Sunday, June 28, 2020

యముడు మానవుడిగా ఎందుకు జన్మించవలిసివచ్చింది?

యముడు మానవుడిగా ఎందుకు జన్మించవలిసివచ్చింది?

పూర్వం మాండవ్యుడు అనే మహాముని ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా ఆయన మౌనవ్రతం దీక్షలో ఉన్నాడు.

మునీశ్వరుడు ఆశ్రమానికి సమీపంలో ఒక రాజ్యం ఉంది.
అనుకోకుండా ఒకరోజు, రాజమందిరంలో దొంగలు పడ్డారు. వారు బంగారు నగలు విలువైన వస్తువులు దొంగలించుకుని పారిపోవడము కాపలవారైన
తలారులు వీరిని చూశారు.

రాజభటులు తో కలిసి వారిని వెంబడించారు, ఆ దొంగలు నగల మూటను తీసుకొని మునిగారి ఆశ్రమంలోకి ప్రవేశించారు. దొంగలు ధైర్యం ఏంటంటే మునీశ్వరుల ఆశ్రమంలోకి రాజభటులు రారు అని వారి నమ్మకం.
దురదృష్టం కొద్దీ దొంగలను తరుముకుంటూ వచ్చిన రాజభటులు దొంగల గురించి ఈ మునీశ్వరుని అడిగారు.

మాండవ్యుడు మౌన దీక్షలో ఉండడంచేత వీరు అడిగిన వాటికి సమాధానం ఇవ్వలేదు. అయితే రాజభటులు ఆశ్రమం అంత గాలించారు అక్కడ దొంగలు దొరికారు. వారితోపాటు నగల మూట కూడా లభించింది. రాజభటులు దొంగల ని నగలని పోతూ పోతూ మాండవ్యుని కూడా రాజుగారి వద్దకు తీసుకెళ్లారు రాజ్యసభలో జరిగిందంతా చెప్పారు.

వెంటనే రాజుగారు ఆ దొంగలకు మరణదండణ
విందించాడు. రాజభటులు చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ దొంగలను ఈ మునీశ్వరుడు ప్రోత్సహించి ఉంటాడేమో అని ఇతడిని కొర్రు వేయమని ఆదేశించాడు. కొర్రు అంటే ఒక ఒక పదునైన సండ్ర కొయ్యను భూమిలోకి పాతివుంచి
నేరస్తుడిని ఆ కొయ్య పైన వదిలేస్తారు ఆ కొయ్య అతడి శరీరంలోకి మలద్వారం ద్వారా శరీరంలోకి గుచ్చుకోని మెల్లగ కడపు లో నుండి కపాలం వరకు పైకి వెళుతుంది. అలా కొర్రు శిక్ష వేసిన వాడు ఒకటి రెండు రోజుల్లో చనిపోతాడు.

అయితే రాజుగారు కొర్రు శిక్ష వేస్తుంటే తనకే పాపం తెలియదని ఏ మాత్రం చెప్పలేదు. అలా శిక్ష వేయబడ్డ మాండవ్యుడు నొప్పి బాధను భరిస్తూ అతను మౌన దీక్షను కొనసాగిస్తున్నారు.

రాత్రి కాపలా కాస్తున్న తలారులు కొందరు శిక్ష వేయబడ్డ ఇతని ని గమనించారు ఆ సమయంలో కొందరు మునీశ్వరులు తపో సంపనులు పక్షుల రూపంలో వచ్చి ఇతని తో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా మరి రాజుగారు ఇంత పెద్ద శిక్ష వేశారు. ఇందులో నీ తప్పు ఏమి లేదని ఏందుకు చేప్పలేదు అని వారిని అడిగారు. వెంటనే మాండవ్యుడు ఇందులో రాజు గారికి తప్పు గాని రాజభటులు దోషం గాని దొంగల పొరపాటు గానీ ఏ మాత్రం లేదు. ఇది నా
పూర్వజన్మ కర్మ ఫలితం సమాధానమిచ్చాడు.

ఈ మహానుభావుడి లో ఎంత నిగ్రహశక్తి ఉంది అని వారు ఆశ్చర్యపోయారు. వీరి వద్ద నుండి సెలవు తీసుకొన్ని ఆ తప్పు సంపన్నులు వెళ్లిపోయిన తర్వాత, తళారులు అతన్ని గమనించారు ఉరిశిక్ష వేసి అప్పటికె రెండోరోజు గడుస్తుంది. సహజంగా సాదరణ మానవుడు అయితే ఇప్పటికే చనిపోవాలి. ఇతని ని చూస్తే కన్నుల్లో తేజస్సు ఏమాత్రం తగ్గలేదు.

ఈయన ఎవరు గొప్ప మహాముని అయి ఉంటాడు. ఏక్కడో ఏదో తెలియని పెద్ద పొరపాటు జరిగింది అని వెంటనే వెళ్లి రాజు గారికి సమాచారం ఇచ్చారు. రాజుగారు పొరపాటును మన్నించమని పరుగు పరుగున వచ్చి వేడుకొన్నాడు అప్పటికే కొర్రు వేయబడ్డ కొయ్య అతనికి మలమూత్రం ద్వారా శరీరంలోకి దిగిపోయింది.

వెంటనే రాజుగారు ఆ కొయ్యను కోయించారు. అయితే కొంత భాగం లోనే ఉండిపోయింది తన తప్పును మన్నించమని రాజుగారు వేడుకొన్నారు.
రాజు గారిని ఏమాత్రం ఒక మాట కూడా అనకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు మాండవ్యుడు.

మరికొంత కాలానికి మాండవ్యుడు దేశ సంచారం చేస్తూ అలాగే లోకాలన్నీ విహరిస్తూ యముని వద్దకు వెళ్ళాడు. యమధర్మరాజు తో జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేయవలసి వచ్చింది.
నేను చేసిన నేరం ఏమిటి అని అడగడం జరిగింది వెంటనే యమధర్మరాజు చిత్రగుప్తుడు
పిలిపించి ఇతని దోషం గురించి తెలియజేయండి అని చెప్పాడు.

విషయం ఏంటంటే మాండవ్యుడు చిన్నతనంలో అంటే ఐదు సంవత్సరాల వయస్సు లో ఉన్నప్పుడు తూనీగలు పట్టుకొని వాటి
తోకాలకు ఈతముల్లు ను గుచ్చేవాడు. ఆ కర్మ లో భాగంగానే ఇప్పుడు ఇతనికి ఈ శిక్ష వేయవలసి వచ్చింది అని చెప్పాడు.

మండ వీడికి బాధ కలిగింది యమధర్మరాజా 0-14 సంవత్సరాల లోపు వయస్సు ను బాల్యదశ గా పరిగణిస్తారు. ఆ వయసులో వారికి ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు.
నేను 5 సంవత్సరాల వయస్సు
అలా చేసాను, అది తప్పు అని నాకు అప్పటి కి తెలియదు.
తేలియక చేసిన తేలిసి చేసిన తప్పు తప్పుే ఓప్పుకుంటున్నాను. అలా చేయడం చాలా బాధాకరమే,
వాస్తవంగా ఆ తప్పు నాది కాదు, ఏందుకంటే నా తల్లతండ్రి నన్ను గమనించి దండించాలి అది వారి చేసిన పొరపాటు, ఇందులో నాది కూడా భాద్యత వుంది కాబట్టి శిక్షంచాలి. కాకపోతే చిన్న వయస్సు లో చేసిన తప్పు కావున చిన్న శిక్ష వేయలి, అంతేకాని ఇంత పెద్ద శిక్ష నాకు
వేయవడం మీకు దర్మం గా వుందా!...........

మానవతా దృక్పథంతో ఏ చిన్నపాటి శిక్ష వేసి ఉండొచ్చు కదా అని అనడం జరిగింది. దానికి యమధర్మరాజు ఏ సమాధానం చెప్పలేకపోయాడు.

బాధ కలిగిన మాండవ్యుడు ఓ యమధర్మరాజా మానవులు పడుతున్న బాధలు వాటి ఇతి వృత్తాంతాలు నీకు కూడా తెలియాలి.

ఏందకంటే ఇక్కడ ఉండి శిక్ష మాత్రమే అమలు చేస్తున్నావు నీవు ఇలా చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద శిక్షలు వేసే నీకు
ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోవాలసిన అవసరం వుంది. అంతే కాకుండా నాకు ఇంత పెద్ద శిక్ష వేసినందుకు గాను ఈ కర్మ ఫలితిని నువ్వు కూడా అనుభవించవలసి వుంది.

కాబట్టి భూమిపై ఒక శూత
గర్భమునందు మానవునిగా జన్మించి అన్నీ ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకో అని వెళ్ళిపోయాడు.

ఆ శాపం కారణం చేత యమధర్మరాజు మహాభారతంలోని
వ్యాసభగవానుడు సంకల్పం చేత దాసీ పుత్రుడు గా విదురుని గా జన్మించవలసిన వచ్చింది. స్వతహాగా ధర్మదీక్ష తెలిసినవాడే కావడంచేత మహాభారతంలో విదురుడు
ధర్మమూర్తిగా పేరుపొందాడు.

మహాభారతం మొత్తం ఏ మాట మాట్లాడినా అందులో న్యాయం ధర్మం మరియు సాంప్రదాయం ఆచారాలు కలిసి ఉంటాయి అందుకే ఇతని ధర్మ బుద్ధునికి విధురనీతి అని పేరు కూడా ఉన్నది.

మహాభారతం జరిగిన ప్రతి పరిణామం లోనూ ఇతడు సాక్షీభూతంగా ఉన్నాడు. కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు రాజ పాలకుడు అయిన తర్వాత ధృతరాష్ట్రుడు,
గాంధారి, కుంతిదేవి మరియు సంజయుడు తో కలిసి విదురుడు కూడా అడవులకు వెళ్ళాడు. అక్కడ తప్పోదిక్ష స్వీకరించాడు అలా కొంతకాలం గడిచిన తరువాత అడవులలో
తపోదీక్ష లో వున్న తమ వారు ఏలా వున్నరో అని వారిని చూడడానికి ధర్మరాజు తన పరివారంతో సమీపంలో ఉన్నటువంటి అడవులకు వెళ్లి గాలించాడు.

ధృతరాష్ట్రుడు,గాంధారి కుంతిదేవి తపస్సు చేసుకుంటూ కనిపించారు. వారి పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా ఉంది. బక్క చిక్కిపోయిన వారి శరీరాలను చూసి బోరున విలపించాడు.
మీతో పాటు సంజయుడు విదురమహాశేయుడు
కూడా వచ్చారు కదా వారు ఏరి ఏక్కడ అని అడిగాడు.
విదురుడు కూడా ఈ సమీపంలోని తప్పసు చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది.

అటు చూడగా ఏదురుగా వస్తు వున్న విధురుడు కనిపించాడు. ధర్మరాజు ను చూడగానే విధురుడు గాబ గాబ అడవి లో కి వెళ్లిపోయడు, విధురుడు తన నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తూ వున్నడు అని అర్థం అయింది.
ఆయను అనుసరించి ధర్మరాజు కూడా పరుగులు పెడుతు, ప్రాధేయపడ్డాడు.

విదురుడు శరీరం ఏముకల గూడు లా మారిపోయింది.
నిలబడ్డడానికి కూడా శక్తి లేక ఒక చెట్టు కొమ్మకు అనుకోని నిలబడ్డాడు. ధర్మరాజు అంజలి ఘటించి నిలబడిపోయాడు. మహాశయుడు తన కళ్లతో ధర్మరాజు కళ్ళల్లోకి చూస్తూ తనలో ఉన్నటువంటి ప్రాణవాయువును ధర్మరాజు శరీరంలో ఐక్యం చేశాడు.
ఏందకంటే ధర్మరాజు కూడా యమధర్మరాజు ఆంశా కాబట్టి.

కొంతసేపు అయిన తరువాత ధర్మరాజు విదురుని గమనిస్తే శరీరం నుండి ప్రాణం వేరుయింది అని అర్థమవుతుంది. అదే సమయంలో ధర్మరాజు శరీరంలో కూడా ఏదో ఒక కొత్త శక్తి వచ్చి చేరిందనిపిస్తుంది.

అంతలోనే తేరుకుని దర్మరాజు విదురమహాశేయునికి దహన సంస్కారాలు చేయను ఆరంబించాడు. ఏదో తెలియని ఒక అశరీరవాణి ధర్మరాజును హెచ్చరించింది ధర్మరాజా ఇతను సన్యాసి దీక్షలో ఉన్నాడు నువ్వు ఇతని శరీరాన్ని దహన సంస్కారాలు జరిపించడం అంత మంచిది కాదు అని వారించింది. అలాగే
ఈ మహానుభావుడు స్వియ శరీర దహనం చేసుకోగల శక్తి సంపన్నుడు అని సెలవు ఇవ్వడం జరిగింది. అలా మానవుడిగా జన్మించిన యమధర్మరాజు పాత్ర పూర్తి అయినది.

బాల్యంలో తెలియకుండా తప్పు చేసిన మాండవ్యుడు కి
కోర్రు శిక్ష వేశారు.ఆ శిక్షణ పొరపాటుగా అమలుపరచినందుకు యమధర్మరాజు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. మరి మనం చేసుకుంటున్న పాప కర్మలకు ఏన్ని జన్మలు ఎత్తి వలసి వస్తుందో, ఆ రుణాలు అన్ని ఏలా తీర్చుకోవాలో మనమే ఆలోచించుకుందాం.

ఎందుకంటే మునీశ్వరుల కైనా దేవుళ్ళ కైనా ఎవరికైనా కర్మ ఫలితాలు తప్పవు అని అర్థం అయింది. మరొక చిన్న ఉదాహరణ త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుండి చంపిన పాపానికి గాను ద్వాపరయుగంలో అదే వాలు బోయవాడి గా మారి శ్రీ కృష్ణ భగవానుని పై బాణం సంధించాడు ఆ బాధను కృష్ణభగవానుడు కూడా భరించాల్సి వచ్చింది. దేవదేవుడు అంతటివాడే కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు లేదు. మరి మానవమాత్రులమైన మనం ఎంత?

మరి ఇటు వంటి వాటికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా?

కర్మ ఫలితాన్ని తప్పించుకోలేం కానీ తగ్గించుకునే అవకాశం మాత్రం ఉంటుంది అని మన వేదాంతాలు చెబుతున్నాయి.

అది ఎలాగో అంటే కన్నవారి కి, అకలిన్నా వారికి అన్నం పెట్టటడం, సాటి ప్రాణులన్ని కూడా మనలాంటి వే అని బావించడం.విలైనంత ఏక్కువ గా దైవ నామ స్మరణ, దానం చేయడం వంటి ధర్మ సూక్ష్మాలను ఆచరించడం...

ఇది ఎలా మనల్ని రక్షిస్తుంది అంటే?

ఒక సర్పం కప్పను మింగేయాలి అని వెంట పడుతూ ఉంటే, ప్రాణ భయంతో కప్ప పరిగెడుతూ ఉంది. దాని వెంబడే పాకుతూ పోతున్న పాము ను ఆ సమయంలో పై నుండి గమనించిన గద్ద తన కాలుతో తను కు వెళ్ళిపోయినట్టు.
అక్కడ పరిగెడుతున్న కప్పె మానవుడైన కర్మజీవి వెంట పడుతున్న పామే మనం చేసిన కర్మలు పాపాలు, ఆ పాము ను కాలుతో తను కు పోయిన గ్రద్ద యే ధర్మమూర్తి అయినటువంటి గరుత్మంతుడు.

కాబట్టి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

Source - whatsapp message

No comments:

Post a Comment