Friday, May 31, 2024

మరణం తర్వాత ఆత్మ

 మరణం తర్వాత ఆత్మ

మనిషి మరణించాక శరీరం వదిలి పెట్టి వెళ్ళడానికి ఇష్టపడడు, రోదిస్తూ ఉంటాడు, భార్య బిడ్డలపై ప్రేమ, తల్లి తండ్రి పై ప్రేమ, స్నేహితుల పై ప్రేమ, డబ్బు పై ప్రేమ, జ్యూద్ధం పై ప్రేమ, కామం పై ప్రేమ, ఒకడి నాశనం పై ప్రేమ, ఇలా ఇవన్నీ తీరక మరణించిన తర్వాత కూడ శరీరాన్ని వదలలేక మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోదిస్తూ ఉంటాడు జీవుడు.

కానీ యమభటులు వచ్చి యమపాశం వేసి ఈ భౌతిక శరీరంతో ఉన్న బంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు, అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్ఠమాత్రం అంటే మన చేతి బొటన వేలి సైజ్ లో ఉంటుంది.

శరీరం నుండి వేరు పరిచాక భౌతిక శరీరాన్ని ప్రేతంఅంటారు, వేరుపడిన జీవుడిని ఆత్మ అంటారు, ఆత్మకు కాళ్ళు చేతులు ఆకారం ఉండదు, ఎలాంటి శక్తి ఉండదు. అలా అంగుష్ట మాత్రం ఆకారంతో 12 రోజులు ఆ ఇంటనే తిరుగుతూ ఉంటుంది, ఇష్టమైనవారితో మాటాడాలని చూస్తూ ఉంటుంది, ఎవరు ఎం మాట్లాడుతున్నారో వింటుంది కానీ ఎవరికీ సమాధానం చెప్పడానికి సాధ్యపడదు.

12 రోజులు కర్మలు చేయాలి, వాటినే ద్వాదశ కర్మలు అంటారు, పిండ కర్మలు, తిల తర్పణాలు, దానాలు ధర్మాలు, గరుడపురాణ పారాయణం, ఇవన్నీ కచ్చితంగ 12 రోజులు చేయాలి, గరుడపురాణంలో చెప్పినవిదంగాచేయాలి. కానీ కొందరు మూడురోజులకు కలిపి ఒకరోజు చేస్తారు, కొందరు 12 రోజులవి కలిపి ఒకరోజు చేస్తుంటారు, ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది, ధ్వదస దిన కర్మలు సరిగా చేస్తే ఆ అంగుష్ట మాత్రం ఆత్మ సైజ్ ఉన్న ఆత్మ అరచేయి సైజ్ కి పెరుగుతుంట, అలా మారిన ఆకారాన్ని దివ్య శరీరం అంటారు, 

దివ్యశరీరాన్ని తీసుకెళ్లి పాప పుణ్యాల విశ్లేషణ చేస్తారు చిన్న వెలుగుల కనిపించే యముడి ముందు, ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి, పుణ్యానికి పితృలోకానికి వెళ్తారు అక్కడ కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసి పోతారు, లేదా మల్లి భూమీద మనిషి గ పుట్టడానికి ఎన్నో జన్మలు ఎత్తుత ఉంటాడు చివరగా మనిషి జన్మ తీసుకొని ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు దాన్నే గత జన్మ వాసన అంటారు. 

ధ్వదస కర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారు, దాన్నే పున్నామ నరకం అంటారు, పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు, పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయట పడక ఇక్కడే భాదపడుతూ కొన్నాళ్ళు తిరుగుతా ఉంటుంది, ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుంది, అలా ఆత్మ చింతిస్తే అది పితృ దోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుంది, వంశంలో ఒక్కడు చేసిన తప్పుకు వంశంలో అందరికి శిక్షపడుతుంది, కాబట్టి ద్వాదశ కర్మలు గరుడపురాణంలో చెప్పినమాదిరి శాస్త్రోక్తంగా చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ్వలోకాలకు వెళ్లేల కర్మలు చేయండి. 

అందుకే ఎవరైన వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలి అని కోరుకోవడం మన విధి, అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలి అని కోరుకోవడం అన్నమాట, ఆడైన మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అంటారు. ఆత్మకు ఆడఆత్మ మగఆత్మ అని లింగ బేధం ఉండదు, కాబట్టి జీవుడు అంటారు, ఇక్కడ శాంతిగ ఉండటం ఏంటి, ఆత్మకు కర్మలు చేస్తే ఊర్ధ్వ లోకాలకు వెళుతుంది అలా వెళ్లాలని మనం కోరుకోవాలి.. కానీ ఆత్మకు శాంతికలగాలి అనడం అర్థం లేనిదీ...

కాబట్టి సద్గతిప్రాప్తిరస్తు అని చెప్పండి.

ಓಂ ನಮಃ ಶಿವಾಯ

No comments:

Post a Comment