👌దైవాన్ని మీరు ఎప్పుడైనా చూశారా. ఆయన ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ రూపంలో ఉంటాడో మీకు తెలుసా? ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా రక్షించాడా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఒకసారి పరిశీలిద్దామా..👌
ఈ సమస్త సృష్టికి మూలమై ఉండి, ఈ విశ్వాన్ని, విశ్వ జగత్తును పరిపాలించే మన కంటికి కనపడని ఓ అజ్ఞాత శక్తి ఒకటి ఉంది. ఆ శక్తినే దైవం అంటారు. దాన్నే మనమందరం దైవంగా పూజిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాము. అయితే అనాది నుండి మన ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు దైవానికి ఇచ్చిన నిర్వచనం కొంత విభిన్నంగా ఉంది. అదేమిటంటే “మునులకు హృదయంలో, స్వల్పబుద్ధి గలవారికి విగ్రహాలలో, బ్రహ్మవేత్తలకు జగమంతట ఆ అంతర్యామి గోచరిస్తాడని” మనకు సూక్తి రత్నావళిలో బోధించినట్టే ‘ఇందు గలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోప గతుండంటూ ’ స్తంభంలో నారసింహుని అవతారంలో ప్రత్యక్షం గావింప జేసిన ప్రహ్లాదుడి ఘనతను మనకు భాగవతం తెలిపింది.
మనం మన కంటితో కనలేనిది, వినలేనిది, బోధపడనిది అయిన ఆత్మ విచారణతోనే దైవదర్శనం సాధ్యమని మన ఋషుల వాక్యం కాగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కాళికామాత అనుగ్రహంతో అద్భుత గ్రంథాలు రచించిన మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు ఈ లోకంలో చిరకీర్తి పొందారు. శ్రీరాముని ఆజ్ఞతో పోతనామాత్యుడు భాగవతాన్ని రచించినట్టు కథలున్నాయి. ఉపనిషత్తులలో ఋషులు పలికిన 'నేతి నేతి ' ( న + ఇతి = నేతి. ఇతి అనగా అంతం. ‘న’ అనగా లేదు అని ) అనే ఈ శబ్దం దైవాన్ని అనంతుడని బోధిస్తోంది.
దైవాన్ని తెలుసుకోవడం మానవుల తరం కాదని ఋషులు, మునులు, యోగులు నిర్ధారించి నప్పటికీ అమోఘమైన రచనలతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్న అన్నమయ్య, పురందరదాసు, రామదాసు, తులసీదాసుల చరితలు మనందరికీ లోకవిదితమే కదా. “భగవంతుడిని చేరుకోవడానికి విభిన్న మతాలవారు విభిన్న మార్గాలను ఎంచుకున్నారు ” అని అంటారు రామకృష్ణ పరమహంస. “భగవంతుడిని చేరుకోవడానికి అనేక రకాల మతాలనే దారుల్లో పయనించి నప్పటికీ అందరూ ఒకే చోట భగవంతుడిని కలుసుకుంటారని”వివేకానందుడు పలికినట్టుగా, దైవాన్ని వేర్వేరుగా ప్రచారం చేశాయి మన మతాలు.
నిజానికి “పరమాత్మకు జీవుడికి భేదం లేదని, పరమాత్మ నిరాకారుడు, సర్వవ్యాపితుడని " శంకరాచార్యుని అద్వైత మతం బోధిస్తే,“పరమాత్మ , జీవాత్మ , జగత్తు ఈ మూడూ ఒక్కటేనని, వైవిధ్యంగా కనిపిస్తాయని, సూర్యునికి కిరణానికున్న సంబంధమే పరమాత్మకు, జీవాత్మకు ఉందని ”రామానుజా చార్యుల విశిష్టాద్వైత మతం బోధిస్తే, “ప్రపంచమంతా అంతర్యామి నిండి ఉన్నాడని ” వల్లభాచార్యుల శుద్దాద్వైత మతం బోధిస్తుంది.
భాగవత రహస్యాన్ని వివరిస్తూ “సృష్టిలోని సకల వస్తు ప్రపంచంలోనూ, పంచ మహాభూతాలు ఇమిడివున్నా కనిపించనట్టే, సర్వభూతాలలో ఆత్మ రూపములో ఉన్న నేను, మామూలు మానవ కంటికి కనిపించనని” భగవానుడు పలికిన భాగవత తత్వాన్ని శుకమహర్షి ద్వారా ఆలకించి ముక్తిని పొందిన పరీక్షిత్తు కథను భాగవతం వివరించింది.
ఈ భూమిపై 'లోకోద్ధరణకై అవతారమెత్తి మానవ రూపంలో సంచరించి నప్పుడే అంతర్యామి దర్శనం సాధ్యమని ' పెద్దలన్నప్పటికీ కాళికా మాతను తిలకించి పులకించిన వారిగా రామకృష్ణ పరమహంస, వివేకానందులను లోకం గుర్తించింది. విగ్రహ రూపంలో అంతర్యామిని పూజించి తృప్తి చెందుతున్న జనులు “కళ్ళు మూస్తే ధ్యానంలోను, తెరిస్తే ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగే ” స్థాయికి చేరగలిగితే అలౌకిక అనుభూతిని, ఆనందాన్ని సొంతం చేసుకో గలుగుతారు. అందుకొరకు ప్రతి ఒక్కరూ సాధన చేసి భగవత్ సాక్షాత్కారం పొందిగలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం
🤘సర్వే జనా సుఖినోభవంతు_🤘
Source - Whatsapp Message
ఈ సమస్త సృష్టికి మూలమై ఉండి, ఈ విశ్వాన్ని, విశ్వ జగత్తును పరిపాలించే మన కంటికి కనపడని ఓ అజ్ఞాత శక్తి ఒకటి ఉంది. ఆ శక్తినే దైవం అంటారు. దాన్నే మనమందరం దైవంగా పూజిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాము. అయితే అనాది నుండి మన ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు దైవానికి ఇచ్చిన నిర్వచనం కొంత విభిన్నంగా ఉంది. అదేమిటంటే “మునులకు హృదయంలో, స్వల్పబుద్ధి గలవారికి విగ్రహాలలో, బ్రహ్మవేత్తలకు జగమంతట ఆ అంతర్యామి గోచరిస్తాడని” మనకు సూక్తి రత్నావళిలో బోధించినట్టే ‘ఇందు గలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోప గతుండంటూ ’ స్తంభంలో నారసింహుని అవతారంలో ప్రత్యక్షం గావింప జేసిన ప్రహ్లాదుడి ఘనతను మనకు భాగవతం తెలిపింది.
మనం మన కంటితో కనలేనిది, వినలేనిది, బోధపడనిది అయిన ఆత్మ విచారణతోనే దైవదర్శనం సాధ్యమని మన ఋషుల వాక్యం కాగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కాళికామాత అనుగ్రహంతో అద్భుత గ్రంథాలు రచించిన మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు ఈ లోకంలో చిరకీర్తి పొందారు. శ్రీరాముని ఆజ్ఞతో పోతనామాత్యుడు భాగవతాన్ని రచించినట్టు కథలున్నాయి. ఉపనిషత్తులలో ఋషులు పలికిన 'నేతి నేతి ' ( న + ఇతి = నేతి. ఇతి అనగా అంతం. ‘న’ అనగా లేదు అని ) అనే ఈ శబ్దం దైవాన్ని అనంతుడని బోధిస్తోంది.
దైవాన్ని తెలుసుకోవడం మానవుల తరం కాదని ఋషులు, మునులు, యోగులు నిర్ధారించి నప్పటికీ అమోఘమైన రచనలతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్న అన్నమయ్య, పురందరదాసు, రామదాసు, తులసీదాసుల చరితలు మనందరికీ లోకవిదితమే కదా. “భగవంతుడిని చేరుకోవడానికి విభిన్న మతాలవారు విభిన్న మార్గాలను ఎంచుకున్నారు ” అని అంటారు రామకృష్ణ పరమహంస. “భగవంతుడిని చేరుకోవడానికి అనేక రకాల మతాలనే దారుల్లో పయనించి నప్పటికీ అందరూ ఒకే చోట భగవంతుడిని కలుసుకుంటారని”వివేకానందుడు పలికినట్టుగా, దైవాన్ని వేర్వేరుగా ప్రచారం చేశాయి మన మతాలు.
నిజానికి “పరమాత్మకు జీవుడికి భేదం లేదని, పరమాత్మ నిరాకారుడు, సర్వవ్యాపితుడని " శంకరాచార్యుని అద్వైత మతం బోధిస్తే,“పరమాత్మ , జీవాత్మ , జగత్తు ఈ మూడూ ఒక్కటేనని, వైవిధ్యంగా కనిపిస్తాయని, సూర్యునికి కిరణానికున్న సంబంధమే పరమాత్మకు, జీవాత్మకు ఉందని ”రామానుజా చార్యుల విశిష్టాద్వైత మతం బోధిస్తే, “ప్రపంచమంతా అంతర్యామి నిండి ఉన్నాడని ” వల్లభాచార్యుల శుద్దాద్వైత మతం బోధిస్తుంది.
భాగవత రహస్యాన్ని వివరిస్తూ “సృష్టిలోని సకల వస్తు ప్రపంచంలోనూ, పంచ మహాభూతాలు ఇమిడివున్నా కనిపించనట్టే, సర్వభూతాలలో ఆత్మ రూపములో ఉన్న నేను, మామూలు మానవ కంటికి కనిపించనని” భగవానుడు పలికిన భాగవత తత్వాన్ని శుకమహర్షి ద్వారా ఆలకించి ముక్తిని పొందిన పరీక్షిత్తు కథను భాగవతం వివరించింది.
ఈ భూమిపై 'లోకోద్ధరణకై అవతారమెత్తి మానవ రూపంలో సంచరించి నప్పుడే అంతర్యామి దర్శనం సాధ్యమని ' పెద్దలన్నప్పటికీ కాళికా మాతను తిలకించి పులకించిన వారిగా రామకృష్ణ పరమహంస, వివేకానందులను లోకం గుర్తించింది. విగ్రహ రూపంలో అంతర్యామిని పూజించి తృప్తి చెందుతున్న జనులు “కళ్ళు మూస్తే ధ్యానంలోను, తెరిస్తే ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగే ” స్థాయికి చేరగలిగితే అలౌకిక అనుభూతిని, ఆనందాన్ని సొంతం చేసుకో గలుగుతారు. అందుకొరకు ప్రతి ఒక్కరూ సాధన చేసి భగవత్ సాక్షాత్కారం పొందిగలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం
🤘సర్వే జనా సుఖినోభవంతు_🤘
Source - Whatsapp Message
No comments:
Post a Comment