Monday, July 31, 2023

 *మనజీవితం కాలం విలువ*
🌹🌹🌹🌹🌹🌹🌹

ప్రతి మనిషికి ఒక భయం దిగులు ఉంటుంది..
 నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో..?
 నా భార్య పిల్లలకు దిక్కెవరు..?
 నా మీద ఉన్న బాధ్యతలన్నీ ఎవరు మోస్తారు ఎవరూ తీరుస్తారు..?

 ఈ ప్రశ్నలు ప్రతి మనిషిని వేధిస్తుంటాయి..

వాటన్నింటికీ సమాధానం కాలం..
మనం ఉన్నా లేకున్నా..
ఎవరికి ఇవ్వాల్సిన సమయం ఎప్పుడు జరగాల్సిన బాధ్యతలు అప్పుడు కాలం నెరవేరుస్తూనే ఉంటుంది.
ఈ టైంలో అమ్మాయికి పెళ్లి చేయాలి..
ఈ టైం లోపు అబ్బాయిని సెటిల్ చేయాలి..
ఈ టైం లోపు ఇది చేయాలి.. ఈ టైమ్ లోపు అది చేయాలి... అని ముందే లెక్కలు వేసుకుంటాం..

 కాలాన్ని మనం కంట్రోల్ చేయలేం..
 కాలమే అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది 
 కాలం ఒకరి సొంతం కాదు..
 కాలం ఎవరికోసం ఆగదు..
 కాలానికి ప్రపంచానికి మన కుటుంబానికి మనమేదో చేసేస్తున్నాం అనుకుంటాం.
 కానీ అన్నింటికి నడిపేది కాలం మాత్రమే..
కొన్నిసార్లు చిన్నపని కోసం ఎంత ప్రయత్నించిన అవదు, కానీ ఒక్కోసారి ఏ ప్రయత్నం లేకుండా గొప్ప విజయం వచ్చేస్తది. 

కాలం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తది. కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం. 

*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏
 *ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు మరియు సెల్ ఫోన్ చూసే వాళ్ళు, వారి కంటి చూపు కాపాడు కోవడానికి ఏమి చెయ్యాలి?*:-

మీరు కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం పని చేస్తుంటే, మీ కంటి చూపును కాపాడుకోవడానికి మీరు చేయగలిగే అనేక విషయాలు ఉన్నాయి:

*1.-తరచుగా బ్లింక్ చేయండి:* రెప్పవేయడం మీ కళ్ళను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే పొడి కళ్ళు ఒత్తిడి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రత్యేకించి మీరు ఎక్కువ సమయం పాటు స్క్రీన్‌ని చూస్తున్నప్పుడు తరచుగా రెప్పవేయడానికి ప్రయత్నం చేయండి.
*2.-విరామాలు తీసుకోండి:* స్క్రీన్‌ని చూడటం నుండి క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి గంటకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని మీకు గుర్తు చేయడానికి టైమర్‌ని సెట్ చేయండి మరియు మీ స్క్రీన్ నుండి దూరంగా చూసేందుకు మరియు మీ కాళ్లను సాగదీయడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి.
మీ స్క్రీన్‌ని సర్దుబాటు చేయండి: మీ కంప్యూటర్ స్క్రీన్‌ను స్క్రీన్ పైభాగం కంటి స్థాయి వద్ద లేదా కొంచెం దిగువన ఉండేలా ఉంచినట్లు నిర్ధారించుకోండి మరియు అది మీ కళ్ళకు చాలా దగ్గరగా లేదా చాలా దూరంగా ఉండదు. కాంతిని తగ్గించడానికి మరియు మీ కళ్లపై సులభంగా ఉండేలా చేయడానికి మీరు మీ స్క్రీన్ ప్రకాశాన్ని మరియు కాంట్రాస్ట్‌ను కూడా సర్దుబాటు చేయాలి.
*3.-యాంటీ గ్లేర్ స్క్రీన్‌ని ఉపయోగించండి:*
యాంటీ గ్లేర్ స్క్రీన్ మీ కళ్ళు బహిర్గతమయ్యే హానికరమైన నీలి కాంతిని తగ్గించడంలో సహాయపడుతుంది.
*4.-అద్దాలు ధరించండి:* మీరు ఇప్పటికే గ్లాసెస్ లేదా కాంటాక్ట్‌లను ధరించినట్లయితే, యాంటీ గ్లేర్ కోటింగ్‌తో కూడిన కంప్యూటర్ గ్లాసెస్‌ని పొందడం గురించి ఆలోచించండి. మీరు ఇప్పటికే అద్దాలు ధరించకుంటే, కంటి పరీక్ష చేయించుకుని, కంప్యూటర్ గ్లాసెస్ లేదా స్క్రీన్ వినియోగం కోసం రూపొందించిన ప్రత్యేక జత కాంటాక్ట్‌లను ధరించడం వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చా అని మీ వైద్యుడితో చర్చించండి.
మంచి భంగిమను పాటించండి: మంచి భంగిమ కంటి ఒత్తిడి మరియు మెడ మరియు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మంచి దిగువ వీపు మద్దతుతో కుర్చీలో కూర్చున్నారని మరియు మీ పాదాలు నేలపై చదునుగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

Anti reflective coating ఉన్న glasses వాడడం మంచిది. ఈ మధ్య 20-20-20 రూల్ గురించి విన్నాను. అంటే కంప్యూటర్ ముందు పని చేస్తున్నపుడు ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులను చూడటం మంచిదని. కనురెప్పలు వాల్చకుండ పని చేయడం మంచిది కాదు.

ఈ దశలను తీసుకోవడం ద్వారా, మీరు మీ కంటి చూపును రక్షించుకోవడంలో సహాయపడవచ్చు మరియు దీర్ఘకాలం స్క్రీన్ వినియోగానికి సంబంధించిన కంటి ఒత్తిడి లేదా ఇతర దృష్టి సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
 [7/30, 20:14] +91 88977 91635: *మరుగున పడుతున్న కొన్ని తెలుగు సామెతలు*:-

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
[7/30, 20:14] +91 88977 91635: 109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
210. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట.

భారతదేశం లో గురు ఋషిపరంపర గురించి MegaMinds ప్రచారం..

 *గురు పౌర్ణమి పురస్కరించుకుని భారతదేశం లో గురు ఋషిపరంపర గురించి MegaMinds ప్రచారం.. చదవండి శేర్ చేయండి*

*వేద వ్యాసుడి జీవిత విశేషాలు*
https://www.megamindsindia.in/2019/05/veda-vyasa-biography-in-telugu.html 

*వ్యాసుని జన్మ రహస్యం*
http://www.megamindsindia.in/2021/07/about-vyasa-purnima-in-telugu.html

*విద్యారణ్యస్వామి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/07/about-vidyaranya-swami.html

*శంకరదేవ్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/07/sankardev-assamese-story.html

*సంత్ జ్ఞానేశ్వర్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/07/sant-dnyaneshwar-biography-in-telugu.html  

*సంత్ తుకారాం జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/07/sant-tukaram-biography-in-telugu.html  

*సమర్థరామదాసు జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/07/samarth-ramdas-history-in-telugu.html  

*పురందరదాసు జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/07/purandaradasa-life-history-in-telugu.html

*శ్రీ రామకృష్ణ పరమహంస జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/02/ramakrishna-parama-hamsa-life.html

*యోగి అరవింద్ ఘోష్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2018/09/15-1947.html

*స్వామి దయానంద సరస్వతి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/02/swami-dayanand-saraswati-in-telugu.html

*నారాయణ గురు జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/01/narayana-guru-life-in-telugu.html

*స్వామివివేకానంద జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.*
https://www.megamindsindia.in/2019/01/swami-vivekananda-life-in-telugu.html

*కపిల మహర్షి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/04/about-kapila-maharshi-in-telugu.html

*కణాదుడి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/04/about-kanaadudu-biography.html

*వరాహమిహిరుడి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/04/varahamihira-history-in-telugu.html

*సుశ్రుతుడి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/04/sushruta-life-story-in-telugu.html

*చరకుడి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/04/charaka-biography-in-telugu.html

*భాస్కరాచార్యుడి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/04/bhaskaracharya-biography-in-telugu.html

*రమణ మహర్షి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/05/ramana-maharshi-life-history-in-telugu.html

*నారద మహర్షి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/05/narada-maharshi-story-in-telugu.html

*కబీర్ దాస్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/06/kabir-das-biography-in-telugu.html

*దదీచి మహర్షి జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/07/about-dadhichi-maharshi-in-telugu.html

*సంత్ రవిదాస్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/07/sant-ravidas-biography-in-telugu.html

*నర్సీ మెహతా జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/07/about-narsinh-mehta.html

*తులసీదాస్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/07/about-tulasidas-in-telugu.html

*గురునానక్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/07/about-guru-nanak-life-in-telugu.html

*గురు గోవింద్ సింగ్ జీవితవిశేషాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి*
https://www.megamindsindia.in/2019/07/about-guru-gobind-singh-in-telugu.html

*ఇలాంటి గురు పరంపర భారతదేశం లో తప్ప మరెక్కడాలేదు అందరమూ తెలుసుకుని ముందుతరాలకు అందిద్దాం.. గర్విద్దాం ఓం గురుభ్యోనమ:*
*సూర్యనమస్కారాలు ఎలా చేయాలి మరియు ఎన్ని చేయాలి*
https://www.megamindsindia.in/2019/05/21-about-surya-namaskar-in-telugu.html  

*యోగము అంటే ఏమిటి - అంతర్జాతీయ యోగా దినోత్సవం*
https://www.megamindsindia.in/2021/06/about-yoga-in-telugu.html#gsc.tab=0

*పతంజలి మహర్షి అష్టాంగ యోగా గురించి పూర్తి వివరాలు*
https://www.megamindsindia.in/2020/06/what-is-ashtanga-yoga-in-telugu.html#gsc.tab=0

*జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యమ నియమాల గూర్చిన విశ్లేషణ*
https://www.megamindsindia.in/2021/06/ashtanga-yoga-yam-niyam-in-telugu.html#gsc.tab=0

*యోగ ముద్రలు - అంతర్జాతీయ యోగా దినోత్సవం*
https://www.megamindsindia.in/2021/06/about-yoga-mudra-in-telugu.html#gsc.tab=0

*యోగనిద్ర ఎలా చేయాలి.. యోగ నిద్ర ఉపయోగాలు*
https://www.megamindsindia.in/2021/06/yoga-nidra.html#gsc.tab=0

*యోగాసనాలు చేసే ముందు సూక్ష్మ వ్యాయామం చేయాలా?*
https://www.megamindsindia.in/2021/06/international-yoga-day-2021.html#gsc.tab=0

*తాడాసన్, అర్థకటి చక్రాసన్, అర్దచక్రాసన్ యోగాసనాలు నేర్చుకుందాం*
https://www.megamindsindia.in/2021/06/yogasanalu-telugu.html#gsc.tab=0

*త్రికోణాసన్‌, పరివృత త్రికోణాసన్‌, పార్శకోణాసన్ యోగాసనాలు నేర్చుకుందాం*
https://www.megamindsindia.in/2021/06/trikonasan-parivritatrikonasan-parswakonasan.html#gsc.tab=0

*జీర్ణశయం సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/05/june-21-yoga-day-asanas-for-gastric.html 

*కీళ్ళనొప్పుల సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/05/yoga-asanas-for-joint-pains.html

*యోగా ప్రాణాయామం ఎలా చేయాలి?*
https://www.megamindsindia.in/2019/05/pranayam-and-asanaas.html

*ఆస్థమా సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/05/yoga-asanaas-for-asthama-cure.html

*గుండె జబ్బులకు సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/05/yoga-for-heart-disease.html

*అధిక బరువు సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/06/yoga-for-weight-loss.html

*నిద్ర సంబందిత రోగాల కు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/06/yoga-for-sleeping-well.html

*షుగర్ సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/06/yoga-for-diabetes-in-telugu.html

*థైరాయిడ్ సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/06/yoga-for-thyroid-control.html

*నడుము నొప్పి  సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/06/yoga-for-back-pain.html

*క్షయ సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/06/yoga-for-tuberculosis.html

*ఒత్తిడిని ఎలా అధిగమించాలి*
https://www.megamindsindia.in/2019/06/stress-management-skills.html

*రక్త పోటు సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*
https://www.megamindsindia.in/2019/06/yoga-for-blood-pressure-bp.html

 ఆరోగ్య భారత్ సమర్థ భారత్*
 *చెట్టును* నరికేయడం చాలా *సులభం* కానీ  అదే చెట్టు *పెరిగి, పెద్దది* కావాలంటే *జీవితకాలం* పడుతుంది. అలాగే *కోపంతో* ఒక *మాట* అనేయడం చాలా *సులభం*  కానీ *క్షణ* కాలంలో *జారే* ఆ మాట ఒక *బంధాన్ని* తెంచేస్తుంది...!!
********************************
    గుణం లేని వారు *కులం* గొడుగు పడతారు మానవత్వం లేని వారు *మతం*  ముసుగు వేస్తారు పని లేని వారు *ప్రాంతాల* ఊసెత్తుతారు జనులంతా ఒక *కుటుంబం* జగమంతా ఒక *నిలయం* .
********************************
   మౌనం *మనస్సు* ని  శుద్ధి చేస్తుంది. స్నానం *దేహాన్ని* శుద్ధి చేస్తుంది. ధ్యానం *బుద్ది* ని శుద్ధి చేస్తుంది. ప్రార్థన *ఆత్మ* ను శుద్ధి చేస్తుంది దానం *సంపాదన* ను శుద్ధి చేస్తుంది ఉపవాసం *ఆరోగ్యాన్నీ* శుద్ది చేస్తుంది. అలాగే క్షమాపణ *సంబంధాల* ను శుద్ది చేస్తుంది.
********************************
 నీ గురించి *పదిమంది* గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు *వందమంది* గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి *సత్యం* వైపు నీవుండాలను కుంటే *ఒంటరిగా* మహావృక్షంలా నిలబడడానికి *సిద్ధంగా* ఉండాలి ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి *విత్తనం* లాగా పడిపోవాలి.
   *NANNAKA's*

మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో - నిర్ణయం మనదే!

 🙏🙏🙏🙏

*మానవ జన్మ..!?*
------------------------------------               

*భగవంతుడు ప్రసాదించిన - మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో - నిర్ణయం మనదే!*

*సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.*

*ఆ పదకొండులో....*

*1. అయిదు జ్ఞానేంద్రియాలు,*

*2. అయిదు కర్మేంద్రియాలు,*
      *మనసు ఉన్నాయి.*

*1. శ్రోత్రం (చెవి),*
*2. త్వక్‌ (చర్మం),*
*3. చక్షుషీ (కన్నులు),*
*4. జిహ్వా (నాలుక),*
*5. నాసికా (ముక్కు) అనేవి*
     *జ్ఞానేంద్రియాలైతే,*

*1. పాయు (మలద్వారం),*
*2. ఉపస్థ (మూత్రద్వారం),*
*3. హస్త (చేతులు),*
*4. పాద (కాళ్లు),*
*5. వాక్‌ (మాట) అనేవి* 
     *కర్మేంద్రియాలు.*

*ఈ పదింటికి చివర మనసు.*

*ఇదీ ఇంద్రియ సమూహం.*

*ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి.*

*ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి.*

*ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.*

*ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.*

*1. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.*

*2. చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.*

*3. కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.*

*4. నాలుక అనారోగ్యకరమైన*
      *రుచులను కోరుతుంది.*

*5. ముక్కు దుర్గంధాలనే*
     *స్వీకరిస్తుంది.*

*6. మల, మూత్రద్వారాలు*
      *పనిచేయకుండా పోతాయి.*

*7. కాళ్లూ చేతులూ హింసను*
      *ఆచరిస్తాయి.*

*8. మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,*

*9. ‘మనసు‘ అనే పదకొండో                  ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.*

*అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే. మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.*

*అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.*

*చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం.*

*ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే. అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు.*

*ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు. కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం. లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి. ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు.*

*ఇంద్రియాల్లో     ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి.*

 *పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.*

*ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం.  అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.*

*మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది... ’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి.*
*అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’.*

*ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*

*అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే!*
          
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

*_నేటి మాట_* *దైవానుగ్రహం...!!*

 *_నేటి మాట_*

             *దైవానుగ్రహం...!!*
మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది...

తల్లి కడుపులో చిన్న వీర్యపు బిందువుగా మొదలైన మన జీవితం తొమ్మిది నెలల్లో చక్కని రూపుదిద్దుకోవడం మనకు అనుగ్రహంగా కనిపించటంలేదు.
పుట్టినప్పుడు జానెడు పకందుగా ఉండి ఆ తర్వాత ఆరడుగులు పెరగడంలో ఆశ్చర్యం కలగటంలేదు. 

కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక వస్తువు సృష్టించారని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాం. 
మనం అనుభవించటం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది. 
మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే...

గులాబీ మొక్క నాటి నీళ్ళు పోస్తే, పువ్వు సిద్ధమవుతుంది. కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు. 

మామిడిపండులోని తియ్యదనం అంటే ఇష్టపడతాం. 
అది మనకు లభించటాన్ని అనుగ్రహం అంటాం. 
పండులో తియ్యదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో టెంకె నాటినప్పుడే ఉంది. 

రుచికరమైన వంటచేసి పెట్టినవారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తాం...
కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహాన్ని మనం గుర్తించం, మనం తినేది , అనుభవించేది, అంతా దైవానుగ్రహంగా భావించాలి,

ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతుంటే.. 
కొంత మంది మాత్రం పరిమిత ఫలాల్ని ఆశించి అవి నెరవేరటాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేసుకుంటారు... అది చాలా అజ్ఞానం ...

                *_🌺శుభమస్తు🌺_*
  🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

Saturday, July 29, 2023

Meditation is not meditation on breath

 Meditation is not meditation on breath, but meditation on breath to reach a state of no breath and no thoughts... In that state the breath moves up and down from the root to the sahasrara... Then the seven chakras are stimulated one after the other from the root... Then by the activation of the third eye also, trikala jnanam, vijnana, self-knowledge is obtained...the word becomes a mantra

Tuesday, July 25, 2023

గ్రాటిట్యూడ్ మెడిటేషన్

 *గ్రాటిట్యూడ్ మెడిటేషన్*
హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్.
*చక్కటి చిరునవ్వుతో ఇష్టంగా కూర్చుందాం.*
ముందుగా మనకి ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనసా, వాచా, కర్మణా కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*ఎప్పటికప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురువు లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
మనకి కంటికి కనిపించక పోయినా, మనకి ఎంతో సహాయం చేస్తూ, మనల్ని సత్యమార్గం వైపు నడిపిస్తున్న మన గైడ్ మాస్టర్స్ కి, దివ్యలకు, మన పూర్ణాత్మకి, మన సబ్కాన్షియస్ మైండ్ కి, మనలో ఉన్న దైవత్వానికి ఎప్పటికప్పుడు కృతజ్ఞత కలిగి ఉందాం.
*ఈ ప్రకృతికి, పంచ భూతాలకి, సూర్య చంద్రులకి, నక్షత్రములకి, ఈ విశ్వాన్ని నడిపించేటటువంటి సకల దేవతలకు, కర్మ దేవతలకు, ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
ప్రతిరోజు మనం అనేక జీవజాతుల మీద ఆధారపడి జీవిస్తున్నాము.
*వృక్షజాతికి, పక్షి జాతికి, జంతు జాతికి, క్రిమి కీటక జాతికి, ఈ విశ్వంలో ఉన్న సకల జాతులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
మన దేహానికి, మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క భాగానికి, ప్రతి ఒక్క అణువు అణువుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*ఎంతటి భాగ్యమో కదా.*
ప్రతిరోజు అమృతతుల్యమైన ఆహారాన్ని పొందుతున్నాము.
*ఈ ఆహారం మన వరకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
మనకి ప్రతి విషయంలోనూ సహకరిస్తున్న మన కుటుంబ సభ్యులకి,
బంధువులకి, స్నేహితులకి, అనేక అనుభవాలు నేర్పుటకై మనకు తారసపడిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*మనం ప్రతిరోజు అనేక వస్తువులను ఉపయోగిస్తున్నాం.*
మనం ఉపయోగిస్తున్న చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*మనకు అవసరమైన అవసరమైనటువంటి పరిస్థితులను, ఎప్పటికప్పుడు సహాయాన్ని అందిస్తున్న విశ్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలుపుకుందాం.*
ఈ భూమి అనే భౌతిక మాయ ప్రపంచంలో ఎటువంటి భౌతిక మాయలో పడకుండా ప్రతిరోజు చక్కని సత్యవాక్కులు వినడానికై మనల్ని ప్రేరేపిస్తున్న మనలోని సంకల్ప శక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*ఎప్పటికప్పుడు దైవ నియమాలకు అనుగుణంగా, ధర్మబద్ధంగా, చక్కటి ఆనందకరమైన, ప్రశాంతమైన జీవితం వైపు నడిపిస్తున్న, చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తున్న మనలో ఉన్న దైవత్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉందాం.*
ఎంతటి భాగ్యమో కదా.
*మన తప్పులను క్షమించి, మన కర్మల నుండి మనలని విడుదల చేసిన ఆత్మస్వరూపులకి కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
ఎంతటి భాగ్యమో.
*భగవంతుని శక్తి ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రవహిస్తూ, వారిలో ఉన్న దివ్యత్వము మేలుకొలుపుతూ, ప్రతి ఒక్కరూ ధ్యానులై, శాఖాహారులై, అహింసాయుతులై, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ప్రేమ పూర్వకమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందుదురు గాక.*
ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులై, బ్రహ్మజ్ఞానులై, వారి వారి నైపుణ్యతను మేలుకొలుపుకొని విశ్వంలో వారు పోషించవలసినటువంటి పాత్రను అద్భుతంగా పోషిస్తూ, ఈ భూమిని అద్భుతమైన దివ్యసీమగా ఉంచుదురుగాక.
*నాకు ఏవిధమైనటువంటి లోటు లేకుండా ఎల్లప్పుడు నేను పొందుతున్నటువంటి సకల సంపద, సమృద్ధి శక్తులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉంటున్నాను.*
లోక సమస్త సుఖినోభవంతు.
*సర్వేజనా సుఖినోభవంతు.* 
లోక సమస్త సుఖినోభవంతు.
*సర్వేజనా సుఖినోభవంతు.* 
లోక సమస్త సుఖినోభవంతు.
*సర్వేజనా సుఖినోభవంతు.*
తధాస్తు, తధాస్తు, తధాస్తు.
థాంక్యూ ఫ్రెండ్స్.
*చక్కగా మన అర చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం.*
 5, 4, 3, 2, 1, 0
 *వెరీ గుడ్ ఫ్రెండ్స్*

Monday, July 24, 2023

అహం నశిస్తే, ఆత్మ ప్రకాశిస్తుంది

 *అహం నశిస్తే, ఆత్మ ప్రకాశిస్తుంది*

అహంకారం మూడు విధాలు. 'అహం' వేరు... 'అహంకారం' వేరు. 'అహం' అనే సంస్కృత పదానికి తెలుగులో 'నేను' అని అర్థం. మరి ఆ 'అహం' వచ్చి 'ఆకారం'తో చేరితే... అది "అహంకారం" అనబడుతుంది. అహం రావడం ఏంటి? ఆకారంతో వచ్చి చేరడం ఏంటన్న ప్రశ్న పడవచ్చు. అంటే అర్థం.... 'నేను' అనేది ఒక భావన. నా యొక్క ఉనికికి 'నేను' అని పేరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే, నా యదార్థ అస్తిత్వమే నేనన్నమాట. ఈ నేను అనుదానికి ఎట్టి ఆకారము లేదు. అది నిరాకార స్వరూపం. ఇది దేని యొక్క ఆధారం లేకుండా తనకు తానుగా వున్నప్పటికీ, 'నేను' అనునది ఈ సర్వానికీ ఆధారంగా వున్నదని తెలియక, ఏదో ఒక ఆకారమే నేను అని, ఈ 'నేను'ను పరిమితం చేయడమే 'అహంకారం' అంటే. అంటే ఏ ఆకారం లేకుండా అపరిమితంగా, అనంతంగా, తనకు తానుగా వున్న 'నేను'ని.... పరిమితమైన, ఖండమైన, వ్యయం చెందేటువంటి శరీర, ప్రాణ, మనో, బుద్ధులకు ఆపాదించడమనేది ఒక రకంగా అహంకారం అనబడుతుంది. కాగా వేదాంతంలో 'అంతఃకరణ చతుష్టయం'గా చెప్పబడే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములలో నాలుగవది ఇది. 

ఈ శరీర ప్రాణ మనో బుద్ధుల సంఘాతాన్ని కలిపి ఉపాధి అంటారు. శరీరాన్ని స్థూల ఉపాధి అని, ప్రాణ మనో బుద్ధులను కలిపి సూక్ష్మ ఉపాధిగా చెబుతుంటారు. అయితే... ఏ ఉపాధిని నేను అని భావించినా అది 'అహంకారం' క్రిందకే వస్తుంది. 'యద్భావం తద్భవతి' అంటే అర్థం ఇదే. 'ఎవరెట్లు భావిస్తారో, వారిని అట్లే బంధిస్తుంది'. 'శరీరమే నేను' అని అనుకునే వారికి జనన మరణాల చేత, ప్రాణమే నేను అనుకునేవారికి ఆకలి దప్పులు, 'మనసే నేను' అని భావించే వారికి శోక, మోహాలు ఇలా ఒక్కో ఉపాధి నేనుకు ఒక్కొక్క రకమైన పరిమితి వుందన్నమాట. అంచేత ఉపాధి సంగత్వం (ఉపాధి నేను అనే భావం) లేని మహనీయులను నిరహంకారులుగా పిలువబడుతారు. 

ఇప్పుడు ఇది ఎన్ని విధాలుగా వుంటుందో గమనిద్దాము.

1. తమో గుణ అహం, 2. రజోగుణ అహం, 3. సత్వగుణ అహం అని అహాన్ని మూడు విధాలుగా చెప్పుకోవచ్చు.

తమోగుణ అహం అంటే... "నాకు నచ్చినట్లే జరగాలి, అంతా నా ఇష్టం, నాకు తోచినట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను...." అనేవిధమైన వైఖరి కలిగినది తమోగుణ అహం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దీనినే రాక్షస ప్రవృత్తి అనవచ్చు. తమ అహం చాటుకోవడానికి, నిలుపుకోవడానికి విధ్వంసకరమైన, హింసతో కూడిన, పచ్చి స్వార్థంతో ప్రవర్తించడానికి, ఆ విధమైన కార్యకలాపాలు చేయడానికి ఈ అహమే మూలకారణం.

రజోగుణ అహం అంటే... ఈ అహం వున్నవారిలో కూడా స్వార్థం వుంటుంది కానీ అది పూర్వం మాదిరి నెగిటివ్ గానే వుండాలని లేదు. ఈ రజోగుణ అహం వున్నవారు కూడా కాస్తంత మధ్యస్త వైఖరి కలిగి వుంటారు. అంటే తమకు అనుకూలంగా వున్నవాటిని అందలమెక్కిస్తారు, ప్రతికూలమనిపిస్తే కూలదూస్తారు. ఈ అహం ప్రభావం చేత.... తమ అహాన్ని చాటుకునేందుకు లోకహిత కార్యక్రమాలను సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. అటు దైవీ లక్షణాలను, ఇటు ఆసురీ లక్షణాలను తమకు అనూకూలమైన విధంగా వ్యక్తపరచటం ఈ రజోగుణ అహంతో వున్నవారి నైజం. 

ఇక మిగిలినది సత్వగుణ అహం. అసలు సత్వగుణాన్నే 'బంగారు సంకెళ్ళు' అని అభివర్ణిస్తుంటారు. అయితే మిగితా రెండు అహాలకంటే ఇది కాస్తంత మెరుగు, ఇంకా శ్రేయోదాయకమైనది కూడా. సత్వగుణ అహం అనేది మానవుని యందు దైవీ లక్షణాలైన ప్రేమ, దయ, కరుణ, శాంతి, సహనం, క్షణ వంటివి పెంపొందేలా చేసుకుని... తదనుగుణమైన విధంగా జీవనశైలిని అవలంబించేలా, పుణ్యాభిలాషను, జ్ఞానాభిలాషణతో కూడిన వర్తనం ఈ రకమైన అహం వున్నవారిలో కనిపిస్తుంది. 

అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే గాంధీ గారు చెప్పినట్లు, "అహం నశిస్తే, ఆత్మప్రకాశిస్తుంది". ఈ వాక్యం కేవలం లౌకికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అక్షర సత్యం. మానవులు పెద్దలను ఆశ్రయించి, వారి బోధలను అనుసరిస్తూ జీవనాన్ని సాగించుట ద్వారా, క్రమంగా భక్తి భావంతో మెలగి, క్రమంగా తమయందలి భక్తి భావాన్ని, దైవీ లక్షణాలను వృద్ధి చేసుకుని... క్రమంగా సాధకులుగా పరివర్తన చెంది, ఆపై అను నిత్యం స్వాధ్యాయం చేయాలి. 'నేను ఇప్పుడు ఏ నేనుగా వున్నాను?' 'నాలో ఇప్పుడు ఏ అహం పనిచేస్తుంది?' 'ఇవాళ ఫలానా పనిలో నేను వ్యవహరించిన తీరు, నాలోని ఏ అహాన్ని ప్రతిబింబిస్తుంది?' అంటూ విచారణ చేస్తూ, స్వ అధ్యయనం చేయాలి. దీనినే 'ఆత్మ విమర్శ' అంటారు. 

ఇలా చేసినప్పుడు, వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించుట చేత, ఏ అహం యొక్క వ్యక్తత అలా పనిగా మారినదో తెలుస్తుంది మొదట. అలా తెలిసిన తరువాత ఏ అహంతో వున్నప్పుడు ఆ పని సజావుగా జరిగింది? ఇదే పనిని తమస్సుతో కాక సత్వంతో చేస్తే, తేడా ఏం కనిపించింది? అంటూ... విచారణను వృద్ధి చేస్తే... క్రమంగా మనకు ఏ అహం ఎప్పుడు ఎలా పనిచేస్తున్నదనేది స్పష్టంగా తెలియడంతో పాటుగా... రజో తమో అహాలను నిరసిస్తూ... సత్వగుణ అహంతో వ్యవహారం నడుపుతూ... ఆంతర్యంలో అభావంగా వుంటూ... వ్యష్టి చైతన్యమైన 'జ్ఞాత' వుండే అవకాశం లభిస్తుంది. అలా వ్యష్టి చైతన్య స్థితిలో నిలిచిన సాధకుడు, సర్వకాల సర్వావస్థలలోనూ తన స్థితిని నిలుపుకున్నట్లయితే సమిష్టి చైతన్యంలోకి అడుగిడి 'బ్రహ్మ స్థితి'ని అందుకోగలుగుతాడు. అప్పుడు అతడు అఖండ అద్వయ స్వరూపమే  తానుగా నిలుస్తాడు. ఆ అనుభూతితో వ్యవహారంలోకి వస్తుండడం చేత, వ్యవహారం అతడిని ఎన్నటికీ బాధించదు.

Friday, July 14, 2023

ఇదివో సంసారమెంత సుఖమో కాని* *తుదలేని దుఃఖమను తొడవు గడియించె..* తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన

[7/14, 00:11] +91 93902 09144: *ఇదివో సంసారమెంత సుఖమో కాని*
*తుదలేని దుఃఖమను తొడవు గడియించె..*

తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన

గానం. సత్తిరాజు వేణుమాధవ్ గారు
రాగం. భూపాళం 

రేకు: 50-5
సంపుటము: 1-308
రేకు రాగము: శ్రీరాగం

ఇదివో సంసారమెంత సుఖమో కాని
తుదలేని దుఃఖమను తొడవు గడియించె

పంచేద్రియంబులను పాతకులు తనుఁ దెచ్చి
కొంచెపు సుఖంబునకుఁ కూర్పఁగాను
మించి కామంబనెడి మేఁటి తనయుండు జని-
యించి దురితధనమెల్ల గడియించె

పాయమనియెడి మహాపాతకుఁడు తనుఁ దెచ్చి
మాయంపు సుఖమునకు మరుపఁగాను
సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ
బోయి యీ నరకమను పురము గడియించె

అతిశయుండగు వేంకటాద్రీశుఁడను మహా-
హితుఁడు చిత్తములోన నెనయఁగాను
మతిలోపల విరక్తి మగువ జనియించి అ-
ప్రతియయి మోక్షసంపదలు గడియించె

*ఇదివో సంసారమెంత సుఖమో కాని*
*తుదలేని దుఃఖమను తొడవు గడియించె..*

భావము :

- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

     కొన్ని అన్నమయ్య కీర్తనలు వేదాంతం నేర్పితే కొన్ని వైరాగ్యాన్ని రుచి చూపిస్తాయి. ఇవి అంత తేలికగా అర్ధం కావు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అనే పంచేద్రియాలు పాపాత్ముల స్నేహం వలన మనిషి సంసారమనే దానితో  భోగిస్తే 'కామము', 'మోహము' అనే కొడుకులు పుట్టారట. వాళ్ళవల్ల నాశనమై, వేంకటపతి దయ వలన భక్తి అనే కూతురు పుట్టి మోక్షం దారిలో పడ్డాడంటున్నారు అన్నమయ్య.
[7/14, 00:11] +91 93902 09144: ఇదివో ప్రజలారా! సంసారమంటే ఎంత సుఖమో కాని, అది చివరికి దుఃఖములనే ఆభరణములు పెట్టుకొన్న ఆడది అని గ్రహించండి.

1. మనిషి అటుపైన పంచేద్రియములు (చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము) అను పాపాత్ముల స్నేహము వలన స్వల్ప శారీరక సుఖానికి ఆశపడితే 'కామము' అనే కొడుకు జన్మించాడు. వాడు ధనసంపాదన అనే వ్యసనం అలవాటు చేసి చివరికి పాపము అనే ధనం మూటగట్టాడు. అధోగతిబట్టాడు, మనిషి.

2. ఆ తరువాత ప్రాయము (యవ్వనం) అనే పాపాత్ముడి స్నేహం కలిసి మాయ అనే సుఖముతో రమించి 'మోహము' అనే కొడుకు పుట్టాడు. ఇంకా దుర్మతి వీడు. ఈ మనుష్యుడి  సుగుణాలనన్నిటినీ చెడగొట్టి నరకము అనే నగరాన్ని కొని వాళ్ళ నాన్నకు (అంటే మనిషికి) బహుమతిగా ఇచ్చాడు. చివరికి ఆ పట్నం లో దారి తప్పి భ్రష్టుడయ్యాడు మనుష్యుడు.

3. చివరికి ఆ వేంకటేశ్వరుడికి ఈ మానువుడిపై జాలి కలిగి ‘విరక్తి' అనే మంచి కుమార్తెను పుట్టించి దయ చూపాడు. వాడి మనస్సులో అప్రతిహతమైన మోక్షమనే సంపదపై ధ్యాసకలిగించి వాడికి మోక్షమును ఆ విరక్తి అనే కూతురు సంపాదించి ఇచ్చింది. లేకపోతే వాడిగతి అధోగతే.


Wednesday, July 12, 2023

మిత ఆహారం-మిత వ్యవహారం

 మిత ఆహారం-మిత వ్యవహారం

ఏడంతస్తుల మేడ కట్టాడు గురునానక్ శిష్యుడొకడు...
గృహప్రవేశానికి గురువును ఆహ్వానించాడు...
గురువును ఘనంగా సత్కరించాడు శిష్యుడు...

గురువు తిరుగుప్రయాణమౌతూ, తన జోలెలో  దాచి ఉంచిన చిన్న సూదిని శిష్యుని చేతిలో పెట్టి, "నాయనా...మనం పరలోకంలో కలుసుకున్నప్పుడు ఈ సూదిని తిరిగి నాకివ్వు" అంటాడు.

శిష్యుడు ఆశ్చర్యపోతూ-
"గురువుగారూ...అదెలా సాధ్యం...!!" అంటాడు.

"ఏడంతస్తుల మేడను నీతోపాటే పరలోకానికి తెచ్చుకోగాలేంది... నా చిన్నసూదిని తేలేవా?" అంటాడు గురువు.

అంతే... గురుబోధ అవగతమైంది శిష్యుడికి.

* * * 

పుచ్చిన వక్కయినా మన వెంటరాదు...అంటాడు రామదాసు...

* * *

నీవు పోతే అసలు ప్రపంచమే ఉండదు...
అంటారు మా గురుదేవులు...

* * *

ఇలాంటి కథలు...
ఇలాంటి వాక్యాలు...
సదా మననం చేసుకుంటూ ఉండాలి...
మన పిల్లలకు చెబుతూ వుండాలి...

తరతరాలకు మన ధనం అందాలనుకోవడం కాదు,
నీ జ్ఞానానికి వారు వారసులు కావాలి...
నీ సంస్కారానికి వారసులు కావాలి...
వైరాగ్యమే మన భారతీయ సంపద...
దాన్నెవడూ కొల్లగొట్టలేడు...

"నా నిజమైన వారసులు మీరే"....
అని శిష్యులతో గురువుగారు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి...

ఆస్తులే నిజమైన వారసత్వం అని మన ప్రాచీనులు అనుకునివుంటే...
ప్రాచీన వాఙ్మయం మనవఱకు చేరివుండేది కాదు...

వేదాల్లోని ఒక్క అక్షరం కూడా తాళపత్రాలలో లిఖించబడలేదు...
అవి శ్రుతులు...
ఒకరి నుంచి ఒకరికి శబ్దరూపంగానే తరతరాలుగా అందించుకుంటూ వచ్చారు...

చాలామంది వేదపండితులు నిరక్షరాస్యులు...
అని ఎక్కడో చదివి ఆశ్చర్యపోయాను....
వారికి లిపితో పనిలేదు...

* * *

నాగరికత అభివృద్ధి అంటే
భౌతికపదార్థంలోని ఆత్మశక్తిని గుర్తించడంలో గల క్రమాభివృద్ధి అంటారు వివేకానందులు...
అంతేగానీ మిద్దెలు మేడలు పెరగడం కాదు...

తక్కువ వస్తువులతో...
తక్కువ మాటలతో...
తక్కువ తలంపులతో...
తక్కువ ఆహారంతో...
తక్కువ వ్యవహారంతో...

ఆనందంగా...సుఖశాంతులతో...
గడిపే టెక్నిక్ డెవలప్ కావడమే నిజంగా అభివృద్ధి అంటే.

మన భారతీయ సంస్కృతిని తేటతెల్లంగా అవగాహన చేసుకోవడం వల్లనే అది సుసాధ్యం.

ప్రస్తుతం మన సంస్కృతికి సంబంధించిన అవగాహనను గజిబిజి చేసేసుకున్నాం.

ఓ జోక్ విన్నా ఈ మధ్య....

ఈ సోషల్ మీడియాలో ఆరోగ్యసూత్రాలు బోధించేవాళ్లంతా ఏమి తినొద్దని చెప్పారో, నిజంగా అవన్నీ వదిలేస్తే, మనకు మిగిలేది ఖాళీ కంచమే...అని.

అలా ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసకుల వల్ల గజిబిజి పెరిగి, కాస్తో కూస్తో మనకున్న క్లారిటీ కూడా పోయి, ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. 

ప్రత్యక్ష  గురుసన్నిధి ఒక్కదానివల్లనే క్లారిటీ లభిస్తుంది. 

వేలగ్రంథాలు చదివినా లభించని స్వరూపనిష్ఠ
ఒక్క సద్గురు సన్నిధి మాత్రంచేతనే లభిస్తుంది.

ఈమధ్య అత్యాశ్రమానికొచ్చిన అతిథి ఒకరు తిరుగుప్రయాణమవుతూ నన్నడిగారు-

"మీరు పొందారా?" అని.

"మీరేమనుకుంటున్నారు?" అని అడిగా...

"మీ రచనలను బట్టి మీరు పొందారనే  అనుకుంటున్నాను." అన్నాడు.

'మీరు ఎలాగైనా అనుకోండి....
కానీ "నేను పొందాను" అన్నా అబద్ధం అవుతుంది. "నేను పొందలేదు" అన్నా అబద్ధం అవుతుంది. అని సమాధానమిచ్చాను. 

'మౌనం-శూన్యం-పూర్ణం' ఏకమైతే అదే "నేను".
'జననం-జీవితం-మరణం' లేకపోతే అదే "నేను".

అద్దం అన్నిటినీ ప్రతిబింబిస్తుంది.
కానీ తనను తాను ప్రతిబింబించుకోలేదు.

నేను అన్నింటినీ నిర్వచించగలనేగానీ,
నన్ను నేను నిర్వచించుకోలేను.

అందుకే 'నేనెవడను' అనే ప్రశ్న ఎప్పటికీ శేషప్రశ్నే.
సృష్టిలో సమాధానం లేని ఏకైక ప్రశ్న 'నేనెవడను'.

* * *

🙏🙏👌పరాయి స్త్రీ పై వ్యామోహం ఎటు వంటిది. అందరికీ అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.

🙏🙏👌పరాయి స్త్రీ పై వ్యామోహం ఎటు వంటిది. అందరికీ అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.
ఒకసారి ఒక రాజుగారు గుర్రం పై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు....
ఆ ఇoటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నము వడ్డిస్తూ వుంది...
ఆమె చాల అందగత్తె, ఆవిడ అందము చూసి రాజుగార్కి ఆశ్చర్యము కలిగింది, ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇoత ఆందమైన అమ్మాయిని ఇదివరకు చుదలేదే అని అనుకున్నాడు.......
ఆమె భరత బోజనo చేసి తన పని కై బయటికి వెళ్ళాడు. భర్త ను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లో కి వెళ్ళింది ....
అప్పుడా రాజు ఇoటి తలుపు తట్టాడు . ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజ వంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది.ఎవరు మీరు అని ప్రశ్నించింది ...
రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి కి రాజు ను, నీవు చాలా అందంగా వున్నావు ,నీ అందం నన్ను కట్టిపడవేస్తోంది. నిన్ను నా భార్య గ చేసుకోవాలి అనుకుంటున్నాను ,నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహా రాణిని చేస్తాను , నీవు చూడని సంపద చూడగలవు , అడుగులకు మడుగులోత్తే పనివారు , కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు.
ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారము కలది.ఆవిడ రాజు గారి తో ఇలా అన్నది . రాజా !! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను ముందు మీరు ఆలసిపోయి వోచి వుంటారు. శరీరం,మనసు రెండు ఆకలితో వుంటాయి.మీరు వెళ్లి కళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పింది ....
ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు,ఇంత సులువుగా తన కోరిక తీరుతందని , ఆవిడ అంగీకరిస్తుందనీ ఊహించలేదు.ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలనుకున్నాడు.కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు.కాళ్ళు చేతులు కడుగుకొని ఇంటిలోనికి వెళ్ళాడు.
రాజా , మీరు భొంచేయండి అంటూ వాళ్ళ ఆయన తినిన అరిటి ఆకును రాజు ముందు వేసి ఇలా అన్నది ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు,అదే ఎంగిలి ఆకులో మీరూ భోజనము చేయండి.మీ ఆకలి తీరాక నేనూ మీతో వస్తాను మీ రాజ్యానికి అన్నది.
రాజుకు ఊహించని ఆ పరిణామానికి ఆమెపై కోపము , ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యము కలిగాయి.దేశాన్నేలే ప్రభువును నేను ,ఎప్పుడూ బంగారు పళ్ళెంలో ఘుమఘుమలాడే షడ్రసోపేతమయిన వంటకాలు వేడి వేడిగా తినే నాకు ఈ ఒక ఎంగిలి ఆకులో భోజనము వడ్డించడానికి నీకెంత ధైర్యము అని గద్దించాడు.
అందుకు సమాదానంగా ఆమె ఇలా చెప్పింది.
మహరాజా నా భర్త బోజనము చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు యేన్గిలిఎంగిలి అడ్డు రలేధా, పెళ్ళైన నన్నుపెళ్లి మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అడ్డరని ఎంగిలి , భోంచేసే విస్తరాకు విషయంలో కలిగిందా , ఎంత ఆశ్చర్యము అన్నది ...
రాజుకు తన మాటలలోని అంతరార్ధం అర్ధమయ్యింది.కనువిప్పు కలిగింది.మొహం పటా పంచలయ్యింది.ఆవిడ సంస్కారానికి , సమయస్పూర్తికి ముగ్ధుడయ్యాడు .ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి తల్లీ నన్ను క్షమించు ,కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను.నీవు ఎంతో నేర్పుగా నాకు సుక్ష్మాన్ని దర్శింపజేశావు.నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు.నీవంటి మాతృ ముర్తులవల్లే ధర్మం ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఇందులోని నీతి ఏమిటంటే
పరాయి స్త్రీ పై వ్యామోహం ఎంగిలి ఆకులో బోజనము ఒక్కటే ....
స్త్రీలలో ఆడతనాన్ని గాక అమ్మతనాన్ని దర్శించిన వారు కృతార్దువులవుతారు
ఓం శ్రీ మాత్రే నమః.👌🙏🙏

భీష్ముడి ఉపదేశం

 *భీష్ముడి ఉపదేశం* 
                 ➖➖➖✍️

*మహాభారత యుద్ధం సమాప్తమయ్యాక జ్ఞాతులందరూ చనిపోయి దుఃఖంతో కుమిలిపోతున్న ధర్మరాజును అంపశయ్యమీద ఉన్న భీష్ముడి వద్దకు శ్రీకృష్ణుడు తీసుకువెడతాడు.* 

*ధర్మశాస్త్రమంతా నిత్యం మనసులో నిలుపుకొనే భీష్ముణ్ని  ధర్మరాజు మనసులోని శోకాన్ని తొలగించాల్సిందిగా శ్రీకృష్ణుడు కోరతాడు.* 

*ఆ సందర్భంగా భీష్ముడు ధర్మరాజుకు తెలియజెప్పిన శాంతిమార్గం కలియుగంలోని మానవులకు కర్తవ్యబోధ.*

*దుర్గమమైన బాధలనుంచి తరించగలిగే మార్గం చెప్పమని యుధిష్ఠిరుడు అడిగినప్పుడు నియమబద్ధమైన నడవడిక కలవారు కష్టాలనుంచి తరించగలరని భీష్ముడు వివరించాడు.*

*మనసా వాచా కర్మణా పాపం చేయని ధర్మవేత్తలను కష్టాలు బాధించవు. రజోగుణం పూర్తిగా శాంతించి, తమోగుణాన్ని తుడిచిపెట్టి సత్వగుణ  స్థితులైనవారు దుర్గమమైన కష్టాలను సులభంగా దాటగలుగుతారు. సమస్త జీవులకు ఈశ్వరుడు, జగత్తునకు ఉత్పత్తి, ప్రళయ కారకుడైన భగవంతుడు నారాయణుడిని భక్తిభావంతో ఆశ్రయించేవారు కష్టాలనుంచి గట్టెక్కగలరని భీష్ముడు ఉపదేశించాడు.*

*ఇంద్రియ నిగ్రహం స్థిరంగా ఉన్నవారు, సుఖదుఃఖాలను సమంగా భావించేవారు, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారు శిష్టులని భీష్ముడు ధర్మరాజుకు విశదీకరించాడు.* 

*సత్పురుషులు ఎల్లప్పుడూ సత్యం అనే సనాతన ధర్మాన్ని అనుష్ఠించాలని, సత్యమే గొప్ప యజ్ఞమని, ధర్మాన్ని కాపాడేది సత్యమే కనుక మానవుడు సత్యతత్పరుడు కావాలని భీష్ముడు బోధించాడు.* 

*వేయి అశ్వమేధ యజ్ఞాల ఫలాలను ఒకవైపు, సత్యవచన ఫలాన్ని మరొకవైపు ఉంచితే సత్యం వైపే త్రాసు మొగ్గు చూపుతుందన్న భీష్ముడి ప్రవచనం మహత్తరమైన సత్యధర్మాన్ని విశదీక రించింది.* 

*లోభం వల్లనే పాపం, అధర్మం, దుఃఖం కలుగుతాయని భీష్ముడు ఉపదేశించాడు.* 

*కపటానికి, మోసానికి, కోపానికి, అజ్ఞానానికి మూలకారణం లోభం కనుక దాన్ని వదిలినవారు సుఖపడతారని తెలియజేశాడు.*

*‘మంచి ఆలోచనలతో ధర్మాన్ని పొందాలి. క్రోధం క్షమాగుణంతో అంతమవుతుంది. కామం విరక్తితో నశిస్తుంది. విజ్ఞానవంతులను గౌరవిస్తే మోహం తొలగుతుంది. తత్వజ్ఞానం మంచి కార్యాలవైపు దృష్టి మళ్లిస్తుంది.*

*శోకించడం వ్యర్థం అన్న భావనతో శోకం నశిస్తుంది. సర్వ ప్రాణుల పట్ల దయాగుణం కలిగి ఉండటమే హింసా ప్రవృత్తికి నివారణోపాయం. ఉత్తమ పురుష సాంగత్యంతో మనసు మాత్సర్యరహితమవుతుంది.*

*వివేకశీలమైన బుద్ధి ఈర్ష్యను పారదోలుతుంది. దయాగుణం జాగృతమై అసూయ తొలగుతుంది. ధర్మాత్ముల మైత్రితో పిసినిగొట్టుతనం పోతుంది. భోగాలు అశాశ్వతమని గ్రహిస్తే లోభం నివృత్తమవుతుంది.* 

*సంయమనంతో ఆశను జయించాలి. సంతృప్తితో తృష్ణను జయించవచ్చు. ప్రయత్నంతో సోమరితనాన్ని, శాస్త్ర నిర్ణయంతో విపరీత తర్కాన్ని, శౌర్యంతో భయాన్ని విడిచిపెట్టాలి.   మనసును, వాక్కును బుద్ధితో వశపరచుకోవాలి’ అని బోధించి మానవుణ్ని పట్టి పీడించే దోషాలు, వాటి నివారణోపాయాలను భీష్ముడు విశదీకరించాడు.*

*భీష్ముడి హితబోధలు అర్థం చేసుకుని అనుసరించినవారు జీవించినంతకాలం సత్కర్మలను ఆచరిస్తూ జీవితాన్ని తీర్చిదిద్దుకుని భగవంతుడి కృపకు పాత్రులు కాగలుగుతారు.*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

🎻🌹🙏దేవకీ మొదటి ఆరుగురు సంతానం, వారి మరణ రహశ్యం...!!

 🎻🌹🙏దేవకీ మొదటి ఆరుగురు సంతానం, వారి మరణ రహశ్యం...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿భాగవతములో ఆకాశవాణి కంసుని హెచ్చరించి  ఆ ఆరుగురు శిశువుల మరణానికి కారణం ఎందుకు అయింది .?

🌸దీనికి భాగవతములో సమాధానము ఎక్కడా లేదు. వేరే ఏదైనా పురాణాలలో ఎక్కడైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ వివరణ. .

🌿కంసుడు పూర్వజన్మలో కాలనేమి. సీతారాముల ఎడబాటుకి, రామరావణ యుద్ధానికి కారణమైన మారీచుడి కొడుకు పేరు కాలనేమి. 

🌸రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు మూలిక బదులుగా సంజీవని పర్వతాన్నే తీసుకువచ్చి మూర్ఛనుంచి తేర్చాడు. 

🌿మరోసారి మళ్ళీ యుద్ధంలో లక్ష్మణాదులు మూర్ఛపోతే ద్రోణగిరిపై ఉన్న విశల్యకరణి అనే మూలిక తేవాలని జాంబవంతుడు చెప్తే తాను తెస్తానని హనుమంతుడు సిద్ధ పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు రావణాసురుడు. 

🌸రావణాసురుడు కాలనేమి ఇంటికి వెళ్ళి హనుమంతుడు ద్రోణగిరికి బయలుదేరుతున్న విషయం చెప్పి హనుమంతుడిని దారితప్పించి అక్కడ ఉన్న మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని ఆజ్ఞాపిస్తాడు.

 🌿ప్రభువు ఆజ్ఞ శిరసావహించాడు కాలనేమి.ద్రోణగిరికి మార్గం వెతుకుతూ దప్పికగొన్న హనుమకు జపంచేస్తూ మహర్షిరూపంలో కాలనేమి కనిపించాడు. 

🌸ద్రోణగిరికి మార్గం చెప్పమని హనుమ అభ్యర్థించాడు. అక్కడ ఉన్న సరస్సులో నీరు త్రాగి, స్నానం చేస్తే దప్పికతీరి, కార్యసాధనకు శక్తి వస్తుందని కాలనేమి తన శిష్యులద్వారా నమ్మించాడు.

🌿 హనుమ ఆ కొలనులోకి దిగగానే మొసలి రూపంలో ఉంటూ శాపగ్రస్త అయిన ధాన్యమాలిని అనే అప్సరస అతనిని పట్టుకుంది. 

🌸మహా బలశాలి అయిన హనుమ దానిని చంపి శాపవిమోచనం కలిగించాడు.అందుకు కృతజ్ఞతతో ధాన్యమాలిని కాలనేమి దురాలోచన వివరించి ద్రోణగిరికి దారి చెప్తుంది.

🌿హనుమంతుడు కాలనేమి ఆశ్రమానికి తిరిగివస్తాడు. సహాయం చేసినందుకు గురుదక్షిణ కోరుకున్న కాలనేమిని యమపురికి పంపిస్తాడు హనుమంతుడు. ఇది కాలనేమి కథ..

🌸వేషాలు మార్చి, మాయచేసే దొంగభక్తులు చేసే పూజాపునస్కారాలను
తెలుసుకోమని పెద్దలు చెబుతుంటారు,
అలాంటి దొంగ జపాలు,తపస్సు లు చెసే వారిని  కాలనేమి తో పోలుస్తారు .

🌿కంసుడు కృష్ణుడి మేనమామ. ఉగ్రసేనుని తొమ్మిది మంది కుమారులలో పెద్దవాడు. కృష్ణుడి చేత చంప బడతాడు. 

🌸కంసుడు పూర్వజన్మలో కాలనేమి. 
ఈ జన్మలో కాలనేమిని విష్ణువు హతమారుస్తాడు.(శ్రీ కృష్ణుడు).

🌿దేవకీ పుత్రులలో ఆరుగురు గత జన్మలో కాలనేమి పుత్రులు. వారిని తండ్రే చంపుతాడు అని హిరణ్య కశిపుడు శపిస్తాడు. ఆవిధంగానే మరుసటి జన్మలో దేవకీ గర్భాన మొదట పుట్టిన ఆరుగురిని కంసుడు చంపుతాడు. 

🌸కాలనేమి పుత్రుల పేర్లు :– హంస, సువికర్మ, కృత, దమన, రిపుర్మర్దన, క్రోధహంత.

🌿ఈ విధంగా హిరణ్యకశ్యపుని శాపం నిజం కావాలన్నా,కాలనేమి చేతిలో అతని సంతానం హతం కావాలన్నా, దేవకీ వసుదేవులను బంధించడం, వారికి జన్మించిన కాలనేమిపుత్రులను ఆరుగురునీ కంసుని చేతిలో హతంచేయించడం 

🌸జరగాలన్నా ఆకాశవాణి పలకటం దేవకీ వసుదేవులను సంతానప్రాప్తి పర్యంతం ఖైదులో ఉంచడం తప్పనిసరిదేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. 

🌿పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా, చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకు వచ్చి ఇచ్చావు. 

🌸నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటి వాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. 

🌿వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి యివ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. 

🌸ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది.
ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. 

🌿కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. 

🌸నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.

🌿ఇపుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురుచేశాడు. 

🌸‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు.

🌿తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భం. 

🌸కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. 

🌿వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయనిష్కారణంగా జ్ఞానం ఇచ్చేవాడు. 

🌸అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇపుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. 

🌿భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు.

🌸పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. 

🌿వాళ్ళు బ్రహ్మగారు కూర్చుని ఉండగా నిష్కారణంగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. 

🌸అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు.

 🌿మీరు అప్పుడే పొందేశారా?కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు.

🌸మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి.

🌿 గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. 

🌸అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం..... హరే కృష్ణ..🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Sunday, July 9, 2023

పిశాచాల్ని పెంచకండి....

 పిశాచాల్ని పెంచకండి....
 మీ బాబు ఎదుగుతున్న మొక్కైతే  మీరు సంరక్షించే తోటమాలులు  మీ పాప విచ్చుకుంటున్న  కనుపాప ఐతే  మీరు ధూళిచేరనీయని కనురెప్పలు.  అప్పటివరకూ  స్త్రీ పురుషులు తమకోసం బ్రతికి తమనుండి ప్రతిరూపాలు వచ్చాక బ్రతుకు వారికోసమే అన్నట్టు మారిపోవడం, తమకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకన్నా, తాము జన్మనిచ్చిన బిడ్డలపై మమకారం చూపడం ప్రకృతి వైచిత్రి కదండీ! సరే కాకిపిల్ల కాకికి ముద్దనేది కాదనలేం కానీ ఆ పిల్ల కాకులు సమాజ శాంతికి ఇబ్బంది కల్గిస్తున్న పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా పట్టించుకోవాల్సివుంటుoది. మందుకొట్టి కారుతో ప్రాణాలుతీసే 10వ తరగతి పిశాచాలు, ఆడపిల్లల మానాలు చెరిచే యువకీచకులు, బైకులు, లాప్ టాప్ లు అమ్మేసే ఇంజనీరింగ్ వెధవలు... వీరి విపరీత ప్రవర్తనకు కారణమేమంటారు? తల్లిదండ్రుల ద్రుతరాస్ట్ర ప్రేమ కాదంటారా? అద్దెగర్భాలూ, టెస్ట్ ట్యూబ్ తంటాలతో సహితం పిల్లల్ని కని, వారు తమను ఉద్ధరించేస్తారనే ఆశతో ఏంచేస్తున్నా కిమ్మనక, ఏం అడిగినా కాదనక పెంచిన వారు మలివయసులో ఒంటరిగా  లేదా ‘ముసలి గృహాలలో’ వుంచటం తప్ప ఏం మిగులుతోంది? అలా కాకుండా ఓ పదిమంది అనాధ పిల్లలను చదివిస్తే ఆ నలుగురైనా మిగులుతారేమో! ఆరోజుల్లో పెద్దలు పిల్లల్ని మరీ ఇంతగా పట్టించుకునేవారు కాదు. అయినా అభిమానం, గౌరవం ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు రివర్స్..పిల్లల్ని ప్రేమించడం ఎక్కువైంది... వారు మాత్రం ఖాతరుచేయడం తక్కువైంది. ఇది ఎత్తునుంచి దిగువకు ప్రవహించే నీరులా వుంది. తల్లిదండ్రులు కడుపుమాడ్చుకుని తినిపించిడమేతప్ప తిరిగి తమను చూసే బిడ్డలు తక్కువైపోయారు. అలాఅని మనం ఏమీ ఇవ్వకుండానే పిల్లలనుండి ఎదో ఆశించడం కూడా తప్పే సుమా..అయితే ఆ ఇవ్వడంలోనే విజ్ఞత వుంది. లక్షన్నర బైక్, ఇరవైవేల ఫోన్, ఐదువేల డ్రెస్ కాదు ఇవ్వాల్సింది.. నిజాయితీ, నమ్మకం, నిగర్వం, నిర్భయత వెరసి నాణ్యత ఇవ్వగలిగినపుడు శ్రీరామచంద్రులు కాకున్నా శిఖండులు మాత్రం తయారుకారు. పిల్లల్ని కూడా పెట్టుబడి వస్తువులుగానే భావిస్తున్న పేరెంట్స్ ని చూస్తుంటే జాలి, భయం కలుగుతుంది.ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుందనేది వ్యాపార సూత్రo కావచ్చుకానీ విలువల సూత్రం మాత్రం కాదు. ఇంజనీరింగ్ లో పద్దెనిమిది బ్యాక్ లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన కొడుకును లక్ష రూపాయలు తగలేసి ఫైనల్ ఇయర్లో  IES కోచింగుకు పంపిన ఒకానొక తల్లిదండ్రులను అమాయకులనాలా? మూర్ఖులనాలా? బైక్ కొనకపోతే కాలేజికి వెళ్లనని మొండికేసే వాడు పెద్దయితే మెడపై కత్తి పెట్టి డబ్బు అడగడా? పాప తెగ మాట్లాడేస్తున్న మొబైల్ ఫ్రెండ్ మగా, ఆడా అనేది పసికట్టలేని తల్లి స్నేహితురాలెలా అవుతుంది? మొక్కై వంగనిది మానై వంగునా!!!  ఎక్కువమంది తల్లిదండ్రులు తమ బిడ్డ చేతిని అలాగే పట్టివుంచేస్తూ ‘బొమ్మరిల్లు’ తండ్రులైపోతున్నారు. ఇది తరువాతి రోజుల్లో ఆ పిల్లల్లో విశృంఖలత్వానికి గానీ, చేతకానితనానికిగానీ డారితీసే ప్రమాదం వుంది. తల్లిదండ్రులుగా మనం గనిలోపనిచేసే కార్మికుల నెత్తినుండే రక్షణదీపాలం మాత్రమే. పనిచేయాల్సింది, రక్షించుకోవాల్సింది మాత్రం పిల్లలనే కార్మికులేనని గుర్తించండి. నేర్చుకోవడాన్ని నేర్పించండి. అన్నిటికి మీతోడు కావాలనుకోకండి. పిల్లలనుండి వయస్సు, మేధస్సుకు తగ్గట్టుగా ఆశించడం, ఆలోచనలు చేయడం అవసరం. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ప్రవర్తించరని మనోవిజ్ఞాన పరిశోధనలు చెపుతున్నపుడు పిల్లలు ఒకేలా సాధించేయాలనుకోవడం అత్యాశ కాదా?  ఆందోళన వద్దు అబ్బాయి పరీక్ష తప్పాడని.. వాడొక ఎడిసన్ కాగలడేమో! అసూయ వద్దు, పక్కిoటి అమ్మాయి కలెక్టర్ అయిందని..మనమ్మాయి జాతికి వన్నె తెచ్చే ఝాన్సిలక్ష్మిభాయి కావచ్చు.. మొహం మాడ్చేయ వద్దు.. ఎదురింటి అమ్మాయి మెడిసిన్ సీటు కొట్టేసిందని..నీ మనుమరాలు సమాజ రుగ్మతలకు మందు వేస్తుందేమో..  బ్రతుకు పొలిమేర బాల్యం అన్నాడో మహనీయుడు. బాల్యం అన్నిటిని ఆమోదించే వయస్సుకూడా. పిల్లల్ని ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకోవచ్చునంటాడు వాట్సన్. అబ్రహం లింకన్ తన పిల్లవాన్ని ఎలా తీర్చిదిద్దాలో టీచర్లకు లేఖరాసాడు. నెహ్రూ లేఖలు ఇందిరమ్మను ఏంతో ప్రభావితం చేసాయంట. ఈ మధ్యే ఒక అధ్బుత విషయం చదవడం జరిగింది. ఒక మాస్టారు హాస్టల్ లో వుండి చదువుకుంటున్న తన కొడుక్కి ప్రతిరోజూ ఒక కార్డు పోస్టు చేస్తాడంట. ఆ అబ్బాయి ఎలా తప్పు చేయగలడు? చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తారని ఉపేక్షిస్తే తరువాత పెద్దలు ఏడవాల్సివుంటుంది. ఏమో చాలామంది అంటారు గురువులే అన్నీ చేసేయగలరని..కాని నేను నమ్ముతాను ఆదిగురువులైన తల్లిదండ్రులే పిల్లల నుదిటి రాతను రాయగలరని. పరీక్షల్లో కొడుక్కి స్లిప్పులందించే ‘నువ్వు నాకు నచ్చావ్’ నాన్నలు, మందు కొడితే పెద్దతప్పేమీ కాదని సమర్ధించే ‘ప్రేమమ్’ మామయ్యలూ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్నారో, తగలేస్తున్నారో వారికే తెలియాలి. లోహాలకు తుప్పు పట్టకుండా పూత వేస్తున్నాం.. పిల్లలు తప్పు చేయకుండా వాతలేయలేమా??? పుస్తక పఠనం చికెన్ పలావ్ కన్నా రుచికరమైందని, మొక్కల్ని పెంచడం రోడ్లమ్మట తిరగటం కన్నా ఆనందమని,  తరగతిలో గురువుగారి ‘సెహభాష్’ అనే మెప్పు  సిగరెట్, మందు కన్నా గొప్పకిక్ ఇస్తుందని తెలుసుకోగలిగితే  పిల్లలు పిశాచాలుగా కాక పిడుగులుగా తయారుకాగలరు.. 
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Tuesday, July 4, 2023

యువత – జ్ఞానయోగం

 || యువత – జ్ఞానయోగం ||

“ఒకానొక తుమ్మెద ప్రతి పువ్వు నుంచీ మకరందాన్ని గ్రహించినట్లు ఒకానొక ఆత్మజ్ఞానాభిలాషి ప్రతి ఒక్కరి దగ్గరినుంచీ నేర్చుకోవాలి. ఈ సృష్టిలో ఉన్న వృక్షజాతి మరి పక్షి, జంతు జాతులనుంచీ నేర్చుకోవాలి .. అదే మరి జ్ఞానయోగం!

“ఇలా నేర్చుకోవడం అన్నది చిన్నప్పటినుంచే మొదలుపెట్టాలి. ఆలస్యం అమృతం విషం కనుక శుభస్య శీఘ్రం” అంటూ “ముక్కు పచ్చలారకముందునుంచే పిల్లలకు ధ్యానం నేర్పించాలి. ధ్యానంవల్ల ఒక రాముడికీ, ఒక కృష్ణుడికీ, ఒక ప్రహ్లాదుడికీ జ్ఞానం అబ్బినట్లు ప్రతి ఒక్కరికీ జ్ఞానం అబ్బుతుంది. అప్పుడే వాళ్ళు తమ జీవితాలను చక్కగా జీవించి వాటిని సార్థకం చేసుకుంటారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న మానవజన్మను గౌరవప్రదంగా చూసుకోగలుగుతారు.

“చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయి ఆత్మహత్యలు చేసుకోకుండా ‘యుద్ధాయ కృతనిశ్చయః’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు .. కష్టాలను ఛాలెంజ్‌స్‌లా తీసుకుని తమను తాము బ్రతికించుకుంటారు. మానవుడు దేవుడిలా పరిణమించడానికి ‘ఈ భూలోకమే సరియైన క్షేత్రం .. మరి ఈ దేహమే సరియైన ఉపకరణం’ అని తెలుసుకుని దానితో ప్రయోగాలు చేస్తారు.

“చిన్నపటి నుంచీ తల్లిదండ్రుల సరికాని పెంపకాల వలనో లేక మన చుట్టుప్రక్కల వాళ్ళు మనగురించి మాట్లాడే మాటలవలనో మనలో మనపట్ల మనకే తెలియని ఒకానొక నమ్మక వ్యవస్థ ఏర్పడిపోతుంది. అయితే ఆ వ్యవస్థను గ్రుడ్డిగా అనుసరించకుండా .. ఎప్పటికప్పుడు దానిని ‘చెక్’ చేసుకుంటూ మరి సరిచేసుకుంటూ ఉండాలి.

“ఇక్కడ ఎవ్వరూ పరఫెక్ట్ కాదు! ఎవ్వరూ ఎక్కువ కాదు; ఎవ్వరూ తక్కువ కాదు. ఎవరెవరి స్థాయిలలో వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు కాబట్టి మన దగ్గర ఉన్నదానిని ప్రక్కవాళ్ళతో పరస్పరం పంచుకుంటూనే ఉండాలి. మనకు ‘ABCD’ లు తెలిస్తే వెళ్ళి ప్రక్కవాడికి నేర్పించాలి. మనకు ధ్యానం తెలిస్తే దానిని ప్రక్కవాడికి నేర్పించాలి.

” ‘ఒక మనిషి ఎంతయినా చెయ్యగలడు’ అని తెలుసుకుని దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు .. శరీరంతో ఉన్నప్పుడే అన్నీచెయ్యగలగడం మరి Equality is the highest quality .. and simplicity is the highest spirituality .. అని తెలుసుకోవడమే జ్ఞానయోగం” .

- Bramharshi Patriji

గుండె 85 ఏళ్ళు చెక్కుచెదరకుండా ఉండాలంటే.. 5 శత్రువులు... 5 మిత్రులు

గుండె 85 ఏళ్ళు చెక్కుచెదరకుండా ఉండాలంటే.. 5 శత్రువులు... 5 మిత్రులు
5 - Enemies
Enemy no 1. Salt(Uppu)
Enemy no 2. Carbohydrates
Enemy no 3. Fats
Enemy no 4. Habbits(Smoking, alcohol, caffeine content)
Enemy no 5. Stress
5 - Friends
Friend no 1. Fruits, Nuts, Salads
Friend no 2. Breathing
Friend no 3. Exercise
Friend no 4. Mental Silence
Friend no 5. Satsanga

****మనసు కథలు🎶 💛గండం💛

 [7/4, 10:00] +91 98491 63616: 🎶మనసు కథలు🎶

💛గండం💛

ప్రణవికి భయం పెరిగిపోతోంది , 
కాలేజీకి తయారయ్యి , మెట్లు దిగుతుంటే ,
దూరంగా కనిపించేసాడు, నీలంషర్ట్ లో సాహిల్..

మనం ఎవరికైతే భయపడతామో , ఎవరినైతే దూరంగా ఉంటే బావుండును అనుకుంటామో , అలాంటివారు దరిదాపుల్లో ఉంటే తొందరగానే పసిగట్టేస్తాము...

వెంటనే , అతను అక్కడ ఉన్నాడని అనిపించగానే , వెనక్కి ఇంట్లోకి వచ్చేసింది ..గుండె దడదడలాడుతోంది ప్రణవికి...మొహం నిండా చెమటలు పట్టేస్తున్నాయి...

సీత , వంటింట్లోంచి హాల్లోకి వచ్చింది..కూతురు ప్రణవి కనిపించింది...అదేవిటే ఇందాకే బాయ్ చెప్పి బయలుదేరావు కదా , మళ్ళీ ఇక్కడున్నావేంటీ అడిగింది సీత...

హా బయల్దేరుతున్నా అమ్మా అంది ప్రణవి కంగారుగా...ఏమ్మా ఏమయిందిరా , అమ్ములూ,  ఏమయిందమ్మా..అంటూ సీత తన చీరకొంగుతో ప్రణవి మొహాన చెమటలు తుడుస్తూ అడిగింది...

అమ్మా బాయ్..అంటూ ధైర్యం కూడకట్టుకుంటూ బయల్దేరింది ప్రణవి...మెట్లు దిగి, తన దారిన తాను నడుస్తోంది , వచ్చేసావా కొంచెం మొరటుగా , వెకిలిగా అంటూ సాహిల్ , ప్రణవితో పాటూ అడుగులు కలిపి నడుస్తున్నాడు...

ఇవాళ ఆఖరి ఎక్జామ్..ఎక్జామ్ అవగానే నా ప్రేమను ఒప్పేసుకో..సెలవుల్లో హాయిగా ఎటన్నా సరదాగా ప్రేమపావురాల్లా తిరిగేసి వద్దాం అని అంటూ , ప్రణవికి వచ్చే చిరాకుని గమనించి కూడా , లెక్కే చేయకుండా , భుజం మీద చేయి వేసాడు , దూరంగా వెకిలిగా నవ్వుతూ చూస్తున్న , మిత్రబ్రృందం వైపు తానేదో గొప్ప పని ఒకటి చేసినట్లు చూస్తూ..

ప్రణవికి వంటి మీద తేళ్ళు జెర్రులు పాకినట్లుగా ఉంది , ఒక అడుగు అతన్నుంచీ దూరం వేసింది , అతని చెయ్యి తన భుజం మీద నుంచీ జారేలాగా...ఓ ఇవన్నీ ఇప్పుడొద్దా , సరేలే , 
సెలవల్లో బాగా సరదా చేద్దాం ఇద్దరం కలిసి.. అన్నాడు అసహ్యం పుట్టేలాగా లేకితనంగా...

ప్రణవి ఆఖరి ఎక్జామ్ కూడా సక్రమంగా పూర్తవ్వాలని పంటిబిగువున బాధని , కోపాన్ని , చిరాకుని , అసహ్యాన్ని ఇలాంటివి అన్నింటినీ , రాని సహనాన్ని బతిమలాడి తెచ్చుకుని మరీ భరిస్తోంది సహనంగా...

ఎగ్జామ్ అవబోతోంది..కోతి బ్యాచ్ ప్రణవి ఎగ్జామ్ రూమ్ కనపడేచోట నుంచుని ఉన్నారు,  ప్రణవిని చూస్తున్నాడు సాహిల్..ప్రణవి పేపర్స్ సెట్ చేస్తూ బయటికి చూసింది..సాహిల్ కనపడ్డాడు..ముందు కోపం వచ్చింది , తరువాత చిరాకు , అసహ్యం కలిగాయి , చివరిగా భయం వేస్తోంది...ఎగ్జామ్స్ అంటూ ఇన్నిరోజులూ చెత్త వాగుడు వాగుతూ తిరిగాడు , ఈ రోజు కేవలం వాగుడుతో సరిపెట్టడు , ఇప్పుడు ఏం చెయ్యాలి.. అని ఆలోచిస్తోంది..

చివరన ఆన్సర్స్ ని ఒకసారి సరిచూసుకునే అలవాటు ప్రణవికి , పేపర్స్ సబ్మిట్ చేసేముందు , కానీ ఇప్పుడు ఆ విషయం మర్చేపోయింది , టీచర్ పేపర్స్ తీసేసుకుంది గాల్లోకి పిచ్చి చూపులు చూస్తున్న ప్రణవిని చూస్తూ...

అందరూ పేపర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు..ప్రణవి చెయిర్ లోనే కూర్చునుంది..పద్మా టీచర్ పేపర్స్ మంచిగా అమర్చుకుని బయటకు వెళ్ళబోతూ ప్రణవిని చూసింది..

ప్రణవీ వెళ్ళలేదు ఏమిటి అడిగింది ప్రణవిని...ఎగ్జామ్ బాగా రాయలేదా , పర్లేదమ్మా మళ్ళీ బాగా చదివి రాయచ్చు , దిగులు పెట్టుకోకూడదు.. అంది, 
ఈ కాలం పిల్లల ఆత్మహత్య ఆలోచనలు గుర్తొచ్చి భయం వేసి...

టీచర్ ఇవాళ మీరు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యగలరా అడిగింది ప్రణవి, పద్మాటీచర్ ని...
మేము వెంటనే వెళ్ళలేం కదమ్మా , మాకు మీటింగ్స్ డిస్కషన్స్ ఉంటాయి , దాదాపుగా సాయంత్రం వరకూ ఉండాల్సొస్తుంది నాకు.. అంది అనునయంగా ప్రణవితో, పద్మామేడమ్...

సరే టీచర్ అంది..ప్రణవి చిన్నగా వణుకుతోంది , ఆమెలో ఏదో తెలీని భయం , అభద్రత మొదలయ్యాయి..వళ్ళంతా చెమటలు పోస్తున్నాయి , మనసు కీడు శంకిస్తోంది...పద్మ , ప్రణవిని చూసి పోనీ మీ ఇంటినుంచీ ఎవరినన్నా నిన్ను తీసుకెళ్ళేందుకు రమ్మని చెప్పు , వాళ్ళు వచ్చేవరకూ నాతోపాటూ స్టాఫ్ రూమ్ లో ఉందువుగానీ..అంది పద్మాటీచర్...

ప్రణవి బాబాయికి ఫోన్ చేసి రమ్మంది..వస్తానమ్మా అన్నాడు...స్టాఫ్ రూమ్ కి వెళుతోంది..సాహిల్ దూరం నుంచీ చూసి ప్రణవి బయటకు రాకపోవటం చూసి కోపంగా ఉన్నాడు...మెసేజ్ పెట్టాడు ప్రణవి ఫోన్ కి...త్వరగా రా బయటికి అని...ప్రణవి రిప్లయ్ ఇవ్వలేదు....ఐ లవ్ యూ ప్రణవీ అయామ్ వెయిటింగ్ ఫర్ యూ అని లవ్ సింబల్స్ తో మళ్ళీ  ఇంకో మెసేజ్ పెట్టాడు...

పద్మాటీచర్ కి అనుమానం వచ్చి నేను నీ ఫోన్ చూడనా , వచ్చే ప్రతీ మెసేజ్ కి ఇంతలా ఉలిక్కిపడుతున్నావెందుకూ అని అడుగుతూ ప్రణవి వైపు చెయ్యి చాచింది ఫోన్ ఇమ్మని..ప్రణవి పద్మాటీచర్ కి ఫోన్ ఇచ్చింది...ఊ అర్థం అయింది అంది పద్మ ఫోన్ లో మెసేజెస్ చూసి...నా తప్పేం లేదు టీచర్ , నాకు ప్రేమలు ఇష్టం ఉండవు , వాడే వెంటపడి వేధిస్తున్నాడు అని ఏడుస్తూ చున్నీతో కళ్ళు తుడుచుకుంటోంది ప్రణవి...

పద్మ లేచి వెళ్ళి , సాహిల్ బ్యాచ్ తో , మీరింకా ఇక్కడెందుకు ఇళ్ళకు వెళ్ళండి అంది మందలింపుగానే కానీ వీలయినంత సౌమ్యంగానే...ప్రణవి మాతో వస్తానంది మేడమ్ అన్నాడు మొండిగా సాహిల్...తన బాబాయ్ వస్తున్నాడులే తనని తీసుకెళ్ళడానికి, మీరు వెళ్ళిపోవచ్చు అంది పద్మ...అదేంటి మేడమ్ , సరే తననే అడుగుతాను అని అంటూ లోపలికి రాబోయాడు
[7/4, 10:52] +91 98491 63616: సాహిల్...చెప్పాను కదా , ఇంకా నువ్వెందుకు అడగటం..అంటూ పద్మ దారికి అడ్డుగా నుంచుంది, బయటకు చెయ్యి చూపిస్తూ...మేడమ్ అన్న గౌరవం , భయం ఏ మాత్రమూ లేకుండా పద్మను కోపంగా చూస్తూ వెనుతిరిగాడు సాహిల్ అండ్ బ్యాచ్...

పావుగంటకు ప్రణవికి కొంచెం తెరిపిగా అనిపించింది...బాబాయ్ కి ఫోన్  చేసింది , వస్తున్నా తల్లీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాను , వచ్చేస్తున్నాను అన్నాడు బాబాయ్...

ప్రణవి అర్జంట్ అనిపించి వాష్ రూమ్ కి వెళుతోంది...స్టాఫ్ రూమ్ కారిడార్ దాటాక కొంచెం ఖాళీస్థలం తరువాత టాయ్ లెట్స్ ఉంటాయి...ప్రణవి వెళ్ళింది...వెనక్కి తిరిగి వస్తోంది...ఖాళీ స్థలం నుంచీ నాలుగు అడుగుల్లో కారిడార్ ఉందీ అనగా , ఎక్కడ ఎలా కాపు కాసాడో , దిగబడ్డాడు దొంగవెధవ సాహిల్ , ప్రణవి ముందుకొచ్చి నుంచున్నాడు , 

ఆ అని భయంతో చిన్నగా అరిచింది ప్రణవి , విపరీతమైన భయం వేసేసింది ప్రణవికి , గబుక్కున పక్కకు తప్పుకుని పోబోయింది , ఠక్కున ప్రణవి జబ్బ బలంగా పట్టుకుని ఆపేసాడు సాహిల్..

కోపంగా , క్రూరంగా చూస్తున్నాడు...సాహిల్ , ప్రణవిని...ప్లీజ్ సాహిల్ నన్ను వెళ్ళనివ్వు , నీది ప్రేమ కాదు సాహిల్ , నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నన్ను ఇలా భయపెడతావా , బాధ పెడతావా , నీది కేవలం నన్ను దక్కించుకోవాలన్న మొండితనం , అది సరి అయినది కాదు , వివేకంగా ఆలోచించు ప్లీజ్ సాహిల్ , నన్ను దయచేసి విడిచిపెట్టు , ప్లీజ్ , నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అని చిన్నగా ఏడుస్తూ బతిమలాడుతోంది ప్రణవి...నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు , నాతో ఇప్పుడు బయల్దేరి వచ్చేసెయ్ , నిన్ను నేను ఏమీ చేయను ..అడిగాడు సాహిల్...

సరే సాహిల్ ఏవన్నా మాటలుంటే , పెద్దవాళ్ళను కూర్చోబెట్టుకుని మాట్లాడుకుందాం , నాకు ఇలా ప్రేమా అంటూ రోడ్లు పట్టుకుని తిరగటం నచ్చదు అంది ప్రణవి... నాటకాలు ఆడుతున్నావా , ఇలా చెప్పేసి తప్పించేసుకుని పోదామనేగా నీ ప్లాన్..., ఇప్పుడు నాతో వచ్చెయ్యటం తప్ప నీకు వేరే మార్గం లేదు అన్నాడు మొండిగా సాహిల్...

నేను రాను అంది ప్రణవి...ఏ ఎందుకు రావు, అడిగాడు గట్టిగా గదమాయిస్తూ,  నాకు నీతో రావాలని లేదు , అయినా ఇలా మొండిగా ప్రవర్తిస్తే ఏ ఆడపిల్లా ఇష్టపడదు అంది కోపంగా..నీకు నేను నచ్చనా అన్నాడు మనిషి కోపంగా ఊగిపోతూ సాహిల్..నచ్చవు అంది తానూ తెగించి ప్రణవి.. 

షర్ట్ వెనుక నుంచీ కత్తి తీస్తున్నాడు , 

ఆ అని భయంతో ప్రణవి కళ్ళు పెద్దవి చేసింది , సాహిల్ చెయ్యిని విడిపించుకోవాలని చూసింది...

బలం పెట్టి పరిగెత్తుకుపోవాలని చూసింది...

సాహిల్ కత్తిని ప్రణవి వైపు విసురుగా తిప్పాడు...
కత్తి ప్రణవి ఎడమ భుజానికి తాకి గాయం అయ్యింది , ఇహ ఏం జరగబోతోందో ప్రణవికి అర్థం అయ్యింది, తన ప్రాణానికి ముప్పు రాబోతోంది , తాను అన్యాయంగా బలి అవ్వబోతోంది అని తెలిసింది , ముందు భయంతో బుర్ర పనిచెయ్యలేదు , భయంతో వళ్ళు మొద్దుబారినట్లుగా అనిపించింది , అది ఒక్క క్షణమే , వెంటనే చావో రేవో తేల్చుకోవాలనిపించింది, అంతే మనసుకి ధైర్యం చెప్పుకుంది , నేను మనిషైతే వాడూ మనిషే , వాడికున్న బలం నాకు లేదా అనుకుని , కుడి చెయ్యి పిడికిలి బిగించింది....బలం అంతా గుప్పిట్లోకి తెచ్చుకుంది....

ఒక్కటే గుద్దు సాహిల్ పొత్తికడుపు కింద బలంగా కొట్టింది , వాడు అబ్బా అని నొప్పితో మెలికలు తిరిగి , మళ్ళీ తేరుకుని బలం పుంజుకునేలోపు , కింద ఉన్న పెద్దరాయి అందుకుని సాహిల్ కత్తి పట్టుకున్న చేతి మీద గట్టిగా దెబ్బ వేసింది...కాస్త తేడాలో రెండు దెబ్బలకు విలవిల్లాడాడు సాహిల్ , 

అయినా శాడిస్ట్ మనస్తత్వం , వెంటనే తనను తాను తిప్పుకుని రెట్టించిన కోపంతో ప్రణవి గొంతు పట్టుకోబోయాడు సాహిల్ , రెడీగా రెండు గుప్పిళ్ళ నిండా పట్టుకుని ఉన్న ఇసుకమట్టిని అతని మొహం మీదకు , కళ్ళమీదకు విసిరింది...కళ్ళు మండటం , కనపడకపోవటం ఒకేసారి జరిగాయి సాహిల్ కి...

అదే సమయంలో , పద్మ కాల్ చేసి చెప్పిన షీ టీమ్స్ వచ్చాయి...ఇద్దరూ లేడీ పోలీసులు సాహిల్ నెత్తి మీద చెరో వైపూ గట్టిగా కొట్టి వాడిని దాదాపూ 
చచ్చిన పాములాగా చేసి , వాడి చేతులకి బేడీలేసి తీసుకుపోయారు ...ప్రణవి , పద్మకి , షీ టీమ్ కి క్రృతజ్నతలు చెప్పుకుంది సమయానికి సమాచారం చెప్పినందుకు పద్మాటీచర్ కి , వేగంగా స్పందించిన షీ టీమ్ కి...

షీ టీమ్ సాహిల్ ని బండిలో అప్పగించి వచ్చి , ప్రణవి సమయస్పూర్తికి , సమయానికి తెచ్చుకున్న తెగువకీ మెచ్చుకున్నారు...ఎవరో వస్తారని ఎదురుచూడకుండా ముందు మనం చేయగలిగిన ఆత్మరక్షణ ధైర్యంగా తెగించి చేసినప్పుడు ఆడపిల్లలు సగం సమస్యలను పరిష్కారించుకోగలుగుతారు, సగం చావు నుంచీ తమకు తామే తప్పించుకోగలుగుతారు అని ప్రణవిని ప్రశంసించారు ..పద్మాటీచర్ , ప్రణవిని దగ్గరకు తీసుకుని ఎంత గండం తప్పింది తల్లీ అని ఊపిరి పీల్చుకుంది...

Story: పారిన పథకం

 *🌻పారిన పథకం🌻*


🥀గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు.

🥀గోపాలుడు బాగా చదువుకొని కచ్చేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపెళ్ళి వారి నుంచి పెద్దగా కట్న కానుకలు లాగి, తన పూర్వవైభవాన్ని పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్నీ వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగ్గొట్టడం ప్రారంభించింది.

🥀తల్లి సంగతి ఇలా వుండగా గోపాలుడి ఆశలూ, కోరికలూ అందుకు భిన్నంగా వున్నవి. తాముంటున్న వీధిలోనే, నాలుగిళ్ళ అవతల వున్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతడి ఆలోచన. నిర్మల చురుకుదనమూ, సహనమూగల పిల్ల.

🥀అయితే, తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు. అందుకు, నిర్మల కుటుంబం ఆర్థికంగా తమకంటే తక్కువ స్థితిలో వుండడం ఒక కారణమైతే, నిర్మల తండ్రి రామయ్యకూ, తన తల్లికీ మధ్య ఏవో కుటుంబాల పాత తగువుల కారణంగా నివురుకప్పిన నిప్పులాంటి శత్రుత్వం వుండడం మరొక కారణం.

🥀ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలాకాలం మధనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని, తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి, మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్నతల్లి! ఆమెలో మార్పు కోరుకోవడమే గాని ఏమీ చెయ్యలేని అసహాయ పరిస్థితి నాది. అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖ జీవితం గడపాలంటే, నీ వంటి దాని సహకారం అవసరం. నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో, మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు.

🥀తల్లిలాగా కాకుండా మంచివాడూ, నెమ్మదస్థుడూ అయిన గోపాలుడంటే నిర్మలకు ఇష్టమే. ఆ ఇష్టాన్ని సూచిస్తూ, సిగ్గుతో తలవంచుకుని కొద్దిసేపు మౌనంగా వూరుకున్న నిర్మల, చివరకు, ఉపాయానికేం ఆలోచించవచ్చుకాని ఎటుతిరిగీ అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు. అన్నది. దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిశాక దాన్ని పూర్తిగా మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు, నిర్మలా! అన్నాడు.

🥀గోపాలుడికి తన మీద వున్న అభిమానానికీ, నమ్మకానికీ కృతజ్ఞతగా చూసిన నిర్మల, అయితే సరే! సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి, నీకు చెబుతాను అన్నది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడమూ, గోపాలుడు దానికి అంగీకరించడమూ జరిగాయి.

🥀ఆ రోజు నుంచి వారం గడవకుండా, ఒక విచిత్రం జరిగింది. ఒకనాటి తెల్లవారుఝామున, ఇంటి ముంగిట కళ్ళాపి చల్లడానికి నిర్మల వచ్చేసరికి, వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు. నిర్మల చప్పున తండ్రిని పిలిచి, సాధువును లోపలకు చేర్చి ఉపచారాలు చేసింది. కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువును, మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు. క్రమంగా అతణ్ణి గురించిన వివరాలు తెలియవచ్చాయి.

🥀సాధువు పేరు కరుణానందుడు. అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు. గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ, అనేక మహిమలు గడించాడు. మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు. గురువు ఆదేశానుసారం, తాను నిర్వాణం చెందేలోగా, జనావాసాలన్నీ కాలినడకన తిరిగి, తన మహిమలన్నీ మంచివాళ్ళకూ, కరుణాహృదయులకూ ధారపోస్తున్నాడు.

🥀అలా తిరుగుతూనే ప్రయాణభారం, వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి. ఊరివాళ్ళలో కొందరు పూలు, పండ్లు తీసుకెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు. ఒకరిద్దరు మంచివాళ్ళకు మాత్రం, ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది. అటువంటి వారిలో సూరమ్మ ఇంటికెదురుగా వుంటున్న గంగాధరం ఒకడు. గంగాధరాన్ని కరుణించిన సాధువు, అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు.

🥀ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది. మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకొని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు. అతడు లోపల దీక్షలో కూర్చుని, నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల, సూరమ్మకు తెలిసినదేమంటే సాధువు, నిర్మలకు మహాలక్ష్మీ మంత్రం ఉపదేశిస్తున్నాడు.

🥀సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమీ శుక్రవారం నాడు, ఆ మంత్రాన్ని ఎనిమిదిసార్లు జపిస్తే, ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి!

🥀ఇది వింటూనే సూరమ్మకు, నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టు తెలియవచ్చింది. సూరమ్మ లోపలికి పోయి, సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి, అతణ్ణి తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది. సాధువు మందహాసం చేస్తూ, ఇప్పుడు వీలుకాదు, తల్లీ! ఏచోటా వారం రోజులకు మించి వుండరాదని గురువాజ్ఞ.

🥀మరొక ఆరునెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మీ మంత్రం జరిపించబోతున్నది. ఉపదేశించిన గురువుగా నన్ను, ఆరోజున ఇక్కడికి వచ్చి, నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది. అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను, అన్నాడు. సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం . స్వామీ కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు సాధువు.

🥀మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే, నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామీ! ఎంతోకాలంగా దాన్ని నా కోడలిని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ దాని తండ్రికి నేనంటే పిసిరంత గౌరవం కూడా లేదు, అన్నది సూరమ్మ. సూరమ్మ మాట వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తర్వాత తెరచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు! వాడు కచ్చేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా? అని ప్రశ్నించాడు. అవును స్వామీ! అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది.

🥀సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్యా! ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు. నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు. రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞ స్వామీ అన్నాడు. ఆ తర్వాత నెల తిరక్కుండానే రామయ్య నిర్మలకూ, గోపాలుడికీ వివాహం జరిపించాడు. వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీలచేత పాడుపడినట్టున్న పెద్ద పెరడును బాగుచేయించి, రకరకాల కూరగాయల మొక్కలు నాటింది. ఆ పెరట్లోనే ఒక మూలగా పాకవేయించి, అందులో రెండు గేదెల్ని కొనితెచ్చిపెట్టి పాలవ్యాపారం ప్రారంభించింది. ఈ విధంగా నాలుగునెలలు గడిచేసరికి కూరగాయలూ, పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనుక వేసింది.

🥀తన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బు సంపాయిస్తున్నదని సూరమ్మ సంతోషించినా, రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మీ మంత్రం జపించి, ఆమె కూడబెట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. కొన్నాళ్ళకు శ్రావణమాసం వచ్చింది. ఒకనాటి ఉదయాన రామయ్య, గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు. తనను చూడగానే పొంగిపోతూ అతిధి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు, ఏం సూరమ్మా! ఇల్లు కళకళలాడుతున్నది.

🥀నీ కోడలు మంత్రం జపించకుండానే, నీ ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందన్నమాట! అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డమూ, జడలూ తీసి పక్కన పెట్టాడు. సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి ఏమిటీ మోసం? అంటూ కోపంగా మరేదో అనబోయింది. కాని, కరుణానందుడిగా వేషం వేసుకు వచ్చిన వృద్దుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయేముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మా! అన్నాడు. అతణ్ణి పరీక్షగా చూసిన సూరమ్మ అతణ్ణి గుర్తుపట్టి తడబడుతూ మీరా! అంటూ తల వంచుకున్నది.

🥀అప్పుడు వృద్దుడు శాంతంగా గుర్తుపట్టావు గదా! అని, అక్కడే వున్న గోపాలుడికేసి తిరిగి, నాయనా! నేను నీ నాన్నకు స్వయానా పినతండ్రిని మీ అమ్మకు పిన మామగారిని. నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటుండేది. అది మా అన్నయ్యకు అంటే, మీ తాతకు ఇష్టం ఉండేదికాదు. నా అభిరుచి వదులుకోలేక, నేను మరొక ఊరు వెళ్ళిపోయాను. వృద్దురాలైన అత్త మామల్ని మీ అమ్మ నానాబాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా, వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకూ కొడుకు కోసం బాధపడుతూనే వున్నారు, అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లీ నేను చెప్పిన దాంట్లో అబద్దం పాలు ఏమీ లేదుగదా? అని ప్రశ్నించాడు.

🥀సూరమ్మ వెలవెలపోతూ, తల పక్కకు తిప్పుకున్నది. వృద్దుడు ఒక్క క్షణం ఆగి, గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకూ, గంగాధరానికీ తెలుసు. నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత, నిర్మల రూపొందించిన పథకంలో, సాధువు పాత్రకు రామయ్యా, గంగాధరం నన్ను ఒప్పించారు. ఆపైన జరిగినదంతా తెలిసిందే! ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది. అంటూ సూరమ్మ వైపు తిరిగి, అత్త మామలను కాల్చుకుతిన్న నీ వంటి దానికి, నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి, నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలిని చేశాడు. నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే, ఈ ఆరునెలలు గడువు ఇచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించావా సరేసరి, లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది. అన్నాడు.

🥀ఆఖరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటా బొటా కన్నీళ్ళు కారుస్తూ మామయ్యా! నా తప్పు నాకు తెలిసింది. మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలవడం నా అదృష్టం. ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది. సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో వున్న ఆమె పినమామతో పాటు అక్కడ వున్నవారందరూ చాలా సంతోషించారు.


☘️☘️🌼🌼🌼🌺🌼🌼🌼☘️☘️

ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకులు .

 ఈరోజు వ్యంగ్య కథా రచయిత, సినీ రచయిత *ముళ్ళపూడి వెంకటరమణ* జన్మదినోత్సవం సందర్భంగా.  వారికి నివాళులు అర్పిస్తూ.... 

జననం 28 జూన్ 1931
మరణం 21 ఫిబ్రవరి 2011

ఈ రమణ మరణించడు..! మరో రమణ జన్మించడు..!

తెలుగు సినిమా మాట నేర్చిన యేడాదే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టారు. కాబట్టే అంత మాటకారి అయ్యారనిపిస్తుంది ఒకోసారి. 1931 లో తెలుగు నాట ‘భక్తప్రహ్లద’ పుట్టాడు. అదే యేడాది జూన్ 28న తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ముళ్ళపూడి వెంకటరావు పుట్టారు. రవణ (షార్ట్ కట్ లో ఇలానే అంటారుస్మీ) పుట్టినప్పుడు ఏం జరిగిందనే ఆసక్తి అందరికీ ఉండటం సహజం. దానికీ రవణే ఇలా సమాధానం చెప్పుకున్నారు.

గోదారి కెడాపెడాగా నేను తూగోజీలో, బాపు పగోజీలో పుట్టాం – ట. అప్పుడు ప్రపంచంలో పూలవాన కురవలేదు. ప్రళయాలు రాలేదు. గంధర్వులు పాడలేదు. కోకిలల్ని ‘కుహూ’ అనమంటే ‘ఊహూ’ అన్నాయని గిట్టని వారి ప్రచారం – అచ్చరలాడలేదు (దుబాయి టూరు వెళ్ళాయిట) – పేపర్లు సప్లిమెంట్లు వేయలేదు. టీవీ యాంకర్లు ‘హలో బాపూ అండీ హలోవ్ రవణాంకుల్’ అని గ్రీటింగ్సులు చెప్పలేదు. భూచక్రంలో భూమండలంలో ఆ రోజు తెల్లారగానే సూర్యుడు మామ్మూలూగానే ఉదయించాడు. ఆ రాత్రి చంద్రుడు కూడ అలవాటు ప్రకారం వెన్నెలే కాశాడు. చుక్కలు తళుకు తళుకు మన్నాయి. కొబ్బరాకులు మిలమిలమన్నాయి. పువ్వులు పూశాయి…” ఈ విధంగా తన జననాన్ని గురించి స్వయంగా ప్రకటించిన రవణ తన మరణం గురించి ఏం ఊహించారో తెలియదు..."


ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకులు .

ముళ్ళపూడి వారి  జోకులు

@ " మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'
"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".

@"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"
"రేపుండదని హెచ్చరిక" 

@కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?
విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."
కమల: చి చి అసయ్యం.

@"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"
" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."

@"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"
"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"
" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".

"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'
" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."

@"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని   పెదవి విరిచాడు.
"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.

@"డాక్టర్ గారూ.భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"
"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"

@ ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ 
"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?" 
"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే..అని వ్యంగ్యంగా జోకులేసేవారు..😀

చక్కెర చీమలు శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన....

 చక్కెర చీమలు

శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన....

కాళీమాత ఆలయం లో ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు

అయితే, ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది.

లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు.

"చీమలను చంపకుండా ఎలా" అని ఆలోచనలో పడ్డారు.

వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు.

అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి. ఇక ఇటు రావు అని సూచించారు.

పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు. ఆ పొడి ని చూడటం తోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. సమస్య కొలిక్కి వచ్చింది.

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.

"మనుషులూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు...." అని చెప్పారు.

తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు

మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకొనే సాధన మొదలు పెడతాము. మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.

తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి. లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు……
 *🌹మనిషికి మనిషికీ దూరమెంత..?*
*అని ఒకతను అడిగాడు...*
*మనసులో నమ్మకముంటే అణువంత*
*అదే లేని రోజు భూమికీ..*
*ఆకాశానికీ ఉన్నంత...!!!*

*🌹చదువు విలువ తెలియని వాని చేతిలో పుస్తకాన్ని, మనసులేని వానిచేతిలో జీవితాన్నిపెట్టకూడదు. ఇద్దరూ వాటితో ఆడుకుంటారు, కానీ గౌరవించరు. మనం అవసరం లేదు అనుకున్నవాళ్లకు మనమే అవసరం అనేలాగా చేస్తుందికాలం.*

🌹 *నీ మనసు ఏది చెబితే అది కచ్చితంగా చేయి.* *ఎందుకంటే అది దేవుడు నీ మనసుకి ఇచ్చిన సంకేతంగా భావించాలి...!*

*🌹ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ.*
*ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.*

🌹🌹🌹🌹🌹🌹

కథ: బాధ్యత

 డబుర ధనలక్ష్మి కథలు ✍️

కథ: బాధ్యత

బెంగళూరు నుండి సెలవుపై ఇంటికొచ్చాడు మోహిత్. 
తన భార్య అర్చన మూడునెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది. 
ఇక అత్తింటి కి రానని మొండికేసింది. తను ఫోన్ చేస్తే అర్చన లిఫ్ట్ చేయడం లేదు. అర్చన కు అసలే పంతం పట్టింపు ఎక్కువ.

అర్చన మోహిత్ తో విడిపోవడానికి నిర్ణయం తీసేసుకుంది.. ఇక తన చేతిలో ఏం మిగిలి లేదు.  మోహిత్ ను ఎంతగానో ఇష్టపడిన అర్చన ఇప్పుడు తన నీడను కూడా సహించడం లేదు. 

ఎప్పుడు చూసినా మోహిత్ కుటుంబం లోని అందరిపై చాడీలు చెప్తూ గొడవలు పడ్తున్న అర్చనంటే ఇంట్లో ఎవరికీ పడడం లేదు. అందుకే గొడవలు చిలికి చిలికి గాలివానలైనాయి. ఇంట్లో గోడవలతో మనఃశ్శాంతి లేకుండా పోయింది.అందుకే ఏదైతే అయిందని విడిపోవడానికే సిద్దపడిపోయాడు.

ఆ రోజు తన బర్త్ డే.

ఆఫీస్ ఈ మెయిల్స్ చెక్ చేస్తుండగా అర్చన పంపిన మెయిల్ కనిపించింది.వెంటనే ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు.

కన్నా 
ఓడిపోయా 
నిను ప్రేమించడం లో కాదు
నా ప్రేమను నీకు అర్థమయ్యేలా చూపడంలో
నీ నుండి నన్ను నేను మరచిపోయేంత తన్మయత్వపు ప్రేమను ఆశించి ఓడిపోయా.

ఊహ తెలిసే సరికే తండ్రిని కోల్పోయా.
అన్నీ తానై గుండె ల్లో దాచుకున్న తల్లి లాలనలో అపురూపంగా పెరిగాను.

ఇంటినిండా పేదరికం ఉన్నా నా తల్లి గుండెల్లో నా పట్ల కొండంత ప్రేమ వెలుగు చూశాను

నా చిన్నప్పుడు ముద్దుల మూటలు కడుతూ నే చెప్పే మాటల్లో అమ్మ తన కష్టాన్నంతా మరచిపోయేది.

చిన్నప్పుడు చీకటంటే భయపడేదాన్ని.

నిశిరాత్రిని కప్పే చీకటి దుప్పటిని చూసి మనుషుల్ని భయపెట్టి పీక్కు తినే దెయ్యాలున్నాయని భయపడేదాన్ని.

కానీ ఆశ్చర్యంగా సాటి మనుషుల రూపంలో వంకర మాటలు మాట్లాడేవాళ్ళు.నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే వాళ్ళు .పుకార్లు పుట్టించి ఆడపిల్ల జీవితాల్లో  అసూయతో అగ్గిరాజేసే వాళ్ళే ఈ కాలానికి నిజమైన దెయ్యాలని తెలుసుకున్నా.

మగదిక్కు లేక అమ్మ పడిన అవమానాలు నా మనసును ఎంతో గాయపరచాయి.

ఎక్కడో జరిగే అత్యాచారాలంటే వణికిపోయేదాన్ని.
లేత శరీరాల పై  ఆ నఖక్షతాలు రాక్షస పంటిగాట్లతో ఉన్న నిస్సహాయ స్త్రీల శవాల దృశ్యాలు ఎక్కడ ఏ వార్తల్లో కనిపించినా చిగురుటాకులా వణికిపోయేదాన్ని.

ఎక్కడికెళ్ళినా  మగాళ్ళ చూపుల్లో తేడా కనిపించేంత ప్రత్యేకత నేను ఏనాడూ కోరుకోలేదు.

నేను ఆడపిల్లను .ఆకాశంలో సగం అంటూ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా నా అడుగులు నేలపైనే గా పడాలి.

చదువు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని నాలో చదవాలనే ఆశను ఆర్థిక స్థిరత్వాన్ని సాధించుకోవాలనే నా ఆశయాన్ని బలంగా శ్వాసించా.

చదువులో ముందుంటూ కాలేజ్ లో టాపర్ గా నిలిచా.

పూలు పరుచుకున్న సుగంధ సమీరాల దారుల్లో
నా మనసును సొంతం చేసుకోవాలన్న చాలామంది తాపత్రయానికి నేను చలించలేదు.

నాకు తెలుసు. వయసొచ్చిన ఆడపిల్ల ఉప్పొంగే గోదారి సొగసు ఎవరినైనా ఆకర్షణ వలయంలో చుట్టేయగలదు.

కానీ ఆ అమ్మాయికి పూల  పూల కీ మారుతూ సుగంధాన్ని ఆస్వాదించే తుమ్మెదలు ధూళితో సమానం.
ఆ ఆడ జీవితాలపై చెడు మచ్చ కు తప్ప ఎందుకూ పనికిరావు.

నా మెడలో తాళి కట్టి నాతో వందేళ్ళ జీవితం పంచుకుని  కష్టాల్లో ఓదార్పుగా సుఖాల్లో తోడుండి సంతోషాన్ని రెట్టింపు చేసే వ్యక్తి జీవిత భాగస్వామి గా రావాలని రెప్పపాటు స్వప్నాలెన్నో స్వప్నించాను.

కలత కన్నుల కన్నీరు నా చెంపలపై జారే అవసరం రానివ్వకుండా అనుక్షణం కష్టసుఖాల్లో నీడలా వెన్నంటి ఉండే  భర్త రావాలనుకున్నా.

అప్పుడే తెలిసినవాళ్ళ ద్వారా మీ పెళ్ళి సంబంధం మా ఇంటికి చేరింది.
పెళ్ళిచూపులు మొదలయ్యాయి.
పట్టుచీర లో వంచిన తల ఎత్తకుండా సిగ్గుబరువుతో సూటిగా మీ కళ్ళలోకి చూడలేకపోయా. అప్పుడప్పుడు మీరు నన్ను సూటిగా చూస్తున్న చూపు నాకు తెలుస్తూనే ఉంది.

దేవుడు రాసిపెట్టి నట్టు మన పెళ్ళి కుదిరింది. నాకేమో మీరు తెగ నచ్చేసారు. నాకంటే అందంగా ఉన్న మీకు నా దిష్టే తగులుతుందేమో అనుకునేంత.

మీ కుటుంబం గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. మీ నాన్నగారిది పెద్ద ఉద్యోగం.మూడంతస్తుల ఇంద్రభవనం లాంటి ఇల్లు.
మీతో కలిసి పంచుకునే జీవితం పట్ల 
ఎన్నో కలలు కంటూ
మరెన్నో ఆశలు పెంచేసుకున్నాను 
భావిజీవితపు ఊహలు నన్ను భూమిపై నిలవనివ్వలేదు.

పెళ్ళి వారం రోజులు ఉందనగా "కట్నం తేలడం లేదు. పది లక్షలు అంటే ఒప్పుకోవట్లేదు.పన్నెండు లక్షలు కావాలంట. ఎనిమిదెకరాల పొలం వారి పేర రాయమంటున్నారు. కట్నం కావలిస్తే ఇంకో రెండు లక్షలు పెంచి ఇస్తాను కానీ పొలం మాత్రం నా కూతురు పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తా అని చెప్పా "  అంటూ మా అమ్మ బాధపడింది.

తొలిసారి మనసులో వెలితిగా అనిపించింది. ఈ పెళ్ళికి ఒప్పుకుని తప్పు చేశానా అనిపించింది.
కానీ అనుకున్న ముహూర్తానికి మన పెళ్ళి జరిగిపోయింది.

మీతో మొదలైన కొత్త జీవితం ఓ అద్భుత లోకం.

చిన్నప్పటి నా భయాలన్నీ పటాపంచలైపోయాయి.

తండ్రిగా భర్తగా కొడుకుగా స్త్రీ తనపై హక్కును నమ్మకం ప్రేమతో ఇస్తుంది.

భర్తగా మీ తోడు మీరు చూపించే ప్రేమ మీ బాధ్యత మీ ప్రేమ ప్రపంచం నాదే అనిపించింది





పాప పుట్టిన రోజు నేను హాస్పిటల్ లో నే ఉన్నా. పాపను నా చేతుల్లోకి తీసుకుంటుంటే ఆ పసిదాని స్పర్శ నాలో తెలియని సంతోషాన్ని నా మదికి పరిచయం చేసింది. 

అప్పుడే నా చిట్టితల్లి కి వాగ్ధానం చేసా. మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగించి తనకు మంచి అమ్మానాన్నలు గా సంతోషాన్ని పంచుతామని.

నువు పీజీ పూర్తి చేశాక జాబ్ లో జాయిన్ అయ్యావు. అక్కడ నీకు సమస్యలు రాకుండా నా స్నేహితున్ని  నీకు తెలియకుండానే తోడుగా ఉంచా.

అప్పుడే మా అమ్మ కరోనాతో చనిపోవడం నన్ను మానసికంగా కృంగి దీసింది.

అదేంటో నా మనసుకు ఏ కష్టం వచ్చినా నువ్వు నా పక్కనుంటే బాగుండేది అనిపించేది.

నువ్వు జాబ్ లో సమస్యలు ఎదుర్కొన్నపుడు నీకు ఓదార్పు అవుదాం అనుకున్నా.కానీ ఈ సమాజంలో నువ్వు స్వతంత్ర వ్యక్తిత్వంతో ఎదగాలని కోరుకున్నా.

ఇక మనం కలిసే సమయం వచ్చిందని అనిపించింది.అందుకే వచ్చా. నీకు అభ్యంతరం లేకపోతే మనం తిరిగి మన జీవితాన్ని ప్రారంభిద్దాం. మన పాపకు మంచి తల్లిదండ్రులు అవుదాం " అన్నాడు.

కన్నీళ్ళతో  అంగీకార సూచకంగా అల్లుకుపోయింది అర్చన.

రెండు వారాల తర్వాత తన భుజంపై నిద్రపోతున్న చిన్నారికూతురికి నిద్రాభంగం కలగకుండా  బెడ్ పై పడుకోబెట్టి రెండువైపులా మెత్తటి తలగడలను పెడుతున్న మోహిత్ ను మెల్లగా హత్తుకుంది అర్చన.

అర్చన " మీరెంత గా నన్ను పాపను మిస్ అయ్యారో నేను కూడా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని మిస్ అయ్యాను.

పొత్తిళ్ళలో బిడ్డను తండ్రికి దూరం చేసేహక్కు నాకు లేదనిపించింది.
మీ అమ్మ గారు కరోనాతో చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డా.
బాధ్యతగా మారి మీరు వస్తే మీతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనే ఆశపడ్డా.
ఇక మన గొడవల కంటే పాప భవిష్యత్తు కు విలువిద్దాం"అంది.

కలిసిన మనసులు
అర్థం చేసుకునే సర్దుబాటు గుణం
క్షమించే ఔదార్యం
ఒకరికొకరు తోడుండటం భార్యాభర్తలు అనుబంధానికి గట్టి పునాది .

విడిపోవడం తేలిక.
సర్దుకుపోతూ కలిసి బ్రతకడం లోనే సమర్థత ఉంటుంది.
ఆవేశంతో నో ఆవేదనతో నో భార్యాభర్తలు విడిపోవచ్చు.

కానీ ఏ పాపం తెలియని పసివాళ్ళను ఈ  లోకంలోకి తీసుకొచ్చి అమ్మానాన్నల లాలన లో పెరగాల్సిన బాల్యాన్ని అమ్మానాన్నలు విడిపోయి ఆ పసిహృదయాలను ప్రేమ రాహిత్యం లోకి ఒంటరితనం లోనికి అభద్రత లోకి నెట్టి వేయడం అమానుషం.

అందుకే పెళ్ళి అంటేనే ఒకరి జీవితం కాదు.
రెండు కుటుంబాల పరువు.
కొన్ని జీవితాలు.
సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాలు గాడాంధకారం.

సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతు