Thursday, November 26, 2020

క్షణికావేశంతో నిర్ణయాలు ఎన్నటికి ఫలితాన్నివ్వవు ..నోరుజారేముందు ఎంతవరకు అది భరించ సాధ్యమోకూడా నిర్ణయించుకోవాలి

క్షణికావేశంతో నిర్ణయాలు ఎన్నటికి ఫలితాన్నివ్వవు ..నోరుజారేముందు
ఎంతవరకు అది భరించ
సాధ్యమోకూడా నిర్ణయించుకోవాలి

సత్యహరిచ్చంద్రుడి పాత్ర , మాట ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు , అది శక్తికి మించినదైతే చాతకాదని విన్నవించుకో , లేదా తీర్చడానికే సిద్ధమైనప్పుడు , ఉత్పన్నమయ్యే సమస్యలనుకూడా సంతోషంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండు అనిపిస్తుంది .. భారతంలో ధర్మరాజుపాత్ర " నీ బలహీనతవలన సంభవించే నష్టాన్ని నీవే భరించాలి తప్ప , ఆ బలహీనత కారణంగా అదికారం ఉందికదా అని నీ ప్రక్కవారినికూడా యిరుకునబెట్టే ప్రయత్నంచేయకు అని చెప్పినట్లనిపిస్తుంది ..

ఎన్నో సౌకర్యాలున్నా , చేతినిండా ఆదేసించే అదికారం ఉన్నా
అన్ని భోగాలను త్యజించి , ఆత్మజ్ఞానంకోసం చెట్టుకింద కూర్చున్న గౌతమబుద్ధుడు తొలుత లోకానికి పిచ్చివాడిగానే కనిపించి ఉండొచ్చు ..
ముక్కుమూసుకొని తపసుచేసుకొనే సర్వసంఘపరిత్యాగికి , శరీరభోగాలకై అలమటిస్తూ , మాయలోపడి దొల్లుతున్న లోకo పిచ్చిగా కనిపించవొచ్చు ..

బాబా ఆ గ్రామంలో అడుగుపెట్టకముందు , షిర్డీ అనే గ్రామం ఒకటుందని ఆ ప్రాంతవాసులె పట్టించుకొలేనంత కుగ్రామం , ప్రస్తుతం ప్రపంచ పటంలో వాసికెక్కిన పట్టణాలలో శిరిడీ కూడా ఒకటిగ వన్నెకెక్కింది ..రుచి చూడనంతవరకూ
పదార్ధం విలువ తెలియదు , ఆయనెవరో అర్థం కానంతవరకు కొన్ని సంవత్సరాలపాటు నిత్యము గమనిస్తున్న ఆ గ్రామవాసులకే అర్థంకాలేదు .. ఆయన నిత్యచర్యలు
నిథానంగా వోక్కక్కరే ఆయనను కలుస్తూ , పొందిన అనుభవాలు ఆయనొక మహాత్ముడని మూల మూలకు ప్రచారం పాకింది ..

అయన సిద్ధాంతంలో ఒక భాగం
" మాట యివ్వకు , యిస్తే ప్రాణంపోయేపరిస్థితిలో కూడా అది తప్పకు " అని .. మనిషి ఉన్నంతవరకే దేన్ని సాదించాలన్నా , దేనిని తీర్చాలన్నా .. చావు , పుట్టుకలకు అతీతమైన మహాత్ములవాక్కు , వారు శరీరం చాలించినా , అవి నెరవేరుతునే ఉంటాయనేది నిత్యము , సత్యమూ కూడా ..

దేనిని క్షణికోద్రేకంతో నిర్ణయించుకోకు , ఒకటి రెండు సార్లు గట్టి నిర్ణయంతో ఆలొచించు , అడుగుపెట్టినచోట సంశయాలకు తావివ్వక , సడలని విశ్వాసంతో నమ్మకం గట్టిదైతే , సమాధికూడా సజీవంగా జవాభిస్తూనే ఉంటుంది ..

మహాత్ముల మాటలెప్పుడూ మొదట విడ్డూరంగానే అనిపిస్తాయి ..
సద్గ్రంథాలలో సత్యహరిచ్చంద్రునిలాంటి పాత్రలెప్పుడూ సత్యదూరమేమో అని సందేహాలను రేకింతించవొచ్చు , గట్టి ప్రయత్నంతో , విశ్వాసముంచి అడుగుముందుకుపడితే , అవే స్వానుభవానికొచ్చి , మనసు వాస్తవానికి దగ్గరకాగలదని పెద్దలమాట

Source - Whatsapp Message

No comments:

Post a Comment