Friday, September 10, 2021

శాఖాహారమే మంచిది, మాంసాహారం గురించి ఎవరు ఏమన్నారో చూడండి .

శాఖాహారమే మంచిది

మాంసాహారం గురించి ఎవరు ఏమన్నారో చూడండి .


వీరబ్రహ్మేంద్రస్వామి
“జీవులను వధించి జీవికి వేసిన
జీవ దోషములను జిక్కువడును:
జీవహింస చేత చిక్కునా మోక్షంబు?
కాళికాంబ ! హంస కాళికాంబ ! “

యోగి వేమన
” పక్షిజాతి బట్టి పరగ హింసల బెట్టి
కుక్షినిండ కూడు కూరుటకును
వండి తినెడివాడు వసుధ ఛండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ !”

జార్జి బెర్నార్డ్‌షా
“మాంసాన్ని తినే మనము నడుస్తూ, తిరుగుతూ ఉన్న సమాధులం. వీటిలో మన జిహ్వ చాపల్యం కోసం చంపబడిన జంతువుల శవాలు పూడ్చిపెట్టబడ్డాయి.”
“శవాల కుళ్ళు మాంసాన్ని పీక్కుతినే కాకుల వలె మనం మాంసం తింటూ జీవిస్తున్నాం. దీనివల్ల జీవులకు భయంకరమైన బాధ, కష్టం కలుగుతుందనే దాని గురించి మనకు చింతలేదు. మనము పట్టించుకోం. ఎంతటి దౌర్భాగ్యమో ..”

ఓషో రజనీష్
“జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువూ చంప బడకూడదు. భూమి మీద ఏ జంతువు అవసరం వున్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద వుండదో దాన్ని చంపినా చంపకపోయినా భూమిమీద నుండి అది అదృశ్యమైపోతుంది.“
“జంతువులు మానవులకు సోదరులు, తోబుట్టువులు. కారణం వారి నుండే మానవుడు వచ్చాడు. అది మన కుటుంబం. మానవుడిని చంపడమంటే ఎదిగిన జంతువును చంపడం. జంతువును చంపడమంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. రెండూ సమానమే. కారణం ఒకనాటి జంతువులే మనుష్యులుగా పరిణామం చెందుతున్నారు.”

కబీర్ దాస్
“జంతువులను ఒక్క పెట్టున నరకడం, చాలాసేపు రక్తం కార్చుతూ చంపడం దోషపూరితం, అధమం మరి దయా రహితం. అలాంటివారు అంత్య సమయంలో శిక్ష అనుభవించవలసి వస్తుంది.”
“కడుపు నిండా చేపల్ని తిని కోటి గోవులను దానమిచ్చినా .. నరకానికే వెళతారు. బాధ అనేది ఏ జీవికైనా ఒక్కటే, మూర్ఖులైన జనులు గ్రహించడంలేదు.”

స్వామి దయానంద సరస్వతి
“మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. మాంసం తినేవారి, మత్తుపానీయాల్ని త్రాగేవారి శరీరాలు మరి వీర్యకణాలు కూడా కలుషితమవుతాయి.”

మైఖేల్ నేమి
“ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చబడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరువబడతాయి. ప్రతీ రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందే” ఇది తిరుగులేని న్యాయ సూత్రం.

మనుస్మృతి
“జీవులను చంపేవారు, చంపించేవారు, అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, మాంసం కోసేవారు, తినేవారు, తినిపించేవారు ఈ ఎనిమిది రకాల వారు హత్యలో భాగస్వాములే.”

ఇస్లాం
“భూమిపై సంచరించు జంతువులు గానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు గానీ, సృష్టిలోని సమస్తమూ మీవంటివే.”
-7వ కాండ 38వ వాక్యం.

ఖురాన్
“అతడే పందిళ్ళపై నెక్కింపబడు తోటలను, పందిళ్ళగా మారని వృక్షములను సృష్టించెను. అలాగే ఖర్జూర వృక్షములను, పొలములను సృష్టించెను. వాని ఫలములు వేరువేరుగా నున్నవి. దానిమ్మను కూడా సృష్టించెను. ఒకదానికొకటి పోలికలు లేని ఫలములను సృష్టించెను. అవి ఫలించినప్పుడు వాటిని భుజింపుము. వృధాగా ఖర్చుచేయకుము. అటువంటి వారిని భగవంతుడు ప్రేమించడు.”
-8వ కాండ 142వ వాక్యం,
ఖురాన్
“ఓ జనులారా ! భూమిలోని వస్తువులలో శాస్త్ర సమ్మతములై, పవిత్రములైన వాటిని భుజింపుము. ‘సైతాను’మార్గంలో నడవకుము. నిశ్చయముగా ‘సాతాను’మీకు సుస్పష్టమైన శత్రువు. హింసాకార్యములను చేయు దిశగా మిమ్ములను ప్రేరేపించును. అసత్యములను పరమాత్మపై మోపుటకు మిమ్ములను ఆజ్ఞాపించును.”
-2వ సూరా 168వ వాక్యం.
ఖురాన్
“ఎవడు ఒక హత్య బదులుగా కాక భూమిలో ఉపద్రవమునకు గాక ఒక జీవిని చంపునో, అట్టివాడు సర్వజీవులను చంపినవాడగును. ఎవడు ఒక ఆత్మను బ్రతకనిచ్చునో, వాడు సర్వ ఆత్మలను బ్రతుకనిచ్చిన వాడగును.”
-6వ కాండ 32వ వాక్యం, ఖురాన్

క్రైస్తవం
ఎడ్మండ్ జకై ప్రచురించిన “గాస్పెల్ ఆఫ్ పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్” అనే పుస్తకంలో ఏసుక్రీస్తు ప్రవచనాలను ఈ విధంగా వ్రాశారు:
“ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు. ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు. జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు. ఎందుకంటే ఈ పాపానికి ఫలితం అంటే శిక్ష మరణం కంటే తక్కువుగా వుండజాలదు. ఎందుకంటే వాడి శరీరంలో ఆ జంతువుల రక్తం యొక్క ప్రతి చుక్కా విషంగా మారుతుంది. వాని శ్వాసలో మృత పశువుల శ్వాసల దుర్గంధముంటుంది. వాని రక్తం మృత పశువుల రక్తంలానే పొంగుతుంది .. మరి పశువుల మరణం వాని మరణం అవుతుంది” అని చెప్పారు.
“మూగ జీవులను చంపకు. అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతాన్‌కు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. అది మృత్యువు వైపుకు తీసుకు వెళ్తుంది. పరమాత్మ ఆజ్ఞలో జీవించు, అలా జీవిస్తే ఆయన దూతలు జీవితపు మార్గంలో నీకు సహాయం చేస్తారు. అందువలన పరమాత్మ యొక్క ఈ ఆదేశాన్ని పాటించు. చూడు .. నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలనూ, ధాన్యాలనూ ఇచ్చాను. ఫలాలు కాచే అనేక వృక్షాలను ఇచ్చాను. ఇవి నీకు మాంసానికి బదులుగా ఇవ్వబడ్డాయి. రక్తమాంసాలతో వున్న వాటిని నీవెన్నడూ తినకు.
– The Gospal of peace, Jesus p.48,49

జైన్ బోధనలు
“జీవించు–జీవించనివ్వు“
“జైన మతం” లో అయిదు మహావ్రతాల్లో మొదటిది మరి అత్యంత అవశ్యకమైన మహావ్రతం ‘అహింస’. ఏ జీవికి ఏ రకమైన దుఃఖాన్నీ, కష్టాన్నీ కలిగించకుండటం, వాటిపై దయ, ప్రేమ చూపడమన్నది ముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. వారు దీనినే ‘మహావ్రతం’అంటారు.
జైన మతం ప్రకారం జంతువులను బంధించడం దుఃఖాన్ని కలిగించడం, కొట్టడం, వాటిపైన అధిక బరువు వేయడం కూడా మహాపాపంగా పరిగణించబడుతుంది.

☘🌷☘🌷☘🌷☘

Source - Whatsapp Message

No comments:

Post a Comment