Wednesday, April 29, 2026

 🚩 *ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ శివైక్యం చెందిన రోజు ఈనాడు 🚩* 

*అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి "అమ్మా సీతమ్మ తల్లి ... ఆకలేస్తుందమ్మా" అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి , దుప్పటి, వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లి వర్ధంతి ఏప్రియల్ 28.*

*శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న'  గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ 'బువ్వ'(అన్నం) పెట్టటమే!*

*అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మ గారికి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు* *అన్నింటినీ నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తలవంచి పెద్దబాలశిక్ష వంటి గ్రంధాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండా నే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది.*

*గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మగారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు 'డొక్కా' గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు.* 

*లంక గ్రామాలకు చేరుకోవాలంటే, నేటికీ కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్నగారి గ్రామమైన లంకగన్నవరం త్రోవలో ఉండటంచేత, చాలామంది ప్రయాణీకులు వారి ఇంటనే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.*

*అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో 'అపర అన్నపూర్ణ' గా శ్రీమతి సీతమ్మ గారు పేరుపొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు. మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా, ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకు అర్ధం, పరమార్ధం ఉండవు. అన్నదానం చేసి మానవతకు అర్ధం చెప్పిన మహిళాశిరోమణి సీతమ్మగారు. అలా అచిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా, ఆంద్ర దేశపు కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది.*

*ఆవిడజీవితమంతా మాతృప్రేమను పంచిన మహనీయురాలు గొప్ప   నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే - ఆవిడ జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. ఇది ఆమె ఆమె ఔదార్యానికి ఓ మచ్చుతునక.*

*నిరంతర అన్నదానంతో ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది.*

 *ఒకానొకప్పుడు ఆవిడ భార్తగారు "ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు..." అన్నారు. దానికి ఆవిడ "నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు" అని చెప్పింది.  తరువాత  ఒక రోజు సాయంకాలం  ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త గునంతో తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి( చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.*(

*ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని ఆమె ఫోటో తీయించుకున్నారు.* 

*బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది.*

*ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. దీనికి డొక్కా సీతమ్మ గారి జీవితమే  నిదర్శనం...*

*అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న 'అపర అన్నపూర్ణమ్మ'మన డొక్కా సీతమ్మ గారు!  ఈ జాతిరత్నం 1909  ఏప్రియల్ 28న శివైక్యం చెందారు.*

*ఈమె జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతుల ను చేయటమే ఆమహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి!.*

🙏🙏🙏 🫡👑🫡 🙏🙏🙏
*┈┅━❀꧁మాత్రేనమః꧂❀━┅┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🚩🍁 🙇🏻🕉️🙇🏻‍♀️ 🍁🚩🍁
 *గోదావరి స్టేషన్*

🚆

రచన : ఎల్. ఆర్. స్వామి 

గోదావరి జలాలలో మునిగి వచ్చిన గాలి నన్ను తాకి బాగా చలి వేసింది. చీర కొంగు తల మీద నుంచి కప్పుకొని బెంచి మీద నుంచి లేచాను.

నిర్జీవముగా వుంది పార్క్. జాతర ముగిసిన మరునాటి గుడిప్రాంగణములా వుంది. జీవితాలకు విద్యుద్దీపాలని అలంకరించే పిల్లలు కేరింతలుకొడుతూ ఆడుకొని వెళ్ళిపోయారు. ఆడుకుంటున్న పిల్లల మోముల్లో విరిసిన ఇంధ్రధనస్సు లు చూసి మురిసిపోయిన పెద్దలు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెలుగు రేఖలు సమంగా పడని చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తమ కంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్న యువజంటలు కూడా కదలిపోయాయి.

ఇంకా అక్కడ వుండటము నా వల్ల కాలేదు. బయటకు నడిచాను. పూర్ణేందు వనే బొట్టు చెరిగిపోయిన ప్రపంచము అమావాస్య చీకటిలోకి జారుతోంది.

రోడ్డు మీదకు వచ్చాను. ఇప్పుడు ఎక్కడకు వెళ్ళటము ?

ఇంటికి వెళ్తే..ఏముంది, ఇంట్లో...

నాలాగే ఏ నిముషములోనైనా కూలిపోవ టానికి సిద్ధముగా వున్న ఇంట్లో చేసేదే ముంది ? పెచ్చులు ఊడిపోయి, రంగులు వెలసిపోయిన, గోడలని చూస్తూ కూర్చోవటము తప్ప చేసేదేముంది?

లేదు. నేను ఇంటికి వెళ్లలేను.

ముందుకి నడిచాన నాలుగు అడుగులు వేసానో, లేదో ఆగిపోయాను. రోడ్డు మలుపు తిరగే చోట గుమిగూడి ఉన్నారు జనము. ఏవేవో మాటలు వినబడుతు న్నాయి.

"ఏమైంది?" గబగబ నడిచి వాళ్ళని సమీపించి అడిగాను.

నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను అదోలా చూసి వాళ్ళ మాటల్లో వాళ్లు మునిగిపోయారు. ముసలిదానికి జవాబివ్వటమేమిటనేది కాబోలు వాళ్ళ భావము.

"కళ్ళు, కాళ్ళూ పని చెయ్యని వాళ్ళు ఇంట్లో పడి ఏడవవచ్చు కదా?” నూనుగు మీసాల యువకుడు ఒకడన్నాడు "రోడ్డు మీదకు వచ్చి మమ్మల్ని ఏడిపించట మెందుకు?"

"ఏ రాచకార్యాలు మునిగిపోతాయని వీళ్లు రోడ్డు మీద తిరుగుతున్నారో!" మరొకడు వంతపాడాడు.

"నాకూ అదే అర్ధము కావటము లేదురా" మరో యువకుడు అన్నాడు.

"తిరిగినంత కాలం తిరిగారు కదా? కళ్ళూ, కాళ్ళూ ఆడనప్పుడయినా, ఇంట్లో పడి వుండవచ్చుకదా?"

మరికొంత దూరము ముందుకుసాగేను అప్పుడు కనబడింది, ఆ దృశ్యము చేతి కర్ర సహాయంతో లేవటానికి ప్రయత్నిస్తోంది రోడ్డు మీద పడిన ముసలావిడ. సుమారు ఏడుపదులు సంవత్సరాలు దాటి ఉండవచ్చు ఆవిడకి.

"నన్నెందుకురా ఆడిపోసుకుంటారు" చేతి కర్ర రోడ్డు మీద నుండి తీసుకుని మెల్లగా అడిగింది "నువ్వు కదా వచ్చి నన్ను గుద్దేసింది?"

నేను చుట్టూ దృష్టి మళ్ళించాను రోడ్డు వారగా పడి వుంది, ఒక స్కూటర్. ఆ స్కూటర్ని ఆనుకొని నిలబడి వుంది ఓ పాతికేళ్ళ అమ్మాయి.

"నువ్వెళ్ళమ్మా, ఈవిడ మాటలతో మనకేం పని".

రోడ్డు మీద పడి ఉన్న స్కూటర్ని పైకి లేపి ఆమెకి అందిస్తూ అన్నాడు ఒక కుర్రవాడు "ఆవిడ రోజులు ఎప్పుడో గడిచిపోయా యి"

నిజమే ! ఆవిడ రోజులే కావు ఆవిడ లాంటి మాలాంటి ముసలివాళ్ళ రోజులు ఎప్పుడో గడిచిపోయాయి.

కానీ కృంగి, కృశించిపోయేలా ప్రవహించి నా, గోదావరి జీవనదియని ఇరువైపుల జనానికి ప్రాణదాయని అని బ్రతుకు చూడని కుర్రవాళ్ళకి ఏమి తెలుస్తుంది.
వీళ్ళు ఇక మారరు.

జనాన్ని దాటుకుంటూ ముందుకు నడిచాను. ఎదురుగా ఉన్న గోదావరీ స్టేషన్ చేరుకోవటమే నా లక్ష్యం.

చీకటిగా వుంది స్టేషన్ ఆవరణ. జీవితపు వసంతకాలములో వచ్చిపోయే అతిధుల కోసము, చుట్టాల కోసము అహర్నిశలూ శ్రమపడి, అలసిపోయి, అకాల వార్ధక్య ములోకి జారిపోయి, నీరసముగా పడుకున్న అతివలా ఉంది స్టేషన్. ఏ మాటలు అన్నా ఎదురు తిరగరనే ధైర్యము వల్ల ముసలి వాళ్ల మీద విసిరే దుర్జ్భాషితాలలా స్టేషన్ చుట్టూ చెత్తాచెదారము విసరేసి వున్నాయి.

మెల్లగా అడుగులు వేసి ప్లాట్ఫారము ఎక్కాను.. ఏ నిముషములోనయినా ఆగిపోయే ముసలి వాని గుండెలా వెలిగి ఆరుతోంది ఒకే ఒక ట్యూబ్ లైట్. ఒకప్పుడు సరకులమ్మిన దుకాణాలు సందడిగా ఉన్న ఆఫీసు గదులు, ఖాళీగా గాలి తీసిన బెలూన్లలా ముడుచుకు పోయి ఉన్నాయి.

ముందుకి నడిచాను ప్లాట్ఫారము మీద నిద్రపోతున్న ముసలి కుక్కలు ఓసారి బద్ధకముగా కళ్ళు తెరచి చూసి మళ్ళీ పడుకున్నాయి.

రోజూ ఆ ప్లాట్ఫారము మీద గంటల తరబడి కూర్చోవటమ నాకు అలవాటు. ఏ బండి ఆగని గోదావరి స్టేషన్ నా బ్రతుకుకు ప్రతీకలా అనిపిస్తూ వుంటుంది నాకు.

ఒక కుర్చీ మీద నడుము వాల్చాను. కాళ్ళూ చేతులు నొప్పిగా వున్నాయి. సాయంత్రము నాలుగు గంటల నుంచీ తిరుగుతూనే ఉన్నాను. ఏమీ తినలేదు. త్రాగలేదు కళ్ళుమూతలు పడుతున్నాయి

పట్టీ పట్టని నిద్రలో ఎవరో లేపినట్లు తోచింది. కర్రతో ఎవరో పొడిచినట్లు బలవంతముగా కనురెప్పలు విప్పాను. ఎదురుగా నిలబడి విన్నాడు గుబురు మీసాల హెడ్డు.

“ఏమిటే ముసలీ నీకు రోజూ చెప్పాలా, ఇక్కడ తొంగో కూడదని? యిదేమన్నా నీ బాబుగాడి సొమ్మా." కర్రతో మరోసారి పొడిచాడు హెడ్డు.

హెడ్డువాడు బాగా పరిచయమే. ఆగని ట్రైన్లని చూస్తూ స్టేషన్లో గంటలు గడిపే నాతో అప్పుడప్పుడు కబుర్లు ఆడుతూ వుంటాడు. అతను 'టీ' కని సిగరెట్లు కనీ అయిదు, పదీ తీసుకుంటూ వుంటాడు. నిన్ననే వాడికి పాతిక రూపాయలిచ్చాను ఆ డబ్బు పుచ్చుకున్నప్పుడు ఎంత బాగా మాట్లాడాడు.

మెల్లగా లేచాను వాడిని నాలుగు తిట్టాలనీ, ఛడామడా దులపాలనీ నోరు తెరచాను కానీ..

అంతలో గుర్తుకువచ్చింది. వాడు పుచ్చుకున్నది పాతిక రూపాయ లేగా ! 

తన జీవితమంతా పుచ్చుకున్న కొడుకు ఏమి చేసాడు !?

పది సంవత్సరాల క్రితము ఇక్కడే బండి ఎక్కాడు వాడు. ఉద్యోగములో చేరి రెండు నెలలు పోయాకా వచ్చి నన్ను తీసుకొని వెళతానన్నాడు, కానీ వాడు రాలేదు. ఇప్పుడు గోదావరీ స్టేషన్లో బళ్ళే ఆగటం లేదు.

చీర కొంగుతో కళ్ళు ఒత్తుకున్నాను.

ప్రపంచములోని వెలుగుని తన గుప్పెట్లో పెట్టుకొని, పశ్చిమార్ణవములోనికి దూకుతున్న సూర్యుడిని చూస్తూ ఇంటి గుమ్మం దగ్గర నిలబడ్డాను. నేను ఏదో బండి ఆగిన శబ్ధము విని తల ఎత్తి చూసాను. నలుగురు ఆయనను మోసు కొని వచ్చి గుమ్మం దగ్గర పడుకోపెట్టారు. నా కళ్ళు తిరిగియి ఎంతసేపు అలా గడిచిపోయిందో తెలియదు. తెలివి వచ్చినప్పుడు ఇల్లంతా హడావిడిగా వుంది చుట్టాలు, స్నేహితులూ, ఇంటి నిండా వున్నారు.

"పాపం సముద్రములో పడిపోయారట" వీధి గుమ్మం అవతల పడుకోపెట్టిన అతని కళేబరాన్ని చూసి వెళ్ళేవారి మాటలు నా చెవిలో పడ్డాయి నాకు. నేను కదలలేదు చుట్టూ వున్న ప్రపంచము ఓ పెద్ద సున్నాలా అనిపించింది.

"జరిగిందేమో జరిగిపోయింది" ఓ ముసలావిడ నా దగ్గరకు వచ్చి అంది. "బాధపడితే పోయిన ఆయన వస్తారా, అమ్మా"

"ఎంతో కొంత చదువుకున్న దానివి, నీకు చెప్పదగ్గ దానిని కాదనుకో" మరో ముసలావిడ అంది. "ఓ పది సంవత్సరా లు కష్టపడ్డానంటే నీ కొడుకు చేతికి అందివస్తాడు, ఆ తర్వాత నీ కష్టాలు తీరిపోతాయి.

నిజమే! వీడు ఎదిగితే ఇంక కష్టమే ముంటుంది!

నేను లేచాను శక్తి కూడకట్టుకుని ముందు కి నడిచాను. శుక్లపక్షవు చంద్రునిలా దిన దిన ప్రవర్ధుడయ్యాడు వాడు పదిహేను సంవత్సరాలలో పూర్ణ చంద్రునిలా ఎదిగాడు.

ఇంజనీరింగ్ చదివాడు గుజరాత్లో మంచి ఉద్యోగము వచ్చింది. ఉద్యోగానికి బయలుదేరుతూ వాడన్న మాటలు ఇంకా నా చెవిలో గింగురుమంటున్నాయి.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
ఈ ఫ్లాట్ఫారము మీదే బండి ఆగింది, ఆ రోజు బండి బయలుదేరక ముందు బండి లో నుంచి చేతులు బయటకి చాచి నా కన్నీళ్ళు ఒత్తుతూ అన్నాడు వాడు.

"బాధపడకమ్మా, ఓ రెండు నెలల్లో ఇల్లు చూసి నిన్న తీసికెళతానుగా".

బండి వెళ్ళిపోయింది. అంతవరకు చక్కని వెన్నెలను అందించి మబ్బు తెర వెనుక జారుకున్న చంద్రుని వెలుగులో అడుగులు వేసాను, ఇంటి వైపు.

రోజులు గడిచిపోయాయి. ఆరు నెలలు తర్వాత వచ్చింది, మొదటి ఉత్తరము. వాడు అమెరికా వెళతాడట! ఆశగా ఉత్తరాన్ని అటూ, ఇటూ తిప్పి చూసాను, వాడి చిరునామా ఎక్కడా కనబడలేదు.

గట్టిగా నిట్టూర్చి కళ్ళు ఒత్తుకున్నాను.

బ్రతుకు వేగము పుంజుకుంది. సైకిలు మీద వెళ్ళినవారు స్కూటర్లోకి మారారు. రోడ్డు నిండా కనబడిన సైకిల్ రిక్షాలు ఆటోలకి, దారి ఇచ్చి కనుమరుగయి పోయాయి. అక్కడక్కడా కారులు కూడా కనబడుతున్నాయి.

గోదావరి స్టేషన్లో ఆగే బళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మానవ సంబంధాలను కలపటము కోసము సంత్సరాల క్రితం నిర్మించిన వారధి బలహీనమైపోయింద ట!

చూపు మందగించింది, కానీ ఎదురు చూపు మానలేదు. ప్రతీ రోజూ వచ్చి ఈ బల్ల మీద కూర్చుంటూనే ఉన్నాను.

ఇక్కడే కనబడ్డాడు ఓరోజు సుబ్బారావు, సుబ్బారావు మా ఈడు వాడే, అమెరికా లో వుంటుంన్నాడని విన్నాను.

నా మనస్సుకి పట్టిన ముసురు ఊరంతా పాకినట్లు అయింది. ఆరోజు చిన్న తుంర్లు కూడా పడుతున్నాయి. వాన జల్లు నుంచి తప్పించుకోవటముకోసమని కొంత దూరములో వున్న బల్ల వైపు నడుస్తూ వుంటే కనబడ్డాడు సుబ్బారావు.

"మీరు మీరు.. " అతను సుబ్బారావు అవునో, కాదో అనే అనుమానముతో నా గొంతు తడబడింది.

"నేను సుబ్బారావునే సీతా" సుబ్బారావు అన్నాడు. "బాగున్నావా" అని నేనడగను ఎందుకంటే నువ్వెలాగున్నావో నాకు తెలుసుకదా." అతను చేతిలో వున్న పైపు ఓసారి నోట్లో పెట్టుకొని గట్టిగా పొగపీల్చి అన్నాడు.

"నీ కొడుకు గురించి నువేమి అడగబోతు న్నావో నాకు తెలుసు, పాపం పిచ్చిది తల్లి మనస్సు" సుబ్బారావు ఓ నిమిషము ఆగాడు. ఆ తర్వాత అన్నాడు “వాడికి ఏమిటమ్మా! బ్రహ్మాండముగా వున్నాడు. దొరసానిని పెళ్ళి చేసుకున్నవాడికి అమెరికాలో లోటేమిటమ్మా!"

ఆకాశము ఓసారి వురిమింది. ఆ వురుముకు తట్టుకోలేక నేను, చెవులు మూసుకున్నాను.

పెనుతుఫానే వీచింది. అంతవరకు మూగగా ఓ పాయలా రోదిస్తూ వెళ్ళిన గోదావరీ తల్లి, గుండెలోని దుఃఖము కట్టలు తెంచుకొని ప్రవహించి ఒడ్డున వున్న యిళ్ళని జలమయము చేసింది.

వివరము విని వచ్చింది మా చెల్లెలు. తనతో రమ్మని బలవంతము చేసింది.

"మేమేమన్నా పరాయివాళ్ళమా చెప్పు. నా పిల్లలు నీ పిల్లలు కాదా?" నా చెల్లెలు అంది "వాడు పోతే పోయాడు మాతో వుండవచ్చుకదా?" ఉండాలనే అనుకున్నాను.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
ఆ వుద్దేశముతోనే దాని వూరు వెళ్ళాను. అంతా బాగుంటే ఉద్యోగం బదిలీ చేయించుకోవాలని కూడా అనుకున్నాను కానీ..

"పెద్దమ్మ వాళ్ళ వూరు ఎప్పుడు వెళు తుందమ్మా?" బయటికి వెళ్ళి వస్తున్న నేను ఆ మాటలు విని ఆగిపోయాను.

"ఊరు వెళ్ళదమ్మా ఇక్కడే వుంటుంది"

"ఎందుకని?"

"పెద్దమ్మకి ఎవరూ లేరు కదమ్మా, మనం తప్ప, అందుకే ఇక్కడ వుంటుంది"

"నా కిష్టంలేదమ్మా" ఆధునిక చదువులు, సంస్కారములు" మారిపోయిన స్వార్థానికి బానిసయిన అమ్మాయి ఖచ్చితంగా అంది.

"అలా అనకూడదమ్మా, పెద్దమ్మని మనం చూడకపోతే మరెవరు చూస్తారు?"

"అది నాకు తెలీదు. అసలే ఇల్లు ఇరుకు, దానికి తోడు ఆవిడ దగ్గు ఒకటి రాత్రంతా నిద్రపోనివ్వటమే లేదు"

"మందు లేసుకుంటే దగ్గు తగ్గిపోతుందిలే"

"దగ్గుకంటే మందు తీసుకుంటుంది కానీ అవిడ ఆలోచనలకి మందులు వాడలేము కదమ్మా?" ఓ నిముషము మాటలూ ఆగి పోయాయి. నేను ఇంటిలోకి అడుగు పెట్టాను.

"నేను జీన్సు వేసుకుంటాను, జుత్తు కత్తిరించుకుంటాను, అది నా ఇష్టం, ఆవిడ ఇష్టం కాదు కదా? అవన్నీ పెద్దమ్మ కి ఎందుకమ్మా?"

"కూరంతా అలా ఏరిపారేస్తావేమిటి?" నా అడుగుల సవ్వడి వినటం వల్ల కాబోలు మాటమారుస్తూ అంది మా చెల్లెలు.

"చూడమ్మా బాగాచూడు ఇదేమీ కూర కాదు, కరివేపాకు "కూరలో కరివేపాకును ఏరిపారేయక తినేస్తారా?"

"అక్కడ నా స్థానము ఏమిటో నాకు అర్థమయింది. ఆరోజే బయలుదేరాను మా వూరికి.


"ఇంకా ఇక్కడే తొంగున్నావన్నమాట నిన్ను నిన్ను. ..." మళ్ళీ వచ్చాడు హెడ్డు.

మెల్లిగా లేచి ముందుకు నడిచాను. ప్లాట్ఫారము దిగి పట్టాలు దాటి గోదావరీ ఒడ్డున నడిచి వెళితే ఇల్లు చేరుకోవచ్చు.

ప్లాట్ ఫారము దిగాను. జీవితములో దాటవలసిన వివిధఘట్టాల లాంటి పట్టాలు, ఒకటి వెనక ఒకటి కనబడ్డాయి. దృష్టినానించి మెల్లిగా పట్టాలు దాటు కుంటూ ముందుకు సాగాను. ఆఖరి పట్టా దాటుతూ వుంటే గుండె జారిపోయింది. ఎదురుగా అతివేగముతో వస్తోంది ట్రైన్!

కళ్ళు తిరగిపోయాయి పట్టాల మధ్యన పరచిన రాళ్ళకు కాళ్ళు తగిలి అవతల పడ్డాను.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
కళ్ళు తెరచినప్పుడు ఓ నులక మంచము మీద పడి వున్నాను. ప్రపంచాన్ని కబళిం చిన చీకటి పూర్తిగా తొలగిపోయింది.

ఉదయ సూర్యుని వెచ్చని కిరణాలు, ఊడిపోయిన తాటాకుల సందులలో నుంచి వచ్చి నన్ను పలకరించాయి. కళ్ళు తెరచి చూసాను ఎదురుగా నిలబడి వున్నాడు ఓ కూలివాడు.

“ఒసే, అమ్మగారు లేచారే” నేను కళ్ళు తెరవటము చూసి అతను ఆనందముతో అరిచాడు "టీ నీళ్ళు పట్రావే”.

ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది చేతిలో ఒక చిన్న కేరియర్ గిన్నె, చంకలో నెలల పిల్ల.

"టీ తీసుకోండి అమ్మగారు" ఆమె కేరియర్ గిన్నె నాకు అందించింది "టీ తీసుకుంటే బాగుంటుంది, ఓపిక వస్తుంది".

నేను ఆ ఇద్దరినీ చూస్తూ పడుకున్నాను అసలు కదలలేదు.

"టీ మేము చేసింది కాదు అమ్మగారు మీ కోసము హొటలు నుంచి తెచ్చాము తీసుకోండమ్మగారు".

నేను ఇష్టములేకపోయినా 'టీ' అందుకో వలసి వచ్చింది.

"నాకు పనిటయిము అయిపోనాది, నేను వెళతాను, నువ్వు వుండిపోయి అమ్మ గారిని జాగ్రత్తగా చూసుకో". అతను వెళ్ళిపోయాడు.

వాళ్ళిద్దరూ గోదావరి పై కొత్తగా నిర్మించే వంతెన కోసం, పని చేసే కూలీలట. నన్ను రోజూ ఆ రోడ్డు మీద చూస్తూ వుంటారట! అంతే కాదు నా గురించిన వివరాలు కూడా వాళ్లకి తెలుసట!
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
నులక మంచం మీద అసహనముగా కదిలాను, "నేను ఇంటికి వెళ్ళాలి" మంచము దిగుతూ ఉంటే పరుగెత్తుకొ చ్చింది ఆమె.

"కదలకండమ్మా, మీరు పడుకోండి"

"లేదు నేను ఇంటికి వెళ్ళాలి"

"ఒద్దమ్మగారు ఉండండి. ఇంటి దగ్గర మీకు ఎవరున్నారని? ఇక్కడే వుండండి.
మాకు కలిగింది మేము పెడతాము".

నేను ఆశ్చర్యముతో చూస్తూ ఉండిపో యాను. లక్షలు సంపాదిచే కొడుకు చెప్పని మాట దీని నోటి నుంచి రావటమే మిటి ? సంపాదించే కొద్దీ, డబ్బు మీద ఆశ పెరుగుతుందని చెప్పటము నిజమే కాబోలు !

నేను మెల్లగా అడుగులేసాను. తడక తలుపు దాటుతూ వుంటే కాళ్ళకి ఏదో మెత్తగా తగిలినట్లు తోచింది. వొంగి చూసాను. సంవత్సరము నిండని ఆమె బాబు నా పాదాలని తడుముతున్నాడు.

హృదయము స్పందించింది, కానీ ముందుకి సాగాను. అ పసికందు చేతులు నా పాదాలను విడచిపెట్టలేదు. పాదాలకి తగిలే చీర అంచులని పట్టుకొని లాగుతు న్నాడు. బోసినవ్వులు నవ్వుతున్నాడు. మనకు తెలియని వాడి భాషలో ఏవేవో చెబుతున్నాడు.

నాలో ఏదో చెప్పలేని స్పందన!

హఠాత్తుగా వాడిని ఎత్తుకున్నాను. వాడిని ఎత్తుకుని ముందుకు నడిచాను. ఇంటి వైపు కాదు, ఇరువైపులా వున్న మావన సంబంధాలను కలపటానికి, కొత్త వారది నిర్మిస్తున్న కూలీల వైపు.

*సమాప్తం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 *_లిసా ఫిలిప్స్_*
*_అందాల కలల నుంచి అగాధపు చీకటి వరకు.._*
 *_ఒక పోరాట యోధురాలి కథ_*
*_నల్ల పుస్తకం"లో దాగి ఉన్న అశుద్ధ సత్యాలు_*

*_"నేను ఎంత భయపడుతుంటే.. వారు అంతగా ఆనందించారు" — లిసా ఫిలిప్స్ పెదవుల నుంచి వెలువడిన ఈ ఒక్క మాట నేడు ప్రపంచాన్ని నిద్రపోనివ్వడం లేదు. కేవలం 24 గంటల్లోనే 28 కోట్ల మంది వీక్షించిన ఆమె కథనం, ఇన్నాళ్లూ కవచంలా ఉన్న 'అధికార' గోడలను బద్దలు కొట్టింది. ఇది కేవలం పాత ఫోటోల గురించి కాదు, 15 మంది అతిరథ మహారథుల పేర్లు ఉన్న ఒక 'నల్ల పుస్తకం' (Black Book) గురించిన సంచలనం. ప్రిన్స్ ఆండ్రూ పేరు అందులో మొదటి వరుసలో ఉండగా, దశాబ్దాల పాటు భయంతో తను దాచుకున్న రహస్యాలను లిసా నేడు ప్రపంచం ముందుకు తెచ్చింది. ఆమె వెల్లడిస్తున్న విషయాలు కేవలం వ్యక్తిగత జ్ఞాపకాలు కావు, ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యానికి సంబంధించిన రహస్య మ్యాప్‌లు._*

*_​బెల్జియం నుంచి న్యూయార్క్ వీధుల వరకు.._*
*_లిసా ఫిలిప్స్ నేపథ్యం సాదాసీదాగా మొదలైంది. ఆమె తండ్రి అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తుండటంతో బెల్జియంలో జన్మించిన లిసా, బాల్యం నుంచే గమ్యాలను మారుస్తూ పెరిగింది. పొడవుగా, ఆకర్షణీయంగా ఉండే లిసాకు టీనేజ్ నుంచే మోడలింగ్ రంగంపై మక్కువ పెరిగింది. 90వ దశకం చివరలో మయామి బీచ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, దక్షిణాఫ్రికా, గ్రీస్ మీదుగా చివరకు మోడలింగ్ కలల రాజధాని న్యూయార్క్‌కు చేరుకుంది. 1999 చివరలో ఆమె వేసిన ఆ అడుగు, తన జీవితాన్ని ఒక అంతుచిక్కని సుడిగుండంలోకి నెడుతుందని ఆమె ఊహించలేదు._*

*_​మెంటార్ ముసుగులో మృగం_*
*_మోడలింగ్ రంగంలో రాణించాలనే కలలతో 21 ఏళ్ల వయసులో ఎప్‌స్టీన్ వలలో చిక్కుకున్న లిసా ఫిలిప్స్ అనుభవం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక హెల్త్ మ్యాగజైన్ కవర్ షూట్ కోసం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌కు వెళ్లినప్పుడు లిసాకు ఎప్‌స్టీన్ పరిచయమయ్యాడు. ఒక 'మెంటార్' లాగా నటిస్తూ, కెరీర్ సలహాలిస్తూ అత్యంత చాకచక్యంగా ఆమెను తన వలలో వేసుకున్నాడు. "అతను చాలా తెలివైనవాడు,_* *_ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే వ్యక్తిత్వం అతనిది" అని లిసా గుర్తుచేసుకున్నారు. ఒక అందమైన దీవికి విందుకు పిలిచి, అక్కడ తన బలాన్ని, పరపతిని ప్రదర్శించి ఆమెను భయపెట్టాడు. ఆ రాత్రే మసాజ్ పేరుతో మొదలైన వేధింపులు, ఆ తర్వాత ఏళ్ల తరబడి సాగిన అంతులేని లైంగిక దోపిడీకి నాంది పలికాయి. లిసాను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ఆమెకు అగ్రశ్రేణి మోడలింగ్ ఏజెన్సీలలో అవకాశాలు కల్పించి, తనపై ఆమె ఆధారపడేలా ‘గ్రూమింగ్’ చేశాడు._*

*_​అధికార గర్వం.._* *_ఆవేదనల సముద్రం_*
*_ఎప్‌స్టీన్ కేవలం తన కోసమే కాకుండా, తన వద్ద ఉన్న యువతులను ఇతర శక్తివంతుల విలాసాలకు వస్తువులుగా వాడుకునేవాడు. "చాలామంది ప్రముఖులు నేడు నోరు విప్పడం లేదు, ఎందుకంటే ఎప్‌స్టీన్ వారి కెరీర్‌లను, కుటుంబాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఉండేవాడు" అని లిసా వెల్లడించారు. లిసా ఎదుర్కొన్న వేధింపుల్లో రాజకుటుంబీకుల నుంచి ఆర్థిక దిగ్గజాల వరకు అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు. ఆ భయంకరమైన రోజుల్లో ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభ, అవమానం ఆమెను డ్రగ్స్, మద్యానికి బానిసను చేశాయి. తనను తాను రక్షించుకోవడానికి చివరకు ఆమె న్యూయార్క్ వదిలి లాస్ ఏంజిల్స్ పారిపోవాల్సి వచ్చింది_*.

*_​చీకటి నుంచి వెలుగు వైపు.._*
*_2019లో ఎప్‌స్టీన్ మరణం తర్వాతే లిసాకు తిరిగి ప్రాణం వచ్చినట్లయింది. ఇన్నాళ్లూ తనలో తాను దాచుకున్న నిజాన్ని బయటపెట్టే ధైర్యం వచ్చింది. థెరపీ సహాయంతో తన గాయాలను మాన్పుకుంటూనే, నేడు ఇతర బాధితులకు అండగా నిలవడానికి "ఫ్రమ్ నౌ ఆన్" (From Now On) అనే పోడ్‌కాస్ట్ ద్వారా గళం ఎత్తుతోంది. "ఇకపై నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు, తప్పు చేసిన వారే తలదించుకోవాలి" అని గర్జిస్తున్న లిసా, నేడు కోట్లాది మంది బాధితులకు ఆశాకిరణంగా మారింది. ఆమె చేతిలో ఉన్న ఆ 'నల్ల పుస్తకం' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అపరాధ నీడల్లో దాగున్న వేటగాళ్లకు చమటలు పట్టిస్తోంది. ​లిసా ఫిలిప్స్ గొంతులో ఉన్న వణుకు నేడు నాగరిక సమాజం నైతికతను నిలదీస్తోంది. ఒకే ఒక్క పేరు బయటకు వస్తేనే బ్రిటన్ రాజకుటుంబం గందరగోళంలో పడితే, ఇక పూర్తి జాబితా బయటపడితే ఆ ప్రకంపనలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో ఊహించుకోవడమే కష్టంగా ఉంది_*. *_ఒకప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అనిపించిన సమాచారం, ఇప్పుడు ఒక భయంకరమైన నేర నమూనాగా (Pattern) రూపాంతరం చెందుతోంది. సత్యం వెలుగులోకి వస్తున్న వేళ, అపరాధ నీడల్లో దాగున్న వారు ఇక ఎంతకాలం తప్పించుకోగలరు అన్నదే నేటి అతిపెద్ద ప్రశ్న._*
 హరిఓం , 

       వాళ్ళిద్దరికీ పెళ్ళయి అరవై ఏళ్ళయింది. పెళ్లి రోజు ని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు. తలంటుకున్నారు. పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్ద మందారం తురుముకుందామె. " ఈ మధ్యనే" అయిదారేళ్ళక్రితం కొన్న అత్తరుని రాసుకున్నాడతను. కధ లోకి వస్తే.. మందారం తురుముకున్న ఆమె, అత్తరు రాసుకున్న అతను కలిసి గుడికి వెళ్ళారు. దేమునికి దండం పెట్టుకున్నారు. మరో పద్ధెనిమిది పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడతను. అప్పటి కి అతనికి నూరేళ్ళు వస్తాయి. ఆమె మరో ఇరవైరెండు పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. అప్పటి కి ఆమెకి నూరేళ్ళు వస్తాయి. దానాదీనా ఇద్దరూ నిండునూరేళ్ళు బతకాలని కోరుకున్నారు. దేమునికి కొట్టిన కొబ్బరికాయ ని ప్రసాదముగా అతని చేతిలో పెడదామని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది. అయ్యయ్యో అనుకుని ఆందోళన తో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసాడతను.
      బతికినంతకాలం బతకదు. ఉన్న నాలుగు రోజులూ హాయిగా బతకనీయండి. ఇంటికి తీసుకుపొమ్మని డాక్టర్ అంటే .. ఇంటికి తీసుకువచ్చాడు. వీలయిన మేరకు ఆమెకు సపర్యలు చేయసాగాడు. ఆమె కళ్ళ లోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు. గర్వపడ్డాడు. నిజంగా కూడా అంతే.. పెళ్లి అయిన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచపెట్టలేదు. అన్నీ అతనితో పంచుకునే బతికింది. ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది. అది ట్రంకు పెట్టె. అటక మీద వుంది. దాని విషయం అడగకండి! అందులో ఏమున్నదీ చూడకండి అని ఆమె ఆంక్ష విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవనూ లేదు, అందులో ఏమున్నదీ చూడనూ లేదు. చూడాలని చాలా సార్లు అనుకున్నా ఆ కోరిక ని అణచుకున్నాడు. ఇక ఇప్పుడు తప్పదు. చూడాల్సిందే.. అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి.. అందామె. అటక మీద నుంచి ఆ పెట్టెని దించి జాగ్రత్తగా తెరిచి చూసాడు. ఏమున్నాయి అందులో?
       రెండు ఊలు స్వెట్టర్ లు వున్నాయి. అంతేనా? ఓ మూడులక్షల రూపాయలు కూడా వున్నాయి. పెద్ద మొత్తమే!
        ఈ స్వెట్టర్ లు ఏంటి? అని అడిగాడు. దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగిందామె. పెళ్ళయి మీతో పాటుగా నేనిక్కడికి బయలుదేరి వస్తునపుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది? ఆత్రపడ్డాడతను.
      భర్త తో ఎన్నడూ పోట్లాడకు. ఒకవేళ అతని మాటలకీ, చేష్టలు కీ పోట్లాడాలన్నంత కోపం వస్తే, ఎంచక్కా స్వెట్టర్ లు అల్లుతూ కూర్చో.. కోపం దానంతట అదే పోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్లూ చేసాను అన్నదామె. ఆ మాటలకి అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. చేతిలోని రెండు స్వెట్టర్ లనూ ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు. అరవైసంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది రెండంటే రెండే సార్లన్నమాట! చాలు! ఐయామ్ గ్రేట్ అనుకున్నాడతను.
     మరి ఈ మూడులక్షలు? ఇంత డబ్బు ఎక్కడది? అని అడిగాడు.
    అదీ.. అదీ.. ఈ అరవైఏళ్ళలో నేను స్వెట్టర్లు అమ్మగా వచ్చిన డబ్బు అది అన్నదామె. అతను కళ్ళు తేలేసాడు................. మీ శ్రేయోభిలాషి
 అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా?
....  వనం జ్వాలా నరసింహారావు
=============================
పెళ్లంటే ఎన్నో ఆచారాలు, సంప్ర దాయాలు, ఉద్వేగాలు, సరదాల సమ్మే ళనం. హిందూమత ప్రకారం జరిగే పెళ్లిలో ఒకప్పుడు కనిపించిన ఆచార సంప్రదాయాలు ఇప్పుడు పెద్దగా కనిపిం చడం లేదు. భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. హిందూ కుటుంబాల్లో పెళ్లిరోజుకు ఒక రోజు ముందర 'స్నాతకం' అనే ముఖ్య మైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంట్లో కానీ, కల్యాణ మండపంలో కానీ లేదా విడిది (ఆడ పెళ్ళివారు ఏర్పాటుచేసిన అతిథిగృహం)లో కానీ, పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ 'సంస్కారం', ప్రధానంగా, వరుడిని 'బ్రహ్మచర్యం' నుండి గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో, అంగీకారంతో 'గృహస్థాశ్రమం' స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న వేడుక. ఆ సమ యంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తిరీయోపనిషత్తులోని 'సత్యాన్న' అన్న ఒక శ్లోక రూపంలో ఉంటుంది.
'సత్యం, ధర్మం, తెలివితేటల విషయాల్లో పొరపాటు పడవద్దు' అన్న ఆదేశం అది. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మా లను తెలుసుకొని, వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ... 'వరుడికి శుభం కలుగుగాక' అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. స్నాతకానికి 'సమావర్తనం' అన్న పేరు కూడా ఉంది. సమావర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం మరో ముఖ్యమైన ఆచారం. వరుడు కాశీ ప్రయాణం, బాజా భజంత్రీల మధ్య గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావుకోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేం దుకు కాశీకి పోతున్నానని చెప్పి బయలుదేరుతాడు. కాశీ యాత్రా ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నాననీ; దానికి బంధు, మిత్రుల అనుజ్ఞ కావాలనీ వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదనీ, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్ర మంలో ప్రవేశించాలనీ పురోహితుడు హితవు పలుకుతాడు. వధువు సోదరుడు వచ్చి 'అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసు కొని గృహస్థుగా జీవించండి' అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వరుడిని వెనుకకు తీసుకొని వస్తాడు. శాస్త్రం ప్రకారం కాబోయే
బావమరిదికి వరుడు నూతన వస్త్రాలను బహుకరిస్తాడు. ఆనాటి పెళ్లిళ్లలో ఇదొక ప్రధానమైన వేడుక. చాలా కోలాహలంగా పెళ్ళికి 'తరలి పోయే ముందర జరిగే సరదా కార్యక్రమం ఇది.
ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు, మిత్రులందరూ బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించుకోవడం, పల్లకీ లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. శుభకార్యానికి బయలుదేరుతున్నామనీ, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా ఉండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.
పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ; స్నాతకం, అంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును (సిద్ధం) చేయడం ఒక ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెల తెలవారుతుండగానే, మంగళ వాద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగు తుంది. వధువుకు, కన్యాదాత దంపతులకు, తోటి పెళ్ళి కూతు రుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), ముందే, ముత్తం బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికీ, తల్లితండ్రులకూ, తోటి పెళ్ళికొడుకుకూ (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధు వులందరూ వస్తారు. నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని 'అంకురార్పణ'అంటారు. అలనాటి మంగళ స్నానాలు, మామిడితోరణాలు, స్నాతకం, కాశీయాత్ర లాంటి వేడుకలు ఇంకా ఉన్నాయా? అక్కడక్కడా ఉండవచ్చునేమో!
సేకరణ .
 ‘ఏం బన్నీ, తలుపు కొట్టావు? ఎవరైనా అటెస్టేషన్ సంతకాల కోసం వచ్చారా?’ బాత్రూమ్ తలుపు సగం తెరిచి, సబ్బుకళ్లు సగం మూసి అడిగాను.

‘ఎంతసేపు స్నానం? మళ్ళీ టైమైపోయిందంటూ పరిగెడతావు. త్వరగా రా!’ అంది కాస్త గట్టిగానే.

‘అయిపోయింది. క్రిములతో క్లైమాక్స్ ఫైట్‌లో ఉన్నాను. 99% తొలగిపోయాయి. డెట్టాల్ మరొకసారి పనిచేసింది’ అంటూ మళ్లీ తలుపేసేశాను.

‘మ్రోగింది వీణా.. పదే పదే...’ పల్లవందుకున్నానో లేదో పదే పదే ఫోన్ మోగింది. హాస్పిటల్ నుంచి.

‘చెప్పు నారాయణా! ఏంటి సంగతి?’ అన్నాను స్పీకర్ ఆన్ చేసి.

‘సార్, చింతకాయలు తింటారేట్సార్? తెస్తాను’

‘చింతకాయలా? అవేం తింటాం?’

‘పచ్చడీ గట్రా సేస్తారేమో కద్సార్?’

‘అవుననుకో, కానీ ఒకసారి తనని కనుక్కోవాలి. చెప్తా!’ అంటూ కాల్ కట్ చేశాను. 

నీళ్లోసుకుంటోంటే చింతకాయలు తింటారా అని ఫోనేవిఁటో? 😝😂

వెర్రభిమానం ఈ నారాయణకి. ప్రతివారం ఏదో ఒకటి తెచ్చి పడేస్తుంటాడు. పచ్చి శనక్కాయలు, పచ్చి జీడిగింజలు తెచ్చిపోశాడు ఆమధ్య. అటువంటివాటిని చూసే చాలా రోజులైంది. వాటన్నిటికీ బోలెడంత శుశ్రూష చేసేటప్పటికి రంగారావుగారు, విజయరామయ్యగారు దిగొచ్చారు.

స్నానానికి ముగింపువాక్యం పలికి టర్కీ తువ్వాలందుకున్నాను. ‘ఏవిఁటో, మనకిష్టం ఉన్నా లేకున్నా ఈ ’ఇటాలియన్’ కమోడ్‌లు, టర్కీ టవళ్లు, చైనా ఫోన్లు వాడక తప్పట్లేదు’ అనుకుంటూ బయటపడ్డాను.

‘పొంగల్ వేడిగా ఉంది. త్వరగా రా! గంటలు గంటలు పౌడర్రాసుకుంటూ కూర్చోక!’

అవమానము. ఘోర అవమానము. ఇహ్హీ...!

అయ్యారే, నేనేల పాండ్సు రాసుకోవలె? రాసితినిపో, అదియేల అద్దములు, స్పీకర్లు, కంప్యూటర్లపైన బడవలె! పడెనుపో, అదియేల తనకంట పడవలె? పడెనుపో, నన్నేల ఏడ్పించవలె? ఏడ్పించెనుపో, నేనేల ఎన్నటికీ మారకుండవలె?

యధావిధిగా మళ్ళీ ఫోరెన్సిక్ టీమ్ వాళ్లలా గదిలో అన్నిటిమీదా పౌడర్ చల్లేసి ఉన్నంతలోనే సుందరంగా తయారై బయటికొచ్చాను. మరీ సాధారణంగా తయారైతే పేషెంట్లు గుర్తుపట్టి చావట్లేదసలు. గుద్దుకుంటూ పోతున్నారు మొహాల్ మండా! 

ఈ ఎండల్లో చొక్కాలాగూలే కష్టం. ఉన్నవే విప్పేసుకుని ‘పఠాన్’ సినిమాలో దీపికాలా పడుకొనే ఉండాలనిపిస్తోంది. అటువంటిది మా డాక్టర్లందరూ తెల్లకోట్లేసుకుని తిరగడం ఎంత ఊష్టమసలు? 

అంచేత ఏప్రానదీ వేసుకోకున్నా చూడగానే ‘ఈయనెవరో ఈ హాస్పిటల్లో కాస్త పెద్దాయనేలా ఉన్నాడు. కొంచెం సైడిద్దాం!’ అని పదిమందీ అనుకునేలా రెడీ అవ్వడమనేది నా చేతిలోనే ఉంది.

డైనింగ్ టేబుల్ మీద రెండు గుంటల పళ్లెంలో పొగలు కక్కుతోంది పొంగలి. ఒక గుంటలో కారప్పొడి, మరో గుంటలో అదేదో పచ్చడీ కనబడుతున్నాయి.

‘బన్నీ, చింతకాయ్ పచ్చడి చేస్తావా?' అన్నాను అకస్మాత్తుగా.

ఒకసారి నావైపు ఉత్సాహంగా చూసి ‘ఎందుకు చెయ్యనూ, తప్పకుండా చేస్తాను!’ అంది. 

నా ఎడంకన్ను అదిరింది. ఏదో తప్పు జరుగుతోందని అర్ధమైంది. 

‘........అదికాదు బన్నీ, నే చెప్పేది నిజమైన చింతకాయ పచ్చడి సంగతి. నారాయణ ఫోన్ చేశాడు. కాయలిస్తాట్ట!’

‘ఎవరండీ ఆ నారాయణ? అన్నీ మూలపదార్ధాలే తెస్తాడెప్పుడూ? బైప్రొడక్ట్స్ గురించి తెలీదా అతనికి? మొన్న నువ్వు తెచ్చిన జీడిగింజల్ని వారంరోజులపాటు ఎండబెట్టి వాచ్‌మన్‌కిచ్చాను. వాళ్ల దగ్గర బొగ్గులుంటాయి కదా, కాల్చివ్వమని. ఈ ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లకి ఇవన్నీ అవసరమా చెప్పు? అటువంటివన్నీ తీరిగ్గా నువ్వు రిటైరయ్యాక చేద్దువుగాని’

‘పోన్లెద్దూ, ఏదో ప్రేమ. ఉద్యోగం వేయించి కుటుంబాన్ని నిలబెట్టానని మాటిమాటికీ ఇలా వేయించుకోడానికి ఏవో తెచ్చిస్తుంటాడు. చెప్పినా వినడు. సరే, వద్దంటే చెప్పు. ఇంకెవరికైనా ఇచ్చేస్తాడు’

‘సరే, తెమ్మనండి. ఏవో తిప్పలు పడతాం గీతా, నేనూ’ అంది నా నుదుటన బొట్టుపెడుతూ.

షూస్ పాలిష్ చేసుకోవాలి. ఫుట్‌ప్రింట్స్ షాపుకెళ్లిన ప్రతిసారీ పాలిష్ డబ్బా ఒకటి కొనడం, అది బా....గా ఎండిపోయి కరువొచ్చిన రాయలసీమలో బీడుభూమిలా పగుళ్లొచ్చాక పారెయ్యడం. అంతే తప్ప వాడిందీ పాడూ లేదు. 

లిఫ్ట్ దగ్గరకి రాగానే అడిగింది 

‘ఏమన్నా మర్చిపోయావా?’

‘హఁ హఁహ, అవునోయ్! నా మామూలేదీ?’ అంటూ శోభన్‌బాబులా గొంతు మార్చి అడిగానో లేదో 

‘క్యారేజి మర్చిపోయావురా మగడా! లోపల సోఫా పక్కనుంది వెళ్లి తెచ్చుకో!’ అంటూ లిఫ్ట్ డోర్ తెరిచి ఉంచింది మళ్ళీ కిందకెళిపోకుండా!

#ఈపొద్దుముచ్చట్లు (నిన్నటివిలెండి. ‘ఇవాళ ఆదివారం కదా? హాస్పిటలుకెళ్లారా?’ అంటూ వచ్చేత్తారు మళ్లీ)

✍🏻...కొచ్చెర్లకోట జగదీశ్
 🍃💠 నా భార్య పొందిన సంతృప్తి వెలకట్టలేనిది.!
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..

🔹 నేటి ఆధునిక సమాజంలో సక్సెస్ అంటే ఏంటి?
ఆరంకెల జీతం, ఏటా పెరిగే బోనస్లు, కార్పొరేట్ హోదాలు… ఇదే కదా అందరి లెక్క!
కానీ ఈ లెక్కలన్నింటికీ అతీతంగా — ఆత్మసంతృప్తినే నిజమైన విజయం అని చాటిన ఒక మహిళ కథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది — ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ (జన్మస్థలం: శ్రీనగర్, శ్రీనగర్ జిల్లా, జమ్మూ & కాశ్మీర్).
ఆయన లింక్డిన్‌లో పంచుకున్న అనుభవం అందరినీ ఆలోచింపజేస్తోంది.

🔸 భార్య రుచి వారికూ – భిన్న దృక్పథానికి ఉదాహరణ

రుచి వారికూ కెరీర్ ప్రారంభం నుంచే ఒక మూసలో ఆలోచించలేదు.
19 ఏళ్ల వయస్సులోనే తన జీవిత లక్ష్యాలపై స్పష్టత కలిగిన ఆమె, కాలేజీ పూర్తయ్యాక ఒక మ్యాగజైన్‌లో పని ప్రారంభించింది. ఆ తర్వాత తన కలల సంస్థ అయిన డిస్కవరీ ఛానెల్లో ఉద్యోగం సాధించి, 2005 నుంచి 2010 వరకు అక్కడే పనిచేసింది..

ఈ కాలంలో ఆమె
➡️ వార్షికంగా సుమారు రూ.20 లక్షల ఆదాయం
➡️ కెరీర్‌లో అత్యున్నత స్థాయి
➡️ స్థిరమైన గుర్తింపు
అన్నీ సాధించింది..

🔸 జీవితానికి కొత్త అర్థం

మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రుచి తన ప్రాధాన్యతలను మార్చుకుంది.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పటికీ —
తన కుమారుడి పెంపకం కోసం స్వచ్ఛందంగా ఉద్యోగానికి విరామం తీసుకుంది..

🔸నాలుగు సంవత్సరాల పాటు పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయించిన ఆమె, తిరిగి పని చేయాలనుకున్నప్పుడు మళ్లీ కార్పొరేట్ ప్రపంచాన్ని ఎంచుకోలేదు.

🔸 రూ.20 లక్షల నుంచి రూ.20 వేల దారి

2014లో రుచి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసింది.
సంవత్సరానికి రూ.20 లక్షల సంపాదన నుంచి
➡️ నెలకు కేవలం రూ.20 వేల ఆదాయం మాత్రమే.

కానీ —
ఆమె ముఖంలో కనిపించిన ప్రశాంతత, మనసులో కలిగిన తృప్తి
ఆ సంపాదనతో పోల్చలేనివి..

ఈ విషయాన్ని అంకుర్ లింక్డిన్‌లో ప్రస్తావించినప్పుడు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు..

“విజయం అనేది ఆదాయంలో కాదు, మనం ఎంచుకున్న జీవితంలో ఉంది” అని చాలామంది వ్యాఖ్యానించారు..

🍃💜 కొసమెరుపు
సమాజం చూపించే విజయ ప్రమాణాలు ఒకటే కాదు.
జీతపు ప్యాకేజీ కాదు…
డబ్బు పెరిగిందా లేదా అన్నదే ప్రశ్న కాదు —

🔹మనసు ప్రశాంతంగా ఉందా?
🔸మన జీవితం మనకు అర్థవంతంగా ఉందా?
హోదా కాదు…
🔸మన మనసు ఒప్పుకున్న జీవితం,
🔹మన కుటుంబానికి ఇచ్చిన విలువ,
🔹మనకు ప్రశాంతత ఇచ్చిన నిర్ణయం-- 
🔸ఇవే నిజమైన విజయ సూచికలు.
*డబ్బు తగ్గినా, మనిషితనం పెరిగితే…
అదే సమాజానికి మార్గదర్శకం..*
*అదే నిజమైన సంపద..అదే నిజమైన విజయం..🎉*
*ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం దొరికితే...*

🌾స్వేచ్ఛ అనువాదం : కూర్పు : వల్లూరి 🙏

🍃💜 నమస్సులతో
🌿 వల్లూరి సూర్యప్రకాష్
🏡 బ్యాంక్ కాలనీ –1, కరీంనగర్
 హాస్య కథానిక 
రచన... ఎం.వి.ఉమాదేవి 
కథా శీర్షిక...
*పారిపోయిన పెళ్ళికూతురు!!*

     అదో పెద్ద కల్యాణ మండపం. పెళ్ళి తంతు కాసేపట్లో ప్రారంభం కానుంది. అంతలో మండపానికి కుడి వైపున్న పెళ్ళికూతురి రూములో నుండి కలకలం రేగింది. 

లోనికెళ్ళి వస్తున్న వారు వింత విషయం తెలిసినట్టు ముక్కున వేలేసుకుని వస్తున్నారు. 

" ఏమైంది అమ్మాయ్?" చుట్టాలలో ఒకావిడ అడిగింది ఆదుర్దాగా. 

"పెళ్ళికూతురు పారిపోయింది!" క్లుప్తంగా చెప్పిన ఆమె వెళ్ళి సీట్లలో కూర్చున్న వారితో విషయం చెప్తుంది.

"రామ రామా! లవ్ మ్యారేజ్ అంటిరీ. అందర్నీ ఒప్పించి చేసుకుంటూ ఉంటే, ఇలా ఎందుకు చేస్తారో ఈ అమ్మాయిలు?" ఒకాయన తల పట్టుకుని మండపం మెట్లమీద కూలబడ్డాడూ.

"చూస్తారేం?వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు బస్, రైల్వే స్టేషన్లు చెక్ చేసి పట్టుకుంటారు. ఎంత పరువు నష్టం రెండు పక్కలా?" ఒకరు అరుస్తూ ఉంటే ఇంకోరు శాంతింప జేసేడు.

అంతలో పెళ్లికొడుకు ముఖంవేలాడేసికొని వచ్చాడు.
"ఏవోయ్? మీ మధ్య ఫోన్ తగాదాలేమైనా జరిగాయా? మంచి పిల్ల అసలు అట్లా ఎందుకు పారిపోయిందో?"  ఆరా తీస్తే అదేమి లేదన్నాడు అతగాడు .

" కాసేపట్లో పెళ్లి ఉంటే ఏమి లేకుండా మా పిల్ల ఎందుకు పారి పోయింది? మేం గొప్ప సంప్రదాయ కుటుంబమే. మీ మోహం మండా!మీరే ఏదో చేసి ఉంటారు! " పిల్ల మేనత్త దులిపేసింది. 

"నువ్వుండవే కాంతం ! అసలు ఇంతకు ముందుగా ఏం జరిగిందో చెప్పి చావండి!"  ఒక బామ్మగారు అరిచింది. 

" మామూలుగా బ్యూటీ పార్లర్ నుండి వచ్చిన పెళ్లికూతురు, ఆమె ఫ్రెండు పెళ్లికొడుక్కి బ్రైడల్ మేకప్ చూపించాలని అటు రూములోకి పోయారు. తలుపు తీసిన పిల్ల మామగారు "మీ మొహం మండా! రాండి లోపలికి!"; అన్నాడట. 

అంతలో ఎవరండీ వచ్చింది అనే అత్తగారికి " ఓసి నీ మొహం మండా! ఆ వచ్చినావిడ ఎవరనుకున్నావ్? కాసేపట్లో కాబోయే కోడలు!" అని చెప్పేడు కూడా.

దాంతో ఆవిడ సంతోషంగా "అరె మీ మొహం మండా! లోపలకి పిలవకుండా వాకిట్లో ఉంచారు ఏమిటి?" అందిట.
అంతలో పెళ్లికొడుకు వచ్చి చూసి, "మీ మొహం మండా! కుర్చీలు వెయ్యండి. జాహ్నవి, ఫ్రెండు కూర్చుంటారు. అని మర్యాద చేసినా కూడా, కూర్చోలేదట.

" మేకప్, చీర కట్టు ఎలా ఉందనీ మీకు చూపాలని వచ్చేమండి!" అన్నదిటా పిల్ల ఫ్రెండు ఊర్మిళ.

" మీ మోహం మండా! మేకప్పు చాలా బాగుంది, ఎంత ఫీజు వసూలు చేసేరు?" అన్నాడట పెళ్ళి పెద్ద.

" ఇదేమిఖర్మనే తల్లీ? వీళ్ళకి అందరికి ఊతపదం *నీ మొహం మండా!"*  నేనా? పిచ్చెక్కి పోతుంది. అయినా అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే తెలియలేదా? " గుసగుసగా అడిగిందిట ఊర్మిళ.

" వాట్సాప్ మెసేజ్ లు మాత్రమేనే ఊర్మిళా!  సంప్రదాయము కోసం పెళ్లికి ముందు ముఖాముఖి మాట్లాడుకోలేదు మేం!" అంటూ జాహ్నవి వెర్రిగా చూస్తూ ఉంటే ఓ చిన్న పిల్ల వచ్చి జాహ్నవి పూల జడ పట్టుకొని చూస్తూ,.. "నీ మొహం మండా, ఎంత బాగుందో పిన్నీ ఈ పూల జడ?" అందిట.
ఆమాట్నా పెళ్ళికూతురు, ఫ్రెండు లేచివెళ్లారట!  ఇక వాళ్ళు కనపడలేదు. చుట్టాలు అందర్నీ రిసీవ్ చేస్తూ, క్యాటరింగ్ అజమాయిషీ చూస్తూ గమనించుకోలేదు. అదీ విషయం! " ఒకరు వివరించారు.

" ఇదేం సంబంధం మీ మొహం మండా! మా వైపు నా ఒక్కదానికే ఈ ఊతపదం! మగ పెళ్ళి వారి ఇంట్లో అందరికీ అదే ఊత పదమైతే ఎట్లా?" పిల్ల మేనత్త తిడుతూ ఉంటే...
పెళ్ళికొడుకు, ఫ్రెండ్స్ అర్జంట్ గా పెళ్ళికూతుర్ని వెతకడానికి వెళ్ళేరు!!

*🧘దేవతా స్తోత్రాలు🧘‍♀*.

 *🧘దేవతా స్తోత్రాలు🧘‍♀*.           *మన హిందూ సాంప్రదాయంలో ఎవరికివారు వారు నమ్మిన, భగవంతుని ఆరాధించడానికి, ప్రసన్నం  చేసుకోవడానికి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో గమనించండి....*
🪷🪷🧘🧘‍♀🪷🪷

1. శ్రీ గణేశవైభవ అష్టరత్నమాలికాస్తోత్రం
2. శ్రీ గణనాథ దశకం
3. శ్రీ గకార గణపత్యష్టకం 
4. శ్రీ హేరంబ దశకం
5. శ్రీ గణేశ తత్త్వ వైభవ సుధానిధి
6. శ్రీ విఘ్ననాయకాష్టకం
7. శ్రీ శంభుసూన పంచరత్న స్తోత్రం
8. శ్రీ స్కందపూర్వజ పంచరత్న స్తోత్రం
9. శ్రీ జ్యేష్టరాజాష్టకం 
10. శ్రీ బ్రహ్మణస్పత్యష్టకం
11. శ్రీ హేరంబ పంచామృతం
12.శ్రీ హేరంబ పంచరత్నమాలికా స్తోత్రం
13. శ్రీ నాట్యగణేశ పంచరత్న స్తోత్రం 
14. శ్రీ వక్రతుండ పంచరత్న స్తోత్రం
15. శ్రీ వరసిద్ధివినాయక పంచరత్న స్తోత్రం
16. శ్రీ విఘ్నేశ్వరప్రార్థనాష్టకం
17. శ్రీ లంబోదర పంచరత్న స్తోత్రం
18. శ్రీ విఘ్నరాజ పంచరత్న స్తోత్రం
19. శ్రీ శివానీకుమారాష్టకం 
20. శ్రీ గణనాయక పంచరత్న స్తోత్రం
21. శ్రీ మహాగణేశ్వరాష్టకం
22. శ్రీ గణేశ షోడశరత్నమాలికా స్తోత్రం
23. శ్రీ విఘ్నేశ్వరాష్టకం
24. శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం
25. శ్రీ విఘ్నరాజ కరావలంబస్తోత్రం
26. శ్రీ శ్రవణలింగేశ్వర దశరత్నమాలికా స్తోత్రం
27. శ్రీ దక్షిణామూర్తి పంచరత్నమాలికా స్తోత్రం
28. శ్రీ మహాదేవస్తుతి
29. శ్రీ చంద్రచూడ షోడశరత్నమాలికా స్తోత్రం
30. శ్రీ కపోతేశ్వర దశకం
31. శ్రీ ఆశుతోష దశకం
32. శ్రీ భానులింగేశ్వర దశకం
33. శ్రీ హాటకేశ్వర దశకం
34. శ్రీ క్షణముక్తేశ్వర దశకం
35. శ్రీ ఏకామ్రేశ్వర దశకం
36. శ్రీ బృహదీశ్వర పంచరత్న స్తోత్రం
37. శ్రీ కుక్కుటేశ్వర పంచరత్న స్తోత్రం
38. శ్రీ రామేశ్వర పంచరత్న స్తోత్రం
39. శ్రీ వైద్యనాథ పంచరత్న స్తోత్రం
40. శ్రీ కపిలేశ్వర పంచరత్న స్తోత్రం
41. శ్రీ భీమశంకర పంచరత్న స్తోత్రం
42. శ్రీ త్ర్యంబకేశ్వర పంచరత్న స్తోత్రం
43. శ్రీ విశ్వేశ్వర పంచరత్న స్తోత్రం
44. శ్రీ కల్యాణసుందరేశ పంచరత్న స్తోత్రం
45. శ్రీ శ్రవణలింగేశ్వర దశకం
46. శ్రీ శ్రవణలింగేశ్వరాష్టకం
47. శ్రీ శ్రవణలింగేశ్వర పంచరత్న స్తోత్రం
48. శ్రీ కంఠరాజ షోడశరత్నమాలికా స్తోత్రం
49. శ్రీ వామదేవ పంచరత్నస్తోత్రం
50. శ్రీ వామదేవాష్టకం
51. శ్రీ కామేశ్వర్యష్టకం 
52. శ్రీ లయకారక పంచరత్నస్తోత్రం
53. శ్రీ శంకర అష్టరత్నమాలికా స్తోత్రం 
54. శ్రీ శివస్మరణాష్టకం 
55. శ్రీ మహాబలేశ్వర పంచరత్న స్తోత్రం 
56. శ్రీ శివశంకరాష్టకం 
57. శ్రీ బృహదీశ్వర దశరత్నమాలికా స్తోత్రం
58. శ్రీ త్రిశూలపాణి పంచరత్నస్తోత్రం 
59. శ్రీ గౌరీమనోహర పంచరత్నస్తోత్రం
60. శ్రీ గౌతమేశ్వర పంచరత్నస్తోత్రం
61. శ్రీ మంజునాథేశ్వరాష్టకం 
62. శ్రీ చిదంబరేశభావనాష్టకం 
63. శ్రీ ఉమావల్లభాష్టకం 
64. శ్రీ జలధీశ్వరాష్టకం 
65. శ్రీ జలధీశ్వరషట్కం 
66. శ్రీ సదాశివ తత్త్వప్రబోధ అష్టరత్నమాలికా స్తోత్రం 
67. శ్రీ సదాశివ అష్టరత్నమాలికా స్తోత్రం 
68. శ్రీ రాజరాజేశ్వర్యష్టకం 
69. శ్రీ అమలేశ్వర పంచరత్న స్తోత్రం 
70. శ్రీ కేదారనాథాష్టకం 
71. శ్రీ శివ జయ షోడశ రత్నమాలికా స్తోత్రం 
72. శ్రీ వ్యాఘ్రేశ్వర పంచరత్న స్తోత్రం
73. శ్రీ సోమనాథ పంచరత్న స్తోత్రం 
74. శ్రీ నాగేశ్వరాష్టకం 
75. శ్రీ అంబికానాథ పంచరత్న స్తోత్రం
76. శ్రీ అరుణాచలేశ్వర పంచరత్న స్తోత్రం 
77. శ్రీ ఏకామ్రేశ్వర పంచరత్న స్తోత్రం  
78. శ్రీ అరుణగిరినాథ పంచరత్న స్తోత్రం 
79. శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం 
80. శ్రీ మహేశ్వర జయాష్టకం 
81. శ్రీ శైలనాథ పంచరత్న స్తోత్రం 
82. శ్రీ ఘృష్ణేశ్వర పంచరత్న స్తోత్రం 
83. శ్రీ మహాకాళ పంచరత్న స్తోత్రం 
84. శ్రీ పరమేశ్వర పంచరత్న స్తోత్రం 
85. శ్రీ శంకరమంగళాష్టకం
86. శ్రీ త్ర్యంబకాష్టకం 
87. శ్రీ శివాష్టకం 
88. శ్రీ శివద్వాదశ పంజరస్తోత్రం
89. శ్రీ నటరాజ పంచరత్నస్తోత్రం
90. శ్రీ కాళహస్తీశ్వర కరావలంబ స్తోత్రం
91. శ్రీ హరికేశాష్టకం 
92. శ్రీ కపర్ద్యష్టకం 
93. శ్రీ కాలాగ్నిరుద్ర పంచరత్న స్తోత్రం
94. శ్రీ జంబుకేశ్వరాష్టకం 
95. శ్రీ శైలనాథాష్టకం 
96. శ్రీ సుందరేశ్వరాష్టకం 
97. శ్రీ అరుణాచలేశ్వరాష్టకం 
98. శ్రీ చంద్రమౌళీశ్వర   షోడశరత్నమాలికా స్తోత్రం 
99. శ్రీ రుద్ర షోడశరత్నమాలికా స్తోత్రం 
100. శ్రీ మహాదేవాష్టకం 
101. శ్రీ మృత్యుంజయాష్టకం 
102. శ్రీ సదాశివ పంచరత్నం 
103. శ్రీ సదాశివాష్టకం 
104. శ్రీ సదాశివదశకం 
105. శ్రీ కుండలేశ్వరాష్టకం 
106. శ్రీ నీలకంఠ కరావలంబ స్తోత్రం
107. శ్రీ నీలకంఠ పంచరత్న స్తోత్రం 
108. శ్రీ నీలకంఠాష్టకం 
109. శ్రీ పంచముఖేశ్వర స్తోత్రం 
110. శ్రీ ప్రణవ శివపంచాక్షరీ స్తోత్రం 
111. శ్రీ శివరక్షా స్తోత్రం 
112. శ్రీ కేదారేశ్వర పంచరత్నస్తోత్రం 
113. శ్రీ విశ్వనాథ పంచరత్నస్తోత్రం 
114. శ్రీ శంకర పంచరత్నస్తోత్రం 
115. శ్రీ మార్గబాంధవేశ్వరాష్టకం
116. శ్రీ దక్షిణామూర్త్యష్టకం 
117. శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రం

118. శ్రీ ఉమామహేశ్వరాష్టకం 
119. శ్రీ అర్ధనారీశ్వర కరావలంబ స్తోత్రం 
120. శ్రీ సుబ్రహ్మణ్యవైభవాష్టకం 
121. శ్రీ దణ్డపాణి దశకం
122. శ్రీ కార్తికేయతత్త్వసుధానిధి
123. శ్రీ కార్తికేయ పంచరత్నమాలికా స్తోత్రం
124. శ్రీ దేవసేనాపతి పంచరత్న స్తోత్రం  
125. శ్రీ మయూరేశాష్టకం 
126. శ్రీ సుబ్రహ్మణ్య మంగళ పంచరత్నస్తోత్రం 
127. శ్రీ గజాననానుజాష్టకం 
128. శ్రీ సుబ్రహ్మణ్యపంచరత్నస్తోత్రం 
129. శ్రీ కార్తికేయపంచరత్నస్తోత్రం 
130. శ్రీ శరవణభవ షోడశరత్నమాలికా స్తోత్రం 
131. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం 
132. శ్రీ గౌరీతనయాష్టకం 
133. శ్రీ కుక్కుటధ్వజవైభవాష్టకం 
134. శ్రీ సుబ్రహ్మణ్యప్రార్థనాష్టకం 
135. శ్రీ సుబ్రహ్మణ్యజయాష్టకం 
136. శ్రీ సుబ్రహ్మణ్య షోడశమానసపూజా స్తోత్రం 
137. శ్రీ షణ్ముఖ పంచరత్న స్తోత్రం 
138. శ్రీ దణ్డాయుధపాణ్యష్టకం
139. శ్రీ స్వామినాథాష్టకం 
140. శ్రీ హరిహరాత్మజాష్టకం 
141. శ్రీ కాలభైరవపంచరత్నస్తోత్రం 
142. శ్రీ విష్ణు షోడశరత్న మానస పూజా స్తోత్రం
143. శ్రీ హరినారాయణవైభవాష్టకం 
144. శ్రీ మన్నారాయణ వైభవ పంచరత్న స్తోత్రం
145. శ్రీ మన్నారాయణ రక్షా అష్టరత్నమాలికా స్తోత్రం 
146. శ్రీ సత్యనారాయణ పంచరత్న స్తోత్రం  
147. శ్రీ మన్నారాయణ వైభవ షోడశరత్నమాలికా స్తోత్రం 
148. శ్రీ వైకుంఠనాథాష్టకం 
149. శ్రీ మన్నారాయణ రక్షా స్తోత్రం 
150. శ్రీ విష్ణుప్రార్థనా పంచరత్న స్తోత్రం 
151. శ్రీ వరదరాజాష్టకం 
152. శ్రీ రామకృష్ణ షోడశరత్నమాలికా స్తోత్రం 
153. శ్రీ కూర్మనాథాష్టకం 
154. శ్రీ లక్ష్మీనారాయణాష్టకం 
155. శ్రీ గదాధరాష్టకం 
156. శ్రీ ద్వారకాధీశ దశకం
157. శ్రీ దామోదర పంచరత్నమాలికా స్తోత్రం
158. శ్రీ మోహనకృష్ణాష్టకం 
159. శ్రీ కృష్ణజయషోడశరత్నమాలికాస్తోత్రం 
160. శ్రీ కృష్ణప్రార్థనాష్టకం 
161. శ్రీ గోవిందాష్టకం 
162. శ్రీ శ్యామలకృష్ణ పంచరత్న స్తోత్రం 
163. శ్రీ వనమాలీ పంచరత్న స్తోత్రం 
164. శ్రీ సారంగపాణి పంచరత్న స్తోత్రం 
165. శ్రీ రాజగోపాల పంచరత్న స్తోత్రం 
166. శ్రీ వాసుదేవ పంచరత్న స్తోత్రం 
167. శ్రీ జగన్నాథ పంచరత్న స్తోత్రం 
168. శ్రీ బదరినాథ పంచరత్న స్తోత్రం 
169. శ్రీ కేశవాష్టకం 
170. శ్రీ నారాయణాష్టకం 
171. శ్రీ మాధవాష్టకం 
172. శ్రీ గోవిందాష్టకం 
173. శ్రీ విష్ణ్వాష్టకం
174. శ్రీ మధుసూదనాష్టకం 
175. శ్రీ త్రివిక్రమాష్టకం 
176. శ్రీ వామనాష్టకం 
177. శ్రీ శ్రీధరాష్టకం 
178. శ్రీ హృషీకేశాష్టకం 
179. శ్రీ పద్మనాభాష్టకం 
180. శ్రీ దామోదరాష్టకం 
181. శ్రీ సంకర్షణాష్టకం 
182. శ్రీ వాసుదేవాష్టకం 
183. శ్రీ ప్రద్యుమ్నాష్టకం 
184. శ్రీ అనిరుద్ధాష్టకం 
185. శ్రీ పురుషోత్తమాష్టకం 
186. శ్రీ అధోక్షజాష్టకం 
187. శ్రీ నారసింహ పంచరత్నమాలికా స్తోత్రం
188. శ్రీ నారసింహ అష్టామృతరత్నమాలికా స్తోత్రం
189. శ్రీ నారసింహ జయ దశకం
190. శ్రీ నరసింహ దశకం 
191. శ్రీ అచ్యుతాష్టకం 
192. శ్రీ జనార్దనాష్టకం 
193. శ్రీ ఉపేంద్రాష్టకం 
194. శ్రీ హర్యాష్టకం 
195. శ్రీ వాసుదేవ వైభవసుధానిధి
196. శ్రీ శిఖిపించమౌళి పంచరత్న స్తోత్రం
197. శ్రీ వంశీధర పంచరత్న స్తోత్రం 
198. శ్రీ కృష్ణ వైభవ షోడశరత్నమాలికా స్తోత్రం 
199. శ్రీ మాధవ అష్టరత్నమాలికా స్తోత్రం 
200. శ్రీ వాసుదేవ వైభవాష్టకం 
201. శ్రీ శౌరి పంచరత్న స్తోత్రం 
202. శ్రీ కృష్ణ శరణ షోడశరత్నమాలికా స్తోత్రం 
203. శ్రీ నందగోపాలాష్టకం 
204. శ్రీ కృష్ణ అష్టరత్నమాలికా స్తోత్రం 
205. శ్రీ పాండురంగ పంచరత్న స్తోత్రం 
206. శ్రీ గోవింద షోడశరత్నమాలికా స్తోత్రం 
207. శ్రీ కృష్ణ షోడశరత్నమాలికా స్తోత్రం 
208. శ్రీ ద్వారకాధీశాష్టకం 
209. శ్రీ కృష్ణ పంచరత్న స్తోత్రం 
210. శ్రీ కృష్ణ పంచామృతం 
211. శ్రీ సంతానకృష్ణాష్టకం 
212. శ్రీ ముష్ణేశ కరావలంబ స్తోత్రం 
213. శ్రీ హయస్యాష్టకం 
214. శ్రీ హయగ్రీవాష్టకం 
215. శ్రీ హయగ్రీవపంచకం 
216. శ్రీ హయగ్రీవపంచరత్న స్తోత్రం 
217. శ్రీ పద్మావతీశ దశకం
218. శ్రీ వేంకటేశ్వర పంచరత్న స్తోత్రం 
219. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి పంచరత్నం 
220. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర పంచామృతం    
221. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర సుప్రభాతం 
222. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర పంచరత్నమాలికా స్తోత్రం
223.శ్రీ శ్రీనివాస పంచరత్న స్తోత్రం
224. శ్రీ వేంకటేశ్వర షోడశరత్నమాలికా స్తోత్రం 
225. శ్రీ వేంకటేశ్వర పంచరత్న స్తోత్రం 
226. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం
227. శ్రీ వేంకటేశ్వరాష్టకం 
228. శ్రీ వైభవ వేంకటేశ్వరాష్టకం 
229. శ్రీ వైభవ వేంకటేశ్వర మంగళశ్లోక పంచకం 
230. శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం 
231. శ్రీభార్గవరామ పంచరత్న స్తోత్రం 
232. శ్రీ రామచంద్ర చత్వారింశత్ రత్నమాలికాస్తోత్రం

233. శ్రీ భద్రశైలనాథ దశకం
234. శ్రీ రామచంద్ర వైభవసుధానిధి
235. శ్రీ వైదేహినాథ పంచరత్న స్తోత్రం
236. శ్రీ రామచంద్ర భజనాష్టకం 
237. శ్రీ రామచంద్రస్మరణాష్టకం 
238. శ్రీ రామచంద్రవైభవాష్టకం 
239. శ్రీ రఘుకులోత్త్తమాష్టకం 
240. శ్రీ భద్రాచలేశ పంచరత్న స్తోత్రం 
241. శ్రీ రామవైభవ అష్టరత్నమాలికా స్తోత్రం 
242. శ్రీ రామతత్త్వస్తోత్రం 
243. శ్రీ రామచంద్రప్రార్థనాష్టకం 
244. శ్రీ రఘునందనాష్టకం 
245. శ్రీ రామమార్గబాంధవాష్టకం 
246. శ్రీ రామభద్రాష్టకం 
247. శ్రీ లక్ష్మణాగ్రజాష్టకం 
248. శ్రీ కౌసల్యనందనాష్టకం 
249. శ్రీ రామభద్రప్రార్థనాష్టకం 
250. శ్రీ జానకీవల్లభాష్టకం 
251. శ్రీ రామలక్ష్మణపంచరత్న స్తోత్రం 
252. శ్రీ రామవైభవ పంచరత్న స్తోత్రం 
253. శ్రీ లక్ష్మణపూర్వజ పంచరత్న స్తోత్రం 
254. శ్రీ రామజయ షోడశరత్నమాలికా స్తోత్రం  
255. శ్రీ రామచంద్ర తత్త్వప్రబోధ షోడశరత్నమాలికా స్తోత్రం 
256. శ్రీ రామచంద్ర షోడశరత్నమాలికా స్తోత్రం  
257. శ్రీ రామచంద్రాష్టకం 
258. శ్రీ రామచంద్ర అష్టరత్నమాలికా స్తోత్రం 
259. శ్రీ రామ పంచరత్నమాలికా స్తోత్రం 
260. శ్రీ రామచంద్ర పంచరత్నమాలికా స్తోత్రం 
261. శ్రీ రామపంచరత్న స్తోత్రం 
262. శ్రీ మైథిలినాథాష్టకం 
263. శ్రీ మైథిలినాథ పంచరత్నమాలికా స్తోత్రం 
264. శ్రీ రామచంద్ర కరావలంబ స్తోత్రం 
265. శ్రీ రామచంద్ర సుప్రభాతం 
266. శ్రీ నరసింహస్తుతిఝరి  
267. శ్రీ యాదగిరీశాష్టకం 
268. శ్రీ నారసింహ వైభవ స్తోత్రం 
269. శ్రీ జ్వాలానరసింహ పంచరత్న స్తోత్రం 
270. శ్రీ మంత్రరాజ పంచరత్న స్తోత్రం 
271. శ్రీ సింహాచలేశ పంచరత్న స్తోత్రం 
272. శ్రీ నరసింహరుద్ర పంచరత్న స్తోత్రం 
273. శ్రీ నారసింహ జయాష్టకం
274. శ్రీ నరసింహ పంచరత్న స్తోత్రం 
275. శ్రీ నరసింహ అష్టరత్నమాలికా స్తోత్రం 
276. శ్రీ నవనారసింహనవకం 
277. శ్రీ ఘటికాచలేశ్వరాష్టకం 
278. శ్రీ నరసింహ పంచరత్నమాలికా స్తోత్రం 
279. శ్రీ మహాసింహ పంచరత్న స్తోత్రం 
280.శ్రీ వేదాద్రినాథ పంచరత్న స్తోత్రం
281. శ్రీ లక్ష్మీనరసింహాష్టకం 
282. శ్రీ లక్ష్మీనృసింహ పంచరత్నస్తోత్రం
283. శ్రీ వాయుదేవాత్మజ దశకం
284. శ్రీ పవనసుతవైభవఝరి
285. శ్రీ సామీరి పంచరత్న స్తోత్రం
286. శ్రీ మారుతిస్మరణాష్టకం 
287. శ్రీ రామదూతపంచరత్నస్తోత్రం 
288. శ్రీ ఆంజనేయ అష్టరత్నమాలికా స్తోత్రం 
289. శ్రీ వాయుసూనభజనాష్టకం 
290. శ్రీ హరిమర్కటాష్టకం 
291. శ్రీ వీరాంజనేయరక్షాస్తోత్రం 
292. శ్రీ పవనాత్మజాష్టకం 
293. శ్రీ అనిలాత్మజవైభవపంచరత్నస్తోత్రం 
294. శ్రీ ప్రభంజనాత్మజాష్టకం 
295. శ్రీ అంజనానందనాష్టకం 
296. శ్రీ ఆంజనేయజయాష్టకం 
297. శ్రీ కపీశ్వరపంచరత్నస్తోత్రం 
298. శ్రీ వాతాత్మజపంచరత్నస్తోత్రం 
299. శ్రీ వీరాంజనేయనవకం 
300. శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం 
301. శ్రీ పవనాత్మజ పంచరత్న స్తోత్రం 
302. శ్రీ భీమాగ్రజాష్టకం 
303. శ్రీ వాగధీశపంచరత్నస్తోత్రం 
304. శ్రీ పవనతనయషోడశరత్నమాలికాస్తోత్రం 
305. శ్రీ ఆంజనేయషోడశరత్నమాలికాస్తోత్రం
306. శ్రీ మారుతిపంచరత్నస్తోత్రం 
307. శ్రీ మారుత్యష్టకం 
308. శ్రీ పక్షీంద్రపంచరత్నస్తోత్రం 
309. శ్రీ ఆతపాధీశ పంచరత్న స్తోత్రం
310. శ్రీ అరుణ ఆదిత్య పంచరత్న స్తోత్రం 
311. శ్రీ ద్రౌపద ఆదిత్య పంచరత్న స్తోత్రం 
312. శ్రీ గంగ ఆదిత్య పంచరత్న స్తోత్రం 
313. శ్రీ కేశవ ఆదిత్య పంచరత్న స్తోత్రం 
314. శ్రీ ఖగోల్క ఆదిత్య పంచరత్న స్తోత్రం 
315. శ్రీ లోలార్క ఆదిత్య పంచరత్న స్తోత్రం 
316. శ్రీ మయూఖ ఆదిత్య పంచరత్న స్తోత్రం 
317. శ్రీ సాంబ ఆదిత్య పంచరత్న స్తోత్రం 
318. శ్రీ ఉత్తరార్క ఆదిత్య పంచరత్న స్తోత్రం 
319. శ్రీ విమల ఆదిత్య పంచరత్న స్తోత్రం 
320. శ్రీ వృద్ధ ఆదిత్య పంచరత్న స్తోత్రం 
321. శ్రీ విమల ఆదిత్య పంచరత్న స్తోత్రం
322. శ్రీ సూర్యదేవపంచరత్నస్తోత్రం
323. శ్రీ సూర్యనారాయణాష్టకం   
324. శ్రీ సూర్యకరావలంబస్తోత్రం 
325. శ్రీ సూర్యద్వాదశనామరత్నమాలికాస్తోత్రం 
326. శ్రీ సూర్యనారాయణపంచరత్నమాలికాస్తోత్రం 
327. శ్రీ సూర్యపంచరత్నస్తోత్రం 
328. శ్రీ శివనారాయణపంచరత్నస్తోత్రం
329. శ్రీ హరిహరవైభవాష్టకం 
330. శ్రీ హరిహరమూర్త్యష్టకం 
331. శ్రీ నారదమునీంద్రషట్కం 
332. శ్రీ వ్యాసపంచరత్నస్తోత్రం 
333. శ్రీ ఆదిశంకరాచార్య పంచరత్న స్తోత్రం 
334. శ్రీ దత్తాత్రేయ అష్టరత్నమాలికా స్తోత్రం 
335. శ్రీ దత్తాత్రేయ పంచరత్న స్తోత్రం 
336. శ్రీ పాదరాజ కరావలంబ స్తోత్రం 
337. శ్రీ దత్తాత్రేయాష్టకం 
338. శ్రీ పాదశ్రీవల్లభాష్టకం 
339. శ్రీ మహేశ్వరీ పంచామృత స్తోత్రం
340. శ్రీ త్రిపురసుందరీ దశకం
341. శ్రీ హిమవన్నగాధిరాజపుత్రి దశకం 
342. శ్రీ నారాయణీ దశకం
343. శ్రీ దుర్గాపరతత్త్వసుధానిధి

344. శ్రీ చండికాంబానవకం 
345. శ్రీ మాణిక్యవల్ల్యష్టకం 
346. శ్రీ కామకోటినిలయ పంచరత్నస్తోత్రం
347. శ్రీ నీలాయతాక్షి పంచరత్నస్తోత్రం  
348. శ్రీ కన్యాకుమారి పంచరత్నస్తోత్రం  
349. శ్రీ రాజరాజేశ్వరీ పంచరత్నస్తోత్రం  
350. శ్రీ త్రిపురాంబికా పంచరత్న స్తోత్రం
351. శ్రీ రాజేశ్వరీ పంచరత్న మంత్రమాలా స్తోత్రం
352. శ్రీ త్రిపురసుందరీ భావనాష్టకం   
353. శ్రీ గిరిరాజనందినీ పంచరత్నస్తోత్రం 
354. శ్రీ పర్వతవర్ధినిపంచరత్నస్తోత్రం 
355. శ్రీ సదాశివవల్లభపంచరత్నస్తోత్రం 
356. శ్రీ గౌరీవైభవపంచరత్నస్తోత్రం 
357. శ్రీ ఈశానీచరణపంచరత్నస్తోత్రం 
358. శ్రీ దుర్గమాంబా వైభవ పంచరత్న స్తోత్రం 
359. శ్రీ శివమనోరంజన్యష్టకం 
360. శ్రీ కామాక్షీజయనవకం 
361. శ్రీ మంగళాంబికా పంచరత్న స్తోత్రం 
362. శ్రీ మంగళ చండికా పంచరత్న స్తోత్రం 
363. శ్రీ వైష్ణవీవైభవాష్టకం 
364. శ్రీ పురుహూతికాపంచరత్నస్తోత్రం 
365. శ్రీ దుర్గమాంబాష్టకం 
366. శ్రీ కామాక్షీమానసపూజాస్తోత్రం  
367. శ్రీ పార్వతీవైభవాష్టకం 
368. శ్రీ మల్లికార్జునభామిన్యష్టకం 
369. శ్రీ శైలపుత్ర్యష్టకం 
370. శ్రీ బ్రహ్మచారిణ్యష్టకం 
371. శ్రీ దుర్గాభవానీపంచరత్నస్తోత్రం 
372. శ్రీ కపర్దినీ పంచరత్నస్తోత్రం 
373. శ్రీ అపరాజితా  పంచరత్నస్తోత్రం 
374. శ్రీ దుర్గమాంబా నవకం 
375. శ్రీ అపర్ణాంబికా పంచరత్న స్తోత్రం 
376. శ్రీ షణ్ముఖ జనన్యష్టకం 
377. శ్రీ శాంకరీ పంచరత్నస్తోత్రం
378. శ్రీ బృహన్నాయకీ పంచరత్నస్తోత్రం 
379. శ్రీ కామాక్షీ చింతనాష్టకం
380. శ్రీ దుర్గాంబికా దశరత్నమాలికా స్తోత్రం  
381. శ్రీ దుర్గా వైభవ పంచరత్న స్తోత్రం 
382. శ్రీ శివకామసుందర్యష్టకం 
383. శ్రీ మాణిక్యాంబికా పంచరత్నస్తోత్రం
384. శ్రీ అఖిలాండేశ్వరి పంచరత్నస్తోత్రం
385. శ్రీ విశ్వేశ్వరీ పంచరత్నస్తోత్రం
386. శ్రీ జ్ఞానప్రసూనాంబికా పంచరత్నస్తోత్రం  
387. శ్రీ పరాత్పరదేవతాస్తుతి
388. శ్రీ మహేశ్వరీచరణాష్టకం 
389. శ్రీ దాక్షాయణీ పంచరత్నస్తోత్రం
390. శ్రీ పార్వత్యష్టకం 
391. శ్రీ జ్వాలాముఖీపంచరత్నస్తోత్రం 
392. శ్రీ దుర్గామానసపూజాస్తోత్రం 
393. శ్రీ విశాలాక్షీ పంచరత్నస్తోత్రం 
394. శ్రీ భవానీ చరణ పంచరత్నస్తోత్రం 
395. శ్రీ కామాక్షీ పంచరత్నమాలికా స్తోత్రం 
396. శ్రీ భ్రమరాంబికా పంచరత్న స్తోత్రం  
397. శ్రీ గౌరీ పంచరత్నస్తోత్రం 
398. శ్రీ శివాన్యష్టకం 
399. శ్రీ మహిషాసురమర్దిన్యష్టకం 
400. శ్రీ తులజాభవాన్యష్టకం 
401. శ్రీ దుర్గమాంబా అష్టరత్నమాలికా స్తోత్రం 
402. శ్రీ కాత్యాయన్యష్టకం 
403. శ్రీ కామేశ్వర్యష్టకం 
404. శ్రీ పాండ్యకుమార్యష్టకం 
405. శ్రీ నారాయణీ అష్టకం  
406. శ్రీ అమృతేశ్వర్యష్టకం 
407. శ్రీ ఉమాదేవీవైభవాష్టకం 
408. శ్రీ చండీ పంచరత్నస్తోత్రం 
409. శ్రీ అద్రిరాజనందినీ పంచరత్న స్తోత్రం 
410. శ్రీ భవానీ పంచరత్నమాలికా స్తోత్రం 
411. శ్రీ భవానీ షోడశరత్నమాలికా స్తోత్రం  
412.శ్రీ మహాగౌరీ షోడశరత్నమాలికాస్తోత్రం 
413. శ్రీ మహాగౌర్యష్టకం 
414. శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం 
415. శ్రీ త్రిపురసుందర్యష్టకం 
416. శ్రీ కామాక్ష్యంబాష్టకం 
417. శ్రీ మీనాక్ష్యంబాష్టకం 
418. శ్రీ దుర్గాష్టకం 
419. శ్రీ దుర్గా పంచరత్నమాలికా స్తోత్రం 
420. శ్రీ దుర్గా పంచరత్నం 
421. శ్రీ అన్నపూర్ణ పంచరత్న స్తోత్రం 
422. శ్రీ మానసాదేవి పంచరత్న స్తోత్రం 
423. శ్రీవైదేహి పంచరత్న స్తోత్రం 
424. శ్రీజానకీ పంచరత్న స్తోత్రం 
425. శ్రీ విష్ణుచిత్త తనూజ వైభవ పంచరత్నం 
426. శ్రీ గోదాష్టకం 
427. శ్రీ హిరణ్మయి అష్టకం
428. శ్రీ ద్వారలక్ష్మ్యష్టకం 
429. శ్రీ పుండరీకవల్లీ పంచరత్నస్తోత్రం 
430. శ్రీ కోమలవల్లీ పంచరత్నస్తోత్రం 
431. శ్రీ అంబుజవల్లీ పంచరత్నస్తోత్రం 
432. శ్రీ భృగునందినీ పంచరత్నస్తోత్రం   
433. శ్రీ కమలాంబికాష్టకం 
434. శ్రీ మహాలక్ష్మీ పంచరత్నస్తోత్రం 
435. శ్రీ హేమాబ్జవల్లీం పంచరత్నస్తోత్రం 
436. శ్రీ రాధికాంబ పంచరత్నమాలికా స్తోత్రం
437. శ్రీ రాధికా పంచరత్న స్తోత్రం
438. శ్రీ రాధికా పంచరత్నమాలికా స్తోత్రం 
439. శ్రీ బ్రహ్మాణీ దశకం 
440. శ్రీ నీలసరస్వతీ పంచరత్న స్తోత్రం
441. శ్రీ వాగధీశ్వర్యష్టకం 
442. శ్రీ శ్యామలాంబాష్టకం
443. శ్రీ సరస్వతీ భావనా పంచరత్న స్తోత్రం 
444. శ్రీ సరస్వతీ తత్త్వప్రబోధ షోడశరత్నమాలికా స్తోత్రం 
445. శ్రీ వాణ్యష్టకం 
446. శ్రీ శారదా పంచరత్న స్తోత్రం 
447. శ్రీ సరస్వతీ పంచరత్నమాలికా స్తోత్రం 
448. శ్రీ సరస్వతీ పంచరత్నం  
449. శ్రీ సరస్వత్యష్టకం 
450. శ్రీ సప్తమాతృకాస్తోత్రం 
451. శ్రీ గాయత్రీ పంచరత్న స్తోత్రం 
452. శ్రీ బృందావనీ పంచరత్న స్తోత్రం 
453. శ్రీ తులసీ పంచరత్న స్తోత్రం

454. శ్రీ బాలా పంచరత్న స్తోత్రం
455. శ్రీ బాలా త్రిపురసుందరి పంచరత్నమాలికా స్తోత్రం
456. శ్రీబాలాత్రిపురసుందర్యష్టకం 
457. శ్రీ లలితా పరాంబికా కల్యాణ వైభవ సుధానిధి
458. శ్రీ లలితా పరాభట్టారికా పంచరత్నమాలికా స్తోత్రం
459. శ్రీ లలితాపరాంబికా పంచరత్నస్తోత్రం
460. శ్రీ లలితాంబికా పంచరత్నస్తోత్రం  
461. శ్రీ లలితాపరమేశానీ పంచరత్న స్తోత్రం 
462. శ్రీ లలితా పంచరత్నమాలికాస్తోత్రం 
463. శ్రీ లలితా పంచరత్న స్తోత్రం 
464. శ్రీ లలితాంబికాష్టకం 
465. శ్రీ లలితామంత్రమాల
466. శ్రీ మాతృకాస్తోత్రం 
467. శ్రీవారాహ్యష్టకం  
468. శ్రీ నవగ్రహ పీడాహరణ స్తోత్రం 
469. శ్రీ సప్తర్షి మండల స్తోత్రం 
470. శ్రీ సుదర్శన పంచరత్న స్తోత్రం 

సర్వం శ్రీపరదేవతా దివ్యచరణారవిందార్పణమస్తు.                

 🙏🌺🌺🌺అద్భుత విషయాలు🌺🌺🌺🙏

1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, 
ఒట్టు పెట్టుట దోషం.

2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని 
అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. 
రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం 
రెండూ నిషిద్దాలే.

5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు.

6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు 
ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే 
వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు 
ఉబ్బసపు రోగులుగా పుడతారు. 
ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు 
సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి 
కష్టనష్టాల పాలవుతారు.

10. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు.

11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. 
పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. 
తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద 
నియమాలు లేవు.

12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. 
హారతి ఇచ్చే పాత్రపై కాదు.

15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. 
పూజా మందిరంలో ప్రవేశించరాదు. 
పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. 
లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. 
సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. 
పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, 
దెప్పి పొడవరాదు.

21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. 
అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, 
వాగ్బంగం చాలా దోషం.

23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే 
ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, 
వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే 
మంచి జన్మలు కలుగుతాయి. 
దీనిని కాయిక తపస్సు అంటారు.

25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 
7 జన్మల పాపాలు తొలుగుతాయి.

26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 
మూడు జన్మల పాపాలు తొలగుతాయి.

27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి 
ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. 
(ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). 
పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలంలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.

31. శవాన్ని స్మశానం దాకా మోసినా, 
శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని 
ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది. 
ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

33. భోజనానికి ముందు, అనంతరం కూడా 
కాళ్ళు కడుక్కోవాలి.

34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.

36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు 
ఆ నూనెజిడ్డు పులమరాదు.

37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, 
ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, 
చెప్పిన మాట వినకపోవటం, 
తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. 
ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, 
అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. 
ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.

41. దిగంబరంగా నిద్రపోరాదు.

42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.

43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.

44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, 
అర్చనలకు వాడరాదు, 
కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.

46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. 
శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, 
కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి🙏🌺🙏.                                    
 *రాశులు ఆకార స్వరూపాలు.....*
*రాశి స్వరూప లక్షణాల ద్వారా జాతకుని లగ్నం గాని,* *రాశి గాని ఉన్నప్పుడు ఆయా లక్షణాలు కలిగి ఉంటారు.* 
*జాతక చక్ర విశ్లేషణలో జాతకుని యొక్క స్వభావ లక్షణాలు తెలుసుకోవచ్చును*

*మేషరాశి:-!!*
మేషమంటే గొర్రె. 
గొర్రెకు ఉండే తీవ్రత, కలహాశక్తి, ధైర్యం, బలం, 
వెనుక ముందు ఆలోచింపక ముందుకు అడుగు వేయటం, దూకుడుతనం, న్యాయకత్వ లక్షణాలు, కొండను కూడా డీకొట్టగలననే నమ్మకం. ఆశ, సాహసం కలిగి ఉందురు. 
మోసాలకు లోనగుదురు. 
మానవులకు సహాయపడుదురు.

వృషభ రాశి:-!!
వృషభరాశి అంటే ఎద్దు. 
స్ధిరత్వం కలిగి ఉంటుంది. 
పోషించే స్వభావం, ఎత్తైన భుజాలు,పెరిగినకండలు, కాంతి కల కన్నులు, విశాలమైన ముఖం, 
గొడ్డు చాకిరీ చేయుదురు. 
ఓర్పు అధికం, ఇతరుల ఆదీనంలో ఉందురు. ఇతరులకు బాగా సహాయపడతారు.

మిధున రాశి:-!!
పురుషుడు ఒక చేత్తో గధ, స్త్రీ ఒక చేత్తో వీణ దరించిన స్వరూపం. 
బార్యా భర్తలు ఇద్దరు యుక్తా యుక్త జ్నానాన్ని 
కలిగి ఉందురు. 
కుటుంబమును పోషించెదరు. 
మానవతా దృక్పదం కలిగి ఉంటారు. 
ఒకరి కోసం ఒకరు అనే భావన, వైవిధ్యం, 
కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత, 
కొంతకాలం ఆర్ధిక అనుకూలత, 
రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు.

కర్కాటక రాశి:-!!
ఎండ్రకాయ(పిత) పీతబుఱ్ఱ (అధిక ఆలోచన) 
కలిగి ఉంటారు. 
పురుగు స్వభావం.
పట్టుదల, తప్పించుకొనే తెలివి తేటలు, స్వతంత్రత, అపకారం చేయుటకు వెనకాడక పోవటం, 
జల భూచరమైన ఆటుపోటులు, వృద్ధి క్ష్యయాలు, మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు.

సింహారాశి:-!!
సింహం. మృగ స్వభావం, బిగ్గరగా అరుచుట, గాండ్రించుట, భయం కలిగించుట, 
స్వేచ్ఛగా సంచరించుట, జంకు బొంకు లేకపోవుట, అందరిని మించిపోవాలనే స్వభావం, 
న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉందురు.

కన్యారాశి:-!!
సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం, 
ఒక చేత్తో సస్యమును దరించిన స్త్రీ. 
కన్య పుష్పవతి కాని స్త్రీ. 
విశేషమైన ఊహాలు, సిగ్గు, లజ్జ, బిడియం, 
దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం, 
సభలో మాట్లాడుటకు భయం, 
పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు. 
స్త్రీకి ఉండే వాత్సల్యం, అభిమానం, బంధుప్రేమ. తన భాధను, శ్రమను ఇతరులు గుర్తించాలనే 
భావం కలిగి ఉంటారు.

తులారాశి:-!!
త్రాసు ధరించిన పురుషుడు. 
సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు. 
స్ధిర చిత్తమును కలిగి ఉంటారు. 
ధర్మా దర్మముల విచక్షణ, సమయోచితంగా ప్రవర్తించుట, ఇతరులకు సహాయ పడుట, అవకాశాలు, ధనం, కాలం, సాధనాలు సరిగా వినియోగించుట, చిన్న వస్తువులను, 
సంఘటనలను సరిగా గుర్తుంచుకోవటం.

వృశ్చికరాశి:-!!
తేలు. తేలు కనపడితే జనం చంపుతారు. 
కనుక ఇతరుల నుండి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తనం కలిగి ఉంటుంది. 
వృశ్చిక రాశి వారికి రహస్య ప్రవర్తన ఉండే సూచనలు. 
తనకు ఈ మాత్రం హాని కలగకుండా చూసుకొనుచు, ఇతరులకు హాని కలిగించు మాటలు, పనులు చేయుదురు. 
వృశ్చిక రాశి వారు పగ కలిగి ఉంటారు.

ధనస్సు రాశి:-!!
నడుము కింది భాగం అశ్వ రూపం కలిగి విల్లు ధరించిన మానవ రూపం. 
ధనుర్ధారుడికి ఉండే ఏకాగ్రత, కార్యదీక్ష, పట్టుదల కలిగి ఉంటారు. 
కదలిక లేని స్వభావం, ఇతరుల ఆదేశానుసారం నడుచుకుందురు.

మకరరాశి:-!!
లేడి ముఖం కలిగి మొసలి రూపం కలిగి 
ఉన్న రూపం. 
లేడికి ఉండే సుకుమారం, లావణ్యత, నాజూకుతనం కలిగి ఉందురు. 
మొసలికి ఉండే పట్టుదల, 
పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం, 
ఏమి ఎరుగని మనస్తత్వం, 
సమయం చూసి పట్టు పడతారు. 
పట్టిన పట్టు వదలరు.

కుంభరాశి:-!!
నీటి కుండను(ఖాళీ కుండ) ధరించిన మానవ రూపం. కొత్త నీరు, నవ జీవనం, బద్ధకస్తులు, 
చలనం లేక మొండిగా ఉండుట, 
ఏ విషయంలో అయిన త్వరగా బయట పడుదురు. సమర్ధులు, భద్ర పరుచుకుందురు.

మీనరాశి:-!!
రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం. 
ఒకరిని చూసి మరొకరు సర్ధుకుపోవటం, 
నీటి ప్రవాహంలో ప్రయాణం. 
సమయమును బట్టి వృద్ధి చెందగలరు. 
ఎరవేస్తే వలలో పడుతారు. 
ఆశ చూపిస్తే లొంగిపోతారు.

ఓం నమః శివాయ..!!        
 *ఆయుధాలు లేకుండా జరిగిన 5 మహాభారత యుద్ధాలు..నిజమైన బలం అంటే ఇదే*
*(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
*ప్రస్తుతం ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాలన్నా, ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. అయితే మహాభారత కాలంలో కత్తులు,కర్రలు,తుపాకీలు వంటి ఎలాంటి ఆయుధాలు లేకుండానే జరిగిన 5 యుద్ధాల గురించి మీకు తెలుసా?*

*నిజమైన బలం..హింస లేకుండానే వస్తుందని,జ్ణానం, ఓర్పు, సంకల్పంతో జరిగిన 5 మహాభారత యుద్ధాలు మనకు తెలియజేస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.*

*జ్ణాన యుద్ధం*

మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో విదురుడు ఒకరు. విదురుడు తన జీవితాంతం నీతిగానే బతికాడు. విదురుడు..కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలెక్కువని నమ్మినవాడు. అందుకే ఆయన ఎప్పుడూ తన వాక్యాతుర్యంతో,వివేకంతోనే యద్ధాలు చేసేవాడు. విదురుడు అందించిన ప్రతి సలహా కురువంశం పతనమవ్వకుండా ఆపడానికి చేసిన ఒక సైద్ధాంతిక యుద్ధం.

ధృతరాష్ట్రుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే విదురుడు అతడికి దిక్సూచిలా నిలబడ్డాడు. ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రి అయిన విదురుడు ధుర్యోధనుడి దుర్మార్గపు ఆలోచనలు ముందే పసిగట్టి హెచ్చరించాడు. ధర్మాన్ని కాపాడటానికి అతడు చేసిన ప్రతి ప్రయత్నం దురాశ, అహంకారంతో నిండిన శత్రువులపై శిశ్శబ్దంగా సాగిన భీకర పోరాటం. విదురుడి కథ దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద పోరాటానికి ఉదాహరణగా నిలుస్తుంది.

సహన యుద్ధం

మహాభారతం మొత్తంలో హస్తినాపురి రాజసభ ప్రాంగణంలో జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాచికల ఆటలోనే కౌరవులు గెలుస్తారు,పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళ్తారు. ధర్మరాజు తన సహనాన్ని,ధర్మానికి కట్టుబడి ఉండే గుణానని అత్యంత కఠినమైన పరీక్షకు నెలబెట్టాడు. మోసం జరుగుతున్నా,అవమానాలు పెనుభూతంలా వెంటాడినా,అడుగడునా నష్టం అతడిని కుంగదీసినా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు,బలవంతంగా ప్రతీకారం తీర్చుకోలేదు.

ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు. అతని మౌనమే ఒక యుద్ధమైంది. అది స్వీయ నియంత్రణకు ప్రతి రూపం. క్షణికావేకాశాలకు లొంగకుండా, ధర్మాన్ని విడవకుండా నిలబడిన ధర్మరాజు సంయమనం నిజంగా అద్భతం. నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతలను, తొందపాటుని జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియజేస్తుంది.

నిశ్శబ్ద యుద్ధం

కురుక్షేత్ర యుద్ధం ముంగిట నిలిచిన వేళ శ్రీకృష్ణుడు ధుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మహాసైన్యం(నారాయణి సేన) మరోవైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగి,నిరాయుధిగా,ఎలాంటి కదలలలేని సాక్షిలా నిలబడ్డాడు. అయితే అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ధుర్యోధనుడు సంఖ్యా బలం, కండ బలంపై గుడి నమ్మకంతో మహాసైన్యాన్ని ఎంచుకున్నాడు. కానీ అర్జునుడు వివేకంతో కృష్ణుడిని ఎంచుకున్నాడు.

నిశ్శబ్ద ఎంపిక కేవలం ఒక నిర్ణయం కేవలం ఎంపిక మాత్రమే కాదు..అది శక్తిపై ధర్మం సాధించే విజయానికి నాంది. ధర్మం నిజమైన బలం గుంపులో కాదు నిస్వార్థ్యమైన సత్యంలో ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుంది. కృష్ణుడు తోడుంటే ధర్మం తప్పక గెలిస్తుందని అర్జునుడి విశ్వాపం ఆనాడే యుద్ధ ఫలితాన్ని తేల్చేసింది.

వినయ యుద్ధం

మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో భీష్ముడు ఒకరు. సింహాసనం పదిలంగా ఉండాలని, రాజ్యం కలకాలం నిలవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ణ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ణ కేవలం మాటలు కాదు..అది తనలోని కోరికలకు,ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిర నిరంతర యుద్ధం. ఇక్కడ ఆయన వాడిన ఆయుధం నిగ్రహం మాత్రమే. నిజమైన యోధులు యుద్ధరంగంలోనే పోరాడరని..కొన్నిసార్లు తమ అంతరంగంలోనూ యుద్ధం చేస్తారని భీష్ణుడి పాత్ర తెలియజేస్తుంది. తన న్యాయమైన కోరికలను, తన సొంత ఆశయాలను త్యాగం చేసి బాధ్యతను ఎంచుకున్నాడు భీష్ముడు..ఇది కురుసామ్రాజ్యానికి బలమైన పునాది వేసింది.

ధర్మ యుద్ధం

పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతారు. దీంతో ఆమెను జట్టు పట్టుకొని సభకు ఈడ్చకొచ్చి కౌరవులు రాక్షసానందం పొందుతారు. ద్రౌపది చాలా అవమానానికి గురవుతుంది. అయితే అప్పుడు ద్రౌపది ఎదురుతిరిగి పోరాడలేదు. సభలో ఉన్న పెద్దలను,రాజులను తన పదునైన మాటలతో నిర్భయంగా ప్రశ్నించింది. తన మాటలనే ఆయుధాలుగా వాడింది.

ఆమె ప్రశ్నించిన తీరు,ఆమె చూపిన ధైర్యం ఆనాటి బలవంతులందరికంటే ఆమెను ఉన్నతంగా నిలబెట్టాడు. అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్షే చివరికి కురక్ష్రేతంలో ధర్మం కోసం జరిగే మహా సంగ్రామానికి అగ్గి రాజేసింది. ద్రౌపది లేవనెత్తిన ఒక్కో ప్రశ్న ఒక్కో నిప్పురవ్వలా మారి కురు వంశాన్నే దహించేసే మహాజ్వాలగా అయింది. ఆమె నిశ్శబ్దంగా చేసిన ఆ ధర్మపోరాటం చరిత్రలో నిలిచిపోయింది.                             
 *భగవద్గీత 9.17–18 — తాత్త్విక విశ్లేషణ*

శ్లోకం 9.17

> పితాఽహమస్య జగతః
మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్రమోంకారః
ఋక్సామ యజురేవ చ ॥

భావార్థం

నేనే ఈ జగత్తుకు తండ్రి, తల్లి, ధారకుడు, పితామహుడు. నేనే తెలిసికొనవలసిన వాడు, పవిత్రమైన ఓంకారము, అలాగే ఋగ్వేద, సామవేద, యజుర్వేదములు.


శంకరభాష్య సారం

1. “పితా, మాతా, ధాతా, పితామహః”

సృష్టి యొక్క అన్ని కారణాలు

ఉపాదాన, निमిత్త కారణాలు


👉 ఈశ్వరుడే సమస్తానికి మూలం

2. “వేద్యం”

తెలిసికొనవలసిన పరమతత్త్వం

అన్ని శాస్త్రాల గమ్యం


3. “పవిత్రమ్ ఓంకారః”

ఓం → బ్రహ్మస్వరూప సూచకం

సమస్త వేదసారం


4. “ఋక్, సామ, యజుః”

వేదత్రయం

జ్ఞానం, ఉపాసన, కర్మ


👉 ఇవన్నీ పరబ్రహ్మస్వరూపమే


శ్లోకం 9.18

> గతిర్భర్తా ప్రభుః సాక్షీ
నివాసః శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం
నిధానం బీజమవ్యయమ్ ॥
భావార్థం

నేనే గమ్యం, పోషకుడు, అధిపతి, సాక్షి, నివాసం, శరణం, స్నేహితుడు. నేనే సృష్టి, లయం, స్థానం, నిల్వ, మరియు నశించని బీజం.


శంకరాచార్యుల వ్యాఖ్యానం

1. “గతిః”

పరమ గమ్యం

మోక్షస్థితి



2. “భర్తా”

పోషకుడు

జీవనాధారం

3. “ప్రభుః”

అధిపతి

నియంత్రకుడు

4. “సాక్షీ”

కర్మలకు సాక్షిగా ఉన్నవాడు

నిర్లిప్త దర్శి


5. “నివాసః, శరణం, సుహృత్”

జీవులకు ఆధారం

రక్షకుడు

నిస్వార్థ స్నేహితుడు


6. “ప్రభవః, ప్రలయః, స్థానం”

సృష్టి

లయం

స్థితి


👉 ఇవన్నీ ఈశ్వరస్వరూపం


7. “నిధానం, బీజమవ్యయం”

సమస్తానికి మూలకారణం

నశించని బీజం


ఉపనిషత్ ప్రతిధ్వని 📖

ముండక ఉపనిషత్ (2.1.1)

> “యత్ తద్అద్రేశ్యం… యస్మిన్ ఇదం విశ్వం నిహితం”



ఈ జగత్తంతా బ్రహ్మంలోనే నిక్షిప్తమై ఉంది


తత్త్వసారం

ఈ శ్లోకాలలో గీతా తెలిపే పరమ సత్యం:

1. ఈశ్వరుడు → సృష్టి యొక్క సమస్త కారణం


2. వేదాలు → ఆయన స్వరూపప్రతిపాదకాలు


3. ఈశ్వరుడు → గమ్యం, ఆధారం, సాక్షి


4. సమస్తం → ఆయనలోనే ఆరంభం, నిలయం, లయం


ఆధునిక అన్వయం 🌿

మనిషి తనను ఒంటరిగా భావించినప్పుడు అస్థిరత కలుగుతుంది. కానీ జీవితం యొక్క మూలం, పోషణ, మరియు గమ్యం ఒకే పరమసత్యంలో నిక్షిప్తమై ఉన్నాయని గ్రహించినప్పుడు, లోతైన భద్రతా భావం మరియు సమత ఉత్పన్నమవుతుంది. ఇది భక్తి మరియు జ్ఞానానికి ఏకీకృత రూపం. 🧘‍♂️.     
 ప్ర : నిత్యకర్మకు,  నైమిత్తిక కర్మకు తేడా ఏమిటి?

జ : నిత్యకర్మకు ఫలితం ఉండదు. రోజూ స్నానం చేయడం, రోజూ సంధ్యావందనం చేయడం, వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు. చేయకపోతే దోషాలుంటాయి. రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు. నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాడు చేసేటటువంటి పని. ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. దీపావళి పండుగనాడు తెల్లవారు ఝామున తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలంలో అన్ని నీళ్ళల్లోకి వస్తుంది. అందుకని ’జలే గంగా’. ’తైలే లక్ష్మీ’ - ఒంటికి నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆరోజున. అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిత్తిక తిథినాడు చేసేపనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. నిత్యం చేసే కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు. నైమిత్తిక కర్మ పరమ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. ఇది నిత్యకర్మకీ, నైమిత్తిక కర్మకీ తేడా.
 *భగవద్గీత లోని అనేక ధర్మ సూక్ష్మాలు వివరించే చాగంటి వారి అద్భుత ప్రవచనం*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

ఆరోగ్యమునకు కేవలం ఔషధములే ప్రధానము కాదు, మంచి మాటలు, మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి అవసరము. ఇవే దేహానికి అమృతత్వము నందించే టానిక్కులు. 

దుర్భావములూ, దుశ్చింతలూ హృదయములో నింపుకొని ఎన్ని విలువైన ఔషధములు సేవించినప్పటికీ రోగ నివారణ కాదు. 

సద్గుణములను అనుభవించి, సదాచారములను ఆచరించి, సచ్చింతనలను సంకల్పించుకుంటే అవి మనకు సరైన ఆరోగ్యాన్ని అందివ్వడమేగాక డాక్టర్లు ఇచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తాయి .. మరియు  ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాయి.

నేడు మానవుడు అనేక విధములైన రోగములతో వివిధ క్లేశములు అనుభవించుటకు కారణం మనస్సుకు సరైన పోషణ లేకనే. శరీరమునకు వివిధ రకములైన రుచికరమైన ఆహారమును అందిస్తున్నాడు కానీ మనస్సుకు అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అనే ఆహారాన్ని అందివ్వడం లేదు. అది లేకనే రోగములన్నీ వచ్చి మీద పడుతున్నాయి. 

నిత్యం భగవన్నామమును స్మరించుట, ప్రవచనాలు వినుట మున్నగు ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా చేస్తుంటే ఏ రోగము మన దరి చేరదు. 
🕉️🚩🕉️

నేనెందుకు చదువుతాను? _(ఆంగ్ల మూలం: గేరీ పాల్సెన్ )

 నేనెందుకు చదువుతాను?

_(ఆంగ్ల మూలం: గేరీ పాల్సెన్ )


నేను చదవకుండా ఉండలేను కాబట్టి చదువుతాను
నేర్చుకోవడానికి,ఎదగడానికి,నవ్వడానికి,స్ఫూర్తి పొందడానికి చదువుతాను ....

నాకు  తెలియని విషయాలను అర్థం చేసుకోవడానికి చదువుతాను ...

నాకు చికాకుగా ఉన్నప్పుడు చదువుతాను ...
నేను ప్రేమించే వ్యక్తులతో  పరమ మూర్ఖంగా  మాట్లాడినప్పుడు చదువుతాను ...

నేను నిరాశలో కృంగిపోయినప్పుడు,భయంతో వణికి పోయినప్పుడు,మానసికంగా ముక్క
చెక్కలయినప్పుడు కోలుకునే శక్తిని పొందడానికి చదువుతాను ...

అంతా సవ్యంగా నడుస్తున్నప్పుడూ చదువుతాను ...
జీవితంలో ఆశను అన్వేషించడానికి చదువుతాను ...

నేను కేవలం భావాలతో నిండిన చర్మపు తిత్తిని కాను,
తినడం కోసమే బతికే  మనిషినీ కాదు, 
నేను పదాలతో నిండిన మనిషిని,
పదాలు నా ఆలోచనలను వర్ణిస్తాయి,
నా గుండె లోతులలో దాగున్న విషయాలను వెల్లడిస్తాయి,పదాలు జీవంతో తొణికిస లాడుతుంటాయి ....

ఇష్టమైన పాటను మళ్ళీ మళ్ళీ పాడుకున్నట్లు
నేను ఇష్టపడే కథను 
మళ్ళీ మళ్ళీ చదువుతాను ....

చదవడం అంటే క్రియా రహితంగా ఉండడం కాదు ...
పాత్రలతో పాటు నేనూ కథలోకి ప్రవేశిస్తాను ...
ఆ పాత్రలు పీల్చే  గాలే  నేనూ పీలుస్తాను ....
వాళ్ళ నిరాశ నిస్పహలను అనుభవిస్తాను ...
వాళ్ళు ఏదైనా తెలివితక్కువ  పని చేస్తుంటే, వద్దురా అని కోప్పడతాను ...
వాళ్ళతో పాటు నవ్వుతాను, ఏడుస్తాను ...

నా దృష్టిలో చదవడం అంటే ఒక స్నేహితుడితో సమయాన్ని గడపడం ...
పుస్తకాలు మన స్నేహితులు ...

ఈ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఇంకా కొరతగానే ఉంటుంది
సేకరణ
 @శ్రీ మహావిష్ణువు పార్వతీదేవిని మోసగించిన సందర్భం

బద్రీనాథ్ ధామం ఒకప్పుడు శివపార్వతుల విశ్రాంతి స్థలంగా ఉండేదని ప్రతీతి. శివుడు తన పరివారంతో కలిసి ఇక్కడే నివసించేవాడు; అయితే, శ్రీ మహావిష్ణువుకు (శ్రీహరికి) ఈ ప్రదేశం ఎంతగానో నచ్చడంతో, దీనిని తన సొంతం చేసుకోవడానికి ఆయన ఒక ఉపాయం పన్నాడు.

పురాణ గాథల ప్రకారం, సత్యయుగంలో శ్రీ నారాయణుడు బద్రీనాథ్‌కు విచ్చేసినప్పుడు, ఆ ప్రాంతమంతా 'బద్రీ' వృక్షాలతో (రేగు చెట్లు) నిండిన దట్టమైన అరణ్యంగా ఉండేది. ఆ సమయంలో, శివుడు తన అర్ధాంగి అయిన పార్వతీదేవితో కలిసి అక్కడ పరమానందంతో నివసిస్తుండేవాడు. ఒకనాడు, శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపం ధరించి, బిగ్గరగా ఏడవసాగాడు.

ఆ బాలుడి ఏడుపు విని, పార్వతీదేవి మనసు తీవ్ర వేదనకు గురైంది. ఆమె ఇలా ఆలోచించుకుంది: "ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో ఏడుస్తున్న ఈ బాలుడు ఎవరు? ఇతను ఎక్కడి నుండి వచ్చాడు? అసలు ఇతని తల్లి ఎక్కడ ఉంది?" ఇటువంటి ఆలోచనలతో కరుణతో నిండిన ఆ దేవి, ఆ బాలుడిని తన వద్దకు తీసుకుని, ఇంటికి తీసుకువచ్చింది.

ఇది శ్రీ మహావిష్ణువు పన్నిన ఒక దివ్యమైన ఉపాయం—ఒక 'లీల'—అని శివుడు వెంటనే గ్రహించాడు. ఆ బాలుడిని ఇంటి బయటే వదిలివేయమని ఆయన పార్వతికి సూచించాడు; ఆ బాలుడు కాసేపటికి ఏడుపు ఆపి, తనంతట తానే వెళ్లిపోతాడని ఆమెకు నచ్చజెప్పాడు. అయితే, పార్వతీదేవి ఆయన మాట వినలేదు; దానికి భిన్నంగా, ఆమె ఆ బాలుడిని ఇంటి లోపలికి తీసుకువచ్చి, ఓదార్చి, నిద్రపుచ్చడం ప్రారంభించింది.

ఎంతో సేపు గడవకముందే, ఆ బాలుడు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి బయటకు వచ్చి, శివునితో కలిసి విహారానికి వెళ్లింది. శ్రీ మహావిష్ణువు ఎదురుచూస్తున్న తరుణం సరిగ్గా ఇదే. ఆయన నిద్రలేచి, తలుపు వద్దకు వెళ్లి, దానిని లోపలి నుండి గడియ పెట్టేశాడు.

శివపార్వతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, తలుపు లోపలి నుండి గడియ వేసి ఉండటం వారు గమనించారు. తలుపు తీయమని వారు ఆ బాలుడిని కోరగా, శ్రీ మహావిష్ణువు లోపలి నుండి ఇలా బదులిచ్చాడు: "ఓ ప్రభూ! మీరు ఇక ఈ స్థలాన్ని వదిలిపెట్టాలి. ఈ నివాసం నాకు ఎంతగానో నచ్చింది. దయచేసి నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోవనివ్వండి. మీరు ఇక ఇక్కడి నుండి కేదార్‌నాథ్‌కు వెళ్లండి."

ఆనాటి నుండి, నేటికీ కూడా, శ్రీ బద్రీనాథుడు ఇక్కడే ఉంటూ తన భక్తులకు దివ్య 'దర్శనం' ప్రసాదిస్తూనే ఉన్నారు; అదే సమయంలో, శివుడు కేదార్‌నాథ్‌లో నివసిస్తూ ఉన్నారు.
 *నైవేద్యాల పేర్లు* 
🍌🍎🍈🍇🥥🍊🍋

*_(తెలుగు పేర్లు – సంస్కృతం పేర్లు)_*

పళ్ళు 
అరటిపండు – కదళీఫలం
ఆపిల్ – కాశ్మీరఫలం
ఉసిరికాయ – అమలక
కిస్మిస్ – శుష్కద్రాక్ష
కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం
కొబ్బరికాయ ౨ చిప్పలు – నారికేళ ఖండద్వయం
ఖర్జూరం – ఖర్జూర
జామపండు – బీజాపూరం
దబ్బపండు – మాదీఫలం
దానిమ్మపండు – దాడిమీఫలం
ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం
నారింజ – నారంగ
నిమ్మపండు – జంభీరఫలం
నేరేడుపండు – జంబూఫలం
మామిడి పండు – చూతఫలం
మారేడుపండు – శ్రీఫలం
రేగు పండు – బదరీ ఫలం
వెలగపండు – కపిత్తఫలం
సీతాఫలం – సీతాఫలం

విశేష నివేదనలు 
🫕🍓🍱🍓🍚🍓🧆🍓
అటుకులు – పృథక్
అటుకుల పాయసం – పృథక్పాయస
అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం
అన్నం (నెయ్యి,కూర,పప్పు,పులుసు,పెరుగు) – మహానైవేద్యం
ఉగాది పచ్చడి – నింబవ్యంజనం
కట్టుపొంగలి (మిరియాలపొంగలి) – మరీచ్యన్నం
కిచిడీ – శాకమిశ్రితాన్నం
గోధుమనూక ప్రసాదం – సపాదభక్ష్యం
చక్కెరపొంగలి – శర్కరాన్నం
చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం
నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం
నువ్వులపొడి అన్నం – తిలాన్నం
పరమాన్నం (పాలాన్నం)- క్షీరాన్నం
పానకం – గుడోదకం, మధురపానీయం
పాయసం – పాయసం
పిండివంటలు – భక్ష్యం
పులగం – కుశలాన్నం
పులిహోర – చిత్రాన్నం
పెరుగన్నం – దధ్యోదనం
పేలాలు – లాజ
బెల్లపు పరమాన్నం – గుడాన్నం
వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్
వడలు – మాసపూపం
శెనగలు (శుండలు) – చణకం
హల్వా – కేసరి

వివిధ పదార్థాలు 
🍯🍯🍯🍯🍯🍯
అప్పాలు – గుడపూపం
చెరుకుముక్క – ఇక్షుఖండం
చక్కెర – శర్కర
తేనె – మధు
పాలు – క్షీరం
పెరుగు – దధి
బెల్లం – గుడం
వెన్న – నవనీతం
 వయసు పెరిగితే మనకేమీ కొత్తగా కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.

”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.

చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు.

అప్పడు చలం…  “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు.     ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో  కొంత విజయం సాధించాలి.

వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.

ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?

మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.

కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా   ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు….            శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.

మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ.

ఏం వదిలివేయాలో చూద్దాం.

”అమ్మాయీ గ్యాసు కట్టేసావా....
గీజర్ ఆఫ్ చేసావా...
ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..
పాలు ఫ్రిజ్ లో పెట్టావా....
...లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.

”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు
వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..
కష్టనష్టాలు కూడా వాళ్ళవే.

ఎవరితో ఏపనీ చేయించుకోకుండా  ప్రతీపనీ మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా..

నా అభిప్రాయం ఏమిటంటే…  అని అనటం తగ్గించి.. నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.

నాకూ తెలుసు తో పాటు. నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ  నాకంటే ఎక్కువ తెలుసు  కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.

మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు.  ఆరోగ్యం బాగుంది కదా అని దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, షుగర్ కీళ్ళనొప్పులు, నిద్ర పట్టకపోవటం. నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. బాబోయ్.. ఎందుకు అడిగామా  అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.

కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం.

పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.

అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...జిహ్వచాపల్యం  తగ్గించుకుని.అన్నింటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించటంలేదు అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...

భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.

ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.

హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.

రోజూ అనుకుందాం ఇలా...
I love my self.
I respect my self.
మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.

మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా...

మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్య. అనే  భావం కనిపించాలో...లేక అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా.. అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది.

 *😌 పిల్లలు మరియు టీనేజ్ వారికి ఒత్తిడి నియంత్రణ (Stress Management Coping Skills for Kids & Teens)*


*ముందుమాట:*  

*ఈరోజుల్లో చిన్నపిల్లలు మరియు టీనేజ్ విద్యార్థులు కూడా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చదువు, పరీక్షలు, పోటీలు, మొబైల్ ప్రభావం వంటి కారణాల వల్ల వారి మనసు ఆందోళనకు గురవుతుంది. సరైన అలవాట్లు నేర్చుకుంటే పిల్లలు ఒత్తిడిని సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రకృతి, వ్యాయామం, మంచి ఆహారం, సానుకూల ఆలోచనలు వంటి అనేక మార్గాలు మనసుకు శాంతిని ఇస్తాయి. ఇప్పుడు పిల్లలు మరియు యువతకు ఉపయోగపడే ఒత్తిడి తగ్గించే ముఖ్యమైన మార్గాలు తెలుసుకుందాం.*


*1. ప్రకృతిని ఆస్వాదించండి (Enjoy Nature)*  

*ప్రకృతి మనసుకు శాంతిని ఇస్తుంది. చెట్లు, పూలు, పచ్చదనం మధ్య కొంత సమయం గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట గాలి పీల్చడం వల్ల మెదడు తాజాగా ఉంటుంది. ప్రకృతి దగ్గర ఉండటం ఒత్తిడిని తగ్గిస్తుంది.*


*2. మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయండి (Practice Mindfulness)*  

*మనసును ప్రస్తుత క్షణంపై కేంద్రీకరించడం మైండ్‌ఫుల్‌నెస్. ఇది ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజుకు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం మంచిది.*


*3. వ్యాయామం చేయండి (Exercise)*  

*వ్యాయామం శరీరానికే కాకుండా మనసుకూ మంచిది. నడక, పరుగులు, ఆటలు వంటి శారీరక చలనం ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఆనంద హార్మోన్లు విడుదల అవుతాయి.*


*4. మీ భావాలను పంచుకోండి (Share Your Feelings)*  

*మనసులో ఉన్న బాధను దాచుకోవడం కంటే చెప్పడం మంచిది. తల్లిదండ్రులు లేదా స్నేహితులతో మాట్లాడితే మనసు తేలికగా ఉంటుంది. భావాలను పంచుకోవడం మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం.*


*5. చిత్రాలు గీయండి లేదా రంగులు వేయండి (Color, Draw or Paint)*  

*చిత్రలేఖనం పిల్లలకు చాలా మంచి మానసిక వ్యాయామం. ఇది సృజనాత్మకతను పెంచుతుంది. రంగులతో ఆడుకోవడం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.*


*6. సంగీతం వినండి (Listen to Music)*  

*సంగీతం మనసును ప్రశాంతంగా చేస్తుంది. ఇష్టమైన పాటలు వింటే ఒత్తిడి తగ్గుతుంది. సంగీతం మెదడుకు విశ్రాంతి ఇస్తుంది.*


*7. స్నానం చేయండి (Take a Bath / Shower)*  

*వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరం రిలాక్స్ అవుతుంది. ఇది అలసటను తగ్గిస్తుంది. స్నానం తర్వాత మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.*


*8. వంట చేయడం నేర్చుకోండి (Cook a Meal)*  

*సాధారణ వంటకాలు చేయడం కూడా ఒక మంచి కార్యకలాపం. ఇది మనసును పనిలో నిమగ్నం చేస్తుంది. కుటుంబంతో కలిసి వంట చేయడం ఆనందాన్ని పెంచుతుంది.*


*9. తగినంత నిద్ర తీసుకోండి (Get Enough Sleep)*  

*పిల్లలకు రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర మెదడును విశ్రాంతి కలిగిస్తుంది. నిద్రలేమి ఒత్తిడిని పెంచుతుంది.*


*10. స్నేహితులతో సమయం గడపండి (Spend Time with Friends)*  

*స్నేహితులతో మాట్లాడడం మరియు ఆటలు ఆడటం పిల్లలకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఒంటరితనాన్ని తగ్గిస్తుంది.*


*11. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి (Eat Healthy Food)*  

*పండ్లు, కూరగాయలు, పాలు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం మెదడుకు శక్తిని ఇస్తుంది.*


*12. నడక చేయండి (Take a Walk)*  

*బయట కొద్దిసేపు నడక చేయడం మనసుకు చాలా మంచిది. తాజా గాలి పీల్చడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.*


*13. హాస్య కార్యక్రమాలు చూడండి (Watch a Comedy)*  

*నవ్వు ఒక మంచి ఔషధం. కామెడీ కార్యక్రమాలు చూడడం వల్ల మనసు తేలికగా ఉంటుంది.*


*14. నమ్మకమైన పెద్దవారితో మాట్లాడండి (Talk to a Trusted Adult)*  

*సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేదా గురువులతో మాట్లాడాలి. వారు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు.*


*15. పుస్తకాలు చదవండి (Read a Book)*  

*పుస్తకాలు చదవడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మంచి కథలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది.*


*16. యోగా మరియు ధ్యానం చేయండి (Stretch or Do Yoga)*  

*యోగా శరీరానికి మరియు మనసుకు శాంతిని ఇస్తుంది. శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.*


*17. నీరు ఎక్కువగా తాగండి (Drink Water)*  

*శరీరంలో నీరు సరిపడా ఉండాలి. నీరు తక్కువగా ఉంటే అలసట మరియు ఒత్తిడి పెరుగుతాయి.*


*18. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి విరామం తీసుకోండి (Break from Electronics)*  

*మొబైల్ మరియు టీవీ ఎక్కువగా వాడకూడదు. కొంతసేపు వాటి నుంచి దూరంగా ఉండాలి.*


*19. ధ్యానం చేయండి (Meditate)*  

*ధ్యానం మనసును ప్రశాంతంగా చేస్తుంది. రోజుకు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే ఆందోళన తగ్గుతుంది.*


*20. సానుకూల ఆలోచనలు పెంచుకోండి (Use Positive Affirmations)*  

*“నేను చేయగలను”, “నేను బలవంతుడిని” వంటి ఆలోచనలు మనసుకు బలం ఇస్తాయి.*


*ముగింపు:*  

*పిల్లలు మరియు యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సరైన జీవనశైలి, వ్యాయామం, మంచి ఆహారం, స్నేహితులతో సమయం గడపడం వంటి అలవాట్లు ఉంటే ఒత్తిడిని సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రతి రోజు చిన్న చిన్న మంచి అలవాట్లు పాటిస్తే జీవితంలో ఆనందం మరియు శాంతి పెరుగుతుంది.*