Thursday, April 1, 2021

నేటి నీతికథ.

నేటి నీతికథ.
తెలివితేటలుంటే ఏదైన సాద్యమే అని మన తల్లీదండ్రులు అంటూవుంటారు.తెలివితేటలకు పెద్దవాళ్లు చిన్నవాళ్లు అని తేడా లేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్లను ఆశ్చర్య పరిచే ప్రతిభ ప్రదర్శిస్తుంటారు.


లింగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు.వారిలో ఒకరికి తన వ్యాపారం బాద్యతలు అప్పగించాలిని అనుకుంటున్నాడు సుబ్బయ్య.   అయితే ఇద్దరి కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని వారికీ వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులుకు ఒక పరీక్షపెడతాడు సుబ్బయ్య. అందులో ఎవరు నెగితే వారికీ వ్యాపారం బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.కొడుకులిద్దరకి కొంత డబ్బును ఇచ్చిన సుబ్బయ్య ఈ డబ్బుతో ఎవరైతే ఇంటినిపూర్తిగా నింపగల వస్తవులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.దీనితో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు.మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురుంచి 


అడిగి తెలుసుకున్నాడు. తండ్రి యించిన డబ్బుతో మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. 


రెండోకొడుకు  మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంత తెలివితేటలతో పూర్తిగా చేయాలని దీర్ఘంగా ఆలోచించాడు. చివరకి ఒక రూపాయని ఖర్చుచేసి ఒక కొవ్వతిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పరుచుకుంటుంది. దీన్ని చూసిన సుబ్బయ్య తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతోనింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికి వ్యాపార భాద్యతలను అప్పజెబుతాడు. సారిక ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరకి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు సుబ్బయ్య. తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు అలాగె తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు.నిజజీవితంలో చాలా మంది చదువు లేకపోయినా తెలివితో వ్యాపారం చేస్త్తున్నారు.....!!

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment