Thursday, February 12, 2026

 “భగవంతుడు నాకేమిచ్చాడు?”
అని అనుకునే ప్రతి ఒక్కరూ
ఒక్కసారి ఆలోచించాల్సిన అమూల్యమైన నిజాలు ఇవి 

1️⃣ టైర్లు నడిపితే అరిగిపోతాయి…
కానీ మన పాదాల అరికాళ్లు జీవితాంతం నడిచినా కొత్తగానే ఉంటాయి.

2️⃣ మన శరీరం సుమారు 75% నీటితో తయారైనదే…
లక్షలాది రంధ్రాలు ఉన్నా
ఒక్క చుక్క నీరు కూడా లీక్ అవదు.

3️⃣ ఆసరా లేకుండా ఏ వస్తువూ నిలబడదు…
కానీ మన శరీరం మాత్రం తన సమతుల్యతను తానే కాపాడుకుంటుంది.

4️⃣ ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ పనిచేయదు…
కానీ గుండె మాత్రం పుట్టుక నుంచి మరణం వరకు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది ❤️

5️⃣ ఏ పంపు శాశ్వతంగా పనిచేయదు, కానీ రక్తం మాత్రం జీవితాంతం శరీరం అంతటా
అలుపెరుగకుండా ప్రవహిస్తుంది.

6️⃣ ప్రపంచంలోని ఖరీదైన కెమెరాలకూ పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు
వేల మెగాపిక్సెల్‌ల నాణ్యతతో ప్రతి దృశ్యాన్ని గ్రహిస్తాయి 👀

7️⃣ ఏ ప్రయోగశాల అన్ని రుచులను పరీక్షించలేకపోయింది, కానీ నాలుక మాత్రం
ఏ పరికరాలు లేకుండానే వేలాది రుచులను గుర్తిస్తుంది 👅

8️⃣ అత్యాధునిక సెన్సార్లకూ హద్దులుంటాయి కానీ మన చర్మం ప్రతి చిన్న అనుభూతినీ స్పష్టంగా గ్రహిస్తుంది.

9️⃣ ఏ యంత్రం అన్ని భావాలతో శబ్దాలను సృష్టించలేదు కానీ మన గొంతు మాత్రం భావాలు, ఆనందం, బాధ. అన్నింటినీ వ్యక్తపరుస్తుంది 🗣️

🔟 ఏ యంత్రం శబ్దాలను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు కానీ చెవులు మాత్రం ప్రతి శబ్దాన్ని విని దాని భావాన్ని కూడా గుర్తిస్తాయి 👂

ప్రకృతి / భగవంతుడు మనకు ఇచ్చిన ఈ అమూల్యమైన శరీరం ఒక వరం. దానిని కృతజ్ఞతతో సంరక్షించుకోవడమే
మన మానవ కర్తవ్యం 🙏

🌻 శుభమస్తు 🌻

❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏
 [2/12, 09:16] +91 97058 59828: *🌷శుభోదయం🌷*

🌻 *మహనీయుని మాట*🍁
      
*🌷విమర్శను శత్రువుగా కాకుండా గురువుగా చూసినట్లు అయితే, అవి మన  చిత్తశుద్ధిని పదునుపెడతాయి.*
      
🌹 *నేటి మంచి మాట* 🌼
    
*🌷మనసులో నుండి గతం తాలూకు దుఃఖాన్ని తొలగిస్తే... వర్తమానపు ఆనందాన్ని నింపడానికి కావలిసినంత చోటు ఉంటుంది. మనిషికి మతి మరుపు కొన్ని సమయాల్లో మంచిదే చేస్తుంది.*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[2/12, 09:23] +91 98497 72509: *🙏🌹శుభోదయం*🌹🙏

  *"మనవెంట ఎవరున్నా,ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుది శ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్బుతమైన సంపద."*

        *"ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని,ప్రాముఖ్యాన్ని,కర్తవ్యాన్ని మనిషికి బోధ పరిచేది చదువే. అది చాల విలువైన సంపద."*

       *"అందరినీ కలుపుకునే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే."*

 *శుభం భూయత్!* 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 *“జీవితం చిన్నది — ప్రేమించు.... నటించకు....*
 
“అరిచే వాడి కోపం కన్నా, మౌనంగా ఉండే వాడి కోపమే చాలా ప్రమాదకరం.”

“పరీక్ష లేకుండా వచ్చే విజయం పతనానికి దారి తీస్తుంది. కష్టాలను దాటి వచ్చే విజయం చరిత్రను సృష్టిస్తుంది. వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే ప్రయాణం కఠినంగా ఉండాలి.”

“నువ్వు చేసే ప్రతి సాయం తప్పకుండా తిరిగి వచ్చి నిన్నే చేరుతుంది.”

సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. నమ్మించు, నమ్మకద్రోహం చేయకు. జీవించు, నిన్ను నీవు మోసం చేసుకోకు.”

“అందం ముఖంలో మాత్రమే కాదు. కొన్ని సార్లు మనసులో, మరికొన్ని సార్లు మాటల్లో కూడా కనిపించాలి.”

“స్నేహాన్ని పువ్వుతో పోల్చవద్దు — వాడిపోతుంది. మంచుతో పోల్చవద్దు — కరిగిపోతుంది. ఆకుతో పోల్చవద్దు — రాలిపోతుంది. మీ నవ్వుతో పోల్చండి — శాశ్వతంగా నిలిచిపోతుంది.”

“అందరితో కలసి ఉండవచ్చు, అందరిలానే నవ్వవచ్చు. కానీ అందరినీ మనవాళ్లే అనుకోకూడదు.

 నటనతో కూడిన ప్రేమ — విషం కన్నా ప్రమాదకరం.

చెడు, దుష్టశక్తులనేవి ఏమీ సమస్య కాదు, మనిషి తన కోరికలు తీర్చుకోవటానికి, మరొకరిపై ఆ మాటలతో నిందిస్తారు.

నేను దేవుడిని పూలు అడిగాను, ఆయన వాన కురిపించాడు, తద్వారా తర్వాత పూలు పుష్పించాయి. 

ఇది అర్ధం ఐతే, దేవుడు ప్రకృతి మనకిచ్చే ప్రతి విషయం కాలంలో ఉపయోగిస్తాయనేది, మనకి అర్ధం అవుతుంది.

నువ్వు శాంతి ఆనందాలకోసం చేసే ప్రతిదీ, అంతకుముందు సహజంగా నీ వద్ద ఉన్న ఆనందాన్ని నాశనం చేస్తుంది.
 ఒక రోజు హిట్లర్ ఒక కోడిని తీసుకుని కేబినెట్ సమావేశానికి వచ్చాడు. ఆ కోడి తలను తన చేతి కింద బిగించి పట్టుకున్నాడు. నడుస్తూనే, కోడి ఈకలను ఒక్కొక్కటిగా పీకడం మొదలుపెట్టాడు. కోడి తీవ్ర వేదనతో కేకలు వేస్తూ, తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ హిట్లర్ దానిని వదలలేదు; దాని అరుపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈకలు పీకుతూనే ఉన్నాడు. అది చూసిన కేబినెట్ సభ్యులు అన్నారు:

“పాపం ఆ జీవిన ఆలా హింసించకండి. దానిని వదిలేయండి.”

కానీ హిట్లర్ ఎవరి మాట వినలేదు. చివరికి ఆ కోడి ఈకలన్నీ పీకేసి, దాన్ని నేల మీదకు విసిరేశాడు. 

తర్వాత తన జేబులోంచి కొంత ధాన్యం తీసి, ఆ కోడికి వేయడం ప్రారంభించాడు. 

ఆ స్థితిలో, ఆకలితో అలమటిస్తున్న ఆ కోడి మళ్లీ హిట్లర్ చేతి వైపే చూడటం మొదలుపెట్టింది.

హిట్లర్ దానిని దగ్గరకు పిలుస్తూ ధాన్యం చూపించాడు. కొద్దిసేపటికి ఆ కోడి అతని దగ్గరకు వచ్చి కూర్చొని, ఆ కొద్ది ధాన్యాన్ని తినడం ప్రారంభించింది. 

ఇప్పటివరకు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదే కోడి, ఇప్పుడు మళ్లీ అతని పక్కనే కూర్చుంది. కేవలం కొద్దిపాటి ధాన్యం కోసం..! 
దాన్ని చూసి కేబినెట్ సభ్యులు ఆశ్చర్యంతో అడిగారు:

“ఇది ఏమిటి?”

అప్పుడు హిట్లర్ అన్నాడు:
“ఓటర్లు కూడా ఇలాగే ఉంటారు. నాలుగున్నర సంవత్సరాల పాటు మనం వాళ్ల ఈకలు పీకుతాం. 
ఆ తర్వాత, చివరి ఆరు నెలల్లో కొద్దిపాటి ధాన్యం వేస్తాం. ఆ కొద్దిపాటి లాభాలకోసం, నాలుగున్నర సంవత్సరాల అన్యాయాలను ఓటర్లు మర్చిపోయి, మళ్లీ మనకే ఓటేస్తారు..!”💐
 🌟 జీవిత సత్యం 🌟
​🧠 నాకు తెలిసిందే వేదం అనుకుంటే... అది మూర్ఖత్వం! 🤡
​🤝 నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే... అది మూఢత్వం! 🚫
​🧐 ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే... అది అమాయకత్వం! 🤷‍♂️
​💔 ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే... అది అమానుషత్వం! 👺
​📚 నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే... అది పైత్యం! 🤒
​✨ ముఖ్య గమనిక: ✨
అందరి భావాలను అర్థం చేసుకుని, అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మనిషి తత్వం... అదే అసలైన మానవత్వం! ❤️🤝🌎
 ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ, లక్షల్లో జీతం తీసుకునే ఒక యువకుడు తన కుటుంబంతో కలిసి వారం రోజుల విహారయాత్ర కోసం లడఖ్ వెళ్లాడు. అక్కడ వారికి కేటాయించిన డ్రైవర్ సుమారు 28 ఏళ్ల యువకుడు. అతనికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ప్రయాణంలో వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది:

పర్యాటకుడు: “ఈ వీకెండ్‌తో టూరిస్ట్ సీజన్ అయిపోతుంది కదా.. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? గోవా, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో హోటల్స్ లో పనికి వెళ్తావా?”
డ్రైవర్ (యువకుడు): “లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. లడఖ్ వదిలి నేను ఎక్కడికీ వెళ్లను.”

పర్యాటకుడు: “కానీ ఇక్కడ శీతాకాలం చాలా భయంకరంగా ఉంటుంది కదా.. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?”

యువకుడు: “పెద్దగా ఏమీ లేదు సార్.. నేను సియాచిన్ వెళ్తాను.”
నేను సియాచిన్ వెళ్తాను.”


పర్యాటకుడు (ఆశ్చర్యంగా): “సియాచినా? అది ఇక్కడి కంటే ఎంతో చలిగా ఉంటుంది కదా!”

యువకుడు: “అవును సార్, నేను అక్కడ భారత సైన్యానికి ‘లోడర్’ (బరువులు మోసేవాడు)గా వెళ్తాను. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం. నా లాంటి కొంతమంది ఇక్కడి నుండి సియాచిన్ బేస్ క్యాంప్ వరకు సుమారు 250 కిలోమీటర్లు నడిచి వెళ్తాము. దానికి 15 రోజులు పడుతుంది. అక్కడ మెడికల్ టెస్టులు చేస్తారు, పాస్ అయితే యూనిఫామ్, బూట్లు, హెల్మెట్ ఇస్తారు. అలా అక్కడ 3 నుండి 4 నెలలు ఉండి పని చేస్తాం.”
పర్యాటకుడు: “అక్కడ మీరు చేసే పని ఏమిటి?”

యువకుడు: “మేము సామాగ్రిని మోస్తాం. సైన్యం హెలికాప్టర్ల ద్వారా ఆహారం, ఇతర వస్తువులను జారవిడుస్తుంది. ఆ వస్తువులను మేము వీపున వేసుకుని ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్‌కు చేరవేస్తాం. అదంతా మంచు పలకల (Glaciers) ప్రాంతం. ట్రక్కులు వెళ్లలేవు. స్నో స్కూటర్లు శబ్దం చేస్తాయి, అది శత్రువులకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే మేము తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరుతాం. టార్చ్ లైట్లు కూడా వాడకూడదు. నిశ్శబ్దంగా, చీకటిలో నడవాలి. అక్కడ గుర్రాలు, గాడిదలు కూడా బ్రతకలేవు. -50°C చలిలో, 18,000 అడుగుల ఎత్తులో ఏ జంతువు ప్రాణాలతో ఉండలేదు.”

పర్యాటకుడు: “అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది కదా.. అంత బరువు ఎలా మోస్తారు
యువకుడు: “అందుకే 15 కేజీల కంటే ఎక్కువ బరువు ఇవ్వరు. మేము రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే పని చేస్తాము. మిగిలిన సమయం అంతా శరీరాన్ని ప్రాణాలతో ఉంచుకోవడానికే సరిపోతుంది.”

పర్యాటకుడు: “ఇది ప్రాణాలతో చెలగాటం కదా..”

ఆ యువకుడు కాసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు: “నా స్నేహితులు చాలా మంది తిరిగి రాలేదు. కొందరు మంచు లోయల్లో పడిపోయారు, మరికొందరు శత్రువుల కాల్పుల్లో చనిపోయారు. అన్నిటికంటే పెద్ద ప్రమాదం ‘ఫ్రాస్ట్ బైట్’ (అత్యధిక చలి వల్ల శరీర భాగాలు కుళ్ళిపోవడం). నిజం చెప్పాలంటే అక్కడ మరణం అనివార్యం అనిపిస్తుంది.”

పర్యాటకుడు: “అయితే మీకు జీతం చాలా బాగా ఇస్తారేమో?”

యువకుడు: “నెలకు ₹18,000. సైన్యం మా ఖర్చులన్నీ చూసుకుంటుంది. మూడు నెలల్లో నేను 50 వేల వరకు దాచుకోవచ్చు. నా కుటుంబం గడవడానికి అది చాలు. అన్నింటికంటే మించి.. మన దేశం కోసం, మన సైన్యం కోసం ఏదో చేశామన్న తృప్తి మిగులుతుంది.”
ఆ మాట వినగానే ఢిల్లీ నుండి వచ్చిన పర్యాటకుడు నిశ్శబ్దమైపోయాడు. ఏసీ రూముల్లో ఉంటూ, 50 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్న తను, ఆ యువకుడి ముందు చాలా చిన్నవాడిగా అనిపించాడు.

మనం నేర్చుకోవాల్సిన పాఠం:

-50°C చలిలో, 18,875 అడుగుల ఎత్తున, మృత్యు నీడలో ఆ యువకుడికి రోజుకు ₹600 కూలీ చాలా “పెద్దది”గా కనిపిస్తోంది.

దేశం కోసం ఏదో ఒకటి చేస్తున్నామనే ఆ భావనే వారి జీవితానికి అర్థాన్ని ఇస్తోంది.

సోషల్ మీడియాలో విషం చిమ్మేవారు, నగరాల్లో కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చేవారు.. ఆ గడ్డకట్టే చీకటిలో పది నిమిషాలు కూడా నిలబడలేరు.

మీ పిల్లలను మాల్స్‌కు తీసుకెళ్లండి, పిజ్జాలు తినిపించండి.. కానీ, ఒకసారి ఈ కథను కూడా వారికి చెప్పండి. ఈ దేశానికి వెన్నెముక ఎవరు అనేది వారికి అర్థం కావాలి.

దేశభక్తి అంటే కేవలం నినాదాలు చేయడం కాదు; అది త్యాగం, క్రమశిక్షణ, బాధ్యత నుండి పుడుతుంది.
మనం సుఖంగా పడుకున్నామంటే, అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆ గడ్డకట్టే మంచులో మన శాంతి కోసం ఎవరో భారాన్ని మోస్తున్నారని గుర్తుంచుకుందాం.

వారు ఉన్నారు కాబట్టే.. మనం ఉన్నాం!
 *చుాడరా ఇటు చుాడరా.....రెండు కన్నుల మనిషి బ్రతుకును....గుండెకన్నుతో చుాడరా.....ఈశ్వరా!! పరమేశ్వరా!!*

ఎదుట పడని వేదనలను.నుదుటి కన్ను తో చుాడరా.....ఈశ్వరా...పరమేశ్వరా!!ఆది మరియూ అంత్యం అయిన శివుడు గురించి పురాణాల్లో వేదాల్లోనుా, ఉపనిషత్తుల్లోను కవులు, నాయనార్లు ఇంకా శివయ్య గాఢ భక్తులు....వేల కొలది సాహిత్యం సృష్టించి వుంటారు...!! 

పద్యాల కధల స్తోత్రాల రుాపంలో మాటల రుాపంలో పాటల రుాపంలో ..వారి దయ కరుణ ను వర్ణించి వుంటారు....కాని ఒక పరమాణువు లాంటి నేను అలా వర్ణ నలు చేయలేను...

అంత ప్రజ్ఞ , జ్ఞానము నాకు లేవు కానీ కొంచెం మాత్రమే శివుడు గురించి తెలుసు...అదిమాత్రమే శివుడు కి సమర్పించగలను....!!

మెదట శివుడంటే మాములుగా అందరిలా వుండేదాన్ని...కానీ ఆయన ప్రేమ త త్వం ప్రేమ కోసం ఆయన పడే ఆరాటం బాధ దుఃఖం ఒక సిరియల్ లో చుాసాను....అప్పుడు నుండి శివుడంటే ఎక్కువ ఇష్టం గా మారింది....!!

మనిషి, దేవుడిని కుాడా అనుభవం లోనే పొందాలి....అప్పుడె ఇష్టం గా మారుతుంది శివయ్య కి మనస్వఛ్చమైన మనసునచ్చితే వాళ్ళ కోసం ఏదో ఒకటి మేలు చేస్తాడు అదే శివుడి గొప్పతనం .!!

ఎందుకంటే పక్కన పార్వతీ మాత వుంటుంది మాత ప్రేమ దేవత ఆమె స్పుార్తి తోడు సహాయంతో శివుడు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడం కోసం ఆరాటపడుతారు.

కాని అదే పార్వతీ మాత పక్కన లేకుంటే ఆయనే దుఃఖభారంతో ఏ సహాయం చేయలేక నిర్లిప్తంగా వుంటారు.పిచ్చివారిలా తన శక్తి కుాడా తనకు గుర్తు రాదు..

పార్వతీ మాత జగన్మాత ...సృష్టి మెుత్తం ఆమె బిడ్డలు ..అంటుంది....ఆమె మీద ప్రేమ తో ఆమెకి ఇష్టం అయిన సృష్టి ని ఆయన ప్రేమిస్తారు....!! 


ప్రేమించకుంటే మాత తన ను వదిలేస్తుందని భయం శివయ్య కి....!! అందుకే జీవుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు.
 *మనసు ఎందుకు అలసిపోతుంది....?*

గతాన్ని తవ్వటం...భవిష్యత్తు గురించి ఆత్రం...

 ఈ పరుగు మనసుని అలసేలా చేస్తుంది, నిజమైన విశ్రాంతి వర్తమానం లోనే ఉంది.

ఏ స్థితినైనా అంగీకరించటంనే, సుఖం అంటారు. పరిస్థితిని అంగీకరించకపోతే అశాంతి.. ఇక్కడ చేయటానికి ఏమీలేదు, అలా ఉండటమే.

అందరికీ నేను జ్ఞానిననే గర్వం ఉంటుంది, కానీ ఆ గర్వం తనకు ఉందని, ఎవరు గుర్తించలేరు.

     *ఏకో ధర్మః పరం శ్రేయః*
              *క్షమైకా శాన్తిరుత్తమా* |
              *విద్యైకా పరమా తృప్తిః* 
              *అహింసైకా సుఖావహా* ||

ధర్మమొక్కటే పరమశ్రేయస్సును కలిగించును....ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది.... చదువొక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును....అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును"

అబధ్ధంతొ కాసేపు తప్పించుకోగలవు, కానీ సత్యం ఎప్పుడు నిన్ను రక్షిస్తుంది.

శరణాగతి అంటే, జీవితం తో వాదనలను ఆపి, జీవన ప్రవాహం తో కొనసాగటం.

సరియైన వారు, సంతోషం కోసం వెతకరు, అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తారు, అర్ధం చేసుకోవటం ద్వారానే ఆనందం పొందగలము.

తమ బాధ్యతలను నెరవేర్చే అంకిత భావం, ఉన్నవారికి, దైవం లేదా ప్రకృతి అనుగ్రహం ఉంటుంది.

మంచి వాళ్ళు ఎలా వెళ్లాలో చెప్పరు, ఆ దారులను కనుగొని వెళ్లగలిగే దిక్సూచి ఇస్తారు. జ్ఞానం ఇతర విషయాలలో తమపై ఆధారపడకుండా చూసుకొంటారు.

 మనిషి ఎంత పిచ్చివాడంటే, చిన్న పురుగుని సృష్టించలేడు, కానీ జగత్తుని సృష్టించారనే, వందల దేవుళ్ళని సృష్టించాడు.

ఏదీ అవసరం లేని, విశ్రాంతి స్థితియే ధ్యానం.తప్పుడు జ్ఞానం పట్ల జాగ్రత్త వహించు, ఇది అజ్ఞానం కన్నా ప్రమాదకరం.
 [2/9, 16:05] +91 97058 59828: *🌷శుభ సాయంకాలం 🌷*

*🌷మనకు కనిపించే అందం కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. కనిపించని అందం వ్యక్తిక్త్వంలో ఉంటుంది. అది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది. మంచి చేసిన కొద్దీ వయసుతో పాటు వ్యక్తిత్వం పెరుగుతూనే ఉంటుంది.*
                     
*🌷హృదయం కూడా భూమి లాంటిదే. ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది.*
*ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలను నాటితే సమాజానికి పనికివచ్చే మొక్కలను ఇస్తుంది.*

🌴🌻🌴🌻🌴🌻🌴🌻🌴
[2/9, 16:06] +91 97058 59828: *🙏🌹శుభ సాయంకాలం*🌹🙏
    
      *"మన లక్ష్యం..మన ఆశయం..ఎంత ఉన్నతమైనవో ...మన ప్రవర్తన... మన ఆలోచన అంతే ఉన్నతంగా ఉండాలి."*

    *"పరిచయం అందరూ అవుతారు. కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు."*

*ప్రేమంటే, మనతో ఉండడం కాదు, తను ఎక్కడ ఉన్నా, మనలో ఉండడం.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 “ప్రేమ పెళ్లి చేసుకున్న నా జీవితం ఓ గుణపాఠం…”
– ఆత్మహత్యకు ముందు పద్మ రాసిన లేఖ 💔
తల్లితండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నాను…
కానీ ఆ పెళ్లి నా జీవితాన్నే కాల్చేసింది అని
చివరి లేఖలో ఆవేదనగా రాసింది పద్మ.
పెళ్లయ్యాక ఎదురైన కష్టాలు,
భర్త బాధ్యత లేని జీవితం,
ఊరంతా అప్పులు,
పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి…
రోజూ మౌనంగా మింగిన కన్నీళ్లు…
“ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ
నా జీవితం ఓ గుణపాఠం”
అంటూ తన బాధను లేఖలో ఒలికించింది.
తిరుపతి జిల్లా పుత్తూరులోని కృష్ణానగర్‌లో
పద్మ తన ఇద్దరు చిన్నారులు
లాస్య (7), తేజశ్రీ (5)లతో కలిసి
ఈ లోకాన్ని వదిలేసింది…
తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో,
తల్లి చేతులు పట్టుకుని
చిన్నారులు కూడా చావును ఆహ్వానించాల్సి వచ్చింది…
వాళ్లకు ఏ తప్పూ లేదు…
కానీ పెద్దల తప్పుల భారాన్ని
పిల్లలు ప్రాణాలతో చెల్లించారు 😢
హైదరాబాద్ చర్లపల్లిలో జరిగిన ఘటన మరిచిపోకముందే
ఇలాంటి మరో విషాదం…
ఇవి కేవలం వార్తలు కావు…
ఇవి మన సమాజానికి గట్టి హెచ్చరికలు.
👉 ప్రేమ పెళ్లి తప్పు కాదు
👉 కానీ బాధ్యత లేని జీవితం ప్రాణాంతకం
👉 ఆర్థిక సమస్యలు పరిష్కారం లేనివి కావు
👉 మాట్లాడితే, సహాయం కోరితే…
ఇలాంటి ముగింపులు ఉండవు
పిల్లలు ఎవరూ బాధ్యతల బలికాకూడదు…
మహిళలు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు…
సమాజం, కుటుంబం, స్నేహితులు –
అందరం కలిసి నిలబడాల్సిన సమయం ఇది 🙏
#hashtags
#పుత్తూరు_విషాదం
#ప్రేమపెళ్లి
#బాధ్యతలేని_భర్త
#ఆర్థికసమస్యలు
#పిల్లల_ప్రాణాలు
#మానసికఆరోగ్యం
#ఆత్మహత్యకు_పరిష్కారం_మాట్లాడటమే
#సమాజం_ఆలోచించాలి
👉 గమనిక:
మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, దయచేసి వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడండి లేదా మానసిక నిపుణుల సహాయం తీసుకోండి. ఒక మాట… ఒక చేయి… ఒక సహాయం… ఒక ప్రాణాన్ని కాపాడగలదు.
 *ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు* 

 *(సాధ్యమయ్యిందా ?) కానీ...* 

ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు. 

మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు.

తాను తినే ఆహారం ముందుగా ల్యాబొరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. 

ఆయన పడుకొనే మంచం ఆయన పీల్చుకొనే ప్రాణవాయువు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది.

ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో  ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. 

ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు. 

అయ్యో,  ఆయన విఫలమయ్యాడే!

50 సంవత్సరాల వయస్సులో, 2009 సం, జూన్ 25 వ తేదీన ఆయన గుండె పని చేయటం మానేసింది. 

ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ 12 మంది డాక్టర్ల నిరాఘాట, నిర్విరామ ప్రయత్నాలు ఫలించలేదు. 

లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా నుండి రప్పించబడిన ప్రత్యేక నిపుణులైన డాక్టర్ల ప్రయత్నాలు కూడా ఆయనను రక్షించలేకపోయాయి. 

25 సంవత్సరాల పాటు  ఆయన వ్యక్తిగత డాక్టర్ల  సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వ్యక్తి 150 సంవత్సరాలు జీవించాలన్న ఆయన స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయాడు. 

2.5 మిలియన్ మంది ప్రత్యక్షంగా తన అంతిమ యాత్రలో పాల్గొన్న చరిత్ర ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక్క జాక్సన్ మాత్రమే దక్కించుకోగలిగాడు.

ఆయన చనిపోయిన ఆ ప్రత్యేక దినమైన 25/06/2009 వ తేదీన 3.15 నిముషాలకు వికీపీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు పనిచేయటం మానేసాయి. మిలియన్ల కొద్దీ జనం మైఖెల్ జాక్సన్ గూర్చి గూగుల్ లో వెతికారు...

జాక్సన్ చావును సవాలు చేసి, దాన్ని జయించాలనుకొన్నాడు; గానీ, చావే జాక్సన్ కు ప్రతిసవాలు విసిరి, తానే జయించింది. 

ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక జీవనాన్ని, భౌతిక మరణం కబళిస్తుంది.  ఇది జీవన నియమావళి.

ఇప్పుడు మనమోసారి ఆలోచిద్దాం!

మనం డాక్టర్లు, ఇంజినీర్లు, డెకోరేటర్లు, డిజైనర్ల కోసమే  (డబ్బు) సంపాదిస్తున్నామా? 

అత్యంత విలాసవంతమైన భవంతులు, కార్ల తోను; అత్యంత వ్యయభరితమైన వివాహ వేడుకలతోనూ మనం ఎవరిని సంతృప్తి పరచాలనుకొంటున్నాం? 

రెండే రెండురోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మనం తిన్న ఆహారపదార్ధాలను నేడు గుర్తుకు తెచ్చుకోగలమా? 

మన జీవనాన్ని మనమొక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం?

సుఖ జీవనానికని చెప్పి, ఎన్ని తరాలకు సరిపడా సొమ్మును మనం ఆదా చేయలనుకొంటున్నాం? 

మనలో అత్యధికులకు ఒకరు లేదా ఇద్దరు సంతానం మాత్రమే ఉన్నారు. అయితే, మనమెప్పుడైనా, మనకెంత అవసరం ఉంది, మనం ఎంత కోరుకొంటున్నాం అని ఒక్క క్షణమైనా అలోచించామా? 

'మా పిల్లలు సంపాదించ లేని అసమర్థులు కాబట్టి వారి కోసం మరింత పోగు పెట్టటం అవసరమని' మనం ఒప్పుకొంటున్నామా? 

ఈ వారంలో నీకోసం గానీ, నీ కుటుంబం కోసం గానీ, నీ మిత్రుల కోసం గానీ, కొంత సమయమైనా కేటాయించగలిగావా? 

నీ కోసం నువ్వు కేవలం ఐదు శాతం సొమ్మునైనా ఖర్చు చేసుకోగల్గుతున్నావా?  

మన జీవన మనుగడలో మనమేం సంపాదిస్తున్నామో వాటిలోనే మనం ఆనందాన్ని ఎందుకు వెతుక్కోలేకపోతున్నాము? 

వీటి కోసం నువ్వు లోతుగా ఆలోచిస్తే నిద్రలేమి, స్థూలకాయం, వెన్నుపూస జారిపోవటం వంటి వ్యాధులు నిన్ను చుట్టుముడతాయేమో?! బహుశా నీ గుండె కూడా పని చేయటం మానేస్తుందేమో?! 

ముగింపు: 

నీకోసం నువ్వు కొంత సమయాన్ని వెచ్చించుకో. మనం ఏ విధమైన ఆస్తుల్ని సొంతం చేసుకోలేం, అవన్నీ  కేవలం తాత్కాలికంగా  మన పేరు రాయబడే దస్త్రాలు మాత్రమే!

'ఇవ్వన్నీ నా ఆస్తులు' అని నీవు చెప్పినప్పుడెల్లా, భగవంతుడు నిన్ను చూసి ఓ వికృత నవ్వు నవ్వుతూ ఉంటాడు. 
ఓ వ్యక్తి నడుపుతున్న కారును చూసి, వేసుకున్న బట్టలు చూసి, అతనిపై ఓ గొప్ప భావనను నువ్వు సృష్టించుకోనవసరం లేదు. 

మనకున్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గణిత మేధావులు, సంస్కర్తలు లాంటి మహానుభావులంతా వారి ప్రయాణానికి వారు స్కూటర్ లను సైకిళ్ళను మాత్రమే  వాడేవారు!

ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం పాపం కాదు; కేవలం డబ్బుతో మాత్రమే ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం కచ్చితంగా పాపం!

జీవనాన్ని నువ్వు అదుపులో పెట్టుకో, లేకుంటే, అది నిన్ను తన అదుపులోకి తీసుకొంటుంది. 

చివరకు-
మన జీవన చరమాంకానికి మనం పొందే 'ఆనందం', 'తృప్తి', 'శాంతి' మాత్రమే మనకు నిజమైన వాస్తవ విషయాలుగా ఋజువవుతాయి. 

విచారించదగిన విషయమేమంటే- వీటినేమీ మనం డబ్బుతో కొనుక్కోలేము...🙏🙏
 *సోమనాథ జ్యోతిర్లింగం విశిష్టత... 🙏*
*సోమనాథఆలయం హిందూధర్మంలో అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొలి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో అరేబియా సముద్ర తీరాన వెలసి ఉంది. పురాణాల ప్రకారం, చంద్రుడు (సోముడు) దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహం చేసుకుని రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. దీనితో కోపించిన దక్షుడు చంద్రునికి క్షయ రోగ శాపం ఇచ్చాడు. ఆ శాప విమోచన కోసం చంద్రుడు ఈ స్థలంలో శివుడిని తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు ప్రసన్నుడై చంద్రునికి ఆరోగ్యం, కాంతి ప్రసాదించాడు. అప్పటి నుంచి శివుడు ఇక్కడ సోమనాథుడిగా వెలసాడు. ఈ ఆలయం కాలచక్రానికి ప్రతీకగా భావించబడుతుంది. అనేకసార్లు దండయాత్రల వల్ల ధ్వంసమై, ప్రతిసారీ పునర్నిర్మించబడింది. ఇది హిందూ ధర్మ స్థైర్యానికి చిహ్నం. ప్రస్తుత ఆలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రేరణతో పునర్నిర్మించారు. సోమనాథదర్శనం వల్ల పాపవిమోచనం కలుగుతుంది, మనస్సుకు శాంతి లభిస్తుంది, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం.🙏*
 *🌿 పొట్టలో గ్యాస్ సమస్యకు ఇంటి చిట్కాలు 🌿*

*ముందుమాట :*  
*పొట్టలో గ్యాస్ సమస్య అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఎదురవుతున్న సాధారణ సమస్య. తప్పు ఆహారపు అలవాట్లు, వేగంగా తినడం, మానసిక ఒత్తిడి, జీర్ణక్రియ బలహీనత వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మందులకంటే ముందు ఇంట్లోనే లభించే సహజ చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.*

*వేడి నీరు తాగడం :*  
*ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. పొట్టలో చిక్కుకున్న గ్యాస్ బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. రోజులో 2–3 సార్లు వేడి నీరు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.*

*జీలకర్ర నీరు :*  
*ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి మరిగించి తాగితే గ్యాస్ తగ్గుతుంది. జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌లను పెంచుతుంది. పొట్ట ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.*

*అజ్వాయిన్ (వాముకాయలు) :*  
*అజ్వాయిన్‌ను కొద్దిగా నమిలి తినడం లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వెంటనే ఉపశమనం ఇస్తుంది. ఇది పొట్టలో గాలి కదలికను సరిచేస్తుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది.*

*ఇంగువ (హింగు) వినియోగం :*  
*గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే గ్యాస్ త్వరగా తగ్గుతుంది. ఇంగువ పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి కూడా తగ్గుతుంది.*

*అల్లం ఉపయోగం :*  
*అల్లం ముక్క నమలడం లేదా అల్లం టీ తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్టలో వాపును తగ్గిస్తుంది. గ్యాస్ ఏర్పడకుండా సహాయపడుతుంది.*

*మజ్జిగ తాగడం :*  
*భోజనం తర్వాత మజ్జిగ తాగడం చాలా మంచిది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. గ్యాస్, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.*

*సోంపు నమలడం :*  
*భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలితే జీర్ణక్రియ మెరుగవుతుంది. పొట్టలో భారమైన భావన తగ్గుతుంది. నోటిలో తాజాదనాన్ని కూడా ఇస్తుంది.*

*నెమ్మదిగా తినడం :*  
*ఆహారం వేగంగా తినకుండా బాగా నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల గాలి లోపలికి వెళ్లదు. గ్యాస్ సమస్య తగ్గుతుంది.*

*వాకింగ్ అలవాటు :*  
*భోజనం తర్వాత 10–15 నిమిషాలు నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. గ్యాస్ బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.*

*ముగింపు :*  
*పొట్టలో గ్యాస్ సమస్యకు చిన్న చిన్న అలవాట్లు, ఇంటి చిట్కాలే పెద్ద పరిష్కారం. రోజువారీ ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ, సహజ పద్ధతులు అనుసరిస్తే మందులు అవసరం లేకుండానే గ్యాస్ సమస్యను నియంత్రించుకోవచ్చు.*
 *🥗 ప్రతిరోజూ తినే ఆహారమే మందు – శరీరాన్ని నయం చేసే 16 ఆహారాలు 🍯*

*ముందుమాట :*  
*మన శరీరానికి ఆరోగ్యం రావాలంటే ఖరీదైన మందులే అవసరం లేదు. మన రోజువారీ వంటగదిలో ఉండే ఆహార పదార్థాలే సహజమైన మందులుగా పనిచేస్తాయి. సరైన ఆహారం శరీరాన్ని నయం చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.*

*అవకాడో (Avocado) ప్రయోజనాలు :*  
*అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీరంలోని వాపును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.*

*వెల్లుల్లి (Garlic) శక్తి :*  
*వెల్లుల్లి సహజ యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. సంక్రమణ రోగాలను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.*

*పసుపు (Turmeric) వైద్యగుణాలు :*  
*పసుపు శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది.*

*తేనె (Honey) సహజ ఔషధం :*  
*తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దగ్గును శాంతింపజేస్తుంది. శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.*

*దోసకాయ (Cucumber) ఆరోగ్య రహస్యం :*  
*దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేడి వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.*

*నిమ్మకాయ (Lemon) ప్రయోజనాలు :*  
*నిమ్మకాయ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ C ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తీసుకుంటే చాలా మేలు.*

*పాలకూర (Spinach) పోషక విలువలు :*  
*పాలకూరలో ఇనుము అధికంగా ఉంటుంది. శక్తిని పెంచుతుంది. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కూడా మంచిది.*

*చిలగడదుంప (Sweet Potato) లాభాలు :*  
*చిలగడదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్లు శరీరానికి బలాన్నిస్తాయి. దీర్ఘకాలం ఆకలిని తగ్గిస్తుంది.*

*అరటి పండ్లు (Bananas) ప్రభావం :*  
*అరటి పండ్లు కడుపును శాంతింపజేస్తాయి. మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శక్తిని త్వరగా ఇస్తాయి. వ్యాయామం చేసే వారికి చాలా మంచివి.*

*చియా గింజలు (Chia Seeds) ప్రయోజనాలు :*  
*చియా గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు సహాయపడతాయి.*

*క్యారెట్లు (Carrots) ఆరోగ్య లాభాలు :*  
*క్యారెట్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కళ్ల చూపును మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.*

*ఓట్స్ (Oats) ఉపయోగాలు :*  
*ఓట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కడుపు నిండిన భావన ఇస్తాయి. బరువు నియంత్రణకు చాలా ఉపయోగపడతాయి. షుగర్ ఉన్నవారికి కూడా మంచివి.*

*బ్లూబెర్రీలు (Blueberries) మెదడు ఆరోగ్యం :*  
*బ్లూబెర్రీలు మెదడుకు మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్ల ద్వారా వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.*

*పెరుగు (Yogurt) పేగుల రక్షకుడు :*  
*పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.*

*గ్రీన్ టీ (Green Tea) ప్రయోజనాలు :*  
*గ్రీన్ టీ శరీరంలోని వాపును తగ్గిస్తుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.*

*టమాటాలు (Tomatoes) రక్షణ శక్తి :*  
*టమాటాల్లో లైకోపీన్ ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.*

*ముగింపు :*  
*ఈ 16 రోజువారీ ఆహారాలను మన భోజనంలో భాగం చేసుకుంటే శరీరానికి సహజమైన వైద్యం లభిస్తుంది. మందులకంటే ముందు ఆహారాన్ని సరిచేసుకుంటే అనేక వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చు. నిజమైన ఆరోగ్య రహస్యం మన ప్లేట్‌లోనే ఉంది.*
 *🏃‍♂️ ఆరోగ్యం & ఫిట్‌నెస్ – జీవన విజయానికి మూలసూత్రం 🧘‍♀️*

*ముందుమాట :*  
*ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు బలంగా ఉంటేనే శరీరం చురుకుగా పనిచేస్తుంది. ఈ రెండింటి సమతుల్యతే నిజమైన జీవన నాణ్యతకు ఆధారం.*

*ఆరోగ్యం–ఫిట్‌నెస్ పరస్పర సంబంధం :*  
*ఫిట్‌నెస్ లేకుండా ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం లేకుండా ఫిట్‌నెస్ సాధ్యం కాదు. రోజువారీ జీవనంలో కదలికలు, శారీరక శ్రమ తగ్గిపోతే అనేక రోగాలు మెల్లగా దగ్గర అవుతాయి. అందుకే ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదు, శరీరం సమర్థంగా పనిచేయడం కూడా.*

*మనసు–శరీరం రెండింటి ఫిట్‌నెస్ అవసరం :*  
*శరీరానికి ఎంత వ్యాయామం అవసరమో, మనసుకూ అంతే విశ్రాంతి అవసరం. ఒత్తిడి, ఆందోళన పెరిగితే శారీరక వ్యాధులు మొదలవుతాయి. మంచి ఆలోచనలు, సానుకూల దృక్పథం ఆరోగ్యానికి బలమైన మందులాంటివి.*

*సరైన ఆహారం పాత్ర :*  
*ఆకుకూరలు, ధాన్యాలు, పప్పులు, కూరగాయలు వంటి పోషకాహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం ఆరోగ్య రహస్యం.*

*సమయానికి భోజనం చేయడం ప్రాముఖ్యత :*  
*సరైన సమయంలో ఆహారం తీసుకుంటే శరీర గడియారం సక్రమంగా పనిచేస్తుంది. ఆలస్యంగా లేదా అస్తవ్యస్తంగా తినడం వల్ల షుగర్, గ్యాస్ట్రిక్, ఊబకాయం సమస్యలు వస్తాయి. క్రమశిక్షణే ఆరోగ్యానికి పునాది.*

*నిత్య వ్యాయామం శక్తి :*  
*రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయడం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలు బలపడతాయి. వయస్సు పెరిగినా శక్తి తగ్గకుండా ఉంటుంది.*

*ఆరోగ్యకరమైన శరీరం ఆత్మవిశ్వాసం పెంచుతుంది :*  
*ఫిట్‌గా ఉన్న శరీరం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో చురుకుదనం పెరుగుతుంది. మనసు ఆనందంగా ఉంటుంది.*

*వ్యాధుల నివారణలో ఆరోగ్యం పాత్ర :*  
*మంచి ఆరోగ్యం అనేక రోగాల నుంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు దరిచేరవు. మందులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది.*

*ఆరోగ్యకర జీవనశైలి రహస్యం :*  
*సరైన ఆహారం, నిత్య వ్యాయామం, తగిన నిద్ర, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిసే ఆరోగ్యకర జీవనశైలి. ఇదే మంచి ఆరోగ్యానికి అసలైన రహస్యం.*

*ముగింపు :*  
*ఆరోగ్యం ఒక రోజు కృషి కాదు, జీవితాంతం కొనసాగించే అలవాటు. ఈ చిన్న సూత్రాలను రోజూ పాటిస్తే దీర్ఘాయుష్కు, ఆనందకర జీవితం ఖాయం. ఆరోగ్యమే నిజమైన సంపద.*