Tuesday, March 30, 2021

జంతు బలుల యొక్క అంతరార్థం ఏమిటి?

🐑జంతు బలుల యొక్క అంతరార్థం ఏమిటి?🐏

శ్రీ విద్యా సంప్రదాయం మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ( హైందవ ) ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి ?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడాని కానీ మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది. కానీ సనాతన ధర్మం లోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం , దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా?

బలి అంటే :

గుడిలోని బలిపీఠం సనాతన ధర్మంలో భూతబలి అనే ఆచారం స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ ఇతర పదార్థమును కానీ గుడిలో వివిధ దిక్కులలో కానీ బలి పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ ప్రకృతిలోని ఉగ్ర భూతములూ తింటాయి. ఇది గృహస్తులు కూడా ఇంటివద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. ఐతే బలికి హోమానికి తేడా ఉన్నది హోమం అగ్ని ద్వారా ఇస్తారు. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది.

ఆచరణలో దోషం :

శ్రీ విద్య మొదలైన సంప్రదాయాలలో జంతు బలుల ప్రస్థావన ఉన్నది. అవి దేవతలకు ఒక పొట్టేలునో మేకపోతునో నల్లపిల్లినో దున్నపోతునో బలి ఇవ్వమని చెప్పాయి. ఐతే దాని అర్థం ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు.

నల్ల పిల్లి దొంగతనానికి సంకేతం. అందుకే పిల్లిలా వచ్చాడు రా అంటూ ఉంటారు. చప్పుడు చేయకుండా వచ్చి చీకట్లో దొంగతనం చేయడంలో పిల్లిని ఉదాహరణగా చెప్తారు. ఇక నల్ల పిల్లి ఐతే అసలే కనపడదు. నల్ల పిల్లిని బలియ్యి అంటే నీలోని పరుల సొమ్ముపై ఉన్న ఆశ అనే నల్ల పిల్లిని బలియ్యి అని అంతే కానీ ఒక నల్ల పిల్లిని చంపేయమని కాదు.

మేకపోతు లేక పొట్టేలు మూర్ఖత్వానికి ప్రతీకలు. ఒకటి ఎటు వెళితే మిగిలినవి కూడా అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి. నీలోని మూర్ఖత్వాన్ని బలి ఇవ్వడం ద్వారా చేసిన కర్మ వలన మరలా పునర్జన్మ వస్తుంది అనే సత్యం తెలుసుకుని మోక్ష మార్గం లో ప్రయాణించవచ్చు.

దున్నపోతు పిరికితనానికీ బద్దకానికీ జడత్వానికి ( చైతన్యం లేకపోవుట )ప్రతీక. నిలోని జడత్వాన్ని వదిలి చైతన్యం వైపూ బద్దకాన్ని విడిచి ఉన్నతమైన జీవితం వైపూ నాకేమౌతుందో అన్న పిరికితనం లో ఉన్న శరీరం పైన మోహాన్ని త్యజించి మోక్షం వైపూ ప్రయాణించమని దాని అర్థం.

ఆ విధంగా మనలోని లోపాలను బలియ్యమని శాస్త్రాలు చెప్పాయి తప్ప జీవహింస చేయమని కాదు.

మూఢనమ్మకం:

కోరికల కోసం జంతుబలులు ఇవ్వడం అనేది ఒక మూఢనమ్మకం మాత్రమే. భాగవతంలో కృష్ణుడిచే పశూమ్ దృశ్యంతి విశబ్దా: అని బలి పేరిట అన్యాయంగా చంపివేయబడ్డ జంతువులు స్వర్గంలో చంపినవాడిపై పగతో ఎదురుచూస్తాయి అని చెప్పబడింది.

అదేవిధంగా భగవద్గీత ప్రతి జీవి దేవుడి దృష్టిలో సమానం అని చెప్పినది – భగవద్గీత , 5.18

ఒక కాలంలో చారిత్రక తప్పిదంగా ఏర్పడిందే తప్ప సనాతన ధర్మంలో జంతుబలి లేదు. అశ్వం నైవా గజంనైవ వ్యాఘ్రం నైవచ నైవచ … అంటూ పూర్వం చెప్పిన రీతిలో గుఱ్ఱమును ఏనుగును పులులను చంపలేరు కనుక లోకువగా దొరికిన మేకను దేవుని పేరుతో చంపినారు అని,

ఋగ్వేదంలో దున్నపోతుల,మేకపోతుల బలులు బ్రాహ్మణులు అర్పించి ఇంద్రిణ్ణి తృప్తి పరిచారు అని ఉన్నది. ఇంద్రడు ఇంద్రియములకు దేవత. అంటే వారి ఇంద్రియాలలో మనసులో లోపాలను బలిగా సమర్పించారు అనే తప్ప చంపేశారు అని కాదు.

వేదాలు ఇతర ఐతిహాసిక గ్రంథాలు పుస్తకరూపంలో రావడం వలనా గురువు వద్ద నేర్చుకోకుండా వారి వారి సొంత అభిప్రాయాలకు రావడం వలన ఏర్పడిన తప్పిదమే తప్ప మరొకటి కాదు.

ఇప్పుడు మనకు జంతు బలుల యొక్క అంతరార్థం తెలిసింది కనుక ఇకనైనా విచక్షణతో ప్రవర్తిద్దాం. అమాయకమైన జంతువులను బతకనిద్దాం.

ఓం నమో నారాయణాయ🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment