Sunday, December 13, 2020

మీ మనసును ఖాళీగా ఉంచుకోండి

మీ మనసును ఖాళీగా ఉంచుకోండి


ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఒక ప్రసిద్ధ భిక్షువును చూడటానికి వెళ్ళాడు.

అతను నమస్కరించి, “నేను గొప్ప పండితుడిని. నేను అన్ని గ్రంథాలను చదివాను. ఇప్పుడు, నేను మెడిటేషన్
సంబంధించిన టెక్నిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు నేర్పండి.
"భిక్షువు మెడిటేషన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ప్రతి కొన్ని సెకన్లలో, ఆ ప్రొఫెసర్ భిక్షువు కి అంతరాయం కలిగించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు లేదా కొంత వ్యాఖ్య చేస్తాడు. ఇది కొంతకాలం కొనసాగింది.
త్వరలోనే, ఇది టీకి సమయం. భిక్షువు ప్రొఫెసర్కి టీ వడ్డించడం మొదలుపెట్టాడు.అతను కప్పును అంచు వరకు పోశాడు, కాని ఇంకా ఆగలేదు. కప్పు పొంగి ప్రవహించే వరకు టీ పోయడం కొనసాగించాడు మరియు టీ టేబుల్ క్రింద ప్రవహించడం ప్రారంభించింది.
“ఆపండి !” ప్రొఫెసర్ అన్నారు. "కప్పు నిండింది, దీనికి ఎక్కువ టీ ఉండకూడదు."
"ఈ కప్పు మాదిరిగానే, మీ మనస్సు కూడా చాలా సమాచారంతో పొంగిపోతుంది" అని భిక్షువు జవాబిచ్చాడు.
"మెడిటేషన్ నేర్చుకోవటానికి, మీరు మొదట మీ మనస్సును ఖాళీ చేసుకోవాలి . అప్పుడు మాత్రమే మీరు నేను చెప్పేది అర్థం చేసుకోగలరు .


ఆలోచనకు ఆహారం: మన సామాజిక పరస్పర చర్యలలో ఎంత అహం పాత్ర పోషిస్తుందో చూపిస్తుంది. మేము సలహా కోసం ఒకరి వద్దకు వెళ్ళినప్పుడు కూడా, మన ఆత్మవిశ్వాసాలు మరియు కోరికలు తమను తాము చూపించలేవు. మనం తరువాత ఏమి చెప్పబోతున్నాం అనే దాని గురించి ఆలోచిస్తూ ఇతరుల మాటలను ఎంత తరచుగా ట్యూన్ చేస్తాము ?


వినడానికి మొదటి అడుగు మనం మౌనంగా ఉండటం, మరియు మన మనస్సు రక రకాల అవగాహనలతో / సమాచారంతో నిండివునప్పుడు, క్రొత్తదాన్ని తీసుకోవడం చాలా కష్టం అని గ్రహించడి.


బుద్ధ భగవానుడు ఒక సారి ఆనందుడు తో ఇలా అన్నాడు

ఆనంద ఈ ప్రపంచంలో మనం మూడు రకాల వ్యక్తుల్ని చూడవచ్చు ఈ మార్గంలోకి వచ్చేవాళ్ళని

మొదటి వారు పూర్తిగా ఆహారం నిండిన పాత్రతో ఈ మార్గం లోకి వస్తారు వారికి ఇప్పుడు ఆహారం ఇచ్చిన ఆ పాత్రలో నిలబడదు.

రెండో రకం వారు ఆహారం లేని పాత్రతో వస్తారు గానీ వారి పాత్రలకు రంధ్రాలు ఉంటాయి , అందువల్లనే వారికి ఆహారమిచ్చినా కానీ వాళ్ల పాత్రలో నిలబడదు.

మూడో రకం వారు వారు రంధ్రాలు లేని పాత్రతో వస్తారు అందువల్ల వారికి ఎటువంటి ఆహారం ఇచ్చిన వాళ్లు ఆహారాన్ని తీసుకోవచ్చు


మొదటిరకం వారు వారు తమ ఆలోచనలతో ఆల్రెడీ రకరకాల దృష్టి కోణాల తో నిండి ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏమి సలహా ఇచ్చిన తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు.వారు వివాదాలతోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు, ఎందుకంటే వారి పాత్ర అంటే వారి మనసు రకరకాల ఆలోచనలతో నిండి ఉంటుంది , అలాంటి వారికి ఇప్పుడు ఎటువంటి ఆహారం ఇచ్చిన ఈ ధమ్మ
మార్గానికి సంబంధించి వారికి వృధా అవుతుంది.

రెండో రకం వారు వారు వారి పాత్రలు ఖాళీగానే ఉంటాయి కానీ వాళ్ల పాత్రలకి రంధ్రాలు ఉంటాయి,అంటే వాళ్ళు ధర్మం గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ దాన్ని పాటించకుండా శీల పాలన ,సమాధి భావన , విపశ్యన భావన , చేయడంలోసమర్థులు కాలేరు ,
అందువలన వారి పాత్రల్లో ఎటువంటి ఆహారం ఇచ్చినా కానీ ఆ రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళి పోతూ ఉంటుంది.
వీరు ధర్మం గురించి తెలుసుకుంటారు కానీ పాటించరు.

మూడో రకం వారు వీరు వారి పాత్రల్లో ఖాళీగా తెచ్చుకుంటారు కాబట్టి వారి పాత్రల్లో ఆహారాన్ని తీసుకోగలుగుతారు అదే విధంగా ఎటువంటి సందేహాలు లేకుండా ఈ ధర్మ మార్గాన్ని తెలుసుకొని దానిని వాళ్ళ జీవితాల్లోకి తెచ్చుకుంటారు ,శీల పాలన ,సమాధి భావన , విపస్సన భావన చేస్తూ వాళ్ళు ఈ మార్గాన్ని పూర్తి చేసుకుంటారు. అరహంతులు అవుతారు.

ఈ ధర్మ మార్గాన్ని నేర్చుకోవాలి అని అనుకునే వాళ్లు వాళ్ల మనసును ఖాళీగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ ధర్మాన్ని చక్కగా అభ్యాసం చేయగలుగుతారు.అందుచేత మన మనసుని ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోవటం అనేది ముఖ్యమైనది.


అందరూ సుఖంగా ఉండు గాక ,వారి స్వస్తి ముక్తిని పొంది గాక, దుఃఖం నుండి విముక్తి కలుగుగాక

భిక్షువుసిద్ధార్థ

Source - Whatsapp Message

No comments:

Post a Comment