Tuesday, October 27, 2020

జగదంబను ఆవాహన చేయడం అంటే స్వయంలో సహనశక్తిని జాగృతం చేయడం.

✨జగదంబను ఆవాహన చేయడం అంటే స్వయంలో సహనశక్తిని జాగృతం చేయడం.

సంకీర్ణ శక్తి మరియు సర్దుబాటు శక్తి ద్వారా స్వయాన్ని వ్యర్థం మరియు బాహ్య ప్రభావం నుండి ఎప్పుడైతే ముక్తం చేసుకుంటామో అప్పుడు సమర్ధవంతమైన శక్తిశాలీ ఆత్మిక స్థితిని పొందుతాము. శక్తిశాలీ ఆత్మలోనే సహనశక్తి జాగృతం అవుతుంది.

ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది. వాస్తవానికి సహించేవారిలో 'నేను సహిస్తున్నాను' అనే ఫీల్ కూడా ఉండదు. అలా ఉంటే కనుక, వెలుపలికి మౌనంగా ఉంటూ మానసికంగా చాలా ఒత్తిడికి, దుఃఖానికి లోనవుతున్నామని అర్ధం. అది సహనం కానే కాదు.

జగదంబ అంటే తల్లి. తల్లి ప్రేమ ఎటువంటిదంటే పిల్లల లోపాలను ప్రేమతో సహిస్తూ సరిదిద్దుతుంది. అలా మనం స్వయానికి తల్లి అయి మనలో మనకే అసహనం కలిగించే విషయాలను ప్రేమతో సహించి, సరిదిద్దుకోవాలి. స్వయాన్ని ప్రేమతో సంభాలన చేసుకోవాలి. ఇలా ఎవరైతే స్వయానికి అంబ అవుతారో వారు సహజంగానే జగత్తుకు అంబ అవుతారు. మనం స్వయంతో ఎలా వ్యవహరిస్తామో ఇతరులతో కూడా అలానే వ్యవహరిస్తాము, సహజంగానే మన నుండి అటువంటి తరంగాలు విశ్వములో వ్యాపిస్తాయి కనుక!

సహన శక్తిని స్వయంలో జాగృతం చేసుకొని జగదంబ అయి స్వయాన్ని తద్వారా జగత్తును ప్రేమతో పాలన చేద్దాం.✨

🌹🙏🏻ఆత్మీయులకు దశరా నవరాత్రి చతుర్ధ దిన శుభాకాంక్షలు🙏🏻🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment