Sunday, April 14, 2024

కష్టమొస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలా మందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడూ గుర్తు రావాలనే కుంతీదేవి తనకు ఎప్పుడూ కష్టాలు కలగాలని కోరుకుంది.

 *06-Jan-24 జ్ఞానోదయం కథ*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కష్టమొస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలా మందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడూ గుర్తు రావాలనే కుంతీదేవి తనకు ఎప్పుడూ కష్టాలు కలగాలని కోరుకుంది.*
ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా బాదర బందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ను ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం. కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు వస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం, మన బాధలు తీరక పోతుంటే సులభంగా దేవుళ్లని మార్చడం.  ఇది ఇప్పుడు సమా జంలో అతి సహజాతి సహజంగా జరుగుతున్న పరిణామ క్రమం. 

 *ఒక కథ చెప్పుకుందాం:*
పూర్వం ఒకాయనకి చాలా చిక్కులొచ్చేయి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పేరు. ఏ దేవుని పూజించాలనే మీమాంస వచ్చింది. శివుడు భోళా శంకరుడు కదా భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలోఎవరో చెప్పేరు కృష్ణుడు అద్భుత లీలలు, మహిమలు చేసినవాడని, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడతా డని చెప్పారు. శివ లింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలెట్టాడు.

కష్టాలు తీర లేదు.వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుణ్ని పూజించాలని ఆయన ఆరాధన మొదలెట్టాడు.ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పేరు ఆంజనేయుడయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయనను పూజించమని. ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి నియమబద్ధంగా పూజించటం మొదలెట్టాడు. ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్లు అందరూ ఇంతే. మగ దేవుళ్లు సులభంగా కరగరు, అమ్మవారి లాంటి వారయితే కరుణ, ప్రేమ ఎక్కువ. తల్లిలా ఆదుకుంటుందని అమ్మను  కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు.అయితే ఆయన సుకృతమో, కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరేయి, కోరికలు నెరవేరాయి. సిరిసంపదలు, సుఖసంతోషాలు కలిగాయి. అమ్మ  మీద నమ్మకం పెరిగిపోయింది. 
ఒకరోజు అమ్మ  ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం, తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు. వారికి ఈ ధూపం ఆఘ్రాణించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డలు కట్టాడు . అప్పుడు మళ్లీ అమ్మని  ధ్యానిస్తూ కళ్లు మూసుకున్నాడు. కొంత సేపైన తర్వాత కళ్లు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్లని చూసి ఆశ్చర్యపోయాడు.
అయితే తేరుకుని “నేను మిమ్మల్ని అందరినీ చాలాకాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిపుడు మిమ్మల్ని పిలవలేదు. రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు, నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కూడా కట్టాను”అన్నాడు. అప్పుడు శివుడు 'నాయనా అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. 

కనుకనే కదా ధూపం ఆఘ్రాణించకూడదని ముక్కునోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాం' అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్న ట్టు చిరునవ్వు చిందించారు. అందరూ అతణ్ని ఆశీర్వదించి అంతర్థానమయ్యారు.ఇక్కడ మనం తెలుసుకోవలసింది భగవంతుణ్ని విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి. ఆరాధించాలి.రామకృష్ణ పరమహంస చిన్నతనంలో ఒకసారి అమ్మవారి గుడికి అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజూ నైవేద్యం తింటుందనుకున్నాడు. 'రోజూ తినే దానివి ఈ రోజు తినవేమి. తింటే కాని వెళ్లన'న్నాడు. తాను తింటానన్న అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది. అదీ విశ్వాసమంటే. 

 *కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాలనుంచి ఉపశమనం తప్పక లభిస్తుంది.*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

No comments:

Post a Comment