Sunday, May 7, 2023

 అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏

కాంతపాళ్యం శ్రీ ఆది శివలింగాచార్య సీనందల్ విశ్వబ్రాహ్మణ పీఠం - తిరువణ్ణామలై నంది

తమిళనాడులోని తిరువణ్ణామలై  కి దగ్గరలో ఉన్నటువంటి కాంత పాళ్యం అనే ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ గురు పీఠం ఉన్నది.ఇది చాలా ప్రాచీనమైనది.మహాభారత కాలము నాటి ఋషుల తపస్సులు ఆచరించిన అరణ్యం గా ప్రసిద్ధి.

తిరువన్నామలై ప్రాంతమును మొఘల్ లు పరిపాలచేసే రోజుల్లో తిరువణ్ణామలై లోని అరుణాచలేశ్వర స్వామి దేవస్తానమ్ లో ఉన్న పెద్ద నంది కి నంది పూజ చేస్తున్నారు.

అప్పుడు అక్కడికి వచ్చిన మొఘల్ రాజు మేము ఆహారం గా స్వీకరించే జీవిని మీరు పూజ చేస్తున్నారు అని అక్కడ పూజ నిర్వహణ చేస్తున్న ఒక 5గురు భక్తులను ని అపహాస్యం గా అంటే ఆ 5 గురు కూడా ఇది మీరు ఆహారం గా స్వీకరించే ఎద్దు కాదు మా సంప్రదాయం లో నందిని అరుణాచలేశ్వర స్వామి  వాహనము గా భావిస్తాము అని చెప్పారు.

ఆ సందర్భములో అక్కడికి ఒక తేజస్సుకలిగిన  బాలుడు వచ్చాడు.

ఈ బాలుడికి మొఘల్ రాజు కి కాస్త వాగ్వివాదాము జరిగినది.మొఘల్ రాజు ఇచ్చిన మాంసమును పువ్వులు గా మార్చాడు.

ఈ మాయలు నేను సహించను అని ఆ మొఘల్ రాజు ఈ అరుణాచలేశ్వరుడి ఎదురుగా ఉన్న నంది నేను రెండు ముక్కలు చేస్తాను అని ప్రయత్నం చేయబోయాడు

అప్పుడు ఆ బాలుడి తపస్సు కి నంది సహజముగా తన కూర్చున్న స్థితిని కుడి కాలము మడిచి ఎడమ కాలు ముందుకు పెట్టింది.....

ఈ సంఘట చూసిన అక్కడి వారు అందరూ ఆశ్చర్యం కు లోనయ్యారు.

కళ్ళముందు రాతి నంది అలా మార్చుకున్న స్థితిని చూసిన ఆ మోఘల్ రాజు.....

ఆ పిల్లవాడిని క్షమించమని వేడుకొని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

ఆ పిల్లవాడే విశ్వబ్రాహ్మణ వంశీయడు సిద్ధపురుషుడు అయినాడు.

ఆయనే శ్రీ ఆది శివలింగాచార్య స్వామి.

వీరు సజీవ సమాది చెందిన ప్రాంతం.....

తిరువణ్ణామలై కి 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న కాంతపాళ్యం.

ప్రస్తుతం 8 వ తరానికి చెందిన శ్రీ శివ జ్ఞాన స్వామి 6382658268 వారు పీఠమును నిర్వహణ చేస్తున్నారు.

🙏🏻అరుణాచలశివ 🙏🏻

No comments:

Post a Comment