నేటి జీవిత సత్యం.
*"దేహంపైఉన్న ధ్యాసను చైతన్యంపై ఎలా నిలపాలి ?"*
*"అద్దంలో ప్రతిబింబం చూసుకునేప్పుడు మనకు ఆ అద్దంపై ధ్యాస ఉండదు.*
*అద్దాన్నే చూడాలనుకుంటే అందుకు మన ప్రతిబింబం అడ్డేమీ కాదు.*
*ప్రతిబింబంపై ఉంచిన ధ్యాసను అద్దంపైకి తెచ్చుకుంటే సరిపోతుంది.*
*అలాగే ప్రస్తుతం దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంగా ఉన్న 'అసలు నేనెవరు' అనే విచారణలోకి మార్చాలి.*
*కేవలం మంత్రజపం చేస్తూపోతే ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉండదు. మనలోనుండి ఆ జపాన్ని చేసేదెవరో గమనిస్తేనే సత్యం తెలుస్తుంది.*
*అంటే మనసుకు మూలంగా ఉన్న చైతన్యం తెలుస్తుంది.*
*ఇక్కడ గమనించటం అంటే మనసు చేసే మంత్రాన్ని, ఆ మనసే వినేంత శ్రద్ధగా చేయటం అన్నమాట !"
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment