Monday, July 1, 2024

***హద్దులు దాటితేప్రమాదం.. చెడ్డ ఆలోచనలు మనసులోకిరానీయకూడదు

 హద్దులు దాటితేప్రమాదం.. చెడ్డ ఆలోచనలు మనసులోకిరానీయకూడదు 
పూర్వం కురు రాజ్యాన్ని ఇంద్రప్రస్థనగరం రాజధానిగా ధనంజయ కౌరవ్యుడు అనేరాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థాన పురోహితుడు, మంత్రిసుచీరతుడు అనేపండితుడు. ఒకరోజున వారిద్దరూ కూర్చొని పరిపాలన విషయాలు చర్చించుకుంటూ ఉండగా ‘ధర్మయజ్ఞం ’ అనేవిషయం చర్చకు వచ్చింది. ‘‘అశ్వమేధం, రాజసూయం, పుత్రకా త్రమేష్టిమొదలైన యాగాలు తెలుసు. ధర్మ యాగం ఎలా చేయాలి అచార్యా!’’ అని అడిగాడు రాజు.
‘‘మహారాజా! నాకూ పూర్తిగా తెలియదు. మన రాజ్యంలో భగీరథీతీరంలో విదుర పండితుడు ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు. వెళ్ళి వివరంగా తెలుసుకు వస్తాను. శెలవియ్యండి’’ అని అడిగి మరునాడు బయలుదేరివెళ్ళి విదుర పండితుణ్ణి కలుసుకున్నాడు. విదురుడు తన మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్న ల తర్వాత తాను వచ్చిన విషయం చెప్పాడు సుచీరతుడు. అంతలో ఎందరో శిష్యులు ఆయన సందర్శన కోసం వచ్చారు. దానితో ....‘‘మిత్రమా  ! నేను ఈ సమయంలో ధర్మయాగం గురించి చెప్పలేను. అదిగో.. అక్కడ అడవి సమీపంలో నా పెద్ద కుమారుడు భద్రకా రుని ఆశ్రమం ఉంది. అతనూ పండితుడే. వెళ్ళి భద్రకా రుణ్ణిఅడుగు’’ అని చెప్పి పంపాడు. 
సుచీరతుడు ఆయన వద్దకు వెళ్లి తాను వచ్చిన విషయాన్ని వివరించగా... ‘‘మహాశయా! మీ ప్రశ్న కు సమాధానం చెప్పే యోగ్యత నాకు లేదు. ఇంకా రెండు యోజనాల దూరం ముందుకు వెళ్ళు. అక్కడ నదీతీరంలో ఒక ఆశ్రమం  ఉంటుంది. అది నా పెద్ద తమ్ముడు సంజయునిది. అతడు ప్రాజ్ఞుడు. నీకు అతను సమాధానం చెప్తాడు’’ అని సగౌరవంగా సాగనంపాడు భద్రకా రుడు. సుచీరతుడు వెళ్ళే సమయానికిసంజయుడు అక్కడ లేడు. తిరిగివచ్చేసరికిసాయంత్రం అయ్యింది. వచ్చాక, సుచీరతునికితగు సత్కారాలు చేశాడు. ఆ విషయం తెలుసుకుని– ‘‘సుచీరతా! నేను కూడా దీనికిసమాధానం చెప్పలేను.
నిజం చెప్పాలంటేఅందుకు తగను. సదాచార  భ్రష్టుణ్ణి. ఇందుకు తగినవాడు మా అందరికంటేచిన్నవాడు మా తమ్ముడు సంభవుడు. అతని ఆశ్రమం  ఈ పక్కనేఉంది. వెళ్ళు’’ అని మర్యాద పూర్వకంగా చెప్పాడు. సుచీరతుడు మరునాటివేకువనే లేచి సంభవుని దగ్గరకు వెళ్ళాడు. విషయం అంతా చెప్పాడు. ఉదయం స్నానాదికాలు పూర్తయ్యాక వారిద్దరూ ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ‘‘సుచీరతా! ధర్మయాగం చేసేవారు ఐదు విషయాలు పాటించాలి. అందులో మొదటిది; ఎప్పుడు చేసేపని అప్పుడేచేయాలి. తరువాత చేయవచ్చులే అని బద్ధకించకూడదు. నిర్లక్ష్యం తగదు. ఈ రెండు లక్షణాల్ని సమయపాలన అనేయజ్ఞగుండంలో కాల్చి బూడిద చెయ్యాలి.
 ఇక రెండోది; ఎవ్వరు ఏదిచెప్పినా జాగ్రత్తగా వినాలి. విన్న ప్రతిప్రదాన్ని ఆచరించకూడదు. బాగా ఆలోచించి సరైన వాటిని మాత్రమే త్ర ఆచరించాలి.
మూడోది; ఏ విషయంలోనూ హద్దు దాటకూడదు. ప్రకృ తిలో ఒక్కో శక్తికిఒక్కో హద్దు ఉంటుంది. సమాజంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. అర్హత ఉంటుంది. ప్రతి వారు తమ తమ హద్దులు తెలుసుకోవాలి. ఈ హద్దులు అమానవీయ, అకుశల విషయాల్లో లింగ భేదాల్లో కాదు. మన సామాజిక నైతిక నడవడికలో తండ్రికి , తల్లికి, తనయులకీ, గురువులకీఒక్కొక్కరికి ఒక్కో హద్దులుంటాయి. వారివారిహద్దుల్లో వారికిగౌరవ మర్యాదలు దక్కుతాయి. నైతిక హద్దులు దాటడం చాలా ప్రమా  దం. అలాగే అధర్మ కార్యాలు చేయకూడదు. మనం చేసేపనులు మనకూ, పరులకూ హితాన్ని, సుఖాన్ని ఇవ్వాలి. ఇలా అందరికీసుఖాన్నిచ్చేవేధర్మకార్యాలు.
 అధర్మ కార్యాలు చేసేవారు రేవు కాని చోట నదిలో స్నానానికిదిగిన వారితో సమానం. అదివారికేప్రమా  దం. ఇక ఐదో విషయం; చెడు తలపులు మానాలి. చెడు చేష్టలే కాదు. చెడ్డ ఆలోచనల్ని మన మనసులోకేరానీయకూడదు. ఒకవేళ వచ్చినా యజ్ఞ జ్వాలలో మండించేసమిధల్లా వాటిని కాల్చి బూడిద చెయ్యాలి. సుచీరతా! ఈ ఐదూ పాటిస్తేఅదేధర్మయాగం. ఈ యాగం చేసినవారు శుక్ల పక్ష చంద్రునిలా దినదినాభివృద్ధిచెంది, పున్నమి చంద్రునిలా శోభిల్లుతారు’’ అని చెప్పాడు. సుచీరతుడు ఇంద్రప్రద్రస్థంప్రస్థం చేరిధనంజయు కౌరవ్యునికిఈ విషయాలు చెప్పాడు. తన రాజ్యంలో ప్రజప్రలందరూ– ‘ధర్మయాగం’ చేయవలసిందిగా రాజు చాటింపు వేయించాడు. – డా. బొర్రా గోవర్ధన

No comments:

Post a Comment