Saturday, January 30, 2021

మృత్యు భయం ఎవరికి ఉండదు ...???

మృత్యు భయం ఎవరికి ఉండదు ...???
మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడి పోతూవుంటాం
మనం జన్మించిన తరువాత, మన జీవితంలో మనం చేసిన మొట్ట మొదటి పని గాలి పీల్చడం. మనం చేసే చిట్టచివరి పని, గాలి వదిలేయడం. మనం ఊపిరి వదిలి మళ్లీ తీసుకోకపొతే, అదే మృత్యువు .... అంతే
“జీవితం ఎప్పుడూ అనిశ్చితమే. మృత్యువు మాత్రం నిశ్చయం.
ఈ విషయం తెలుసుకుంటే మృత్యువు కూడా శాశ్వతనిద్రగా స్వీకరిస్తావు . నిద్రలోని ఆనందం మృత్యువులోనూ పొందుతావు. “-అంటారు శ్రీభగవాన్ రమణ మహర్షి

ఈ దేహoపైన ప్రేమ.. మమకారం.. ప్రాపంచికతపై మోజు - తీరనంత కాలం, వియోగం పుట్టనంత వరకు - మృత్యువు భయంకరంగానే కనిపిస్తుంటుంది.

శ్లో: "దేహినోస్మిన్ యధాదేహే కౌమారం యౌవనం జరా తథాదేహాన్తర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి "
జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది.

మనిషి అన్నింటిని ఒప్పుకొంటాడు, కానీ ఒక్క మృత్యువు అంటే భయపడతాడు,
నేను దేనికి ఒరవను, భయపడను అన్న వాడు కూడా మృత్యువు అంటే ఆమడ దూరం పరుగెడతాడు...
మరి ఎవరికి ఈ మృత్యువు అంటే భయముండదు?
పురాణాలను చదివిన వారికా, పూజలు సల్పే వారికా, సేవలు చేసే వారికా, భజనలు నిర్వహించే వారికా?
అయితే, ఆ మృత్యువు అనే భయాన్ని ఆత్మజ్ఞానంతో అధిగమించవచ్చు. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, తద్వారా మృత్యుభయాన్ని దాటడానికే మనకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలను భగవంతుడు అనుగ్రహించాడు.
వీటినే శాస్త్రాలు అంటారు.
ఇలాంటి శాస్త్రాలను గురువుల వద్ద శ్రవణము చేసి ప్రయోజనం పొందాలి. ఇలా పొందాలంటే.. నిత్యానిత్య వివేకము, ఇహమూత్రార్థ భోగవిరాగము. శమదమాదిషట్క సంపత్తి, ముముక్షుత్వం అనే నాలుగు లక్షణాలు కలిగిఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవారు మృత్యుభయాన్ని సులభంగా దాటగలరు.

ఒకసారి రామావతార సంఘటన చూద్దాం
శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా, అయోధ్యా నగర మంతయూ, వివిధ అలంకరణ లతో, అశేష జన సందోహంతో కళకళలాడింది. ...

'మనువు' ధరించి న కిరీటం ధరించడం, సూర్యవంశ పురాజుల సాంప్రదాయం.
ఆ సాంప్రదాయ మును ననుసరించి, వశిష్ఠుడు, వామదేవుడు,జాబాలి ముగ్గురూ కూడి రాముని శిరస్సుపై ఆ కిరీటమునుంచారు...

అనేకమంది రాజులు, రారాజులు, సామంతులును, ఋషులు, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
సింహ ద్వారము వద్ద, పెద్ద పెద్ద అక్షరాలతో,
" సత్యధర్మాభియుక్తానాం నాస్తిమృత్యుభయం" అని వ్రాయబడిన బోర్డు కనిపించింది.
అనగా .... సత్యధర్మాలతో జీవితం గడిపే వారికి, మృత్యు భయం లేదని అర్ధము....

ఎందుకంటే - సత్యధర్మాలను పాటించే వారికి మరే జన్మ ఉండదు. జన్మించారు అంటేనే కదా, మరణముండేది!

Source - Whatsapp Message

No comments:

Post a Comment