Friday, May 31, 2024

****ఓం

 ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🏻🌺

                 ఓం
         🌸🌸🌸🌸

కఠోపనిషత్ యొక్క ఘోషణ ఏంటంటే... అన్ని వేదాలు దేనిని వర్ణన చేస్తాయో, దేన్ని పొందడానికి అన్ని రకాల తపస్సులు చేస్తారో మరియు దేన్ని పొందాలని కోరికతో బ్రహ్మచారులు గురుకులంలో ఉంటూ కఠోరమైన బ్రహ్మచర్యను పాటిస్తారో ఆ పదానికి అర్థం సంక్షిప్తంగా చెప్పాలంటే ఆ పదము 'ఓం'.

    ఒక బ్రహ్మచారి ఒక గురువు దగ్గరికి వెళ్లి తను వచ్చిన పని చెప్తాడు. నాకు గుప్త మంత్రం తెలుసుకోవాలని ఉంది.  దానివలన జీవనం యొక్క అన్ని సుఖాలు దొరికేలా ఉండాలి.  ఆ మంత్రసిద్ధి వలన పెద్దపెద్ద ఖజానాలు తెరవబడాలి. అలాంటి గుప్త మంత్రం మీకు తెలుసా అని అడుగుతాడు. 

     దానికి గురువుగారు అంటారు మహాత్వమైన మంత్రాన్ని తెలుసుకోవాలంటే మహాత్వమైన సాధన చేయాలి.  మరి నువ్వు సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? బ్రహ్మచారి అందుకు అంగీకరిస్తాడు. 

     గురువుగారు చాలా కాలం వరకు శాస్త్రాలను బ్రహ్మచారికి బోధిస్తారు.  కానీ అతను అడిగిన మంత్రం మాత్రం చెప్పలేదు.  బ్రహ్మచారి ఇక ఆగలేక ఒకరోజు గురువు వద్దకు వెళ్లి అడిగేస్తాడు ఆచార్య చాలా కాలంగా మీ ఆజ్ఞను పాటించి శాస్త్రాల అధ్యయనం చేశాను.  కానీ మీరు ఇప్పటివరకు నాకు ఆ మంత్రాన్ని చెప్పలేదు అంటాడు.  సరే నువ్వు ఇంతలా ఆత్రుతగా ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు ఆ మంత్రం చెబుతాను నీ చెవిని నా దగ్గరికి తీసుకురా అని  మంత్రం చెప్తారు . కానీ ఈ మంత్రాన్ని నిత్యం ధ్యానించాలి సుమా!  అలా ధ్యానిస్తే తొందరగా నీకు అన్ని ఖజానాలు లభిస్తాయి.  అని అతని చెవిలో ఆచార్యులు మంత్రం చెప్తారు. 

     ఆ బ్రహ్మచారి ఏకాంత ప్రదేశంలో జపం చేస్తూ కూర్చుంటాడు 'ఓం' అని మంత్ర జపం చేయడం మొదలుపెడతాడు. ఓంకారము అతను చేస్తుంటే పక్కనుండి కూడా ఓంకార ధ్వని వినబడుతుంది.  బ్రహ్మచారి ఆశ్చర్యంగా చూస్తే అక్కడ వేరే వ్యక్తి కూడా ఓంకారాన్ని చేస్తున్నారు.  బ్రహ్మచారి అక్కడి నుండి  బయలుదేరుతాడు.  గ్రామంలోని వారు కూడా ఓం అనే పదాన్ని ఉపయోగించడం చూసి వాహ్ గురువుగారు వాహ్! మీరు నన్ను మోసం చేశారు.  'ఓం' గుప్త మంత్రం అని చెప్పారు.  ఇది అందరూ పలుకుతున్నారు.  మరి ఇది గుప్త మంత్రం ఎలా అయింది? ఆరంభంలో ఓం అంతంలో ఓం మరియు 'ఓం' రహస్యం ఎలా అయింది? ఆచార్య నేను మీకు గుప్త మంత్రం అడిగాను కానీ మీరు ఇచ్చినది గుప్త మంత్రం ఎలా అయింది అందరూ దానిని పలుకుతున్నారు కదా అని గురువుగారిని ప్రశ్నిస్తాడు బ్రహ్మచారి.

     దానికి గురువుగారు నాయనా నీకు గుప్త మంత్రమే ఇచ్చాను.  కానీ నీలాంటి శిష్యులు అనేకం ఉంటారు.  అలాగే గుప్త మంత్రం ఇచ్చే నాలాంటి గురువులు కూడా అనేకమంది ఉంటారు.  సరే నా దగ్గర వేరొక గుప్త మంత్రం ఉంది.  దాన్ని పొందడానికి నువ్వు ఒక పని చేయాలి అంటూ లోపల నుండి ఒక రాయిని తెచ్చి బ్రహ్మచారికి ఇచ్చి, ఇది మా ఆచార్యులు నేను గుప్త మంత్రం అడిగితే దీనిని నాకు ఇచ్చారు.  దీన్ని ఈరోజు  నీకు ఇస్తున్నాను.  బజారుకు వెళ్లి ఇది అమ్మడానికి ప్రయత్నం చెయ్యి.  కానీ అమ్మకు.  ఒకవేళ నువ్వు దీని యొక్క అసలైన విలువను తెలుసుకొని వస్తే నేను నీకు ఆ రెండో మంత్రాన్ని చెప్తాను అంటారు.  

     బ్రహ్మచారి బజారుకు వెళ్లి చాలామంది వ్యాపారులకు రాయిని  చూపించి దీన్నినేను అమ్మాలనుకుంటున్నాను అని చెప్తాడు.  వాళ్ళు ఆ రాతిని కొనడానికి ఎవరూ ముందుకు రారు ఆఖరికి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి రాతిని చూపిస్తాడు రాయిని చూపిస్తాడు.  అతడు ఆ రాయిని చూసి ఇంత విలువైన వస్తువును కొనే అర్హత నాకు లేదు.  ఇది రాజులు మీ ఆచార్యునికి బహుమతిగా ఇచ్చిన రత్నం అయి ఉంటుంది.  దీనిని కొనే శక్తి నాకు లేదు.  దీని విలువ ఎవ్వరు కూడా కట్టలేరు.  అని చెప్తాడు ఆ వ్యాపారి.  బ్రహ్మచారి ఆచార్యుని దగ్గరికి వెళ్లి  చాలామందికి దీని విలువ తెలియలేదు.   ఒక్క వ్యాపారి మాత్రమే ఇది చాలా విలువైనది అని గుర్తించాడు. కానీ ఇంత విలువైనదని తెలిసి కూడా మీరు నాకెందుకు అమ్మమన్నారు ఆచార్య? అని అడుగుతారు. 

     ఎందుకంటే నువ్వు 'ఓం' యొక్క విలువని తెలుసుకోవాలని.  ఈ రాయి విలువ అందరూ తెలుసుకోలేకపోయారు.  అంటే దీని విలువ గుప్తమే కదా!  అందరూ దీని విలువ కట్టలేకపోయారు.  కానీ సునిశితమైన దృష్టి కలవాడే ఇది రత్నం అని తెలుసుకున్నాడు.  అదేవిధంగా 'ఓం' కూడా ఒక రత్నమే.  దాని విలువ గుప్తమైనది.  నిత్యం 'ఓం' ను జపించిన వారు కూడా ఓం విలువ, ఓం రహస్యం తెలుసుకోలేరు.

నిత్యం జపించిన వారు కూడా ఓం విలువ తెలుసుకోలేరా?  కానీ ఇది ఎలా సంభవం?

      బహుశా అందుకే పురాణకారులు 'ఓం' యొక్క మహత్వాన్ని బోధించడానికి ఒక అద్భుతమైన కథను రచించారు. 

     కార్తికేయుడు బ్రహ్మ ప్రజాపతి దగ్గరకు వెళ్లి మీకు నేనొక ప్రశ్న అడగాలి అంటాడు.  దానికి బ్రహ్మ అడుగు ఏం అడగాలి అంటారు.

 ఓం యొక్క అర్థం ఏంటి? 
మీకు 'ఓం' యొక్క తాత్పర్యం తెలుసా? తెలియదా... సరే అయితే మీరు నాకు బందీగా ఉండండి అంటాడు.  సృష్టి రచనా కారుడే తనంతట తాను తన రచనలోనే బందీ అయ్యాడు.

కానీ సృష్టికార్యంలో అలజడి రేగింది.  సృష్టిలో రచన ఆగిపోయింది.  పూలు వికసించడం, చెట్లు ఫలించడం ఆగిపోయింది. దేవతలందరూ భయపడి శంకరుని వద్దకు వెళ్లి ప్రార్థించారు.  అప్పుడు దేవతల యొక్క ప్రార్థన విని ఆశుతోషుడు కార్తికేయుని అడిగాడు.

కార్తికేయ! నువ్వు ప్రజాపతిని బందీ ఎందుకు చేశావు? 

అన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవలసిన వారి దగ్గర నా ప్రశ్నకి సమాధానం లేదు.  అందువలన నేను కాదు ఆయనే స్వయంగా బందీ అయ్యారు. 

'ఓం' యొక్క అర్థం నీకు తెలుసా?  అని శివుడు అడిగారు. 

ఇది తెలుసుకోవాలంటే మీరు నన్ను గురువుగా స్వీకరించాలి.  అందుకు శివుడు అంగీకరిస్తారు. అప్పుడు కార్తీకేయుడు 'ఓం' యొక్క అర్థం ఇలా వివరించాడు.

     'ఓం' ఒక అక్షరం.  ఒక శబ్దం.  'ఓం' ధ్వని మరియు నాదం కూడా. 'ఓం' లో మూడు అక్షరాలు ఉన్నాయి.  అవి  అ, ఉ, మ. ఎప్పుడైతే అ, ఉ కలిసి పోతాయో ఓ అవుతుంది.  ఓ, మ కలిసినప్పుడు ఓం అవుతుంది. ఏ వ్యక్తైనా, అతని మాతృభాష ఏదైనా సరే అతను ఉఛ్ఛరించడానికి నోరు తెరిస్తే స్వాభావికంగా 'అ'కారం యొక్క ధ్వని వెలువడుతుంది.  అతను ఉఛ్ఛరించిన తర్వాత నోటిని మూసినప్పుడు కేవలం 'మ'కారం యొక్క ధ్వని వినిపిస్తుంది.  అతను పెదవులను దగ్గరికి తెచ్చి నోటిని సగం తెరిచి, సగం మూసి ఉంచేటప్పుడు 'ఉ'కారం యొక్క నైసర్గిక ధ్వని వినిపిస్తుంది. 

     అంటే నోటిని తెరిస్తే ఆకారం.  నోటిని మూస్తే మ కారం.  రెండింటికి మధ్యలో ఉకారం  వస్తుంది.  అందువలన అన్ని భాషల యొక్క అన్ని ధ్వనులు (అచ్చులు కానీ హల్లులు కానీ)  అన్నీ కూడా ఓంకార పరిధిలోనే వస్తాయి.  అందువలన 'ఓం'  విశిష్టమైన వైశ్విక ధ్వని.  ఓం ఈశ్వరుని ప్రతీక కూడా. 

     మాండూక్య ఉపనిషత్ ప్రకారం జాగ్రద్ యొక్క సమగ్ర జాగ్రత్ ప్రపంచం ఓంకారం యొక్క ప్రథమ అక్షరం 'అ' నుండే అభివ్యక్తం అవుతుంది.  మరియు సమస్త స్వప్న అవస్థ యొక్క ప్రపంచం 'ఉ' నుండి అభివ్యక్తం అవుతుంది . సుషుప్తి అవస్థ యొక్క ప్రపంచం 'మ' నుండి అభివ్యక్తం అవుతుంది . సంపూర్ణ ప్రపంచమే ఈశ్వరుడు.  మరియు జాగ్రత్, స్వప్న, సుషుప్తే సమస్త ప్రపంచం.  ఈ మూడింటి ప్రతీక  అ,ఉ,మ.  అందువలన 'ఓం' ఈశ్వరుని యొక్క అత్యద్భుతమైన ప్రతీక. 

       ఓంకారం ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూపానికి కూడా ప్రతీక.  మాండూక్య ఉపనిషత్ యొక్క ఘోషణ ఏంటంటే ఎలాగైతే ఈ మూడు అవస్థలు బ్రహ్మ లేదా ఆత్మలోనే ఉత్పన్నమవుతాయి మళ్లీ అందులోనే విలీనం అయిపోతాయో... 

     అలాగే మూడు అక్షరాలతో కూడిన 'ఓం' కూడా శాంతి లేదా నిశ్శబ్దం నుండి ఉత్పన్నమై మళ్ళీ అందులోనే విలీనం అయిపోతుంది.  అందువలన రెండు ఓంకారాలకు మధ్య ఉన్న నిశ్శబ్దతను 'అ' మాత్ర అంటారు.  నిర్గుణ బ్రహ్మ యొక్క ప్రతీక. 

     ఓంకారం ఉచ్చరించే సమయంలో అకారం ఉకారంలో,  ఉకారం మకారంలో విలీనం అవుతుంది.  మరియు మకారం నిశ్శబ్దంలో విలీనం అవుతుంది. అదే విధంగా ఉపాసన సమయంలో ఈ 'ఓం' యొక్క ఉఛ్ఛారణను ఆధారంగా చేసుకుని సాధకుడు స్థూల జాగ్రత్  ప్రపంచాన్ని సూక్ష్మ లేదా మానసిక ప్రపంచంలో, సూక్ష్మ ప్రపంచాన్ని కారణ ప్రపంచంలో విలీనం చేస్తాడు.  తరువాత దానిని కూడా అతిక్రమించి అతను కేవలం శాంత నిర్గుణ శాంతం, శివం, అద్వైతం ఆత్మలోనే స్థిరమైపోతాడు.  ఇదే ఓంకార ఉపాసనకి చరణసీమ. 

     అంటే ఏవైతే అస్తిత్వంలో ఉన్నాయో మరియు సముచయ అస్తిత్వం యొక్క విలువలను అన్నింటిని 'ఓం' అభివ్యక్తం చేస్తుంది.  మరియు అన్నింటికీ 'ఓం' అతీతమైనది.  'ఓం' ని ప్రణవం కూడా అంటారు.  అంటే దీని ద్వారా ఈశ్వరుని స్తుతించగలరు. 

     'ఓం' యొక్క దార్శనికార్ధం అయితే తెలిసింది.  కానీ చాలా మంత్రాలలో ప్రార్థనలలో ప్రారంభంలో ఓం ఎందుకు వాడుతారు?  ఓం నమశ్శివాయ,  ఓం నమో నారాయణాయ మొదలైనవి. 

     ఈశ్వరుడు ఈ సంసారం యొక్క రచన 'ఓం' మరియు య'అథ' ఉచ్చారణ చేసి ఆ తర్వాతే సృష్టిని ఆరంభించారు అని చెప్తారు. అందువలన ఏదైనా కఠినమైన కార్యం ఆరంభించే ముందు 'ఓం' ఉచ్చారణ యొక్క ధ్వని శుభం అవుతుందని అంటారు.  అందువలన చాలా మంత్రాలు, వైదిక ప్రార్థనలో 'ఓం' తోనే ప్రారంభమవుతాయి. అంతేకాదు దైనిక జీవనంలో అభివాదం చేయడానికి కూడా 'ఓం'  ను ప్రయోగిస్తారు.
  హరిః ఓం అని. 

     ఈ విధంగా ఓం అన్నింటిని వ్యక్తం చేస్తుంది.  జీవనం యొక్క లక్ష్యం మరియు లక్ష్యం వరకు చేర్చే  సాధన కూడా.  జగత్తు మరియు దాని అధిష్టానం రూపమైన సత్యం వరకు 'ఓం' చేరుస్తుంది. 


హరిః ఓం 🙏🏻జైగురుదేవ 🙏🏻 🏵️ 
           ‌

No comments:

Post a Comment