Wednesday, August 31, 2022

జీవిత సత్యాలు

ఈరోజు కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం

జనరల్ బోగీలో వెళ్ళినా, 
ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు .అలాగే పక్కనెంత మందున్నా, ఎంత సంపదున్నా ఏంటి ?30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. 
పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !
ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే...ఇద్దరూ గెలుస్తారు 
ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి
దేవుడి కోసం తీర్ధాలు, పుణ్య క్షేత్రాలంటూ తిరుగుతారు , ఆయనెక్కడో లేడు. 
శ్వాస తీసుకుంటూ సృష్టితో మనమేసుకున్న 'లంకె'లోనే వున్నాడు.
కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. 
ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. 
నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. 
కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... 
నీకు గొడుగుపట్టి కాపాడతాడు... ఈ సత్యాన్ని గుర్తుంచుకో 
కొబ్బరిచెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగి పోతాయి.
పుండు మానితే పొలుసు అదే పోతుంది. 
పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… 
పుండు తీవ్రమై రక్తం కారుతుంది .అలాగే 
జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. 
ఆత్రపడితే లాభం లేదు !
సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి ముందుకు చూడు. 
నీపై నీకు నమ్మకం కావాలి.
నీపై నమ్మకం నీకు బలం. 
నీపై అపనమ్మకం అవతలివారికి బలం !
నీ బలం ఎవరికీ తెలియక పోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !
మరణం ఎంతో మధురమైనది. ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్ట లేరు. 
ప్రకృతికి కూడా అదంటే ఎంతో పక్షపాతం ! 
ప్రాణం పోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది. 
నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు 
నీ రోగాలను తగ్గించగలడు. కావున 
వాటిని ఆరోగ్యంగా వుంచుకో.
వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. మరి నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ? అందుకే ప్రతిరోజు ధ్యానం చేస్తూ మలినాన్ని కడిగేయి
నిజాయితీపరులు సింహం లాంటి వాళ్ళు. 
సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. 
నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !
ముని-మహర్షి-తపస్వి-యోగి.వీరు వేరు వేరు. మౌనంగా వుండేవాడు ముని.
నియమ నిష్టలతో తపింప చేసుకునే వాడు తపస్వి. అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి. ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి.
పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. అలాగే జీవితం కూడా నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !
ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నా వాళ్ళనుకుంటూ) బతికేశావు. 
ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం 
నువ్వు బతుకు. 
వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో అసలు జన్మ వుందో లేదో తెలీదు.

నువ్వు నా వాళ్ళు నా వాళ్ళు' 
అనుకుంటుంటే వాళ్ళు తన తర్వాత 
వాళ్ళ వాళ్ల కోసమే' బతుకుతారు. 
నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !
అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈ మాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. అది తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. 
అందుకే ఈ జీవితమంతా !మన మరణం దగ్గర పడితేనే మహా సత్యాలు బోధపడ్తాయ్.
పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. 
వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీ బదులు భరించటానికి ఎవరూ దొరకరు.
వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు .తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనమేంటి ? అందుకే మానవులుగా బ్రతకటం కన్నా మానవత్వంతో బ్రతుకుదాం.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment