Friday, June 26, 2020

పంచకోశములు

పంచకోశములు

👌 ఈ స్థూల శరీరానికి 5 శుక్ష్మ కోశాలు ఉంటాయి. వాటిని పంచ కోశాలు అంటారు.
1 . అన్నమయ కోశం
2.ప్రాణమయ కోశం
3. మనోమయ కోశం.
4.విజ్ఞాన మయ కోశం
5. ఆనందమయ కోశం.

ముందుగా అన్నమయ కోసం గూర్చి తెలుసుకుందాము.
ఈ అన్నమయ కోశం భౌతిక ఆహారం మీద ఆధారపడి .ఆ ఆహారం యొక్క గుణము మీద శరీర ఆరోగ్యం అనేది ఆ ఆహార తత్వం మీద ఆధారపడి ఉంటుంది.ఆహారం మూడు గుణాలు కలిగి ఉంటుంది. సాత్విక ఆహారం, రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం.
సాత్విక ఆహారం తాజా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు. వీటిని పచ్చిగా అన్నా తినవచ్చు, వండుకుని అన్నా తినవచ్చు. వండిన ఆహారం సుమారు రెండు గంటల లోపు భుజించిన దానిని సాత్విక ఆహారం. అందురు.
రజోగుణ ఆహారం. మసాలా దినుసులు కలిగిన ,మరియు కారం కలిగిన ,మాంసాహారం రజో గుణం కలిగిన ఆహారం.
తమోగుణ ఆహారం మాంసాహారం, నిల్వ ఉన్న ఆహారం తమోగుణ ఆహారం .

ఏవిధమైన ఆహారం తీసుకుంటే దానికి సంబంధించిన గుణాలు ఈ శరీరానికి వస్తుంది. దీని నుండి మనస్సు ప్రభావితం అవుతుంది.
సాత్వికాహారం తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
రజోగుణ ఆహారం తీసుకుంటే మనస్సు అలజడిగా ఉంటుంది.
తమోగుణ ఆహారము తీసుకుంటే మనస్సు, శరీరము కూడా అనారోగ్య స్థితికి చేరుకుంటుంది.

2. ప్రాణమయ కోశం.
ఇది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటుంది. పీల్చుకునే గాలి శుభ్రంగా ఉంటే శరీరము ఆరోగ్యముగా ఉంటుంది. అందుకు యోగా ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. ఆక్సిజన్ లోకూడా పూర్తి ప్రాణశక్తి అన్ని చోట్లా దొరకదు. ప్రకృతి మద్య వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. ముఖ్యముగా రావి, మర్రి, వేప ,తులసి వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. అందుకే దేవాలయములకు వెళ్లి అక్కడ ఉండే వృక్షముల చుట్టు ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది, అంటారు. పర్వతాల మధ్య ప్రాణ శక్తి దివ్యంగా ఉంటుంది. అందుకే తీర్థయాత్రల పేరిట కేదార్నాథ్, భద్రినాద్, హిమల పర్వత శ్రేణులు మద్య సంవత్సరానికి ఒక సారి ఐనా తిరిగి రమ్మంటారు.

3. మనోమయ కోశం.
ఇది మనస్సుపై ప్రభావం చూపుతుంది. తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో మనస్సు చాలా ముఖ్యం. మనసులోనే గమ్మత్తుమొత్తం ఉంది. నిరంతర బయట ప్రపంచం చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. దీనిని తీసుకుని వచ్చి అంతర్ముఖం చేస్తే అధ్బుతమైన ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది. అందుకే దినకి జంపం, ధ్యానము అలవాటు చేయాలి. గుఱ్ఱములను కల్లేము ద్వారా అదుపు చేయునట్లు మనస్సుకి సాధన అనే కళ్లెం వెయ్యాలి. అప్పుడు మనస్సు కి శాంతి లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యముగా ఉంటుంది. శరీరము ఆరోగ్యంగా ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు. అందుకే మనోమయ కోశం అత్యంత ముఖ్యమైనది.

4. విజ్ఞాన మయ కోశం.
ఇది మనస్సు తీసుకునే జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది. భౌతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞముపై అంచేస్తుంది. భౌతిక పరమైన ఆలోచన చేస్తే భౌతికంగా ఎలా ఏదగాలి అను దానిపై పెంచేస్తుంది. ఆధ్యాత్మికంగా ఆలోచన పెడితే దానిలో పరిజ్ఞానము. సంపాదిస్తుంది. నీ ఆత్మకు ఎదుగు దలకు పనికి వచ్చేది విజ్ఞానము.ఆత్మ ఎదుగుదలకు పనికి రానిది అజ్ఞానము. విజ్ఞానము అంటే జ్ఞానము పెంచునది.అని అర్థం. ఏ జ్ఞానము ఉండాలి అంటే నేను ఎవరు అని తెలుసుకునే జ్ఞానం విజ్ఞానం. ఇది తెలిస్తే జీవితంలో ఉండే కష్టాలు చెక్ పెట్టినట్లు.

5. ఆనందమయ కోశం.
క్రింద నాలుగు కోశాలు యొక్క శుభ్రత మీద ఆధార పడి ఉంటుంది. ఇది భగవంతునితో సమానమైనది. నిత్యం ఇది అనందమ్ కలిగి ఉంటుంది. సాధనతో మాత్రమే దీనిని గూర్చి తెలుసుకోగలం. ఎవరైతే నిత్యం భగవంతుని గూర్చి ఆలోచిస్తూ ఉంటారో వారీ కోశం లో ఆనందంగా ఉండగలరు.🌹

Source - whatsapp sandesam

No comments:

Post a Comment