ఆమెతో మాట్లాడే అవకాశం కుదరలేదు సునందకు.

ఇంటికొచ్చినా సునందలో ఆలోచనలు...

'ఇంత చిన్న వయసులో... ఈ అమ్మాయికి ప్రకృతిని పరిరక్షించుకోవాలనే గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో?” అనుకుంది.

తర్వాతిరోజు స్కూల్లో ఉదయతో మాట్లాడదామని అనుకుందిగాని, ఆరోజు ఉదయ స్కూలుకు రాలేదు. స్కూల్లో ఉండగానే సునందకు ఫోన్ వచ్చింది.

"మేడమ్ నేను ఉదయ. మీరు ఈ రోజు సాయంత్రం మా ఇంటికి రావాలి. మా అన్నయ్య బర్త్ డే. మా క్లాస్మేట్స్ని, కొంతమంది టీచర్లను కూడా పిలిచాను" అంది.

"ఓహెూ... మీ అన్నయ్య బర్త్ డే గురించి ఈ రోజు స్కూలు మానేశావా?” అంది సునంద.

"మీ పాపను కూడా తీసుకుని రండి. ఆరోజు బీచ్లో చూశాను" అంటూ తన ఇంటి అడ్రస్ చెప్పింది ఉదయ.

“సరే తప్పకుండా వస్తాను" అంటూ ఫోన్ పెట్టేసింది.

ఆరోజు స్కూలు నుంచి తొందరగా ఇంటికొచ్చేసింది సునంద. భర్త ఆఫీసు పనితో బిజీగా ఉండడంతో, కూతుర్ని తీసుకుని స్కూటీలో బయలుదేరింది సునంద. పావుగంటలో ఆ ఇంటికి చేరుకుంది.

తలుపు కొట్టగానే, ఉదయే తలుపు తీసింది. అప్పటికే లోపలంతా, తమ స్కూలు పిల్లలు, టీచర్లు ఉన్నారు. ఆ గదిలో బల్లమీద క్యాండిల్స్ పెట్టిన కేక్.

ఉదయ తన తల్లిదండ్రుల్ని సునందకు పరిచయం చేసింది.

“నా పేరు రఘురాం... నా భార్య గాయత్రి" అన్నాడతను.

“చాలా సంతోషం. మీ అమ్మాయి నిత్యం ప్రకృతిని పరిరక్షించే లక్ష్యంగానే సాగుతోంది. మా స్కూలు వాల్ మేగ్ జైన్లో చిన్న చిన్న కథలు, ఆర్టికల్స్ రాస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే, ఇంత చిన్న వయసులో సముద్రంలోకి వెళ్ళి, డైవింగ్ చేసి, ప్లాస్టిక్ చెత్తను ఏరుకురావడం నిజంగా అద్భుతం" అంది సునంద.

“అవును మేడమ్... తనకు చిన్నతనం నుంచి ప్రకృతిని పరిక్షించడంలో అవగాహన ఉంది” అన్నాడాయన క్లుప్తంగా.

ఆ హాల్లో చుట్టూ చూసి, “ఇంతకీ మీ అబ్బాయి ఏడి?” అంది సునంద.

ఆ మాటలకు అతను క్షణంసేపు ఆగి, “వాడు మన మధ్యనే ఉన్నాడు. ముందు కేక్ కట్ చేద్దాం.” అంటూ ఉదయని, మిగతా పిల్లల్ని పిలిచాడు.

సునంద. అంతా కలిసి కేక్ కట్ చేశారు. పిల్లలకు కేకు, చాక్లెట్లు ఇచ్చింది ఉదయ వాళ్ళ అమ్మ. 'ఆ పిల్లల్లో ఎవరు ఉదయ అన్నయ్య? ఆ కుర్రవాడిని పరిచయం చేయలేదేంటి?' అనుకుంటూనే ఉంది

పిల్లలందరూ స్నాక్స్ తీసుకుని ఇంటిలోనుంచి బయటకు కదిలారు, వారితోపాటు టీచర్లు వెళ్ళిపోయారు. సునంద మనసులో మెదిలే ప్రశ్నకు జవాబు దొరకలేదు. దాంతో చిన్నగా ఏదో బాధ.

'అసలు ఉదయ అన్నయ్య ఉన్నాడా? లేడా? ఉంటే పరిచయం చేసేవారు కదా! ఏమయ్యాడో!' అనుకుంది. మరీ అడిగితే బాగుండదని, "వెళ్ళొస్తానండి. థాంక్యూ...” అంటూ ఆ ఇంట్లోంచి కదలబోయింది. ఉదయ తండ్రి -

“ఒక్క నిముషం ఆగండి, కూర్చోండి" అని అనడంతో,

నిలబడి ఉన్న సునంద, ఆ గదిలోని సోఫాలో కూర్చుంది.

“కొంచెం కాఫీ తాగి వెళుదురు గాని” అంది ఉదయ తల్లి వంటగదిలోకి నడుస్తూ.

ఉదయ తండ్రి పక్కనే కూర్చుంది. అతను చెప్పడం మొదలెట్టాడు.

ఆ "నేను వైజాగ్కు రాకమునుపు, కలకత్తాలో పనిచేశాను. మేం పనిచేసే ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీకి దగ్గరలోనే మా క్వార్టర్స్ ఉండేవి. మా అబ్బాయి, రోజూ సైకిల్ మీద, మా ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న స్కూలుకు వెళ్ళేవాడు. వాతావరణం అంతా పొగతో, రసాయనాలతో నిండి ఉండేది. ఒకరోజు టౌన్షిప్ ప్రాంతంలో చెత్త కాలుస్తుంటే, పొగ వల్ల ఊపిరి పీల్చుకోలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత ఆరు నెలలు ఇలాగే, దగ్గు, ఆయాసంతో బాధపడ్డాడు. ఆ తర్వాత పరీక్షలు చేయిస్తే, డాక్టర్లు లంగ్ కేన్సర్ అని తేల్చారు.”

ఆయన అలా చెబుతుంటే, సునంద మనసు బాధతో సుడులుగా తిరిగింది.

"నేను ఉద్యోగానికి సెలవు పెట్టి, హైదరాబాదులోని కేన్సర్ ఆస్పత్రిలో మా అబ్బాయిని చేర్చాను. కీమో, రేడియోషన్ పూర్తయ్యాయి. ఒక సంవత్సరం బానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ వ్యాధి తిరగబడింది. డాక్టర్లు ఎక్కువ కాలం బతకడని చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే, తనకు క్యాన్సర్ కలుగజేసిన ప్రకృతి కాలుష్యానికి వ్యతిరేకంగా ఏం చేయాలో, అది చేయడం ప్రారంభించాడు. అది తన ఆఖరి కోరికగా మాకు చెప్పాడు. అందుకు “నేషనల్ ఎన్విరాన్మెంట్” ప్రాజెక్ట్ ్వరు సహకరించారు. తనలాగ ఎవరూ వాతావరణ కాలుష్యానికి గురై, క్యాన్సర్ బారిన పడకూడదనే మా వాడి అంతిమ కోరిక. అలా తను ఉద్యమిస్తూనే, ఓ రాత్రిపూట ఈ కాలుష్య ప్రపంచం నుంచి, ఆరోగ్యకరమైన వాయువులు పీల్చుకునేందుకు వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు.”

ఆ మాటలు చెబుతున్న ఉదయ తండ్రి కళ్ళనుండి నీళ్ళు.

వంటగదిలోంచి ఉదయ తల్లి కూడా, తన కన్నీరు తుడుచుకుంటూ వచ్చి, సునందకు కాఫీ అందించింది. సునంద తండ్రి చెప్పడం కొనసాగించాడు.

"నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, మా సొంత ఊరైన విశాఖపట్నం వచ్చేశాను. తన అన్న సూర్య లక్ష్యాన్ని, చెల్లెలు ఉదయ కొనసాగిస్తోంది. నేను ఆమెను ప్రోత్సహిస్తున్నాను” అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ఆ గదిలో టేబుల్ మీద పదిహేనేళ్ళ వయసున్న అబ్బాయి ఫొటో. ఫొటో చుట్టూ ఆరోజే తాజాగా కట్టిన పూలమాల.

"మీ అబ్బాయి సూర్య, హరిత ఉద్యమాన్ని, మీ అమ్మాయి కొనసాగించడం చాలా గొప్ప సంగతి" అంటూ వారినుంచి సెలవు తీసుకుని, బయటకు వచ్చింది సునంద.

బయటకు వస్తుంటే, ఉదయ, ఒక గుడ్డ సంచి చేతికిస్తూ, “ఇది మా అన్నయ్య బర్త్ డే గిఫ్ట్” అంది. ఇంటికొచ్చిన సునంద, ఉదయ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో సంచిలోంచి తీసి చూసి ఆనందపడింది.

✡✡✡

ఆ రోజు సునంద తొందరగా నిద్రలేచింది. ఉదయ ఇచ్చిన ఆ చిన్న మట్టి తొట్టిలో ఉన్న ఆ లేత మొక్కవంక చూసింది. ఆరోజు ఉదయం ఆమెకు ఆకుపచ్చగా కనిపించింది. మనసుకు ఆహ్లాదం అనిపించింది.
 నిన్న ఖధీర్ బాబు గారి వాల్ మీద కుర్చీ కథ చదివాక ఎప్పటి నుండో రాద్దామనుకున్న బెంచీ తాలుకు జ్ఞాపకాన్ని ఈ రోజు రాసుకోగలిగాను. 

బెంచీ...

ప్రభుత్వ ఆసుపత్రి క్యాన్సర్ వార్డు బయట ఒక పాత ఇనుప బెంచీ ఉంటుంది.
ఎన్ని ఏళ్ల నుంచో అక్కడే ఉంటుంది.
దానికి రంగు ఎప్పుడు వేసారో ఎవరికీ గుర్తుండదు.

వర్షాలు దాన్ని తడిపాయి...
ఎండలు దాన్ని ఎండబెట్టాయి...
కానీ మనుషుల బాధలు దాన్ని ఇంకా ఎక్కువగా తుప్పు పట్టించాయి.

ఉదయం ఐదు గంటలకే ఆ ప్రాంగణం మెల్లగా కళ్లు తెరుస్తుంది.
ఎక్కడో దూరంగా టీ అమ్మే వాడి గళం వినిపిస్తుంది.

"టీ... టీ..."

వార్డు కిటికీల్లోంచి మందుల వాసన వస్తుంది.
రాత్రంతా నిద్రపోని బంధువులు ముఖాలు కడుక్కుంటారు.
కొంతమంది దేవుడి ఫోటో ముందు చేతులు జోడిస్తారు.
మరికొందరు డాక్టర్ రౌండ్స్ కోసం ఎదురుచూస్తారు.
ఆ బెంచీ మీద మాత్రం ఒక తాత కూర్చుని ఉంటాడు.

నిన్న కూర్చున్నాడు.
మొన్న కూర్చున్నాడు.
నెల రోజులుగా కూర్చుంటూనే ఉన్నాడు.
లోపల ఆయన భార్య ఉంది.
యాభై ఏళ్ల వైవాహిక జీవితానికి సాక్ష్యమైన మనిషి.
తన జీవితంలో ఎప్పుడూ తనను ఒంటరిగా వదిలిపెట్టని మనిషి.
ఇప్పుడు మాత్రం ఒక గోడకు అవతల ఉంది.
ఒక తలుపుకు దూరంలో ఉంది.
అంత దగ్గరగా...
అంత దూరంగా...

అప్పుడప్పుడు నర్స్ బయటకు వస్తుంది.
తాత ఒక్కసారిగా లేచి నిలబడతాడు.
ఎదురుచూపుల్లో వయసు ఉండదు.
ఎనభై ఏళ్ల వాడైనా...
ఎనిమిదేళ్ల పిల్లాడైనా...
ఎదురు చూసేటప్పుడు ఒకేలా కనిపిస్తారు.

"అమ్మా... మా ఆవిడ ఎలా ఉంది?"

నర్స్ చిన్నగా నవ్వుతుంది.

"బాగానే ఉంది తాతయ్య."

"నిజంగానేనా?"

"అవును."

"రాత్రి దగ్గు తగ్గిందా?"

"తగ్గింది."

"నన్ను అడిగిందా?"

ఆ ప్రశ్న విన్న ప్రతిసారీ నర్స్ కళ్లల్లో నీళ్లు మెరుస్తాయి.

"అడిగింది తాతయ్య..."

అంతే.
ఆయన ముఖంలో చిన్న వెలుగు.
ఎన్నో కోట్ల ఆస్తుల కంటే విలువైన వెలుగు.
ఒక రోజు పక్క బెంచీ మీద కూర్చున్న వ్యక్తి అడిగాడు.

"తాతయ్య... మీ పెళ్లై ఎన్ని సంవత్సరాలు?"

తాత నవ్వాడు.
"యాభై మూడు."

"అంతకాలం గొడవలు లేకుండా ఉన్నారా?"

తాత మెల్లగా నవ్వుకున్నాడు.

"రోజూ గొడవలే బాబూ..."

అతను ఆశ్చర్యపోయాడు.

"అయితే ఎలా కలిసి ఉన్నారు?"

తాత కళ్లలో మెరుపు.

"ఇప్పుడు మీ తరం ఒక విషయం మర్చిపోయింది.

మా కాలంలో...

విరిగిపోయిందని పారేయడం తెలియదు.

బాగు చేసుకుని మళ్లీ వాడుకోవడం తెలుసు.

అది వస్తువైనా... బంధమైన...
సంబంధమైనా... అనుబంధమైన...

అంతే.
ఆ మాట చెప్పి మౌనమయ్యాడు.
ఎందుకంటే...
ఇప్పుడు తాను బాగు చేయలేని ఒకే ఒక్క విషయం తన భార్య ఆరోగ్యం.

మధ్యాహ్నం అవుతుంది.
ఒక చిన్న స్టీల్ డబ్బా తెరుస్తాడు.
ఇంట్లో కూతురు పంపిన అన్నం.
రెండు ముద్దలు తింటాడు.
మూడో ముద్ద చేతిలో ఆగిపోతుంది.
యాభై ఏళ్లుగా తన పక్కన కూర్చుని...
"కారం ఎక్కువైంది..."
"ఉప్పు తక్కువైంది..."
అని ఆవిడను అంటూ తినే రోజులు గుర్తొస్తున్నాయి.

ఒంటరిగా తినడం కంటే...
ఆకలితో ఉండటం తేలికగా అనిపిస్తుంది.
డబ్బా మూసేస్తాడు.

అంతలో వార్డు తలుపు తెరుచుకుంటుంది.
స్ట్రెచర్ మీద ఒక పేషెంట్‌ను తీసుకెళ్తున్నారు.
వెనకాల భార్య ఏడుస్తూ వస్తోంది.

"నన్ను వదిలి వెళ్లొద్దండీ...
నాకెవరు ఉన్నారు..."
అని విలపిస్తోంది.

ఆ శబ్దం వినగానే...
తాత గుండెలో ఏదో విరిగినట్టు అవుతుంది.
ఎందుకంటే...
అదే మాట ఒకప్పుడు తన భార్య చెప్పింది.

పెళ్లైన కొత్తలో...
మొదటిసారి ఉద్యోగం కోసం ఆరు నెలలు ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు.

బస్ ఎక్కే ముందు...
ఆమె కళ్లలో నీళ్లు.

"ఇంత దూరం వెళ్లాల్సిందేనా?"
అని అడిగింది.

అప్పుడు నవ్వుతూ చెప్పాడు.
"ఆరు నెలలే కదా...
అంతలో ఏమవుతుంది?"

ఈ రోజు...
ఆసుపత్రి బెంచీ మీద కూర్చుని...
అదే మాట తనను వెంటాడుతోంది.

"అంతలో ఏమవుతుంది?"
మనిషి జీవితంలో అతి పెద్ద అబద్ధం అదే.

"అంతలో ఏమవుతుంది?"
అంతలోనే జీవితాలు మారిపోతాయి.
మనుషులు మారిపోతారు.
కాలం మారిపోతుంది.
ఒక్కోసారి...
మనిషి కూడా వెళ్లిపోతాడు.
సాయంత్రం అయిదు గంటలు.
ఆసుపత్రి గేటు దగ్గర పూలమ్మాయి కూర్చుంది.
మల్లెపూలు అమ్ముతోంది.
తాత చూపు ఆ పూల మీద ఆగిపోతుంది.
యాభై ఏళ్లుగా...
ప్రతి శుక్రవారం తన భార్యకు మల్లెపూలు తీసుకెళ్లడం అలవాటు.
ఎంత పేదరికం ఉన్నా...
ఆ పూలు మాత్రం మానలేదు.
ఒకసారి డబ్బులు లేక...
ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాడు.
ఆవిడ నవ్వి...

"పూలు లేవని బాధపడుతున్నావా?"
అంది.

"అవును..."
అన్నాడు.

ఆమె తన జడలో ఉన్న రెండు మల్లెలు తీసి...
అతని చొక్కా జేబులో పెట్టింది. మన మల్లె తీగవే ఇవి అని...

"నువ్వుంటే చాలు...
ఇక నుండి పూలు లేకపోయినా పర్వాలేదు..."
అంది.
ఆ రోజు గుర్తొచ్చింది.
ఈ రోజు జేబులో డబ్బులు ఉన్నాయి.
పూలు కొనగలడు.
కానీ...
ఆ పూలు పెట్టుకునే జడ మంచం మీద ఉంది.

రాత్రి.
ఆసుపత్రి ప్రాంగణంలో చలి పెరుగుతోంది.
బెంచీ చల్లబడుతోంది.
తాత భుజంపై పాత శాలువా కప్పుకున్నాడు.
నిద్ర రావడం లేదు.
పక్కనే కూర్చున్న యువకుడు ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.

"అమ్మా...
నేను వస్తా...
ఏడవకు..."
అంటున్నాడు.

ఆ మాట విని తాత కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఎందుకంటే...
తన అమ్మ చనిపోయిన రోజు గుర్తొచ్చింది.
ఆ రోజు కూడా ఇలాగే పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
కానీ...
చేరేసరికి ఐదు నిమిషాలు ఆలస్యమైంది.
అమ్మ చేతులు చల్లబడిపోయాయి.
అప్పుడు తన భార్య భుజం మీద చేయి వేసి చెప్పింది.

"ఏడవకండి...
మీ అమ్మ మీలోనే ఉంటుంది..."
అంది.

ఈ రోజు...
ఆ మాట చెప్పే ఆమెనే మంచం మీద ఉంది.

నర్స్ బయటకు వచ్చింది.
"తాతయ్య...
లోపలికి రండి."
అంది.
తాత గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది.
వణుకుతున్న కాళ్లతో లోపలికి వెళ్లాడు.
ఆవిడ నిద్రలో ఉంది.
ముఖం చిక్కిపోయింది.
జుట్టు పలచబడిపోయింది.
కానీ...
తనకు మాత్రం ఇప్పటికీ పెళ్లి రోజు కనిపించిన అమ్మాయే కనిపిస్తోంది.
మెల్లగా దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.
ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఎముకలు మాత్రమే మిగిలిన ఆ చేతుల్లో...
ఒకప్పుడు మొత్తం కుటుంబాన్ని మోసిన శక్తి ఉండేది.
ఆ చేతులే...
పిల్లలకు అన్నం కలిపి పెట్టాయి.
ఆ చేతులే...
తన జ్వరం తగ్గే వరకు తల నిమిరాయి.
ఆ చేతులే...
తన కష్టాల్లో తోడుగా నిలిచాయి.
మెల్లగా ఆమె చెవిలో చెప్పాడు.
"వింటున్నావా..."

"ఇంకా మన ఇంటి పెరట్లో జామచెట్టు ఉంది."

"నువ్వు నాటిన తులసి మొక్క కూడా ఉంది."

"మన మనవరాలు నవ్వుతోంది."

"నువ్వు లేస్తే చెప్పాలని చాలా మాటలు ఉన్నాయి."

కొద్దిసేపు ఆగాడు.
గొంతు వణికింది.
కళ్లలో నీళ్లు నిండిపోయాయి.

"కానీ...

నువ్వు అలసిపోయి ఉంటే...

పోరాడలేకపోతే...

వెళ్లిపో..."

"నేను ఆపను..."

"ఈ యాభై మూడు ఏళ్లలో...

మొదటిసారి నీ ఇష్టం."

అన్నాడు.
ఆ మాట చెప్పిన వెంటనే...
తన ముఖాన్ని ఆమె చేతుల మీద పెట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
ఎనభై ఏళ్ల మనిషి...
మళ్లీ ఎనిమిదేళ్ల పిల్లాడైపోయాడు.
ప్రేమ అంటే...
కలిసి నవ్వడం కాదు.
కలిసి ఫోటోలు దిగడం కాదు.
కలిసి ప్రపంచం తిరగడం కాదు.
ప్రేమ అంటే...
మనిషి మొత్తం ప్రపంచమే అయిపోయిన తర్వాత...
ఆ ప్రపంచాన్ని కోల్పోతాననే భయంతో...
చిన్న పిల్లాడిలా ఏడవడం.
ఆసుపత్రి బయట ఉన్న ఆ బెంచీకి...
ఈ విషయం బాగా తెలుసు.
ఎందుకంటే...
అక్కడ కూర్చునే ప్రతి మనిషి...
ఒక రోగి కోసం కాదు...
తన ప్రపంచం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

బయట ఆసుపత్రి ఆవరణలో ఒక చిన్న పిల్లాడు పరిగెడుతూ వెళ్తాడు.
తాత చూపు అతనిపై ఆగిపోతుంది.
అతనికి ఒక్కసారిగా తన కొడుకు గుర్తొస్తాడు.
మొదటి సారి స్కూల్‌కు వెళ్లిన రోజు.

ఏడుస్తూ...
"నాన్నా... నువ్వు కూడా రా..."
అని చేతులు పట్టుకున్న రోజు.
సైకిల్ తొక్కడం నేర్పిన రోజు.
డిగ్రీ పాస్ అయిన రోజు.
పెళ్లి రోజు.
అన్నీ గుర్తొస్తాయి.
కాలం ఎంత విచిత్రం కదా...
ఒకప్పుడు పిల్లలు మన చేతిని పట్టుకుని నడుస్తారు.
తర్వాత మనమే వాళ్ల జ్ఞాపకాలను పట్టుకుని నడవాల్సి వస్తుంది.

రాత్రి ఎనిమిది గంటలు.
విజిటింగ్ అవర్స్ ముగిశాయి.
ఆసుపత్రి నిశ్శబ్దమవుతుంది.
దూరంగా అంబులెన్స్ సైరన్ వినిపిస్తుంది.
ఎవరో ఏడుస్తున్నారు.
ఎవరో ప్రార్థిస్తున్నారు.
ఎవరో ఆశ ఎదురు చూస్తూ కూర్చున్నారు.
ఎవరో ఆశను కోల్పోయి తల పట్టుకొని కూర్చున్నారు.
ఆ బెంచీ మాత్రం అన్నింటినీ చూస్తోంది.

మళ్ళీ తాత బెంచి మీదకు వచ్చి నడుం వాలుస్తాడు. తాత జేబులోంచి ఒక పాత ఫోటో తీస్తాడు.

నలభై ఏళ్ల క్రితం తీసింది.
బ్లాక్ అండ్ వైట్ ఫోటో.
ఆవిడ నవ్వుతోంది.
తాను పక్కన నిలబడి ఉన్నాడు.
చాలాసేపు చూస్తాడు.
తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలుపెడ్తాడు.
ఎదుట ఎవరూ లేరు.
కానీ అతనికి ఆవిడ వినిపిస్తోందనిపిస్తుంది.

"వింటున్నావా?"

"నువ్వు లేకపోతే నాకు టీ కూడా తాగడం రావట్లేదు."

"ఇంట్లో మన తులసి మొక్క ఎండిపోతోంది."

"నీ పిల్లి ప్రతిరోజూ నిన్నే వెతుకుతోంది."

"నీకు ఇష్టమైన మల్లెపూలు పూశాయి."

కొద్దిసేపు ఆగుతాడు.
గొంతు బరువెక్కుతుంది.

"ఇంకా కొంచెం ఉండు..."

"ఇంత తొందరగా వెళ్లిపోకు..."

"నువ్వు వెళ్తే...

నేను ఎవరితో గొడవపడాలి?"

"ఎవరితో మాట్లాడాలి?"

"ఎవరికోసం ఇంటికి వెళ్లాలి?"

తెల్లవారుజామున నాలుగు గంటలు.

ఆసుపత్రి ఇంకా పూర్తిగా మేల్కొనలేదు.

కారిడార్లలో లైట్లు మాత్రం వెలుగుతున్నాయి.

నిశ్శబ్దం.

ఎక్కడో దూరంగా ఒక మానిటర్ "బీప్... బీప్..." అంటూ వినిపిస్తోంది.
మరో మూలన ఎవరో దేవుడి పేరు జపిస్తున్నారు.
ఆ బెంచీ మీద మాత్రం తాత కూర్చునే ఉన్నాడు.
రాత్రంతా కంటిమీద కునుకు లేదు.
కళ్ల కింద నల్లటి వలయాలు.
గుండెల్లో చెప్పలేని భయం.
అప్పుడే...

వార్డు తలుపు తెరుచుకుంది.
నర్స్ బయటకు వచ్చింది.

"తాతయ్య..."
అంది.

ఆ ఒక్క పిలుపుతోనే...
ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
ఎందుకో తెలియదు.
కొన్ని పిలుపులు వినగానే...
జీవితం మారబోతోందని మనసు ముందే పసిగడుతుంది.

"లోపలికి రండి..."
అంది నర్స్.
తాత మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లాడు.
మంచం మీద ఆమె ఉంది.
కానీ...
ఈసారి ఏదో భిన్నంగా అనిపించింది.
ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి.
చాలా రోజుల తర్వాత.
చాలా రోజుల తర్వాత తనను చూసి నవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఆ నవ్వులో శక్తి లేదు.
కానీ ప్రేమ మాత్రం ఉంది.
అదే పాత ప్రేమ.
యాభై మూడు సంవత్సరాల ప్రేమ.
తాత దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.
ఆమె చేయిని పట్టుకున్నాడు.
ఈసారి...

ఆమె కూడా తన వేళ్లను కదిలించింది.
బలహీనంగా...
కానీ స్పష్టంగా.
"ఏమండీ..."
అంది.

ఆ మాట వినగానే...
తాత గుండె బద్దలైంది.
ఎందుకంటే...
మూడు వారాల తర్వాత ఆమె తనను పిలిచిన మొదటి మాట అది.
"ఏమండీ..."
అనే పిలుపు.
అందులో యాభై మూడు ఏళ్ల సంసారం ఉంది.
వేల గొడవలు ఉన్నాయి.
లక్ష జ్ఞాపకాలు ఉన్నాయి.

"ఏమండీ..."
మళ్లీ పిలిచింది.

"చెప్పు..."
అన్నాడు తాత.

గొంతు వణుకుతూ.
"మన ఇంటి తలుపు మూసారా?"
అంది.

తాత ఒక్కసారిగా ఏడ్చేశాడు.
చివరి క్షణాల్లో కూడా...
ఆమెకు ఇంటి గురించే ఆలోచన.
ఆ ఇంటి కోసం...
ఎన్ని నగలు అమ్ముకుంది.
ఎన్ని కోరికలు చంపుకుంది.
ఎన్ని రాత్రులు నిద్రపోలేదు.
ఆ ఇంటి గురించే.

"మూసాను..."
అన్నాడు.

"తులసి మొక్కకు నీళ్లు పోశారా?"

"పోశాను..."

"మన పిల్లి తిందా?"

"తింది..."

"మన మనవరాలు స్కూల్‌కి వెళ్లిందా?"

"వెళ్లింది..."

ఆమె చిన్నగా నవ్వింది.
ఒక్కొక్క ప్రశ్నతో...
ఆమె జీవితం మొత్తం కళ్లముందు తిరుగుతోంది.
కొద్దిసేపు మౌనం.
తర్వాత మెల్లగా అడిగింది.

"నేను పోతే..."
తాత వెంటనే ఆమె నోరు మూసేశాడు.

"అలా మాట్లాడకు..."
అన్నాడు.
చిన్న పిల్లాడిలా.

ఆమె బలహీనంగా నవ్వింది.
"నన్ను ఎప్పుడూ మాట్లాడనివ్వరు..."
అంది.

అదే ఆమె పాత అలవాటు.
చావు ముందు కూడా మారలేదు.

"నేను పోతే..."
మళ్లీ మొదలుపెట్టింది.

"మీరు టైంకి భోజనం చేయాలి."

"మందులు వేసుకోవాలి."

"ఎక్కువగా ఏడవకండి."

"మన పిల్లలకు భారంగా మారకండి."

"ప్రతిరోజూ సాయంత్రం బయట కూర్చోండి."

"మల్లెపూలు కనిపిస్తే కొనండి."

"నాకు ఇష్టం కదా..."

అంది.

తాత తల వంచుకున్నాడు.
కన్నీళ్లు ఆగడం లేదు.

ఆమె అకస్మాత్తుగా అడిగింది.

"ఒక విషయం చెప్పండి..."

"చెప్పు..."

"మన జీవితంలో నేను మీకు మంచి భార్యనేనా?"
అంది.

ఆ ప్రశ్న విన్నాక...
తాత కళ్లల్లోని నీళ్లు ఆగలేదు.
ఎందుకంటే...
ఆ ప్రశ్నకు జవాబు మాటల్లో చెప్పలేడు.
యాభై మూడు సంవత్సరాలు సరిపోవు.
ఒక జీవితకాలం సరిపోదు.
మెల్లగా ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు.
బహుశా...
పెళ్లైన తర్వాత మొదటిసారి.

"భార్య కాదు..."
అన్నాడు.

"నువ్వే నా ఇల్లు."

"నువ్వే నా ధైర్యం."

"నువ్వే నా దేవుడు."

"నువ్వే నా ప్రపంచం."

"ఈ జన్మలో నేను చేసిన ఒక్క మంచి పని ఉంటే..."

"అది నిన్ను పెళ్లి చేసుకోవడమే."
అన్నాడు.

ఆమె కళ్ళలో నీళ్లు మెరిశాయి.
చాలా కష్టంగా చేయి ఎత్తింది.
అతని చెంప మీద పెట్టింది.

అదే చేయి...
ఒకప్పుడు అతని జుట్టు సర్దింది.
అదే చేయి...
అతని జ్వరాన్ని తాకింది.
అదే చేయి...
పిల్లల భవిష్యత్తును నిర్మించింది.
ఇప్పుడు...

చివరిసారి అతని ముఖాన్ని తాకుతోంది.

"ఏమండీ..."
అంది.

"చెప్పు..."

"తర్వాతి జన్మ ఉంటే..."

కొద్దిసేపు ఊపిరి తీసుకుంది.

"మళ్లీ మీకే భార్యగా వస్తాను."
అంది.

తాత ఇక తట్టుకోలేకపోయాడు.
ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

"నాకు తర్వాతి జన్మ వద్దు."
అన్నాడు.

"ఈ జన్మలోనే ఇంకొంచెం ఉండు..."
అన్నాడు.

"ఇంకో సంవత్సరం కాదు..."

"ఇంకో నెల కాదు..."

"ఇంకో రోజు కాదు..."

"ఇంకో గంట కాదు..."

"ఇంకో ఐదు నిమిషాలు ఉండు..."
అన్నాడు.

"నివ్వు లేకుండా బతకడం ఎలా అని నేర్చుకునేంత వరకు ఉండు..."

అన్నాడు.

కానీ...

కొన్ని మొక్కులకు సమాధానం ఉండదు.
కొన్ని ప్రేమలకు ముగింపు రాసి ఉంటుంది.
కొన్ని చేతులు...
ఎంత గట్టిగా పట్టుకున్నా జారిపోతాయి.

ఆమె పెదవుల మీద చిన్న నవ్వు.
కళ్లల్లో తృప్తి.
అతని చేతిలో తన చేయి.
అలాగే...
మెల్లగా కళ్ళు మూసుకుంది.

ఆసుపత్రి గది నిశ్శబ్దమైంది.
మానిటర్ శబ్దం మారిపోయింది.
డాక్టర్లు పరుగెత్తుకొచ్చారు.
నర్సులు వచ్చారు.
ఎవరో మాట్లాడుతున్నారు.
ఎవరో కదులుతున్నారు.
కానీ...
తాతకు ఏమీ వినిపించడం లేదు.
ఎందుకంటే...
అతని ప్రపంచం ఇప్పుడే ఆగిపోయింది.

ఆ రోజు సాయంత్రం...
ఆ పాత ఇనుప బెంచీ మళ్లీ ఖాళీగా ఉంది.
కానీ ఈసారి...
అది నిజంగా ఖాళీ కాదు.
దాని మీద యాభై మూడు ఏళ్ల ప్రేమ కూర్చుని ఉంది.
ఒక మనిషి జీవితమంతా కూర్చుని ఉంది.
ఒక స్త్రీ చేసిన త్యాగాలన్నీ కూర్చుని ఉన్నాయి.
ఒక కుటుంబం నిలబడటానికి తన జీవితాన్ని ఖర్చు చేసిన అమ్మ కూర్చుని ఉంది.

కొన్నాళ్ల తర్వాత...
తాత మళ్లీ అక్కడికి వచ్చాడు.
చేతిలో చిన్న మల్లెపూల దండ.
బెంచీ మీద కూర్చుని...
పక్కన ఖాళీ చోటు చూసి మెల్లగా అన్నాడు...

"ఏమే..."

"ఈరోజు కూడా పూలు తెచ్చాను..."

"నువ్వు పెట్టుకోడానికి లేవు..."

"కానీ నేను తేవడం మానలేకపోతున్నాను..."
అన్నాడు.

ఆ తర్వాత...
మొదటిసారి కాదు...
చివరిసారి కాదు...
మళ్లీ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
ఆ బెంచీ మాత్రం...
మౌనంగా అతని కన్నీళ్లను మోస్తూ కూర్చుంది.

మన జీవితంలో ప్రేమ అంటే...
పెద్ద పెద్ద మాటలు కాదు.
రోజూ "తిన్నావా?" అని అడిగే మనిషి.
జ్వరం వస్తే రాత్రంతా మేల్కొని కూర్చునే మనిషి.
మన కోపాన్ని భరించే మనిషి.
మన బలహీనతలను దాచే మనిషి.
ఆ మనిషి ఉన్నప్పుడు...
అది సాధారణంగా అనిపిస్తుంది.
లేనప్పుడు...

అదే స్వర్గం అని తెలుస్తుంది.

ఆసుపత్రి ఆ బెంచీ ఇప్పటికీ అక్కడే ఉంది.
ప్రతిరోజూ కొత్త మనుషులు వస్తున్నారు.
కొత్త కథలు.
కొత్త కన్నీళ్లు.
కొత్త ప్రార్థనలు.
కానీ ప్రతి రాత్రి...
ఆ బెంచీ ఒకటే ప్రశ్న అడుగుతుంది.
"మీరు ప్రేమించే వాళ్లు ఇంకా మీ పక్కనే ఉన్నారా?"
"అయితే ఈరోజు వాళ్లతో కాసేపు కూర్చోండి..."
"రేపు సమయం ఉంటుందనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు..." అని.
.
.
.
.
.
.
రఘు మందాటి
Episode : 428
10 జూన్ 2026
 రాజీనామా అంటే మూలభాషలో కూడా ఉద్యోగం వదిలేయటమనే అర్థమా? ఇది ఫార్సీ/అరబిక్ మూలం ఐతే, దీనికి వాడుక తెలుగులో దీటైన పదం ఉన్నదా?
రాజీనామా అనేది మూలభాషలో నేరుగా ఉద్యోగం వదిలేయడం అనే అర్థాన్ని ఇవ్వదు. ఇది అరబిక్ మరియు ఫార్సీ (పర్షియన్) భాషల నుండి వచ్చిన పదం. మూలభాషలో దీని విశ్లేషణ ఇలా ఉంటుంది:

* రాజీ అంటే సమ్మతి, ఇష్టం లేదా తృప్తి అని అర్థం.

* నామా అంటే పత్రం, లేఖ లేదా దస్తావేజు అని అర్థం.

కాబట్టి, రాజీనామా అంటే మూలభాషలో "సమ్మతి పత్రం" లేదా "సంతృప్తిని తెలిపే లేఖ" అని అర్థం. పూర్వ కాలంలో ఒక ఉద్యోగి తన స్వచ్ఛంద ఇష్టంతో, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నానని, ఇరుపక్షాలకూ సమ్మతమేనని రాసిచ్చే పత్రం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది కేవలం ఉద్యోగాన్ని వదిలేసే లేఖ (Resignation) అనే అర్థంలో స్థిరపడిపోయింది.

# దీనికి వాడుక తెలుగులో దీటైన పదాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం ఈ క్రింది పదాలను వాడుకోవచ్చు:

* పదవీ విరమణ: ఇది సాధారణంగా రిటైర్మెంట్‌కు వాడినా, పదవిని వదిలిపెట్టే సందర్భంలోనూ ఉపయోగించవచ్చు.

* పదవీ త్యాగం: ఏదైనా ఉన్నతమైన పదవిని లేదా రాజకీయ పదవిని స్వచ్ఛందంగా వదిలేసేటప్పుడు ఈ పదం బాగుంటుంది.

* స్వచ్ఛంద విరమణ: మనకు మనమే ఉద్యోగం వదులుకుంటున్నప్పుడు వాడే పదం.

* ఉద్యోగ విరమణ లేఖ / రాజీనామా పత్రానికి బదులుగా "విధుల నుండి తప్పుకునే లేఖ" అని వాడుక భాషలో సులభంగా చెప్పుకోవచ్చు.

# అయితే పరిపాలనా పరంగా మరియు వ్యావహారికంగా రాజీనామా అనే పదం తెలుగులో ఎంతగా కలిసిపోయింది అంటే, దీనికి ప్రత్యామ్నాయంగా కేవలం ఒకే ఒక్క స్వచ్ఛమైన తెలుగు పదాన్ని వాడటం కంటే, సందర్భాన్ని బట్టి "విధుల నుండి తప్పుకోవడం" లేదా "పదవిని వదులుకోవడం" అని వివరణాత్మకంగా చెప్పడమే వాడుకలో ఎక్కువగా కనిపిస్తుంది.
 ఓపిక ఉన్నవాడిదే లోకం..! తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!

జీవితంలో విజయం సాధించడానికి తెలివితేటలు, కష్టపడే తత్వం ఎంత ముఖ్యమో, ఓర్పు, సహనం కూడా అంతే అవసరం. అందుకే మన పెద్దలు సహనమే సర్వభూషణం, నిదానమే ప్రధానం అనే సందేశాలను ఎప్పుడో ఇచ్చారు.

పెద్దలు ఇచ్చిన ఈ సందేశం నేటి వేగవంతమైన జీవితంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓర్పు, సహనం గొప్పతనాన్ని తెలిపే ఓ నీతి కథను ఇప్పుడు చూద్దాం..

కథ

ఒక గ్రామంలో రామనాథం అనే వ్యాపారి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివ తెలివైనవాడు కానీ ముక్కు మీద కోపం ఉండేది. చిన్న కుమారుడు హరి మాత్రం ప్రశాంత స్వభావం, ఓర్పుతో వ్యవహరించేవాడు. తమ వ్యాపారానికి సరైన వారసుడు ఎవరో తెలుసుకోవడానికి రామనాథం ఇద్దరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. తాము పండించిన ముడి పత్తిని నగరానికి తీసుకెళ్లి, ఎక్కువ లాభంతో అమ్మి రావాలని వారిద్దరికీ చెప్పాడు.

నగరంలోని మార్కెట్‌కు మొదట వెళ్లిన శివ దగ్గరకు వచ్చిన కస్టమర్లు.. పత్తి నాణ్యత సరిగ్గా లేదంటూ ప్రశ్నలు వేయడంతో అతడు ఆవేశానికి గురయ్యాడు. వారి మాటలను అవమానంగా భావించి కోపంగా స్పందించాడు. ఫలితంగా కస్టమర్లు వెనక్కి తగ్గి శివ దగ్గర పత్తిని కొనుగోలు చేయకుండా వెళ్లిపోయారు. రోజంతా చూసి చివరికి శివ పత్తిని తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది.

మరుసటి రోజు మార్కెట్‌కు వెళ్లిన హరి మాత్రం అదే పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు. పత్తి నాణ్యతకు సంబంధించిన కస్టమర్ల సందేహాలను ఓపికగా విన్నాడు. పత్తి నాణ్యతను మర్యాదగా వివరించాడు. అతని వినయం, సహనం చూసి కస్టమర్లు ఆకర్షితులై మంచి ధరకు మొత్తం సరుకును కొనుగోలు చేశారు. దీంతో హరి అధిక లాభంతో ఇంటికి చేరుకున్నాడు.

నీతి

ఈ సంఘటన ద్వారా రామనాథం ఒక ముఖ్యమైన పాఠాన్ని తన కుమారులకు బోధించాడు. కోపం మనిషిని నష్టపరుస్తుంది. ఆవేశం సరైన నిర్ణయాలను తీసుకునే విచక్షణ శక్తిని తగ్గిస్తుంది. కానీ సహనం సరైన నిర్ణయాలు తీసుకునేలా చేసి మనల్ని విజయ మార్గంలో నడిపిస్తుంది. ఇతరుల విమర్శలను, కష్టాలను, ప్రతికూల పరిస్థితులను ఓర్పుతో ఎదుర్కొనే వ్యక్తే చివరికి విజేతగా నిలుస్తాడు.

అందుకే ఓపికతో ఉన్నవాడిదే లోకం. సహనం అనేది బలహీనత కాదు, జీవితాన్ని గెలిపించే గొప్ప ఆయుధం.
 *యోగి వేమన -13*

రచన : మాలయశ్రీ 


*వేమన కవితాసారం...*

వేమన భావాలు పండితమ్మన్యులకు, మత ఛాందసులకు, దుష్టపాలకులకు, దోపిడీ దొంగలకు తలకంటకంగా ఉండేవి. కాని, సామాన్య జనానికి ఆవే విత్ర మంత్రాలు, శిరోధార్యాలు.

ఏ ప్రభుత్వాలు కాదు, పండిత పరిషత్తులు కాదు, సామాన్య ప్రజలే వారి పద్యరత్నాలను తాళపత్ర గ్రంధాల్లో వ్రాసి అమూల్యంగా భద్రపరచు కొన్నారు. ఈ తరానికి తరగని నిధిగా అందించారు.

వేదాంత భావాలను పట్టిచూస్తే అద్వైత ప్రభావం, విగ్రహారాధన వ్యతిరేకత, కులమతాల విముఖత ఆయన కవితల్లో వుంది.
📖

*వేమన మానవతావాది*

ఆయన ఆరాధించిన శివుడు- జీవుడు. పేర్కొన్న యముడు మృత్యువు పరానికంటే ప్రస్తుతానికే విలువిచ్చాడు విశ్వసించాడు.

కాలానికి ముందున్నవాడే క్రాంత దర్శి. వేమన నిజమయిన ప్రజాకవి. ఆకలిని నిరసించి "సర్వేజనాః సుఖినోభవంతు” అనే ఆదర్శ సిద్ధాంత ప్రవర్తకుడు.

దైవానికి మించి ధర్మానికి విలువిచ్చాడు. విధి వ్రాతను కాదని స్వయం కృతానికి పట్టంకట్టాడు.

మంచియన్నది మాలయైతే-మాలనేయౌదున్, అనిన గురజాడ మహా కవి కంటే కొన్ని వందలేండ్లకు పూర్వమే మాలలను ఇతర మానవులతో సమానమన్నాడు..
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
గాంధీజీది దైవభక్తి ప్రేరితమైన హరిజనోద్యమం. కాని మన వేమనది కులమతాలు లేని నవ్యమానవతావాదం. కాలం దినదినం దిగజారిపోతున్నదా అనిపించుతుంది, ఇప్పటికీ మన సమాజంలో స్వార్ధ సంకుచిత భావాలు వుండడం శోచనీయం.

ఈ కాలంలో కొందరు దొంగసాధులు గుర్రపుస్వారితో పగటి దివిటీలు, బాజాలతో వేమన శిష్యులమని సంచారంచేస్తూ ప్రజల్ని దోపిడీ చేస్తూ కనిపించడం మనజాతి దౌర్భాగ్యానికి చిహ్నం.

ఆంధ్ర కవుల్లో నవీనుల సంగతి వదిలితే ప్రాచీనుల్లో ఇంతటి ప్రగతి శీలియైన ప్రజాకవి కాగడాలతో వెదకినా మరొకరు కనిపించరనుట అతిశయోక్తి కాదు.

భాషావ్యాకరణ దోషాలు ఏవైనా వుంటే అవి ఆయన భావసంపత్తి ముందు లెక్కలోనికిరావు. ఈనాడు సాగిస్తున్న వ్యావహారిక భాషా ఉద్యమానికి ఆయనే ఆద్యుడనొచ్చు. ఆ భావాల వెగటువల్లనే వేమనను శిష్టకవుల పంక్తికి రానీకుండా మనవాళ్ళు గట్టిప్రయత్నం చేశారు. అందుకేనేమో కవి వేమనను, యోగి వేమనగా ప్రచారం చేశారు. యోగానికి ఆ కవి పెద్దపీటను వేయలేదు, పైగా వెక్కిరించాడు కూడా. జనం వేమనను మరచిపోలేరు కనుక కవి పేరునయినా మరిపించాలని చూశారు. హిందూ మతాన్ని నిరసించిన గౌతమబుద్ధుని విష్ణుమూర్తి దశవతారాల్లో ఒకనిగా మార్చిన ఘనులు కదా మన పూర్వులు. అయినా సూర్యకాంతికి అరచేతిని అడ్డుపెట్టి ఆపగలరా? ఆది వారికి సాధ్యంకాలేదు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వేమారెడ్డి తన పేరును వేమనగా చెప్పుకోవడమే ఒక విశేషం. కాదు అనుకుంటే రెడ్డి శబ్దాన్ని తన పద్య మకుటంలో ప్రయోగించేవాడే.

అసలు సిసలయిన అచ్చపు ఆంధ్రకవి వేమన. అజరామర కవితను మనకు అందించినందులకు కృతజ్ఞతాపూర్వక అంజలు లర్పించుకుందాం.

తన సాహిత్యంతో జనం గుండెల్లో గూడుకట్టుకొని నాలుకలపై ఆట వెలదిని నాట్యమాడించి, గుండె బలం ఆదర్శం పెంచిన ఈ మహాకవి తన వార్ధక్య దశలో కీర్తిశేషులైనారు, కడప [అనంతపురం] జిల్లాలోని కటారుపల్లెలో వేమన సమాధిని భక్తిశ్రద్ధలతో జనం నేటికీ పూజిస్తున్నారు.
📖
*వేమన జన్మ ధన్యం ఆయన పద్యాలు మాన్యం*

ఆంధ్రదేశంలో తెలుగు కవిత నిలిచి వున్నంత కాలం వేమన కవిత నిలిచి వుంటుంది. వారి పద్యాలు ఆణిముత్యాలు — అక్షర సత్యాలు. అందులో ఏ కొద్ది మొత్తమో కాలదోషం పట్టిన భావాలు వుండవచ్చును. కాని ముప్పాతిక మువ్వీసం చెన్ను తరగనివి, వాసి చెడనివి, వాడి వీడనివి. అందులో అర్ధాంశమైనా ఆచరణ లోకి తెస్తేనే మనం ఆంధ్రులం — లేకుంటే? అంధులం — అని వేరే అనాలా! అచ్చమైన ప్రగతిశీల సజీవ కవితా చైతన్యమూర్తి వేమన.

ఆ ప్రజాకవి కీర్తి అజరామరం ! 
📖

*కొన్ని వేమన పద్యాలు*

అన్ని దానములకు అన్నదానము మిన్న కన్న వారికంటె ఘనులులేరు ఎన్న గురునకంటె ఎక్కువలేదయా విశ్వదాభిరామ వినురవేమ.

ఉప్పులేనికూర ఒప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడె ఆధిక సంపన్నుడు —విశ్వదాభిరామ వినురవేమ.

తామసింపజేయ తగదెట్టి కార్యంబు 
వేగిరింప నదియు విషమమగును పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనె—
విశ్వదాభిరామ వినురవేమ.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ?
విశ్వదాభిరామ వినురవేమ.

చిత్తశుద్ధిచేత చేసిన పుణ్యంబు 
కొంచెమైన నదియు కొదువ కాదు 
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత ?
విశ్వదాభిరామ వినురవేమ.

చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగమేలు చేసి పొమ్మనుటయే చాలు
విశ్వదాభిరామ వినురవేమ.
🙏🙏
*సమాప్తం*
*సర్వేజనా సుఖినోభవంతు* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 *చిటారుకొమ్మన చీకటి* *పొట్లం* ?

                -------వేణుమరీదు
                         ( ఖమ్మం) 

 _బుద్ధయ్య అలా తోటలోకి అడుగుపెట్టాడో లేదో ఆ మామిడిచెట్టు అమాంతం అతణ్ణి కౌగిలించుకుంది. 
“అబ్బ నా పిల్లగాడా....ఎన్నేళ్ళయింది నిన్ను చూడక” అంటూ రెండు లేత క్రిందికొమ్మల్ని వంచి ఏనాడో జాతరలో తప్పిపోయి తిరిగొచ్చిన బిడ్డను హత్తుకున్నట్లుగా దగ్గరకు తీసుకుంది.
“అబ్బా నీ ఉబ్బు... నీ ఇష్టం పాడుగాను! వదలవే తల్లీ... అబ్బా... నాకు ఊపిరాడట్లేదూ...”
చెట్టు తన పట్టును విడిచింది. బుద్ధయ్య ఊపిరితిత్తుల్నిండా గాలి గుంజుకున్నాడు.
“సరేగానీ చెట్టమ్మా... నిన్నెందుకిలా ఇనుప తీగెలో బంధించారు?”
“ఖైదు బుద్ధయ్యా ఖైదు! నేలకే గాదు... చెట్టుకూ పుట్టకూ ఖైదు! మనూళ్లో పెదనర్సయ్యగాడు తెలుసుగా. వాడు ఈ ప్లాటు ముక్కను కొన్నాడంట. నేనేమో ప్లాటు నడుమన వున్నాను. చుట్టూ రాళ్లుపాతి ఇనుపకంచె వేస్తుంటే “అరే నర్సీ... భూమి కొంటే కొన్నావు. నన్నెందుకురా ఖైదు చేస్తున్నావ్?” అని నిలదీసా.
“-ఎక్కువ తక్కువ మాట్లాడితే నిట్టనిలువునా నరికిపడేస్తా నీ యవ్వా ముసలిచెట్టా- అని వాడు బూతులాడాడు. బుద్ధయ్యా... నువు చెప్పు. చెట్టును తిట్టొచ్చా? పుడమి కానుపులం మేము. తరువేగా నరుని ఆదరవు. నర్సయ్యను వెనక్కు పిల్చిమరీ తిట్టాలే! ‘అరే నర్సీ! నీ యింట్లో వాళ్ళైతే ఎట్లాబడితే అట్లా పైలా పచ్చీసుగా తిరగొచ్చు! నేనేమో ఈ ముళ్లఫెన్సింగులో ఖైదీని కావాలా?’ అంటూ ఇంకా ఏవేవో తిట్టాలే. వినపడనట్లు నటిస్తూ పోయాడు నాయాలు!” అంటూ ఒళ్ళంతా ఊపుతూ ఇకిలించింది ఆ వృద్ధవృక్షం. ఆ ఊగుడుకు నాలుగు గిడసబారిపోయిన కాయలు రాలాయి. 
బుద్ధయ్య కాళ్ల ముంగిటపడ్డ ఒక కాయనందుకుని కొరికాడు.
“అబ్బా... రొడ్డ... రొడ్డ... ఏంటేతల్లీ? నీ చెట్టుకాయ చక్కెరలా తియ్యగా ఉండేది. యిప్పుడేంటి ఇలా పుల్లగా?”
“వయసై ముదిరిపోతూవుంటే రుచులైనా, అభిరుచులైనా మారిపోవలసిందేగా నాయనా!”
“సరే ఓకేలేగానీ... మరి మనవాళ్లంతాయేరి? ఆ ముంతమామిడి, జొన్నలరాశి చెట్టు, కొబ్బరిమామిడి, కోతిపిర్ర చెట్టు, ఇమాం పసంద్ కోసుకొని తింటుంటే జున్నుముక్కల్లా కమ్మగా ఉండే ఆ మధురఫలాల దశేరి మామిడి.... ఏవి ఆ చెట్లన్నీ కనపడట్లేదు?”
నీకు పక్కనే పొరుగింటోళ్లలా ఉండే నీలం, రసాలు, జలాలు ... ఏమైపోయాయి? నీ వెనుక ఆ తోతాపురి చెట్లేవి? పాతిక బంగినపల్లి చెట్లకు బదులు నువ్వోక్కదానివే మిగిలావే?”
బుద్ధయ్య కనుమరుగైన రక్తసంబంధీకుల కోసం ఆరా తీసినట్లుగా ఆందోళనగా అడిగాడు.
ఆ ప్రశ్నలు వింటూనే చెట్టు పొగిలి పొగిలి ఏడవసాగింది. తన చిటారు కొమ్మల్ని వంచి వంచిత ఐన ఓ పడతి గుండెలు బాదుకున్నట్లు తన మోడుకేసి మోదుకోసాగింది.
“అయ్యా బుద్ధయ్యా... నన్ను కూడా రేపోమాపో నరికేసి బండికెత్తి ఏ పీనుగునో కాలెయ్యటానికి బొందలగడ్డకు తోలమని చెప్పు నాయనా! మా మానులూ మనుషుల మాదిరే కునారిల్లి కూలుతున్నాం!” అని రోదిస్తూ ఆ ప్రౌఢ మామిడిమాను అదాటున తాడిచెట్టంత మనిషై భీకరంగా నిలబడింది. నిలబడిన ఆ మానుమనిషి ‘ఆకులో ఆకునై... పూవులో పూవునై... కొమ్మలో కొమ్మనై.... నునులేత రెమ్మనై’ అంటూ కృష్ణశాస్త్రి గారి పాటను భైరవిరాగంలోకి మార్చుకొని ఆర్ధ్రస్వరంతో పాడసాగింది.
పాట పూర్తికాగానే మళ్లీ మానై పచ్చగా నిలుచున్న ఆ మావిచెట్టు అంతలోనే తన మండల్ని డేగల రెక్కల్లా టపటపలాడిస్తూ నిర్వికారంగా నవ్వుతూ, “హ్హ హ్హ హ్హ... ఏవిరా ఆకులు? ఏవిరా కొమ్మలు? ఏవిరా రెమ్మలు? ఓ మనిషీ ! బుద్ధయ్యా... ఏదిరా వసంతం? అదిగో వాడింది! ఏదిరా హేమంతం? అదిగో మండింది! ఏమైంది వర్ష ఋతువుకు? ఎండింది! ఎక్కడ ఆ శరదృతువు? చచ్చింది! ఐతే యిక ఈ ఇలలో... అందరి కలలో... ఘడియ ఘడియకు గ్రీష్మమే... అడుగు అడుగుకీ శిశిరమేనా? అయ్యయ్యో... కృష్ణశాస్త్రిగారూ... క్షమించాలి మీరు!” అంటూ దు:ఖాతిశయం తనను కమ్ముకోగా కీచుగొంతుకతో “ఆరు ఋతువులు... ఆమని వేళలె మన తోటలో... మరచిపోకుమ తోటమాలి... పొరపడి ఐనా మతిమాలి” అంటూ బిగ్గరగా పాడసాగింది.
బుద్ధయ్య నుదుటి చెమట కణతల మీదుగా చంకల్లోకి యింకిపోయింది.
“ఆర్నీ చెట్టమ్మా... ఫాంటసీ, మ్యాజిక్ రియలిజంలో వందల కతలు రాసిన నన్నే అబ్బుర పరిచావే! యింతకే చెట్లన్నీ ఏమైనాయంటే ఏంటలా ఏడుస్తావ్? ఆయమ్మ అయ్యలు... రేణుకత్త, పెద్దిరెడ్డి మామ... ఎంత నెనరు వాళ్లకు ఈ తోటంటే. పాపం... వెన్నుపూసనుకాల్చే ఎండల్లో... ఒంట్లో మాంసం ఉడికిపోతున్నా... కడవల్లో, కావిళ్లలో ఊరిచెరువునుండి నీళ్లు మోసుకొచ్చి ఎంతో మక్కువతో పెంచుకున్నారు. జిహ్వాకో రుచి కదా... అన్ని నాలికలకు కావాల్సిన అన్నిరకాల మామిడి మధురాలను పంచాలని యిద్దరూ ఆరాటపడ్డారు. పెంచారు. ఏవా చెట్లన్నీ? ఎటుపోయాయి? చెప్పవే?”
“ఎటుపోయాయి? కర్రలై కాటికిపోయాయి! పుల్లలై పుర్రెలతోపాటు పేలాయి! అదంతా చెప్తాలేగానీ... నువ్వేంటిలా బుద్ధయ్యా? లిల్లీకాడలా నాజుగ్గా ఉండేవాడివి. రేవుకాడ తాటిమానులా భలే పెరిగావే! మీసం కూడా నెరుస్తుంది. మళ్ళీ యిటెందుకొచ్చినట్లు?”
“మళ్లీ లిల్లీలా కావటానికి!”
“కుదరదు”
“నీకేం ఉబ్బు?”
“ఉబ్బుగాదు. అది గబ్బు!”
“ఏంటి?”
“మళ్లీ బాల్యంలోకి మరలటం... కుదరదు!”
“నాకు కుదురుతుంది. నే సగం బాల్యమే గడిపానిక్కడ!”
“ఓహో! బాల్యం బాకీ ఉందా! ఐతే ఉండిపోలే! నాకూ తోడులేక నా నీడ కూడా ఉత్తగనే పోతుంది”. 

“యింతకూ విషయం చెప్పు. నీ తోటిచెట్లన్నీ ఏమయ్యాయి? ఎవడీ తోటనిలా ముక్కచెక్కలు చేసింది? చుట్టూ రాతి స్థంభాలునాటి ఈ ఇనుప కచ్చడాలు కట్టిందెవడు?
“భూమి నాదన్న భూమి ఫక్కున నవ్వు... ఎవడిన్నాడు గనుక వేమన్న మాట. అంతా రియలెస్టేటు మహిమ నాయనా. కొన్నేళ్ల కిందట... పెద్దిరెడ్డి మామ ప్రాణం అట్లా పోయిందో లేదో... వారసులు చిన్నదినం నాడే ఆస్తులు పంచుకున్నారు. ఊరితో పేగుబంధం తెంచుకున్నారు. తోటనెవడో గన్నాయిగాడికి అమ్మారు. వాడు దీన్ని తూట్లుతూట్లుగా చదునుచేసి ప్లాట్లుప్లాట్లుగా అమ్ముకు నూకిండు!”
“అయ్యో...అయ్యో... అగో అక్కడ నైరుతి మూలన... ఆ ముంతమామిడినీ నరికేసారా”
“లేదు”
“మరి?”
“తనే ఉరేసుకుంది!”
బుద్ధయ్య వెన్నుపూస కంపించింది. కడుపులో దేవింది.
“అదేంటి? ఉరేసుకున్నదా? ఎవడైనా చెట్టుకు ఉరేసుకోటం విన్నాగానీ చెట్టే ఉరేసుకుందా? తనకంత కష్టమేమొచ్చింది చెట్టమ్మా?”
“అది మా అందరికన్న పెద్దది... మంచీ చెడూ మాకు చెప్పాల్సింది. కుక్కయినా మొక్కయినా తనను సాకినోడే తండ్రి. పెద్దిరెడ్డి మామ చచ్చిపోయిననాటినుండి ముంతమామిడి మాను మనాదిపడ్డది. అదీగాక మీ పిల్లలంతా రావటం మానేశారు. యిక తన చుట్టూ రాతిగుంజలు పాతి ఇనుపముళ్ళు బిగించేసరికి గుండెపగిలింది. మనోవ్యాధికి మందులేదు కదా. తాను ఒంటరినైపోయానంటూ, తన అమ్మానాన్నల వంటి రేణుకమ్మ, పెద్దిరెడ్డి మామ, అలాగే దేశాంతరాలు పోయిన మీ సోపతులంతా ఎందుకని కన్పించకుండా పోయారని ప్రతిరాత్రీ పొగిలి పొగిలి ఏడ్చేది. ఆఖరికి తనంత తనే ఓ పెనుతుఫాను గాలికి ఆ ఇనుప ఫెన్సింగు మీదకు కూలి ఆ లోహపు ముళ్లతీగల్ని వేర్లకు చుట్టలుచుట్టలుగా బిగించుకుని ఊపిరొదిలింది!
బుద్ధయ్య కన్నులు కన్నీటి నాలాలై పొంగాయి. ఏడుస్తూనే ఇంకో చెట్టును గుర్తు చేసుకున్నాడు, “మరి ఆ తల్లేది? ఆ పెద్దరసాల చెట్టు? రేణుకత్త గుండెల్లో ఎంత ఔదార్యం ఉండేదో ఆ చెట్టుకూ అంత...”
“ఔదార్యం ఒకనాటి జీవన సౌందర్యం బుద్దయ్యా. యిప్పుడంతా వ్యాపారం. పైసా దే... పైసా లో! ఐనా... మనిషి మారినా మాను మారునా? ఆ రసం చెట్టు వయసు మీద పడకుండానే జబ్బుపడ్డది. ఎలా అంటే అది ఉన్న ఆ ప్లాటులో ప్లాటు ఓనరు ఆ మధ్య కన్నడం వాళ్లతో బెల్లం గానుగలు పెట్టించాడు. అల్లం బెల్లం అంతా అదేదో ఆర్గానికంటగా యిప్పుడు! గానుగల దగ్గర పారబోసిన బెల్లం జిడ్డు, పిప్పి తీపికి అక్కడ లక్షల్లో చీమలు చేరాయి. వాటన్నిటికీ రసం చెట్టే ఇల్లయింది. అప్పట్లో మిమ్మల్ని అనుకున్నట్లే అన్ని చీమల్నీ తనబిడ్డలనే ఆదరించింది. ఓ రోజు ఆ ప్లాటు కొన్నాయన పిల్లలు ఆటకని తన కొమ్మలపై దూకుతుంటే ఆ మాను పులకరించిపోయింది. కానీ చీమలు వాళ్లను గట్టిగా పట్టిపీకాయి. కోపంతో ఆ ప్లాటు ఓనర్ మందు చల్లమని పనోళ్లకు చెప్తే వాళ్ళు తెలిసీతెలియక ఏదో ఆమ్లపు రసాయనం స్ప్రే చేసారు. అదీ మోతాదుకు మించి. దాంతో వొళ్ళంతా కురూపిలా ఐన తనను తాను చూసుకొని రేయింబవళ్ళూ శోకాలు పెట్టేది. ఎన్నో తరాలపాటు మధుర రసఫలాలిచ్చిన ఆ చెట్టు... పిల్లల్నీ, పిట్టల్నీ, పురుగుల్నీ అమితంగా ప్రేమించిన పెద్ద రసాల చెట్టు... మెలమెల్లగా కుంగి కృషించి ఒంటిపై ఒక్క మారాకు కూడా తొడగక, ప్రేమగా పిలుస్తున్నా ఏ చిలుకా ఏ బాలికా తన దరిచేరక... వాడిపోయి, తనువు మాడిపోయి మోడై కూలిపోయింది...” అని ఆర్తిగా పలికింది ఆ బంగినపల్లి మామిడి చెట్టు స్వరం.
“అయ్యో తల్లీ...అలా రాలిపోయిందా మన రసాల చెట్టు. హార్ట్ ఫెల్ట్ రిప్ టు మై బిలవిడ్ మ్యాంగో ట్రీ”
“ఆ... ఆ... ఈ రోజుల్లో మనుషులు ఓ రిప్ పడెయ్యటం తప్ప యింకేం చేయగలరులే”
“చెట్టమ్మా... నీకు మా రుక్మమ్మత్త తెలుసునా?”
“హాఁ.... తెలియకనే? మడమలనుండి చెంపలదాకా పసుపు రాసుకుని బోనమెత్తుకుని నడిచొస్తుంటే అమ్మోరే ఆమెలా కదిలొచ్చినట్టుండేది అప్పట్లో...”
“చిత్రం... మనుషులు మరచిన మనుషుల్ని మానులు తమ యాదిలో పదిలపర్చుకోవటం... నువు గొప్పదానివి చెట్టమ్మా... అచ్చం మన రుక్కమ్మత్తలానే... మొదలు కొమ్మలనుండి చిటారు కొమ్మల దాకా విరగకాసి పసుపువన్నెల పండ్లతో పెద్ద ముత్తయిదువలా హూందాగా అక్కడ ఆ కొసన నిలబడుండే ఆ దశేరి మామిడిచెట్టేది కాకా?”
“ఔనౌను బుద్ధయ్యా... నిండాకాసి నిండు గర్భిణిలా అగుపించే దశేరిని మీరంతా సరదాగా ‘అత్తచెట్టు... అత్తచెట్టు’ అని పిల్చుకునేవాళ్లు! అసలారోజుల్లోనే ఎక్కడో ఉత్తరాదినుండి ఆ దశేరి అంటు మొక్కను తెప్పించుకుని మరీ తోటలో వేసాడు. ఆ చెట్టంటే ఆయనకు గుట్టంత గావురం. తానో మైసూరు మహారాజానన్నట్లు ఆ దశేరి మావినే తన ప్యాలేసన్నట్లు ఆ చెట్టునీడలో ఓ పెద్ద కుర్చీ వేసుకుని ఓ తీపికునుకు తీసేవాడు. ఢిల్లీ సేట్ నుండి గల్లీ గరీబ్ వరకూ ఆ దశేరి మామిడి కాయలకోసం ఎగబడేవాళ్ళు. ఆ ఒక్క చెట్టు కాయల్తోనే పెద్దిరెడ్డి మామ జేబులు వందనోట్లతో నిండిపోయేవి. కానీ చివరికి? చనిపోయేముందు పెద్దిరెడ్డి మామ ఆ దశేరి చెట్టు వున్న కొంత తోటభాగాన్ని అల్లుడికి పంచాడు. తర్వాత మీ తెలుగుమాస్టారు రామేశ్వరం పంతులుగారి కొడుకు ఆ చెట్టున్న తోటభాగం రెండు కుంటలు కొన్నాడు. నీకు తెలుసుగా బుద్ధయ్యా... వాడుత్త హవ్ లా... లోభి.. దురుసు మనిషి... బండమూర్ఖుడు. తన ప్లాటు చుట్టూ ముళ్ళ ఫెన్సింగ్ వేయించాడు. అంతటితో ఆగక తన జాగనెవడో పెరుక్కుని పోతాడేమో అన్నట్లు దట్టంగా రేగు పరిగకంపలు, ఇంగ్లిష్ తుమ్మచెట్లు పెంచాడు. ఎవరూ పట్టించుకోకపోయినా పోషణగీషణ ఏదీ లేకుండానే దశేరి చెట్టు ఆ యేడు విరగకాసింది. సిటీలో వుండే రామేశ్వరం పంతులు గారి కొడుకు ఓ రోజు తన ప్లాటు చూసుకోవటానికి వచ్చాడు.  చెట్టుకు కాపలా పెట్టుకున్న లచ్చయ్య అదే సమయంలో రెండు పండ్లు కోసి తన మనవరాలికిస్తుంటే అతను చూసి లచ్చయ్యను బండ బూతులు తిట్టాడు. ఆ చిన్న పాపను కూడా ఏదో అన్నదని కొట్టాడు. పంచాయితీ అయింది. అతగాడు తలదించుకుని తప్పుగట్టాడు... పాతిక వేలు. లేకపోతే కులదూషణ కింద కేసయ్యేది.
“మరి దశేరి సంగతేమైంది?”
“ఏమైతుంది! ఎంత భోగమో అంత రోగమన్నట్లు ... ఆ హరిత అప్సరస సజీవ దహనమైంది. పంచాయితీ ఐన తెల్లారే ‘అసలీయవ్వారమంతా ఈ చెట్టు వల్లనే... బొచ్చులో దశేరి... ఇదేమన్నా కల్పవృక్షమా?” అని మండిపడుతూ ఆ తెలుగు పంతులు గారి కొడుకు అదేదో పొగలుకక్కుతున్న ఆమ్లం తెచ్చి చెట్టు మొదట్లో పోయించాడు... అదంతా చూసిన రామేశ్వరం పంతులుగారి కోడలు నెత్తీనోరు కొట్టుకుంటూ ఆ రోజు ‘ఓ పాపిష్టోడా... ఛీ ఛీ... పెళ్లాం పిల్లల మీదనే అనుకున్నా... నీ రాకాసితనం చెట్ల మీదకు కూడా మల్లిందా? ధూత్... నిండు చూలాల్లాంటి ఆ పండ్లచెట్టుని చంపటానికి నీకు మనసెట్లా వొప్పిందసలు?’ అని మొగుడిపై లడాయికి దిగింది.
“నీకెలా తెలుసు ఇవన్నీ?” చకితుడయ్యాడు బుద్ధయ్య.
“మీకున్నవి పంచేంద్రియాలేగా బుద్ధయ్యా! ఆ ఇంద్రియాల ఆయువుకు, ప్రాణవాయువులందందించే మా తరువుల్ని మీకు బరువులైనట్లు కూలుస్తూ మమ్మల్ని ఆఖరికి మోళ్ళు, మొద్దులు అని భావిస్తారే! అదే మీ పిచ్చితనం... ఎదగని పసితనం! ఎక్కువ మంది మనుషులు తమ ఆకలిదప్పికలు, తమ సుఖస్వార్థాలు మించి యిక ఎదగలేరనిపిస్తుంది... వృక్షానిది మాత్రం విశ్వమంత వీక్షణమని ఎరుగరు మీరు!”
“ఒప్పుకుంటాం చెట్టమ్మా ... నీకు అటూ యిటూ ఆమడదూరంలో ఉండేవి... అ చిన్న రసం చెట్లు, తోతాపురి చెట్లు, యింకా ఆ జలాలు, నీలాలు, ఇమాం పసందు చెట్లూ...  ఏవవి?” 
“అవన్నీ పెద్దిరెడ్డి మామ చిన్నకొడుకు భాగానికి పోయాయి. అతగాడేమో తాను ఉంచుకున్న పెంచలమ్మకు ఆ చెట్లున్న భూమిని రాసిచ్చాడు. ఆవిడ కొడుకు... అదే ఆ కలప డిపో నడిపే సీనయ్య... ఆ చెట్లన్నీ నిలువునా నరికించేసి కొమ్మకొమ్మకూ కాసుల్లెక్కేసుకున్నాడు సన్నాసెధవ... నా తోటి మానులవి... నా కళ్లముందే కూలిన నా సోపతులు... కష్టసుఖాల్లో నా యిరుగుపొరుగు... ప్రతి వేసంగినాటికీ ఫలభారంతో మేము అలసిపోయి, పంటకానుపునంతా మా యజమానికి పంచి... పచ్చి బాలింతల్లా మేము మగతగా మాగన్నుగా అసుర సంధ్యల నులి వెచ్చదనంలో విశ్రాంతి పొందే ఘడియల్లో... చిరుగాలులతో కూడి ఆకులు సవ్వడులయుగళగీతాలు పాడుకునేవేళల... వానకారు కోయిలలు తమ ప్రవాసాల వనవాసాలనుండి మరలొచ్చి మమ్మల్ని కమ్మగా పలకరించే వేళల... ఈదురుగాలులకు మా చిటారు కొమ్మల తలలను తోటి చెట్ల తలలతో ఆప్యాయంగా స్పృశించుకుంటూ... ఒకరి చిగురాకులపై పడిన జల్లుల్ని మరొకరిపై అల్లరిగా చిలకరించుకుంటూ... తుఫానుల అలజడికి అతలాకుతలమైపోయి మనిషీ మృగమూ, పురుగూపిట్టా అన్నీ పారిపోయి కొంపల్లో, కలుగుల్లో గజగజ వణికే వేళల్లో కూడా... గుడిలో దేవరలకు సైతం వొళ్ళు ఝల్లనిపించే అగ్గిపిడుగుల హూంకారఘీంకారాలను విని కూడా ఓ నవ్వు మాత్రం నవ్వేసి నిబ్బరంగా ఉప్పెనల సవాళ్లకు సైతం ప్రతిసవాళ్లు విసిరి, ప్రకృతి బీభత్స తాండవానికి సైతం నిలబడ్డాంగానీ... మనుషుల స్వార్థపు గొడ్డళ్ళకు, భూదాహానికి మాత్రం ఘోరంగా బలవుతున్నాం బుద్ధయ్యా...”  
“ఔనమ్మా... నూరుపాళ్లు సత్యం చెట్టమ్మా... మా తాతలు మందిరాల దగ్గర రావిచెట్లు, జమ్మి వృక్షాలు పెంచారు. ఈ తరం వాటిని కూలదోసి కుండీల్లో కాక్టస్ లు పెంచుతున్నాం... నీదీ నాదీ ఒకటే బాధ... ఈ మధ్యనే ‘ది లాస్ట్ బన్యన్ ట్రీ’ అనే నవల రాసాను కూడా... హిట్టయింది... మిలియన్ కాపీస్ సోల్డ్ ఔట్...”
“ఓహో మా బుద్ధయ్య రైటరయ్యిండా! ఎంత సంతోషం. మరి నీ దోస్తుల సంగతేంటి? ఏమయ్యారు? రఘు, చందర్, సాహిల్, కుమార్, తిరుపతి, ముస్తాఫా, తలసి, రమణి, మాధవి, సుధ... మీరంతా నా కొమ్మలపై దూకుతూ, నా కాండంపై పాకుతూ, అప్పుడప్పుడూ జారిపడి అంతలోనే లేచి యికిలిస్తుంటే... నా వొంటిపైని మారాకుల నరాలు తీపిరాగాలు పాడేవి... అపుడు నా వేర్లు నేలతల్లి గర్భంలో శిశువుల్లా కదలాడేవి. రాత్రంతా కనిపించని బిడ్డల కోసం పలవరించి పలవరించి పొద్దు పొడవగానే మీ లేతపాదాల నులివెచ్చదనం నా పచ్చనిదేహాన్ని ఎపుడెపుడు ప్రియమారంగా తాకుతుందా అని ఆత్రంగా ఎదురుచూసేదాన్ని... మిమ్మల్ని నా కొమ్మల రొమ్ముల మాటున అబ్బురంగా పొదుపుకుందామని తహతహలాడేదానిని బిడ్డా... ఏరి ఆ పిల్లలంతా? అసలు గుర్తున్నారా నీకు?”
ఆ ప్రశ్నకు బుద్ధయ్య దేహంలో పెద్ద పెద్ద అద్దాలు పగిలినట్లుగా, అలలు అలలతో తాడనం చేసుకున్నట్లుగా ఏదో హోరు వినిపించింది. ఆ వెంటనే అతని రెండు పాదాలూ బారు వేర్లలా నేలలోకి చొచ్చుకొనిపోయాయి. అతని మొండెం కాండంగా మారింది. అతని శిరోభాగంపై కొమ్మలు రెమ్మలు ఎత్తుగా మొలిచి అదాటున అతనో సాలవృక్షమై నిలిచాడు. యింతలో అక్కడ పల్చగా మంచుధారలు పారిజాతపూల చిరుజల్లుల్లా కురవటం మొదలైంది. ఆ తోట కొన్ని ఘడియలపాటు లుంబినీవనంలా దర్శనమిచ్చింది. బుద్ధయ్యనుండి మొలిచిన సాలవృక్షపు కొమ్మను తన వామహస్తంతో బిగించిపట్టుకుని యక్షిణులు తమ చెంగులను చుట్టూ పరచగా అమ్మ మహామాయ సిద్ధార్థుడిని కన్నది. ఆ శిశువు నిల్చోని ఏడు అడుగులు వేసాడు. అడుగు అడుగుకో పద్మం మొలచింది. ఆ వెంటనే ఆ శిశువు యువకుడై ఎదిగి బోధివృక్షం క్రింద ధ్యానముద్రలో ఉన్నట్లు, ఓ లిప్తపాటు వెలిగి మరునిమిషమే మృగదావనంలో ఐదుగురు శ్రమణులకు నాలుగు పరమ సత్యాలను బోధిస్తున్నట్లు ఓ చిత్రం కదలాడింది. ఆ ప్రదేశమంతా క్రమంగా చిన్నారుల మృదు బృందగానంలా త్రిశరణాలు ఓ సంగీతఝరియై అష్టదిక్కులా వినిపించసాగాయి.
అదంతా ఓ చిత్రదర్శినిలో వెంటవెంటనే మారిపోయే వర్ణచిత్రాల్లా వీక్షించి విభ్రాంతికి గురైన ఆ వృద్ధ మామిడిమాను తన కొమ్మలన్నిటినీ రెండు హస్తాలుగా ముకుళింపజేస్తూ నమస్కారం భంగిమలో నిలబడింది.
అల్లంత దూరం నుండి ఒక్కసారిగా వందల రామచిలుకలు గాల్లోకి ఎగురుతూ చేసిన కిలకిలలు వినవచ్చాయి. కోయిల ఒకటి మధ్యలో పాటందుకున్నది. అబ్బాయిలు కొందరు సుతారంగా ఊపుతుండగా పూలతీగెల ఊయలల్లో పడుచు అమ్మాయిల నిర్మలమైన నవ్వుల కేరింతలు చుట్టూ ప్రతిధ్వనించాయి. అదంతా తన చెవిని తాకగానే బుద్ధయ్య తన చెట్టు రూపాన్ని వదలి మళ్లీ మనిషి రూపులోకి మరలొచ్చాడు.
మామిడిచెట్టు తన ప్రశ్నను వదల్లేదు.
“బుద్ధయ్యా... నీ బాల్యమిత్రుల గురించి అడగ్గానే నాకంతా ఏదో ప్రాకృతిక లీలాదర్శనం చేయించావు! యింతకీ నీ దోస్తులు?”
“చెప్పలేకపోతున్నా చెట్టమ్మా... దుఃఖం తన్నుకొస్తుంది. వాళ్లలో చాలామంది, ఆ ముంతమామిడిలా తమను తాము చంపుకున్నారు. కొందరేమో ఆ దశేరిమావిలా చంపబడ్డారు!”
“అయ్యో... అయ్యో... ఈ తోటలో ఆడుకున్న ఆ గువ్వలు అలా ఆగమయ్యారా?”

“ఔనమ్మా... రఘు విదేశాలకు వెళ్లి కోట్లు సంపాదించాడు. వాడైతే కనీసం ఒక్కసారి కూడా ఈ నేలతల్లిని, కనీసం కన్నతల్లిని కూడా చూడటానికి రాలేదు. బాధ్యతలన్నీ ఇక్కడ తమ్ముళ్ళకే వదిలేసిపోయాడు. చివరికేమైంది? వ్యాపారాల ఒత్తిడిలోపడి డిప్రెషన్ కు గురై వాడామధ్య ఓ బస్తాడు కరెన్సీ నోట్లు మీదపోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడట...”
“అయ్యో తండ్రి... మీ చిన్నప్పుడు వాడేది పట్టుకుంటే అది బంగారమవుతుంది అనుకునేవాళ్లు. ‘మిడాస్ టచ్’ చివరికలా అయిందన్నమాట... మరి చందర్...సాహిల్...  యింకా ముస్తాఫా?” అందర్ని గుర్తుచేసుకుంది ఆ బంగినపల్లి మామిడి.
“చందర్ గాడు ఎన్నో ఫైవ్ స్టార్ హోటళ్లు నడిపాడు. కానీ యాభైయేళ్లు నిండకుండానే అతనికి షుగర్ జబ్బు బాగా ముదిరిపోయిందట. యింట్లోవాళ్ళు, డాక్టర్లు ఎంత హెచ్చరిస్తున్నా మూడు పూటలా వాడికిష్టమైన అన్నం, కూరలు బాగా తినేసరికి అతని షుగర్ లెవల్స్ ప్రమాదస్థాయికి చేరాయి. భార్యాబిడ్డలు అస్సలు అతణ్ణి అన్నం తినకుండా కట్టడి చేసారు. నీకు తెలుసు. చిన్నప్పటి నుండీ వాడు అన్నం పిచ్చోడు. వాడు ఏదైనా బంతి భోజనానికొస్తే అన్నం దబరా వాడిముందు పెట్టాల్సిందే. చివరికి అన్నం తిననీయకుండా అతన్ని ఓ గదిలో బంధించినంత పనిజేసారు. తలుపుకున్న చిన్న క్యాట్ హోల్ లాంటి కంత నుండి అన్నం తప్ప గింజలు, గుగ్గిళ్లులాంటివి గదిలోకి పంపేవారట. ఓనాటి నడిరేయి చందర్ ఎప్పుడో గతించిన తల్లికోసం ఆర్తిగా ‘అమ్మా... అన్నం... అన్నం పెట్టమ్మా అన్నం... నీ చేత్తో కొద్దిగంత ముద్దపప్పు,  వేడి వేడి నెయ్యి కలిపి రెండు ముద్దలు పెట్టమ్మా... రెండే రెండు ముద్దలు చాలమ్మా... అమ్మా అన్నం... అన్నంపెట్టు తల్లీ... లేకపోతే నే చస్తానే!” అంటూ అరుస్తూనే తన నెక్ టై తోనే గొంతు బిగించుకుని ఊపిరి వొదిలాడంట ...”
ముసలి మామిడిచెట్టు తన కొమ్మలు వాల్చేసి విలపించింది.

“నాయనా... మనుషులట్లాకూడా మరణిస్తున్నారా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకునే రోజుల్నుండి కొందరికి అన్నం పరమవిషం అన్న స్థాయికి పోయిందా... హే భగవాన్... యింతకు వాడేమయ్యాడు? వాడే... ఆ ముస్తాఫా. ఎప్పుడు చూడూ ఆ మూలన సీతాఫలం చెట్ల సందుల్లో జొరబడి కమ్మగా పిల్లనగ్రోవి ఊదుతూ పూటంతా గడిపేవాడు. తోటలో ప్రతి కొమ్మా రెమ్మా పరవశించి ఊగేది ఆ పాటకు. ముస్తాఫా పెద్ద ఉస్తాద్ అయ్యుండాలి కదా బుద్ధయ్యా?”

“ఔనమ్మా అయ్యాడు... ముస్తాఫాకు సంగీతమే అన్నం నీరు కూడా. సంగీతాన్ని నేర్చుకోవటమే గాదు. క్లాసికల్ మ్యూజిక్ పై అద్భుత పరిశోధనలు చేసాడు. గొప్ప స్వరజ్ఞాని. లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వాళ్ళు కూడా వాడితో ఆన్లైన్ క్లాసులు చెప్పించేవారంట. ఐతే బ్రహ్మచారిగా ఉన్న మన ముస్తాఫా ఒక చక్కని చురుకైన అమ్మాయిని చేరదీసి, ఆమెకు సంగీతం నేర్పిస్తూ తన వారసురాలిగా నిలబెడదామని అనుకున్నాడు. ఆమెను ముద్దుగా ‘మై లిటిల్ ఫిడేల్’ అని పిల్చుకునేవాడు. కానీ ఆ పిల్ల ఫిడేలు మాత్రం... వన్ ఫైన్ మార్నింగ్ అన్నట్లు... తన గురువు ఫిడేల్ తోనే అతని తలను మోది అతని సొమ్ములు, లక్షలు పలికే వింటేజ్ గ్రామ్ ఫోన్ రికార్డులు, డిస్క్ లు, ముస్తాఫా స్వరపర్చిన సరికొత్త కంపోజిషన్స్ ను ఎత్తుకెళ్ళి విదేశాలకు పారిపోయి ఓ కొరియన్ బ్యాండ్ లో చేరిపోయిందట!”
“బాప్ రే... ఈ రోజుల్లో జ్ఞానాన్ని పంచటమే ప్రమాదమైపోతుందన్నమాట! ఒకప్పుడు పంచుకో పెంచుకో... యిప్పుడు మాత్రం ‘పంచుకో-తుంచుకో’ అన్నట్లయింది కదా! యింతకూ మీ సోపతుల్లో ఆడపిల్లల ముచ్చట చెప్పనేలేదు?”
“హా... ఏముంది చెప్పటానికి? కొందర్ని వాళ్ళ కర్మం కాల్చేస్తే కొందర్ని వాళ్ల గర్భం కాటేసింది. నలుగుర్ని కన్న నాగరాణి, ఐదుగుర్ని మోసిన అలివేలు ఆశ్రమాల్లో అనాధలైపోయె! అన్ని భాగ్యాలున్న అరుంధతికూడా అభాగ్యురాలిగా ఒంటిగా రోజులెళ్ళదీస్తుంది. కడుపునకాచిన కాయలేమో విదేశాల్లో పండుతాయి... కాచిన తల్లుల కడుపులేమో యిక్కడ ఎండుతాయి!”

    “అయ్యో అలాగా... ఆ చిట్టితల్లి తులసి కూడానా? ఎప్పుడూ నోములూ, పూజలూ అంటూ ఎంత భక్తితో నిష్టగా ఉండేది తను.”
“ఏం లాభం? చివరికి వేశ్యావాటికల పాలయ్యింది!”
“అమ్మో... అమ్మో... అంత ఘోరమా బుద్ధయ్యా?”

“ఔను... అస్తమానం గుళ్లూగోపురాల చుట్టూనేనా? కొంచెం మనుషుల మాయాలోకంలో కూడా తిరగాలి కదా! పూజలూ పుణ్యాలేనా? పాపం, స్వార్థం, ద్రోహం, లౌక్యం, మోసం... ఈ నాగరిక ముసుగుల గురించి కూడా కాస్త తెలుసుకోవాలిగా మరి! చివరికా భక్తబేల తులసిని ఓ కోడెఎద్దు మేసింది. అమితాబ్ లా భలే పొడుగ్గా చురుగ్గా ఉన్నాడని ఓ పంజాబీ పిల్లగాడిని నమ్మితే వాడు ఆమె వయసుని వొలిచేసి, మనసుని తొలిచేసి వదిలేసిపోయాడు. పాపం తులసి... ఇంటిముఖం చూడలేక భయపడి ఎక్కడెక్కడో ఎన్నెన్నో మగ చేతుల్లోనో మోసపోతూ ఆఖరికి సోనాగాచి చేరుకుంది. నేను సెక్స్ వర్కర్స్ పై ఒక నవల రాస్తున్నప్పుడు కలకత్తా వెళ్తే తాను వీధిలో తారసపడింది. నన్ను గుర్తుపట్టి పొగిలి పొగిలి యేడ్చింది. విషయం ఊళ్లో ఎవరికీ చెప్పలేదు. నీకు తప్ప!”
మామిడి చెట్టు ఒక్కసారిగా ఒక భారీకాయంతో స్త్రీమూర్తిలా మారిపోయింది. పచ్చని జరీ చీరలో పద్మాసనంలో కూర్చొని కొన్ని ఘడియలు ధ్యానంలోకి వెళ్ళింది. తర్వాత మూలిగినట్లుగా ఓ క్షణం రోదించింది. పైకిలేచి జెన్ బుద్ధిస్ట్ లా నమ్రతతో తల, మెడ వంచి ప్రణామం చేస్తూ మళ్లీ చెట్టుగా మారింది.
“ఏం చేసావిప్పుడు?” సంబ్రమంతో అడిగాడు బుద్ధయ్య.
“ఏం లేదులే... నన్ను తులసిలా ఓ ఆడదానిగా పుట్టించనందుకు మా ప్రకృతి అమ్మకు వందనాలు చెప్పుకున్నా!”.
“నువ్యూ పూస్తున్నావు... కాస్తున్నావు... ఆ చొప్పున నువ్వు కూడా స్త్రీ వేగా?”
“కానీ నాకు రొమ్ములు లేవు... కొమ్మలు తప్ప! యోనిలేదు ఈ కరకు మేని తప్ప! గర్భాలు లేవు గింజలు తప్ప!”
“అందుకేనేమోనమ్మా మీరు బతికిపోయారు... మా మగాళ్ళ బారినుండి!”
ఆ మాటకు కిలుక్కున నవ్వింది మామిడి మాను.

“ఆహా... ఎంత రమణీయంగా నవ్వావు!” మెచ్చుకోలుగా చూసాడు. ఆ మాట వినటంతోటే ‘రమణి’ గుర్తుకొచ్చింది.
“బుద్ధయ్యా... రమణి... రమణి ఎలా వుంది? పాపం! చిరుగుల పరికిణీతో చిన్నబుచ్చుకున్న ముఖంతో రోజూ పొద్దున్నే నా మొదట్లో కూర్చొని రాలిపడిన పండ్లు తీసుకొని ఆవురావురుమని ఆరగించేది. చుట్టుపక్కల వాళ్లు చక్కగా ఇడ్లీ దోసెలు పూరీలు పులిహోరలు చేసి తమ పిల్లలకు కమ్మగా తినిపిస్తుంటే పాపం రమణికి మాత్రం రోజూ ఇంట్లో చద్దన్నం నీళ్ల మజ్జిగనేనట కదా! అందుకే ఆషాఢమాసం చివరిదాకా నా గుబురు చిటారుకొమ్మల్లో కొన్ని పండ్లు తనకోసం దాచిపెట్టి ఉంచేదాన్ని! అల్లంత దూరాన నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న రమణిని చూడగానే రెండు పండ్లను అవి చితికిపోకుండా సుతారంగా జారవిడిచేదాన్ని. ఆ పండ్లను అందుకొని రమణి నా దగ్గరగా వచ్చి, తలెత్తి నా వైపు చిరునవ్వుతో చూసి నన్ను హత్తుకుని ముద్దాడేది. యింత లావువున్న నా ఈ మానుమేను ఆ కోమలమైన చిట్టి చేతుల్లోకి ప్రియమారా ఒరిగిపోయినట్లే అన్పించేది”.
బుద్ధయ్య కన్నులు పగిలిన నీటికుండలైనాయి.

“నాకు తెలుసు బుద్ధయ్యా. మా కొమ్మల రొమ్ములపైన ఆనందంగా ఆడుకున్న ఆ నాటి చిన్నారుల్లో నువ్వు అత్యంత సున్నిత మనస్కుడివి. ఏడవకు నాయనా, మనిషీ మాను ఒక్కటే అనే మమేకభావన ఉన్నప్పటి రోజులు కదా అవి!” అంటూ కొన్ని లేరెమ్మలు క్రిందకు వంచి అతని కన్నీరు తుడిచి “యింతకూ రమణి ఎక్కడ?” అంటూ గాభరాగా అడిగింది.

“లేమితో మొదలైన బతుకులు కాసుల బలిమికోసం తీవ్రంగా కృషి చేస్తాయి. మంచిదే. కానీ కొందరు దానివల్లే కృషించిపోతారు. రమణి కష్టపడి చదివి సివిల్ ఇంజనీర్ అయింది. కానీ సంతృప్తి చెందలేదు. బీదరికాన్ని చవిచూస్తూ వచ్చిన ఆమెకు ధనదాహం పెరిగింది. ఉద్యోగం వదిలి భర్తతో కలిసి రియల్ ఎస్టేటు వ్యాపారం మొదలుపెట్టింది. మూడు విల్లాలు... ఆరు వెంచర్లు అన్నట్లుగా సాగింది వాళ్ళ వ్యాపారం. తను శ్వాస విడిచిన తర్వాత తన ఆరెకరాల అల్ట్రా - లగ్జరీ ఫామ్ హౌజ్ వెనుక గార్డెన్ లోనే తనను సమాధి చేయమని కొడుకులు, కూతుళ్లకు గట్టిగా చెప్తుండేది. కరోనా కల్లోల కాలంలో కాశీలో చిక్కుకుని లాక్ డౌన్ వల్ల సమయానికి అక్కడినుండి బయటపడలేకపోయింది. అక్కడే ఇన్ ఫెక్ట్ అయి చనిపోయింది. గంగానదిలోకి విసర్జించబడిన పీనుగుల్లో తనూ ఒకటైంది. ఆమె పోయిన తర్వాత భర్త యింకొకామెను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమె మెల్లిగా రమణి పేరున వున్న ఆస్థులన్నీ తనపేర రాయించుకుని రమణి కన్నబిడ్డల్ని ఫామ్ హౌజ్ నుండి గెంటేయించింది. వాళ్ళు సవతితల్లి మీద వ్యాజ్యాలు వేసి పుష్కరకాలం నుండీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు”.
“చెట్టుతల్లి నిట్టూరుస్తూ అన్నది “యిప్పుడర్ధమైంది నాకు. మా పిల్ల వేర్లు తల్లివేరునెప్పటికీ వదలకుండా ఎందుకని ఈ మట్టిలోనే అంటిపెట్టుకుని ఉంటాయో!” 
“అర్ధం కాలేదు”.
“మీరంతా చదువుకుని సీమాంతరాలు దాటి ఎంతో ఎదిగిన తర్వాత ఎప్పుడన్నా ప్రేమగా ఈ తోటను గుర్తుచేసుకున్నారా?”
“లేదు!”

“మీ ఆటపాటలకు తావై... అమ్మలా నీడను తోడును ప్రేమను పండ్లను పంచిన మీ చిన్ననాటి తోట గతి ఏమయ్యిందో ఏమోనని ఒక్కరన్నా వచ్చి తిరిగిచూసారా?”
“లేదు!”
“అది మరి .... కొన్ని లెక్కలుంటాయ్ బుద్ధయ్యా! రాకెట్లలా రోదసి అంచులకు ఎదిగారు మీ దోస్తులు. పండుబండి రాలాల్సినవాళ్ళు మధ్యలోనే తారాజువ్వల్లా రాలిపోయారు. అందుకే ఎవడైనా తన ‘తోట’ను మరువగూడదు. ఒక్కడికీ ‘తోట’ గుర్తున్నట్లు లేదు! ‘తోట’ పట్ల కృతజ్ఞత లేనే లేదు !”
“లేదు... లేదు... నాకుంది. అందుకే యిన్నేళ్ళకైనా మళ్ళీ వచ్చా. ఐనా నువ్వు తప్ప యిక్కడ తోటేముంది నా బొంద! ఇది చీకటి తోటయింది. దీనికన్నా నా యిల్లేనయం. ఎప్పుడూ జీవజ్యోతులు మండుతూనే ఉంటాయి. సరే ఉంటా నేస్తమా... నాకు నైట్ డ్యూటీ ఉంది. బై మరి!” అంటూ వెనుదిరుగుతున్న బుద్ధయ్యతో చెట్టు అన్నది.
“సరే బుద్ధయ్యా... నీ మిగిలిన దోస్తులందరికీ చెప్పు... ‘తోట’ను మరవొద్దని. తరచూ రమ్మను వాళ్లను... ఊరి తోటను ఎన్నటికీ గుండెనుండి తుడిపేయకండి. మా తోటలా కాకుండా మీరంతా పచ్చగా బతకండి... ఓ... ఓ... ఓ... బుద్ధయ్యా అటెటు? ఊరు యిటువైపు కదా ! అటు కాష్టాల దిబ్బ... పోవద్దు... ఇటు నడువ్!” ఆందోళనగా హెచ్చరించింది మామిడి తల్లి.
“లేదు... నా దారి అటే... నా యిల్లే అది... నేను పదేళ్లనుండీ అక్కడే ఉంటున్నా! సెలవిక నా చెట్టు తల్లి!”

మాను మ్రాన్పడి మానై నిలబడి నోర్లు ఎల్లబెట్టింది.!
* * * * *
ఆ రోజు తెల్లవారి పొద్దున్నే ఊరి కట్టెలడితి పనోళ్లు గొడ్డళ్ళు, కరెంటు రంపం భుజాలపైన మోసుకొని వచ్చారు. కాష్టానికి కట్టెలకోసం.
“రేణుకమ్మ మా దొడ్డమనిషిరా... ఆ చల్లనితల్లి యింకా పదేళ్లుంటదని అనుకున్నాం” అంటూ మేస్త్రి తుండుగుడ్డతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
“ ఔన్రా... ఆ తల్లి పెనిమిటితో కలిసి ఎంత ప్రేమగా పెంచుకుందోరా ఈ తోటని. ఎన్ని నోళ్లను తీపిచేసాయి ఈ చెట్ల కాయలు! రేణుకమ్మకు తొంభైయేళ్లు దాటాయి. కొడుకులు కూతుళ్లెవ్వరూ పక్కన లేకున్నా ఒంటిగానే ముప్పై యేళ్లూ బతుకెల్లదీసింది మా తల్లి. పాపం... యిగనవసరం అనుకునే మెడగోసుకుందిరా! పోయినేడు గూడా ఈ మిగిలిపోయిన ఒక్క చెట్టు కాయలు నాతో కోపిచ్చి అందరికీ తలా నాలుగు పంపింది. గొప్ప తల్లి... గొప్ప మనసు” బాధపడ్డాడు ముఠాలో ఓ పెద్దాయన.
“తన సావు తనకు తెలుసురా... ఈ చివరిచెట్టు కట్టెల్లోనే తానూ ఒక కట్టెనై కాలిపోవాలనుకుందిరా ఆయమ్మ” మేస్త్రి మళ్లీ కన్నీళ్లు తుడుచుకుంటూ తన చేతిలో గొడ్డలివైపు ఓసారి చూసుకొని దానిని బలంగా పైకి ఎత్తాడు.

అది విని తన తల్లితో తాను ఐక్యంకాబోతున్నానని పొంగిపోతూ గొడ్డళ్లకు వొళ్ళప్పగించింది ఆ పసిడిచెడిన చివరిమావి.
(మ్యాజిక్ రియలిజం ధోరణిలో రాసిన కథ)