🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
ప్రశ్న: వైకల్యం లేని కైవల్యమును మానవుడు పొందలేడా?
పరబ్రహ్మ వాక్కు
0. నిత్యసత్య శాశ్వతమైన సత్యసాధనకు, దృఢసంకల్పం, నిశ్చలబుద్ధి, చిత్తశుద్ధి ప్రధాన అంగములు. అనన్య భక్తి లేని పూజ, నమ్మకం లేని గురుసేవ వ్యర్ధములు/ఫలశూన్యములు
1. పరిశుద్ధమైన / పరార్ధ జీవనుడైన మానవుడే పరమాత్మతో సమానుడు
2. దేవుడు వేరే లేడు
3. నీలోనే ఉన్నాడు
4. ప్రతీక్షణం నీవు చేసే ఆలోచనలను చేసే పనులను గమనిస్తూనే ఉన్నాడు
5. కాని పనులకు కాదని హెచ్చరిస్తున్నాడు
6. అది గుర్తించలేక ఆత్మ సంయమనము చేసుకోలేక మానవుడే తప్పు తోవలపడి అథః పతితుడగుచున్నాడు
7. కనుక మానవుడే దేవుడు.
8. నువ్వు నేనే- నువ్వు నేనే. ఇందులో సందేహం లేదు
9. ఈ దివ్యత్వాన్ని నువ్వు గానే దర్శించు. అనన్య భక్తికి మించిన సాధన లేదు ఆత్మ నివేదనకు మించిన ఆరాధన లేదు.
విధిరాత విఫలము - సద్గురువాక్కు సఫలము. ఇది అపవర్గ మార్గము
నిత్య సత్య శాశ్వత కైవల్య ప్రాప్తి స్వరూపులు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
No comments:
Post a Comment