Saturday, May 28, 2022

అవి ధ్యానం వల్లనే సాధ్యం.

పత్రం పుష్పం ఫలం తోయం, యోమే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యు ప్రహృతమస్నామి ప్రయతాత్మనః ( భగవద్గీత )

సామాన్యమైన అర్థం ఏమిటంటే :-
భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.

కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే భగవంతుడు సమర్పించమన్నాడు.

➡ పత్రం -- మనస్సు -- చంచలం.
➡ పుష్పం -- బుద్ధి -- వికసించడం.
➡ తోయం -- చిత్తం -- నిర్మలం.
➡ ఫలం -- అహంకారం -- నారికేళం రెండు ముక్కలవడం.

అవి ధ్యానం వల్లనే సాధ్యం.
👉 ధ్యానంలో 'మనస్సు' యొక్క చంచలత్వం పోతుంది.
👉 అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల 'బుద్ధి' వికసిస్తుంది.
👉 అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ పోయి 'చిత్తం' నిర్మలమవుతుంది.
👉 దానివల్ల నేను అనే 'అహంకారం' తొలగిపోతుంది.
అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వాడే ఆయనకు ప్రీతి పాత్రులు అవుతారు.

No comments:

Post a Comment