Thursday, June 10, 2021

రాజుగారి భయంకరమైన కల

రాజుగారి భయంకరమైన కల👺

చాలా ఏళ్ళ క్రితం ఒక రాజుగారికి కలలో ఒక మహమ్మారి👹 అంటువ్యాధి వచ్చి,
"నీ రాజ్యంలోని ఒక 500 మంది జనాన్ని త్వరలో పొట్టన బెట్టుకోపోతున్నాను." అని బెదిరించింది

ఉదయాన్నే రాజు మంత్రులను పిలిచి రాజ్యమంతా అంటువ్యాధి గురించి దండోరా వేసి విస్తృతంగా ప్రచారం చేయించాడు. అయితే ఈ ప్రచారం మంచి చేయకపోగా, ప్రజల్లో భయాన్ని, ఆందోళననీ కలగజేసింది. మహమ్మారి రానే వచ్చింది. జనం పిట్టల్లా రాలిపోయారు.😳 అంటువ్యాధి తన పని ముగించుకొని పోతూపోతూ, రాజుగారి కలలోకి వచ్చింది. రాజు కోపంతో, "నీవు 500 మందిని చంపుతానని, 5,500 మందిని ఎందుకు బలి తీసుకున్నావ్."🤷‍♂️

"నిజానికి నేను 500 మందిని కబళించడానికే వచ్చాను. కానీ మీరు చేసిన ప్రచారం వల్ల భయాందోళనలతో మరో 5000 మంది చనిపోయారు." అంటూ మాయమైంది.

1.ఇటువంటి కఠిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా ఉండడం నేర్చుకోవాలి.👍
2. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటూ, రేటింగ్ కోసం అర్రులు చాచే మీడియాకు, వార్తలకు దూరంగా ఉండాలి.👎

3. నిర్లక్ష్యం ఒదిలి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి. తర్వాత జరిగేది జరుగుతుంది

4. భయాన్ని పారద్రోలి ఆనందంగా ఉంటూ, ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి.😁

5.పాజిటివ్ గా ఉండలేక పోవడం, వ్యాధి సోకుతుందేమోననే భయం, వ్యాధి సంక్రమణకు సగం కారణం.☹️

😁 పాజిటివ్ గా ఆలోచిస్తే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.👍. ఉండండి💪 ఆరోగ్యంగా ఉండండి🙏

మీ మానస సరోవరం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment