Friday, March 15, 2024

జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 3

 త్రిపురా రహస్యము - 63
================

స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 

 
జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 3 

ఉత్తమ జ్ఞానులు తమకు సహజంగా లేకపోయినా, తాము కల్పించుకుని తెచ్చుకున్న భావాలతో లోకవ్యవహారం చేస్తారు. వీరి మనస్సు వికారం పొందదు. ఉత్తమ జ్ఞానికి తన విషయంలోగాని, ఇతరుల విషయంలోగాని కలిగే సుఖదుఃఖాలు కల్పితాలే. అవి వారి మనస్సునంటవు. 
 
మేధావులైన జ్ఞానులు తమ మనస్సులో ఉన్న పూర్వవాసనలను నాశనం చెయ్యటానికి ప్రయత్నించరు. అందువల్ల అవి వారిలో పని చేస్తాయి. ఆ కారణంగా వారు కోపిష్పులుగానో, కాముకులుగానో అవుతారు. ఆ కర్మవాసనలు వారికి ప్రతిబంధకాలు కావు. అందుచేతనే ఉత్తమజ్ఞానులలో రకరకాల ఆచారవ్యవహారాలు కనపడుతుంటాయి. 
 
సమనన్ములైన వారిని మందజ్ఞానులంటారు. వీరు అల్పజ్ఞానులు వీరికి కూడా సమాధిస్టితిలో ఆత్మతత్త్వం గోచరిస్తుంది. స్వరూపవిమర్శన లేనివారికి ఆత్మతత్త్వం 
గోచరించదు. 
 
హఠయోగికి వికల్పనిరోధంవల్ల కలిగే స్వరూపస్ఫూర్తియే సమాధి. హఠయోగులు రెందు రకాలు. 
 
1. పతంజలి చెప్పిన అవమ్టాంగయోగంలో సిద్ది పొందినవారు 
 
_ 2, ధౌతి, వస్తి మొదలైన షట్కర్మలు, ప్రాణాయామం బాగా చెసి, షట్బక్రఛేదనం చేసి సుషుమ్న ద్వారా కుండలిని సహస్రారం చేర్చేవారు. 
 
మొదటి పద్దతిలో ముందుగా ఆలోచనలు వదలివేస్తాడు. తరువాత ఆలోచనలను నిరోధిస్తాడు. తరువాత సంకల్పాన్నికూడా వదిలేస్తాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇక తానొక్కడే ఉంటాడు. రెండవ పద్ధతిలో ప్రాణాయామం చేస్తాడు. అది చాలా శ్రమతో కూడినది. కాని ప్రాణవాయువు సుషుమ్నలో ప్రవేశించిన తరువాత హాయిగా ఉంటుంది. 
 
ఈ రెండు పద్ధతులలోనూకూడా, సిద్ధి కలిగినప్పుడు, సుషుప్తిలో కలిగే సుఖం కలుగుతుంది. 
 
వ: హఠయోగికీ, జ్ఞానయోగికీ తేడా ఏమిటి ? 
 
ద: జ్ఞానయోగికి అజ్ఞానము యొక్క ఆవరణము, విక్షేపము అనే రెండు అంశాలూ తొలగిపోతాయి. ఆత్మతత్త్వం గోచరిన్తుంది. హఠయోగికి అజ్ఞానం పోదు. 
 
ప: హఠయోగికి వచ్చే సుషుప్తికీ, సమాధికీ తేడా ఏమిటి ? 
 
ద: సుషుప్తిలో మనస్సు తమోగుణరూపంగా పరిణమిస్తుంది. అది మూఢావస్ట, సమాధిస్థితిలో మనస్సు ్రకాళించినా, అజ్ఞానంతో అది మేఘాలు క్రమ్మిన సూర్యుడిలా ఉంటుంది. అదే జ్ఞానయోగికి నిర్మలాకాశంలోని సూర్యునిలా మనస్సు ప్రకాశిస్తుంది. అని దతాత్రేయుడు పరశురాముడికి జ్ఞానభేదాలు. మోక్షసాధనాల గురించి వివరించాడు అంటూ పంధొనిమిదో అధ్యాయాన్ని పూర్తిచేశాడు రత్నాకరుడు. 
 
🌴. విధ్యాగీత  - 1 🌴
 
గురువుగారూ ! జ్ఞానులలో ఉండే వివిధరకాలు, మోక్షసాధనాలు గురించి తెలుసుకున్న తరువాత పరశురాముడు ఇంకా ఏమడిగాడు ? అంటూ ప్రశ్నించాడు నారాయణభట్టు చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. 
 
దత్తాత్రేయుడు చెప్పిన విషయాలను పూర్తిగా విన్న పరశురాముడు “గురుదేవా జ్ఞానుల వ్యవహారాలు ఎ విధంగా ఉంటాయో వివరించండి” అన్నాడు. ఆ మాటలు విన్న దతాశ్రేయుడు చెప్పటం ప్రారంభించాడు.  
 
పూర్వకాలంలో ఒకసారి సత్యలోకంలో జ్ఞానయజ్ఞం జరిగింది. దానికి సనక సనందనాదులు, వసిష్టుడు, వామదేవుడు, పులస్త్యుడు, పులహుడు, చ్యవనుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, నారదుడు మొదలైన మహానుభావులంతా విచ్చేశారు. యజ్ఞం కేవలం ప్రవచనాలు, చర్యగా సాగింది. చివరలో అక్కడ చేరిన మహానుభావులంతా విధాతనడిగారు. “ప్రజాపతీ, ఇక్కడ చేరినవారందరూ జ్ఞానులే. అయినప్పటికీ, గతజన్మ కర్మవల్ల కొందరు సమాధిలో ఉంటున్నారు. కొందరు శాస్త్రాలు చర్చిస్తున్నారు. కొందరు భక్తులు, కొందరు కరిష్టులు అయినారు. వీరందరిలోకీ ఎవరు శ్రేష్టులు ఎవరికివారు తమ అభిప్రాయాలే మంచివి అనుకుంటున్నారు. కాబట్లి మాలో శ్రేష్పులెవరో నువ్వే తేల్చవలసినది” అన్నారు. 
 
ఆ మాటలు విన్న బ్రహ్మ తీవ్రంగా ఆలోచించాడు. వీళ్ళెవరికీ తమమీద నమ్మకం లేదు. కాబట్టి నేను చెప్పిన మాటలు మాత్రం నమ్ముతారనే నమ్మకమేముంది ? అనుకుని “మహర్షులారా ! ఈ విషయం చెప్పటం నాక్కూడా కష్టంగానే ఉన్నది. అందుకని మనమంతా ఈశ్వరుడి దగ్గరకు వెడదాం రండి” అన్నాడు. మహర్నులందరూ కలిసి కైలాసం చేరి విషయం శివుడికి వినిపించారు. ఆయనకు కూడా బ్రహ్మకు వచ్చిన అనుమానమే వచ్చింది. 

దాంతో శివుడు “మునీంద్రులారా ! ఈ విషయం నాక్కూడా పూర్తిగా తెలియటంలేదు. మనమంతా పరమేశ్వరిని స్తుతి చేద్దాం. ఆమే మీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది.” అన్నాడు దాంతో బుషీశ్వరులంతా ఆ వరమేశ్వరిని పరిపరివిధాల స్తుతి చేశారు. 
  
కొంతసేపటికి ఆ పరమేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమై, ఏ కోరికలు లేని మీరు నన్నెందుకు పిలిచారు? మీకేం కావాలి ? అని అడిగింది. అలా ప్రత్యక్షమైన దేవిని పరిపరివిధాల స్తుతించినవారై చివరకు ఆమెతో “అమ్మా నీ రూపాలలో 
 
1. ఐది పరము? 
 
2, ఏది అపరము ? 
 
3. ఏది నీ ఐశ్వర్యరూపం ? 
 
4 న్‌ జ్ఞానరూపం ఎమిటి ? 
 
5. ఆజ్ఞానానికి ఫలమేమిటి ? 
 
6. జ్ఞానానికి ముఖ్యసాధనం ఏది ? 
 
7. ఎవడు సాధకుడు 7 
 
8. ఎవడు సిద్దుడు ? 
 
9. అన్నిటికన్న ఉత్తమమైన సిద్ది ఏది ? 
 
10. సిద్దులలో శ్రేష్టుడెవరు ?

No comments:

Post a Comment