Monday, January 25, 2021

కేవలం మిరియాల కోసం భారతదేశం పై దండయాత్రలు, యుద్ధాలు జరిగాయని మీకు తెలుసా!! కామెడీ గా అన్పిస్తుంది కదా!

 కేవలం మిరియాల కోసం భారతదేశం పై దండయాత్రలు, యుద్ధాలు జరిగాయని మీకు తెలుసా!! కామెడీ గా అన్పిస్తుంది కదా!

యూరోపియన్ దేశాలలో మంచు అధికంగా ఉండి, వారు ఎండాకాలంలో సేకరించి పెట్టుకున్న మాంసాన్ని చెడిపోకుండా నిలువ ఉంచుకోవడం అసాధ్యంగా ఉండేది. అందుకు వారికున్న ఒకేఒక్క మార్గం, మాంసాన్ని సుగంధ ద్రవ్యాల తో కలిపి నిలువ ఉంచడం. So, మిరియాలు, జీలకర్ర, లవంగాలు ఇలాంటి వాటిని పొందటం కోసం భారతదేశం మాత్రమే వారికున్న గతి.

అందుకే వారు భారతదేశం తో కొన్ని వేల సంవత్సరాల గా వ్యాపార, ధార్మిక, సాంస్కృతిక సంబంధాలు పెట్టుకున్నారు, యుద్ధాలు కూడాచేసారు.

ఏదేమైనా ఇటలీ పై సనాతనధర్మం ప్రభావం విపరీతంగా ఉందేది.

అందుకు మిగిలున్న కొన్ని ఆనవాలు :

-> క్రీశ 2వ శతాబ్దానికి చెందిన శివలింగం ఒకటి నేటికీ వాటికన్ సిటీ లోని "గ్రెగోరియన్ ఎట్రుస్కన్ మ్యూజియం "లో ప్రదర్శించబడుతోంది.(ఫోటో చూడండి)

-> ఈ శివలింగం ప్రస్తుతం వాటికన్ చర్చి ఉన్న ప్రాంతంలోనే దొరికినదట.

-> అంటే 2000సం|| క్రిందట అక్కడ శివారాధన జరిగిందనే కదా అర్థం.

-> ఇది కాక ఇటలీ అంతటా చాలా శివలింగాలు లభ్యమయ్యాయని వారు వ్రాసుకున్నారు.

-> (చాలా విచిత్రంగా) వాటికన్ సిటీ నిర్మాణం కూడా శివలింగం (పానుమట్టం) ఆకారంలోనె ఉంటుంది

-> వాటికన్ మందిరం గోడలపై గల స్వస్తిక్ గుర్తుల ఫోటోలు, బ్రెజిల్ కు చెందిన నా ఫ్రెండ్ "సామ్మీపార్ " గారు పంపారు, కానీ అవిప్పుడు కనిపించడం లేదు.

-> వాటికన్ సిటీ శాటిలైట్ పిక్ కూడా ఇచ్చాను చూడండి.

-> ఇటలీ ప్రధాన కూడలిలో త్రిశూల ధారి అయిన శివుని (యూరోపియన్ రూపురేఖల తో) ప్రతిష్టించబడి ఉన్నాడు. కానీ నేటి యూరోపియన్ లకు అది శివుడని తెలియదు.

-> పోప్ దండంపై ఇప్పటికీ సూర్యుడు ఉంటాడు.

-> Last but not least నేటికీ ఇటలీలో పెళ్ళిళ్ళలో నూతన వధూవరుల పై అక్షింతలు (బియ్యం) వేసి ఆశీర్వదిస్తారు. నిజానికి యూరప్లో విరివిగా పండేది గోధుమలు. కానీ వారు బియ్యం అక్షింతలు గా వాడటం సనాతనధర్మ సూచకం.

స నాతనధర్మ కీ జయ్

No comments:

Post a Comment