Thursday, November 30, 2023

అది తెలిస్తే జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *కాంచీపురాన్ని పరిపాలించే మహారాజు తన కుమారుణ్ణి గొప్ప విద్యావంతుణ్ణి చేశాడు. రాజ్యపాలనకు చెందిన అన్ని విషయాలలో తర్ఫీదు ఇప్పించి యువరాజపట్టాభిషేకం చేసాడు. రాజ్యపాలనలో యువరాజు సలహాలను కూడా మహారాజు తీసుకొనేవాడు.*
💖 *కొందరు ప్రజలు మహారాజు దగ్గరకువచ్చి అడవికి దగ్గరగా ఉన్న తమ గ్రామాలలోకి క్రూరమృగాలు వస్తున్నాయని, వాటి నుండి రక్షించాలని కోరారు. వెంటనే రాజు పక్కనే ఉన్న యువరాజు వంక చూశాడు. ఆ చూపును అర్ధం చేసుకున్న యువరాజు ప్రజల వెంట అడవికి బయలు దేరాడు. క్రూరమృగాల్ని వేటాడుతూ ఆయన ఆ అడవిలో చాలాదూరం వెళ్ళాడు.*
❤️ *క్రూరమృగాల్ని చాలా మటుకు వధించాడు. వేటలో అలసట చెందిన యువరాజుకు దాహం వేసింది. నీటి కోసం చుట్టూ చూసాడు. ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దగ్గరగా ఉన్న ఒక చెట్టెక్కి చూడగా కొద్దిదూరంలో ఒక ఆశ్రమం కనిపించగా చెట్టు దిగి ఆశ్రమం చేరుకొన్నాడు. అక్కడ ఒక స్వామి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. యువరాజు వచ్చిన అలికిడికి కళ్లు తెరిచిన ఆ స్వామి యువరాజును లోనికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసాడు.*
💞 *సేద తీరిన యువరాజును ఆ స్వామి ‘మీరెవరు? మీ పేరేంటి?’ అని ప్రశ్నించాడు. యువరాజు “స్వామీ! మాది సమీపంలోని ఒక రాజ్యం. నేను యువరాజును నా పేరు మోహదీప్తుడు. అయినా అందరూ నిస్సంగుడు అని పిలుస్తారు” అన్నాడు.* 
💕 *ఆ స్వామి ‘నాయనా! నీ పేరు విచిత్రంగా ఉందే’ అన్నాడు. యువరాజు ‘స్వామీ! నా ఒక్క పేరేమిటి? మా రాజ్యంలో అన్నీ ఇలాగే ఉంటాయి.’ అన్నాడు.*
💞 *ఆ వెంటనే స్వామికి ఏదో తోచింది. ‘యువరాజా! మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. మీ ఉత్తరీయం నాకివ్వండి. నేను మీ రాజ్యంలోకి పోయి వస్తాను’ అని ఉత్తరీయాన్ని తీసుకున్నాడు. కొంతదూరం పోయిన తర్వాత ఆ ఉత్తరీయానికి అక్కడక్కడ కొంత రక్తం మరకలు పులుముకుని ఆ రాజ్యం చేరుకున్నాడు.*

💖 *రాజాంతఃపుర ద్వారం దగ్గర ఒక దాసి ఎదురైంది స్వామికి. అపుడా స్వామి ఆ దాసితో ‘అమ్మా! అడవిలో మీ యువరాజును పులి చంపేసింది. ఇదిగో రక్తంతో తడిసిన ఆయన ఉత్తరీయం’ అన్నాడు. అప్పుడా దాసి ‘దానిదేముంది స్వామీ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని శ్లోకాలను గుర్తుకు తెచ్చుకోండి’ అంటూ వెళ్లిపోయింది.*
💓 *ఆశ్చర్యపోయిన ఆ స్వామి అంతఃపురంలోని రాజు దగ్గరకు పోయి యువరాజు మరణవార్త చెప్పాడు. ఆ రాజు స్వామితో “బుుణగ్రస్తుడు. బుుణం తీరింది వెళ్లిపోయాడు” అని తన పనిలో మునిగిపోయాడు. స్వామికి మరింత ఆశ్చర్యం వేసింది.*
*సరే అనుకుని రాణి దగ్గరకు పోయి కొడుకు మరణవార్త వినిపించాడు. అందుకామె బాధ పడలేదు. పైగా ‘స్వామీ! చెట్టుపై సాయంత్రం చేరిన పక్షులు ఉదయమే వెళ్లిపోతాయి. ఆ సాయంత్రం ఆ చెట్టుపైకి ఎన్ని పక్షులు తరిగి చేరుకుంటాయో తెలియదు కదా’ అని అన్నది. “ఈమె కూడా ఇట్లాఅన్నదేంటీ” అని ఆ స్వామి యువరాజు భార్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. అందుకామె ‘స్వామీ ప్రవహిస్తున్న గంగానది పైనున్న దుంగలం మనమంతా. అలలపై కొన్ని దుంగలు కొట్టుకుని పోతాయి. దానికి చింతించ వల్సిన పనిలేదు’ అన్నది. స్వామి ఇక్కడ యింకేం పని లేదనుకుని ఆశ్రమం చేరుకుని ‘రాజా! మీ రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించుకుని మీ తల్లినీ, తండ్రినీ బంధించారు’ అని యువరాజుతో అన్నాడు.* 
❤️ *విషయం తెలుసుకున్న యువరాజు ‘స్వామీ ఇందులో విచిత్రమేముంది? యాత్రికుల్లాగా ఇక్కడికి వచ్చాం. యాత్ర ముగిసింది. అంతేగదా అని అనగానే స్వామికి ఆనందం రెట్టింపు అయింది.*
💖 *సత్సంగత్వే నిః సఙ్గత్వం నిఃసఙ్గత్వే నిర్మోహత్వం |*
*నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||*
💓 *~జ్ఞానులైన సజ్జనుల సాంగత్యము వల్ల సంసార బంధాలు విడిపోతాయి. బంధాలు విడిపోతే అజ్ఞాన మూలకమైన మోహమూ పోతుంది. మోహం నశించితే నిశ్చలమైన పరిశుద్ధ తత్వము గోచరమౌతుంది. అది తెలిస్తే జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment