Wednesday, July 12, 2023

🙏🙏👌పరాయి స్త్రీ పై వ్యామోహం ఎటు వంటిది. అందరికీ అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.

🙏🙏👌పరాయి స్త్రీ పై వ్యామోహం ఎటు వంటిది. అందరికీ అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.
ఒకసారి ఒక రాజుగారు గుర్రం పై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు....
ఆ ఇoటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నము వడ్డిస్తూ వుంది...
ఆమె చాల అందగత్తె, ఆవిడ అందము చూసి రాజుగార్కి ఆశ్చర్యము కలిగింది, ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇoత ఆందమైన అమ్మాయిని ఇదివరకు చుదలేదే అని అనుకున్నాడు.......
ఆమె భరత బోజనo చేసి తన పని కై బయటికి వెళ్ళాడు. భర్త ను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లో కి వెళ్ళింది ....
అప్పుడా రాజు ఇoటి తలుపు తట్టాడు . ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజ వంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది.ఎవరు మీరు అని ప్రశ్నించింది ...
రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి కి రాజు ను, నీవు చాలా అందంగా వున్నావు ,నీ అందం నన్ను కట్టిపడవేస్తోంది. నిన్ను నా భార్య గ చేసుకోవాలి అనుకుంటున్నాను ,నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహా రాణిని చేస్తాను , నీవు చూడని సంపద చూడగలవు , అడుగులకు మడుగులోత్తే పనివారు , కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు.
ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారము కలది.ఆవిడ రాజు గారి తో ఇలా అన్నది . రాజా !! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను ముందు మీరు ఆలసిపోయి వోచి వుంటారు. శరీరం,మనసు రెండు ఆకలితో వుంటాయి.మీరు వెళ్లి కళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పింది ....
ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు,ఇంత సులువుగా తన కోరిక తీరుతందని , ఆవిడ అంగీకరిస్తుందనీ ఊహించలేదు.ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలనుకున్నాడు.కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు.కాళ్ళు చేతులు కడుగుకొని ఇంటిలోనికి వెళ్ళాడు.
రాజా , మీరు భొంచేయండి అంటూ వాళ్ళ ఆయన తినిన అరిటి ఆకును రాజు ముందు వేసి ఇలా అన్నది ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు,అదే ఎంగిలి ఆకులో మీరూ భోజనము చేయండి.మీ ఆకలి తీరాక నేనూ మీతో వస్తాను మీ రాజ్యానికి అన్నది.
రాజుకు ఊహించని ఆ పరిణామానికి ఆమెపై కోపము , ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యము కలిగాయి.దేశాన్నేలే ప్రభువును నేను ,ఎప్పుడూ బంగారు పళ్ళెంలో ఘుమఘుమలాడే షడ్రసోపేతమయిన వంటకాలు వేడి వేడిగా తినే నాకు ఈ ఒక ఎంగిలి ఆకులో భోజనము వడ్డించడానికి నీకెంత ధైర్యము అని గద్దించాడు.
అందుకు సమాదానంగా ఆమె ఇలా చెప్పింది.
మహరాజా నా భర్త బోజనము చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు యేన్గిలిఎంగిలి అడ్డు రలేధా, పెళ్ళైన నన్నుపెళ్లి మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అడ్డరని ఎంగిలి , భోంచేసే విస్తరాకు విషయంలో కలిగిందా , ఎంత ఆశ్చర్యము అన్నది ...
రాజుకు తన మాటలలోని అంతరార్ధం అర్ధమయ్యింది.కనువిప్పు కలిగింది.మొహం పటా పంచలయ్యింది.ఆవిడ సంస్కారానికి , సమయస్పూర్తికి ముగ్ధుడయ్యాడు .ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి తల్లీ నన్ను క్షమించు ,కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను.నీవు ఎంతో నేర్పుగా నాకు సుక్ష్మాన్ని దర్శింపజేశావు.నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు.నీవంటి మాతృ ముర్తులవల్లే ధర్మం ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఇందులోని నీతి ఏమిటంటే
పరాయి స్త్రీ పై వ్యామోహం ఎంగిలి ఆకులో బోజనము ఒక్కటే ....
స్త్రీలలో ఆడతనాన్ని గాక అమ్మతనాన్ని దర్శించిన వారు కృతార్దువులవుతారు
ఓం శ్రీ మాత్రే నమః.👌🙏🙏

No comments:

Post a Comment