Sunday, December 17, 2023

****కాబ్బాటీ జీవేడే దేవుడూ.....

 "ఎంత కఠినమైన పరిస్థితులైనా ఉండనీ,రానీ భగవంతుడు,మరియు ఆయనను ఆశ్రయించియున్న ధర్మం వైపు నిలబడి ఉంటే" "పొందే ఆ అనుభూతియే వేరు".

"వారు ఎటువైపు ఉన్నారు అనేది తెలుసుకోవటం పెద్ద కష్టమేమి కాదు".

"మనలో ఉండే తత్త్వజ్ఞాన రూప దీపం ఇచ్చే వివేకం తెలియజేస్తుంది"...
.

దేవుణ్ణి వెదికే ,,పూజించే,,, ఆరాధిస్తున్న వాడే దేవుడు 
..................

బయటి దేవుణ్ణి సృష్టించు కుంటున్నంత కాలం 
ఏ మనిషీ ఆధ్యాత్మిక ,,,నిర్వాణ పరిధులను తాకలేడు.
కానీ అసలు సిసలైన ఆధ్యాత్మికత నువ్వే భగవంతుడు
అని చెబుతుంది...చాలా మతాలు దీన్ని అంగీకరించడానికి 
ససేమిరా ఒప్పుకోవు..ఈ సత్యాన్ని ఒప్పుకోనంత కాలం 
అంతర్గత శాంతి అనేది మృగతృష్ణ లాంటిదే..

ఆగి ఉన్న నీళ్ళు ఏ రాయిని కూడా కదల్చ లేవు ..అదే
నీళ్ళు వంద కిలోమీటర్ల స్పీడ్ తో ప్రవహిస్తే 
పెద్ద పెద్ద కొండలనే నేలమట్టం చేస్తాయి..

తేడా అంతా వేగంలోనే వుంది...
మన చైతన్య,, శక్తి,, జ్ఞాన ,,,జాగృతి స్థాయిలు
పెరిగినప్పుడు ఏదైనాసరే,,, ఇలా అంటే 
అలా జరిగిపోతుంది...మన నోటి ప్రతి వాక్కు శాసించే 
శాసనం అవుతుంది....కనుసైగతో  అయిపోతుంది..

ఇలాంటి తాత్వికులను మనం భగవంతుళ్లని చేసి
ఆరాధిస్తూ,,,,పూజిస్తూ,,,,టెంకాయలు కొడుతూ
కూర్చున్నాం...కానీ అదే శక్తి,, చైతన్యం,,,మనలో కూడా
నిద్రాణంగా వుంది అని మాత్రం తెలుసుకునే సాధనాప్రయత్నం మాత్రం చెయ్యం..

నేను జాగింగ్ వెళ్ళినప్పుడు బిట్టూ ( కుక్క ) ఒక డేగ గుడ్లు పెట్టిన స్థలాన్ని కనుక్కుని అక్కడ వెళ్ళి ఆగింది..ఆ డేగ  భయపడి తాను పెట్టిన గుడ్ల మీద నుండి పారిపోయింది ..రెండు మూడు రోజులు చూసాను..అది మళ్లీ గుడ్ల మీదికి రాలేదు...నేను ఆ గుడ్లను తీసుకుని 
కోడి కింద పెట్టాను....అది పొదిగి పిల్లలను చేసింది...ఇప్పుడు ఆ డేగ  పిల్లలు ఆ కోడి పిల్లలతో పాటు
పెరిగాయి....అయితే వాటి సహజ గుణం అయిన ఎగరడం 
మర్చి పోయాయి..ఇప్పుడు ఆ డేగ పిల్లలు భూమ్మీద పొడుచుకుని పొడుచుకుని గింజలు తింటున్నాయి ..అయితే ఎగరడం ఆన్న దాని సహజ నైజం 
దాని మూలాల్లో ఎప్పటికీ దాగే వుంటుంది...సామాజికంగా ,,,పుట్టిన,, పెరిగిన ,,,జీవించిన వాతావరణం నుండి మనస్సు నిర్మాణం అవుతుంది..దాని నుండే నమ్మకాలు పుడతాయి...ఆ నమ్మకాలు ఎలా వుంటాయో అలా ఆ నమ్మకాలలోకి  మన శక్తి వెళ్ళి జీవిస్తూ వుంటుంది..అదే మన తల రాత అవుతూ వుంటుంది ..

ఎప్పుడు ఆ డేగ పిల్లలు తమ శక్తిని ( ఎగిరే ) గ్రహిస్తాయో అప్పుడు అవి ఆ కోడి తత్వాన్ని విచిపెడతాయి...

మనిషీ అంతే ఈ శరీర మూలాల్లోకి వచ్చి,, ఈ స్తూలమైన బూమ్మీద,,, స్తూల అనుభవాలను పొందుతున్నాడు...ఎప్పుడైతే అతని ధ్యాస ఈ స్తూల ప్రపంచం నుండి ఆత్మ వైపు మళ్ళిందో అప్పుడు తాను  శరీర తత్వాన్ని వదిలి  భగవత్ తత్వం లోకి  వెళ్ళిపోతాడు ...

కాబ్బాటీ జీవేడే దేవుడూ.....🙏🙏🙏🙏.....*
.

No comments:

Post a Comment