Wednesday, July 28, 2021

'విసుగుదల ' అనేది, ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయం....

'విసుగుదల ' అనేది, ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయం. అందుకే దున్నపోతులకి (జంతువులకి) విసుగు ఉండదు. అవి చాలా ఆనందంగా, సంతోషంగా కనిపిస్తాయి. విసుగు చెందేది మనిషి ఒక్కడే. మనిష్యులలో కూడా, ప్రతిభావంతులు, తెలివిగలవాళ్ళు మాత్రమే విసుగు చెందుతారు. మూఢమతులు విసుగు చెందరు. వారు ఉద్యోగాలు చేసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ, బ్యాంకులో ధనాన్ని పెంచుకుంటూ, పిల్లల్ని పెంచుతూ, కంటూ, తింటూ, సినిమాహాళ్ళల్లో కూర్చుంటూ, హోటళ్లకు వెళ్తూ, అందులో ఇందులో పాల్గొంటూ చాలా సంతోషంగా ఉంటారు. వారికి విసుగు ఉండదు. నిజానికి వారు ఇంకా మానవులు కాలేదు. మనిషి ఎప్పుడైతే, విసుగు చెందడం మొదలుపెడతాడో, అప్పుడే మానవత్వం గల మనిషి అవుతాడు. అత్యంత తెలివిగల శిశువు, అత్యంత విసుగు చెందే శిశువే..! బుద్ధుడు సంపూర్ణంగా విసుగు చెందాడు. గుర్తుంచుకో, ప్రపంచం చెడ్డగా ఉందని అతడు దానిని త్వజించలేదు. ప్రపంచంతో విసిగిపోయి అతడు దానిని త్వజించాడు. ప్రపంచం చెడ్డదీ కాదు, మంచిదీ కాదు. నువ్వు తెలివిగలవాడివి అయితే అది నీకు విసుగు కలిగిస్తుంది. మూఢమతివి అయితే ముందుకుపోవచ్చు. అల్ప విషయాలలో నీకు ఆసక్తి ఉంటుంది. చేసిందే చేస్తుంటావు. అలా చేస్తున్నావని కూడా నీకు తెలియదు.
'తెలివి' అంటే, ఉన్నవి ఉన్నట్లుగా చూడడం.

- ఓషో (ఆనందం)

Source - Whatsapp Message

No comments:

Post a Comment