Tuesday, October 10, 2023

జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి

 💝*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *”మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్‌ కాలః సర్వం మయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా”*అన్నారు శంకరాచార్యులవారు.*
💖 *’ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో, ఆత్మానుభూతిని చెందు!’ అని దీని అర్థం.*
💕 *ధనం, జనం, యౌవనం అన్నీ అశాశ్వతమే. బుద్బుద ప్రాయమే.*
💞 *ఆత్మజ్ఞానానికి అనువైన జన్మ మానవజన్మ మాత్రమే. ఈ మానవజన్మలో ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి లౌకిక సంపదలూ, భోగాలూ మాత్రమే ప్రధానమనకునే వారి గతి అధోగతే అని ప్రబోధించారు శంకరాచార్యులు.*
💕 *ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు,అహంకరిస్తాడు.*
💞 *కొందరికి ధనగర్వం…!*
💞 *మరికొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులున్నారనే గర్వం…!*
💞 *ఇంకొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం….!*
💖 *ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లూ, ఆస్తులూ నేలమట్టమై పోతాయి. “నాకేంటీ!? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది” అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది.*
💕 *~ఆ క్షణంలో ధనం, జనం ఏవీ రక్షించవు.*
💕 *అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు.వృద్ధాప్యం వెక్కిరిస్తూ మన నెత్తిమీదకు వచ్చికూర్చుంటుంది.*
💖 *కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనవని భావించాలి. *
💓 *~అలాగని అన్నీ వద్దనుకోవాల్సిన పని లేదు.*

💝 *వాటిని అనుభవించడంలో తప్పు లేదు. కానీ, వాటితో అనుబంధం పెట్టుకోకూడదు.*
💞 *~అలా పెట్టుకుంటే, అవి పోయినప్పుడు భరించలేని దుఃఖం తప్పదు.జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు.*
💝 *శాశ్వత ఆనందప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి. ఆ పరమానందం, నిత్యానందం లభించాలంటే చలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి, ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండిపోవాలి.*
💖 *పరమాత్మతో మమేకం కావాలి.*
💕 *~ఇది చెప్పడమంత సులువు కాకపోవచ్చు. సుసాధ్యం కాకపోవచ్చు.*
💝 *~కానీ అసాధ్యం అసలే కాదు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment