జూలై 1
*డాక్టర్స్ డే లేదా* *వైద్యుల దినోత్సవం..*
*సమస్త వైద్య ప్రపంచానికి "వైద్యుల దినోత్సవ" శుభాకాంక్షలు.*
"1909..ఇంగ్లండ్ లోని St Bartholomew's మెడికల్ కాలేజ్ ..అందులో PG చేసేందుకు ఆసియాస్టూడెంట్స్ కోటా క్రింద ఇండియాకు చెందిన ఒక యువకుడు అప్లికేషన్ పెట్టాడు. కానీ డీన్ ఆ అప్లికేషన్ తిరస్కరించాడు. అయినా నిరాశచెందకుండా మళ్ళీ మళ్ళీ అప్లై చేసాడు..డీన్ మళ్ళీ తిరస్కరించాడు..మళ్ళీ అప్లై చేసాడు..మళ్ళీ తిరస్క రించాడు..ఇలా ఆ యువకుడు 29 సార్లు అప్లైచేసాడు..30 వ సారి ఇంక చేసేది లేక డీన్ అప్లికేషన్ ను అమోదించి ఆ యువకుడికి మెడికల్ పోష్టుగ్రాడియేషన్ లో సీటు ఇచ్చాడు.మూడు సంవత్స రాలకంటే ఎక్కువ కాల వ్యవధి గల ఆ కోర్సును కేవలం రెండు సంవత్సరాల మూడునెలలలో పూర్తిచేసి రికార్డు సృష్టించాడు ఆ యువకుడు. దానితో అతనికి లండన్ రాయల్ మెడికల్ అసోషియేషన్ లో ఫిజీషియన్ గా గుర్తింపు లభించింది. అలాగే సర్జన్ గానూ గుర్తింపు తెచ్చింది.
29 సార్లు తిరస్కరణకు గురైనా పట్టువదలకుండా 30 వసారి అర్హతసాధించి MRCP..FRCS చేసిన ఆ యువకుడి పేరే బిధన్ చంద్ర రాయ్ ..బి సి రాయ్ గా ప్రసిద్ది చెందాడు.
1911లో ఇండియా తిరిగి వచ్చి భారతదేశంలో వైద్యవ్యాప్తికి బాగా కృషిచేసారు. స్త్రీలకు, చిన్నపిల్లలకు "చిత్తరంజన్ సేవాసదన్ " పేరుతో ఉచితవైద్యశాలలు ఏర్పాటు చేసారు.కలకత్తాలో ప్రాక్టీసు ప్రారంభించి కలరా విజృంభించిన సమయంలో వేలాదిమంది ప్రాణాల్ని కాపాడారు.
స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1928 లో రాజకీయాలలో ప్రవేశించి సురేంద్రనాధ్ బెనర్జీ పై గెలుపొందాడు.
1948 నుండి 1962 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ పదవిలో వుండగానే మరణించారు.
ఈయన జాదవ్ పూర్లో టి.బి. హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలు నెలకొల్పాడు.1926 లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్య శాలను ఏర్పాటు చేసాడు.మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థనూ ఏర్పాటు చేసాడు.
జాతిపిత మహాత్మా గాంధీకి వైద్యుడిగా, స్నేహితుడిగా వెన్నంటి నడిచారు.1961లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా రోజూ సాయంత్రం కొంత సమయాన్ని వైద్య సేవలకు కేటాయించారు.
1882 జూలై 1 పుట్టిన బి.సి రాయ్ గారు 1962 జూలై 1 నే మరణించడం విశేషము.
ఆయన ఇండియాకు చేసిన వైద్యసేవలకు గుర్తుగా ఆయన పుట్టినరోజును "నేషనల్ డాక్టర్స్ డే "గా భారతప్రభుత్వం ప్రకటించింది!!
భారత ప్రభుత్వం 1961లో ఈయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
1976 నుండి వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి డా. బి.సి.రాయ్ అవార్డులను అందిస్తున్నారు.
ఎందరో డాక్టర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధితులకు 24 గంటలు సేవలందిస్తున్నారు. వైద్యో నారాయణ హరి అనే పదానికి అర్థమిచ్చేలా వారి చేస్తున్న సేవ ప్రశంసించదగ్గది చిరస్మణీయ మైనది.
*భగవంతుని ప్రతీకలైన వైధ్యులందరికి శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక అభివందనములు...*
No comments:
Post a Comment