Monday, June 30, 2025

 [6/28, 10:16] +91 79819 72004: *💎 నేటి ఆణిముత్యం💎*

శుభము లొనరించు వానికి శుభము గలుగు
బాపమొనరింపఁ  దప్పదు పాపఫలము;
పుణ్యరతుని విభీషణుఁ బొందె సుఖము, 
పాప శీలివి నీకిట్టి పాటు గలిగె

*తాత్పర్యం:*
మంచి చేయు వారికి శుభఫలములు, పాపములు చేసేవారికి పాపఫలం కలిగీ తీరుతాయి. పుణ్యశీలుడైనవిభీషణుడు మేలుపొందాడు. పాపాత్ముడైన నీకు, ఓరావణా ఇలాంటి కష్టం కలిగింది. 

*శ్రీమద్ వాల్మీకి రామాయణం యుధ్ధకాండ నుంచి*
[6/28, 10:16] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


విజయం అంటే..
మనం చేరుకున్న గమ్యం కాదు..!
ఆ గమ్యాన్ని చేరే క్రమంలో,
ఎదురైన కష్టాల నుండి
నేర్చుకున్న అనుభవం..!
[6/28, 10:16] +91 79819 72004: *👭 నేటి చిన్నారి గీతం👬*


*పచ్చ పచ్చాని తీగ పాకింది*


పచ్చ పచ్చాని తీగ పాకింది
ఎర్ర ఎర్రాని పూవు పూసింది
చిన్న చిన్నారి పాప చూసింది
మెత్త మెత్తాని చేయి చాచింది
మెల్ల మెల్లాగ పువ్వు తుంచింది
నల్ల నల్లాని జడలో ముడిచింది
[6/28, 10:16] +91 79819 72004: *✍🏽 నేటి కథ ✍🏻*


*మా రాజు..మహాత్ముడు*


ఐరావత సామ్రాజ్యాన్ని పరిపాలించే దేవసేన మహారాజు అత్యంత బలవంతుడు. అతని సామ్రాజ్యంలో పదహారు సామంత రాజ్యాలు ఉన్నాయి. దేవసేనుడు సామంత రాజులను,
ఎప్పుడూ తన ఆధీనంలో ఉంచుకోవడానికి, నెలకు రెండు సార్లు
వారితో సమావేశమయ్యేవాడు. సామ్రాజ్యాలన్నింటిలో మనమే ముందున్నామని.. ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో
జీవిస్తున్నారని దేవసేనుడు పదే పదే చెప్పే మాటలు అబద్ధమని తెలిసినా, ఎవరూ అడ్డు చెప్పేవారు కాదు. గతంలో ఒక సామంత రాజు 'మహారాజు చేతల మనిషి కాదు.. మాటల మనిషే అని చాటుగా అనడంతో పదవి నుంచి తొలగించి, ఆయన సోదరుడిని రాజుగా చేసాడు దేవసేనుడు. మహారాజు
ఆజ్ఞకు విరుద్ధంగా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తే..
బలగంతో అణిచివేసేవాడు. నాటి నుంచి సామంత రాజులు
దేవసేనుడు ఏది చెప్పినా సై అంటున్నారు.వాస్తవానికి రాజ్యాల్లో ప్రజలకు సరైన ఆహారం, వైద్యం లభించడం లేదు. ఈ సమస్యలు మహారాజుకు తెలియడం లేదు. మంత్రులు విలాసాలకు అలవాటు పడి, ప్రజా సమస్యలు
గాలికి వదిలేశారు. ప్రజలు రాజు దగ్గరికి రావడానికి
భయపడేవారు. మహారాజు ప్రతినెలా నిర్వహించే సమావేశాలకు
ధర్మవరం సామంత రాజు ఇంద్రవర్మ మూడు నెలలుగా రావడం
లేదు. ఏదో ఒక కారణం చెప్పి మంత్రిని పంపిస్తుండటంతో
దేవసేనుడికి బాగా కోపం వచ్చింది. కొద్దిరోజులకు మహారాజు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచ
దేశాల్లోని చక్రవర్తులు, రాజులు విచ్చేసి విలువైన కానుకలు సమర్పించారు. సామంత రాజులు కూడా తమ ఖజానా నుంచి ఖరీదైన వజ్ర వైఢూర్యాలు తెచ్చి బహూకరించారు. ధర్మవరం మంత్రి ఒక పుష్పగుచ్చం తెచ్చి ఇవ్వగా.. దేవసేనుడు కోపంతో
విసిరి పడేశాడు. మంత్రి మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.
   ఇంద్రవర్మ రాకపోవడం అందరికీ ఆశ్చర్యం వేసింది. పొలం దున్నుతున్న ఒక రైతును సైనికులు బలవంతంగా మహారాజు ముందుకు తీసుకొచ్చారు.
పుట్టినరోజు వేడుకలకు కూడా ఇంద్రవర్మ హాజరుకాకపోవడంతో ధర్మవరంపై దేవసేనుడు యుద్ధం ప్రకటించాడు. వేలాదిగా సైనికులతో బయలుదేరగా..
మార్గమధ్యలో ఎక్కడ చూసినా బీడు వారిన భూములు,ఎండిపోయిన చెరువులు, బక్కచిక్కిన మనుషులు కనిపించారు.
ఎవరి ముఖాల్లోనూ ఆనందం కనిపించలేదు. దాంతో రాజుకు
రాజ్య స్థితిగతులు అర్ధమయ్యాయి.ధర్మవరంలో ఎటు చూసినా
పచ్చని పంటలు, నిండిన చెరువులు,కళకళలాడుతున్న వాగులు..కాలువలు, పూలతోటలు కనువిందు చేశాయి. మహారాజును చూడడానికి ఒక్కరు కూడా పని మానేసి దారి దగ్గరికి
'మహారాజు వస్తుంటే.. దండం పెట్టాలని తెలియదా?' అని
రైతును కోపంగా అడిగాడు సేనాపతి. 'క్షమించండి రాజా.. మీరెవరో మాకు తెలియదు. ఈ దారి వెంబడి మా రాజు
ఎన్నోసార్లు ఒక్కడే ఒంటరిగా వెళ్లినా..మమ్మల్ని ఏనాడూ ఇలా
'పిలిచి అడగలేదు' అని రైతు ధైర్యంగా చెప్పాడు. 'ఇదేనా మీ రాజు చెప్పిన సంస్కారం!' అని ఓ సామంత రాజు ఎగతాళిగా అన్నాడు. రైతు నవ్వడంతో.. 'ఎందుకు నవ్వుతున్నావు?' అని
కోపంగా అడిగాడు మహారాజు. 'మహారాజా.. పని చేసుకునేవాడిని బలవంతంగా ఎత్తుకురావడమేనా మీ
సంస్కారం. మా రాజు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటాడు. ఎవరి పనులు వారే చేసుకోవాలని, ఇతరులపై ఆధారపడవద్దని,ఆడంబరాలకు పోవద్దని చెబుతుంటారు. అందుకే ఇక్కడ ప్రజలందరూ కష్టపడి పనిచేస్తారు. అందుకే మా రాజ్యంలో కరవు అనేదే లేదు' అన్నాడు రైతు.ఆ మాటలు మహారాజులో ఆలోచన రేకెత్తించాయి. 'మీ రాజు, మా మహారాజు నిర్వహించే సమావేశాలకు ఎందుకు రావడం లేదు. రాజ్యం బాగుందని గర్వమా?' అని మంత్రి మెల్లగా రైతును అడిగాడు. 'మా రాజు ఉత్తముడు. మూడు నెలల కిందట గోపాలపురంలో వరదలు వచ్చి రెండు చెరువులకు గండి పడింది. దాని మరమ్మతులు పూర్తయ్యే వరకూ రాజు అక్కడే ఉన్నాడు. కట్ట తెగిపోకుండా చేసి,
నాలుగు ఊర్ల ప్రజల ప్రాణాలను కాపాడాడు' అని రైతు చెప్పగానే దేవసేనుడి కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. సామంతరాజులు సిగ్గుతో తల దించుకున్నారు. 'నిరాడంబర జీవితం
గడుపుతూ, నిత్యం జన సేవకుడిగా కృషి చేస్తున్న వ్యక్తిపైనా
నేను యుద్ధం చేసేది?" అనుకొని దేవసేనుడు బాధపడ్డాడు. తన
పరివారాన్ని రాజధానికి పంపించి, మహారాజు ఒక్కడే.
ఇంద్రవర్మను కలుసుకోవడానికి సంతోషంతో బయలుదేరాడు.

*- దుర్గమ్ ఖైతి*
[6/28, 10:16] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*

*అంచు డాబే కాని, పంచె డాబు లేదు*

పంచె అంచులో ఉన్న డాబుసరి (గొప్పదనం) మిగతా పంచెలో లేదు అని అర్థం. పైకి అన్నీ తెలిసినవారిలా కనపడుతూ లోపల మాత్రం విషయపరిజ్ఞానం లేని వాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.
[6/28, 10:16] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*

*అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.*

నిజానికి ఒక పెద్ద పుస్తకం చేత ఉండటానికీ, పంచాంగం చెప్పడానికీ సంబంధమే లేదు. కానీ, ఈ విషయం తెలియని అవివేకి ఆ పెద్ద పుస్తకం చేతబట్టిన వానిని పంచాంగం చెప్పలేని అనసమర్ధునిగానే పరిగణించును. ఇది వాని అవివేకానికి పరాకాష్ఠ. ఈ సామెత అట్టివాని అవివేకాన్ని గుర్తుచేస్తూ వాడుకలో ఉంది. అంతలావున్నావు తేలు మంత్రం తెలియదా అన్నట్టు .... ఈ సామెత కూడాను.
[6/28, 10:16] +91 79819 72004: *☑️ తెలుసుకుందాం ✅*


*🛑ఫ్యాన్‌ గాలి పైకి పోదేం? Why do fan air go up?*

❇️సీలింగ్‌ ఫ్యానులో సాధారణంగా మూడు లేదా నాలుగు రెక్కలు ఉంటాయి. ఇవి తిరిగే క్రమంలో పైనున్న గాలిని కింది వైపు నెట్టుతాయి.ఇలా జరగడానికి కారణం ఫ్యాను రెక్కల నిర్మాణమే. ఫ్యాను రెక్కల ఉపరితలం పూర్తిగా చదునుగా ఉండదు. రెక్కల ఓ అంచు మరో అంచు కన్నా ఫ్యాను మోటారు దగ్గర ఒకటి రెండు సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. రెక్కల నిర్మాణంలో ఈ తేడా వల్ల అవి తిరిగేప్పుడు వాటిలో పై అంచు నుంచి కింది అంచు వైపునకు గాలిని నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి అవి గాలిని ఎంత బలంతో కిందికి తోస్తాయో, అంతే బలంతో అవి పైవైపు పోవడానికి ప్రయత్నిస్తాయి. ఇందుకు కారణం న్యూటన్‌ మూడో గమన సూత్రమే. అయితే అవి గట్టిగా బిగించి ఉండడం వల్ల అలా జరగదు. ఇదే సూత్రం మీద హెలికాప్టర్‌ పని చేస్తుంది. ఆ రెక్కలు కూడా గాలిని కిందికి నెట్టే క్రమంలోనే హెలీకాప్టర్‌ను పైకి లేప గలుగుతాయి.

No comments:

Post a Comment