Wednesday, October 28, 2020

ఏ వస్తువునైనా దాని పరిధి నుండి కాకుండా దాని కేంద్రం నుండి తెలుసుకోవడమే జ్ఞానమంటే.

శుభోదయం.

అజ్ఞానముతో మనం ఏదైతే తెలుసుకుంటామో అది సంసారం. జ్ఞానంతో తెలుసుకునేది పరమాత్మ. ధర్మం అనేది ఒక లో వెలుగు. ఎవరి లోపల సందేహం లేదో, వారు సాక్ష్యాలను ప్రోగు చేసుకోవలసిన అవసరం ఉండదు.

ద్వంద్వాలు అనేవి మనలో కూడా ఉంటాయి. ఒక విషయం మనకి ఒప్పుకోవాలి అని ఉంటుంది, అలాగే ఒప్పుకోకూడదు అని కూడా ఉంటుంది. ఒక పనిని చేయాలని ఉంటుంది. చేయకూడదు అని కూడా ఉంటుంది. ఈ జఠిలతని ఎవరు అర్ధం చేసుకోకుండా తమ గమనాన్ని సాగిస్తూ ఉంటారో, వారు దాని నుండి ఎప్పటికీ బయట పడలేరు. తాను ఎవరు? అనేది యదార్ధంగా తెలుసుకునే సాహసం ఎవరు చేస్తారో, వారి విషయంలో ధార్మిక జీవనం ప్రారంభమవుతుంది. అతను తాను ఎలా ఉన్నాడో, తనని అలా స్వీకరించగలుగుతాడు. ఏ వస్తువునైనా దాని పరిధి నుండి కాకుండా దాని కేంద్రం నుండి తెలుసుకోవడమే జ్ఞానమంటే.

Source - Whatsapp Message

No comments:

Post a Comment