Tuesday, November 30, 2021

జ్ఞాన దీపం

💥జ్ఞాన దీపం🪔

చిమ్మచీకట్లో నడుస్తున్నప్పుడు దారి కనిపించదు. అప్పుడే దీపం అవసరమేమిటో గుర్తుకొస్తుంది. అలాగే జీవితం అంధకారమయంగా మారినప్పుడు దిక్కు తోచదు. ఎటువెళ్లాలో ఒక పట్టాన తెలియదు. ఏ ఆలోచనా తట్టదు. అప్పుడూ దీపమే కావాలి. హృదయంలో వెలిగే దీపమది. అదే ‘జ్ఞాన దీపం’!

లోకంలో భౌతికంగా కాంతులీనే దీపాలకు ఆది, అంతం ఉంటాయి. మనిషిలో అంతర్లీనంగా వెలిగే దీపానికి ముగింపు ఉండదు. అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.

పగలు, రాత్రి- సుఖదుఃఖాలకు ప్రతీకలు. సుఖం కలిగినప్పుడు సంతోషించడం, అది లేనప్పుడు దుఃఖించడం అతి సామాన్యులు చేసే పని. ప్రాజ్ఞులు అలా కాదు.ు. సుఖదుఃఖాల్లోనూ ఒకే తీరుతో (ఆనందం) వ్యవహరిస్తారు. జ్ఞానసిద్ధి పొందినవారిని ‘బుద్ధుడు’ అంటారు. అతడు ఎప్పుడూ వెలుగులోనే ఉంటాడు. చీకటి అతడి దరి చేరదు. అజ్ఞానం అంటే, చీకటి. జ్ఞానం అంటే, వెలుగు. వెలుగు ఉన్నచోట చీకటికి తావు లేదు. అజ్ఞానం వల్లనే దుఃఖం కలుగుతుంది. జ్ఞానంతో అది తొలగిపోతుంది.

చీకటి వెలుగులు- ప్రకృతి సహజాతాలు. అవి వస్తాయి, పోతాయి. కేవలం ప్రాకృతిక వెలుగు మీదనే ఆధారపడితే, పరాధీనులై మిగిలిపోతారు. సహజమైన వెలుగు వచ్చేంతవరకు, వారు చీకట్లో జీవనం గడపాల్సి వస్తుంది. మనిషి తానే ఒక వెలుగైతే, స్వతంత్రుడిగా మారతాడు. జ్ఞానం పట్ల ప్రేమ పెంచుకోవడం వల్లనే, మానవుడు విద్యుద్దీపాన్ని కనుగొన్నాడు.

జ్ఞానం అనేది రెండు ముఖాలున్న నాణెం వంటిది. ఒక ముఖంతో బయటకు చూస్తే, విజ్ఞాన ఫలితంగా కొత్తవాటిని కనిపెట్టే శాస్త్రవేత్త అవుతాడు. మరో ముఖంతో లోపలికి చూసుకుంటే, జీవన రహస్యాలు విప్పిచెప్పగల తత్వవేత్తగా ఉంటాడు. అందువల్లే పశ్చిమ దేశాలు వైజ్ఞానికంగా ఎదిగాయి. భరతఖండం ఆధ్యాత్మిక శిఖరంగా ఉన్నతీకరణ చెందింది. ప్రపంచం దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.

అజ్ఞానం అనే చీకటి వల్లే అరిషడ్వర్గాలు మనసులోకి చేరతాయి. అల్లకల్లోలాన్ని, గందరగోళాన్ని అవి సృష్టిస్తాయి. ఫలితంగా మనసు దుఃఖానికి లోనవుతుంది.

చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. జ్ఞానం వెలుగుతున్న దీపం వంటిది. ‘ఇంట్లో దీపం వెలుగుతుంటే, అక్కడికి ఏ దొంగా వెళ్లడు’ అని గౌతమ బుద్ధుడు బోధించేవారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి విషయంలోనూ అంతే! ‘లోపలి దీపం’ వెలిగించుకున్న మనిషి మనసులోకి అరిషడ్వర్గాలకు చెందిన ఏ చోరుడూ ప్రవేశించలేడు.

గాలి వీస్తున్నప్పుడు దీపం వెలగదు. పరిపరి విధాలుగా సంచరించే మనసు, వీచే గాలి వంటిది. అలాంటి నిలకడ లేని మనసులో ఆత్మజ్యోతి ప్రకాశించదు. ధ్యాన సాధనతో మనసును ఉన్నతీకరించుకోవాలి. మానవ జీవితం పెట్టుబడి వంటిది. దానికి రాబడి- లోపలి దీపం వెలగడమే!!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

లక్ష్యసాధన

లక్ష్యసాధన

అలారం పెట్టుకుని నీవు ఎప్పుడు లేచావన్నది కాదు. లేచి ఏం చేసావన్నదే ముఖ్యం. 'నేనిది అయి తీరుతాను' అని ఒక లక్ష్యం పెట్టుకోవడం ఒక ఎత్తు. దృష్టి చెదరకుండా దాని వైపుగా మాత్రమే ప్రయాణించడం మరో ఎత్తు. రాముడూ లేస్తాడు ఉదయాన్నే, రావణాసురుడూ లేస్తాడు ఉదయాన్నే. రావణాసురుడు లేచి పరస్త్రీ వ్యామోహంలో వెడితే, రాముడు దైవకార్యం చేయడానికి వెడతాడు.

లక్ష్యం దిశగా నీ ప్రయాణం ముందుకు సాగకుండా వెనక్కి లాగేవి రెండు ఉంటాయి. వాటిలో ఒకటి అహిత శత్రువు, అంటే శత్రువు నీకు కనబడడు. కానీ పక్కన చేరి పాడు చేస్తుంటాడు. అంటే ఎంతో స్నేహితుడిగా కనబడతాడు. కానీ కుట్రలు చేస్తుంటాడు. నీవది గ్రహించేసరికి పుణ్యకాలం దాటి పోతుంది.కలాంగారి మాటల్లోఅంటే విద్యార్థిగా నువ్వొక లక్ష్యం పెట్టుకో. ఏ లక్ష్యం లేకుండా గడ్డిపరకలా బతకొద్దు. మాజీ ఏపీజే అబ్దుల్ చెప్పాలంటే.. "నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఉన్న శక్తి ఇప్పుడు లేదు. అప్పుడు చేసిన మంచి పసులు, అప్పుడు చది విన చదువే ఆధారంగా జీవితం కొనసాగుతున్నది. అప్పుడు చదువుకుని ఉండకపోతే ఇలా నేను మీ ముందుకు వచ్చే సాహసం చేయగలిగి ఉండేవాడిని కాదు. శక్తి నిరుపయోగం కాకుండా ఉండాలంటే ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యమనా అలవోకగా సాధించలేం.
అందుకే చిన్న
లక్ష్యాన్ని పెట్టుకోవడం నేరం అని నాకు అర్ధమయింది' అని అన్నారు. అంటే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటేనే ఎక్కువ శ్రమచేసి దానిమీద దృష్టి పెట్టు కోగలుగుతారన్నమాట.

సర్ ఆర్ధర్ కాటన్ చిన్నత నంలో అన్నయ్యతో కలిసి వీథిలో వెడుతుండగా పెద్ద వర్షంపడి అక్కడక్కడా పెద్ద మడుగులు కట్టింది. 'ఇంటికి త్వరగా వెడదాం' అని అన్నయ్య తొందర పెడుతున్నా కాటన్ ఒక పెద్ద మడుగు దగ్గర ఆగి... ఒకపుల్ల తీసుకుని పల్లం వైపున్న చిన్న చిన్న గుంటలలోకి ఆ మడుగు నీటిని మళ్ళించాడు. తమ్ముడి నిశిత దృష్టిని గమనించిన అన్న ఇంటికి తిరిగి వచ్చిన తరువాత వారి తండ్రికి కాటన్ చేసిన పనిని ప్రశంసాపూర్వకంగా చెప్పాడు. ఆయన కుమారుడిని నీటి పారుదల శాస్త్రంలో ఇంజినీరును చేసారు. ఆ మహానుభావుడే తరువాత కాలంలో ధవళేశ్వరం దగ్గర గోదావరిపై ఒక గొప్ప ఆనకట్ట కట్టి తూర్పు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల్లో బంగారం పండడానికి కారణ మయ్యాడు.

ఇద్దరు శత్రువులు: మీరు లక్ష్యసాధన దిశగా వెళ్ళేటప్పుడు మీరు ముందుకు వెళ్ళకుండా ఆటంకపరిచేవి రెండుంటాయి. అవి హిత శత్రువు, అహిత శత్రువు. ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అహిత శత్రువు- అది శత్రువని తెలిసిపోతూనే ఉంటుంది. తెలిసి కూడా ప్రమాదం చేస్తుంది. హిత శత్రువు మనిషిని ఆకర్షించి నాశనం చేస్తుంది.

అకాలంలో అనవసర విషయాలజోలికి వెళ్ళడం అంటే జీవితాలను పాడు చేసు " కోవడమే. అక్కరలేని వయసులో సెల్ఫోన్. అర్ధంలేని మెసేజ్లు, వీడియోలు చూసు కోవడం, పనికిమాలిన గ్రూపుల్లో ఉండడం. ఏ లక్ష్యం లేకుండా అస్తమానూ వీధుల " వెంట తిరగడం... ఏ పనీ లేదు కాబట్టి పక్కింటివాడిని కలిసి కబుర్లాడడం... కాసేపు ' మంచి పుస్తకం ఎందుకు చదువుకోవు? మంచి విషయాలు ఎందుకు ధ్యానం చేయవు? నీ చదువు నీవు చదుకుకుంటూ కూడా నీ మనసుకు నచ్చిన మంచి హాబీలు.. వీటిని విలాస విద్య లంటారు. వీటిని అభ్యాసం చేయవచ్చు. నీ చదువు నీవు చదువుకుంటూ... ఒక మృదంగం ఒక వేణువాయిద్యం, ఒక కర్ణాటక సంగీతం... అలా ఏదయినా అభ్యసించవచ్చు.

ఒకప్పడు ఆంధ్రా మెడికల్ కాలేజిలో ఆచార్యుడు, గొప్ప వైద్యుడు అయిన శ్రీపాద పినాక పాణి గారు సంగీతంలో నిష్ణాతుడై చాలా పేరు ప్రఖ్యాతులు గడించాడు. చిట్టచివరకు మహావృద్ధుడై మరణశయ్యపై ఉండి కూడా నేదునూరి కృష్ణమూర్తిగారిలాంటి విద్వాంసులు, పలువురు శిష్యులు ఆయన మంచం పక్కన నిలబడి కీర్తనలు పాడుతుంటే వింటూ ప్రాణత్యాగం చేసారు. ఆయన ప్రఖ్యాత వైద్యుడయికూడా విలాసవిద్యను కష్టపడి నేర్చుకుని అంత స్థాయికి ఎదిగారు. అందుకే మనిషి తనను ఆకర్షించి పాడుచేసే వాటి వైపుకి వెళ్ళకూ డదు. నిగ్రహించుకోగలిగే శక్తి ఉండాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

మానవుడు మాధవుని అనుగ్రహానికి నోచుకోవాలంటే తన మనస్సును కోరికల కొంపగా కాక ప్రేమ, భక్తి, విశ్వాసాల గంపగా చేసుకోవాలి.

ఒకసారి రుక్మిణి కృష్ణుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగింది…"విడవకుండా కృష్ణుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా! పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేసావు? ఆ రహస్యం నాకు దయచేసి చెప్పు!" అని.

అందుకు వేణువు నవ్వి ఇలా అన్నది, "నాలోపల డొల్లతప్ప ఏంలేదు. ఆ ఏమీ లేకపోవడమే నన్ను ఆ ఆనంద కిషోరునికి దగ్గర చేసింది" అని చెప్పిందట.

ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులోంచి పూర్తిగా తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆమాధవునితో సదా ఉండగలుగుతారు. ఆయన అనుగ్రహానికి నోచుకుంటారు.

మనం ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుకుని ఆచరిస్తే చాలు ఇంకా ఎటువంటి సాధన అవసరం లేదు!✍️

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట పెద్దలమాట.

నేటి మంచిమాట పెద్దలమాట.

ఇతరుడయినా సరే - మనకు మేలు చేకూర్చేవాడే బంధువు. మనవాడే ఐనా మనకు బాధ కల్గించేవాడు శత్రువే. వ్యాధి దేహంలో పుట్టిందే అయినా బాధ కల్గిస్తుంటే - ఎక్కడో అరణ్యంలో పుట్టిన ఓషధి బాధను తొలగించి ఆరోగ్యాన్ని కల్గిస్తూంది కదా!*

కావున ఎవడు శత్రువో, ఎవడు మిత్రుడో, వాళ్ల స్వభావాలు
ఎలా ఉంటాయో, ఖచ్చితంగా నిర్ణయించడం కష్టం. మిత్రరూప
శత్రువులూ, శత్రురూప మిత్రులూ ఎందరో ఉంటారు.

వీళ్లని
గుర్తించడానికి ఒక విధానం చెప్పబడింది. మన
వాడు కాకపోయినా పరాయివాడే అయినా మనకు మేలు
కల్గించేవాడే నిజమైన బంధువు ఆత్మీయుడు. మనవాడే
రక్తసంబంధం కలవాడే అయినా మనల్ని పీడించేవాడు నిజంగా
శత్రువే అవుతాడు.

వ్యాధి శరీరంలో వస్తుంది. కానీ దాన్ని
తొలగించడానికి ఎక్కడో అరణ్యంలో పుట్టిన ఔషధీమూలిక
ఉపయోగ పడుతుంది కదా!

వీడు సొంతంవాడా పరాయివాడా..
అని కాదు చూడా ల్సింది. వాడు మనకు మంచి చేసేవాడా?
కీడు కల్గించేవాడా? అనే విషయం గమనించాలి. హితం కల్గించే
వాడు ఎవడైనా, ఎక్కడివాడైనా వాడే దగ్గరి బంధువు, అత్యంత
ఆత్మీయుడు. అరణ్య ఔషధి మన శరీరవ్యాధిని పోగొట్టినట్లు
పరాయివా డయినా మనకు హితం చేకూర్చేవాడు నిజమైన
హితుడు, సన్నిహితుడు. ఇతరులకు ఉపకారం చేసే జీవితంఅల్పకాలమే అయినా - వానియశస్సు ఆచంద్రార్కం నిలు స్తుంది. తోటివాళ్లకు తోడ్పడంలో ఉన్న ఆనందం అమోఘం! మహాపుణ్యం!

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

గల్పిక - హాస్యం *పెళ్లాం చెబితే వినాలి!*

గల్పిక - హాస్యం
పెళ్లాం చెబితే వినాలి!


పెళ్లాల దగ్గర ఉగ్రవాదం పనికిరాదు. భక్తిమార్గమే శరణ్యం. అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడంతటివాడు సత్యభామ కాళ్ళు పట్టుకోలేదా?

దేవుడా! నాకు కష్టాన్నివ్వు... బాధలనివ్వు.. టెన్షన్నివ్వు' అని నా లాంటి ఓ విరాగి కోరుకుంటే ' ఇదిగో .... నీ కోరికలు తీర్చే సాధనం' అంటూ నీలాంటి ఓ భార్యనిచ్చాడా దేవుడు' అన్నాను. . మా ఆవిడతో ఎద్దేవాగా.

'ఆహా.. మరి ఆ పెళ్ళాన్ని బెటర్ హాఫ్ అని ఎందుకున్నారో మీ మగాళ్ళు? అయినా, అందుబాటులో ఉండేవాటినే ఆమె కోరుకుంటుంది. మహేష్ బాబు జుట్టు ఎంత ముచ్చటగా ఉంటే నాకేంటి.. నా మొగుడి నెత్తిమీది జుత్తు మాత్రం నా గుప్పెట పట్టేంత ఎత్తుంటే చాలని కోరుకునే అమాయకురాలండీ ఆడది! ఆ మాత్రం మీ మొగమూర్ఖులకు అర్ధంకాదు.. అంతే!

... మీకు నేనో తమాషా కథ చెప్పనా? అనగనగా ఓ అందమైన తోటంట' దాన్నిండా పండ్లూ పూలూ... కాయలూ... మంచి మంచి జంతువులూనూ! అయినా ఆమెకు ఏమీ తోచింది కాదు... ఆడుకునేందుకు ఓ జోడునివ్వవా' అని దేవుణ్ణ్ని అడిగితే ' ఇస్తాగానీ.. రెండు షరతులు.. ఆ వచ్చే మగవాడు నీ కన్నా బలంగా... మొరటుగా ఉంటాడు అన్నాడట...

సరే.. మరి రెండో షరతు? అడిగిందా ఆడమనిషి

' వాడు తానే ముందుపుట్టానని... నువ్వు వాడి పక్కటెముకల్నుంచి వచ్చావని గొప్పలు చెప్పుకొంటాడు. నువ్వు వినీ విననట్లు ఊరుకోవాలి మరి' అన్నాడు.

అప్పుడలా ఒప్పుకొన్నందుకే ఆడది మీ మగాళ్ళ మూర్ఖత్వాన్నే కాదు- చపలచిత్తాన్ని కూడా ఇప్పుడు చచ్చినట్లు భరిస్తోంది
మాది చపలత్వమా?
మీదే కాదు. మిమ్మల్ని పుట్టించిన దేవుళ్ళది కూడా ! ఒక భార్యను పక్కన పెట్టుకుని నెత్తిమీదింకో భామను పెట్టుకున్నాడు శివుడు. ఒక పెళ్ళాంచేత కాళ్ళు పట్టించుకుంటూ ఇంకో పెళ్ళాంకోసం అవతార మెత్తాడు ఇంకో మహానుభావుడు . అలికోసం అంత లావు యుద్ధంచేసి అనుమానంతో భార్యను అగ్నిప్ర వేశం చేయమన్నాడు రాముడు. ఆ దేవుడూ మగాడే కదా! బెడ్ కాఫీ దగ్గర్నుంచీ నైట్ బెడ్ ఎక్కేదాకా మొగాడి అవసరాలు తీర్చేందుకే ఆడది పుట్టిందని మీ మగాడిఅహంకారం .
అవునా?
తలొంచుకుని తాళి కట్టించు కుంటుందని ఎగతాళా? పాచిపనిచేసే పనిమనిషికి బట్టలుతికి ఇస్త్రీ చేసే లాండ్రీవాడికి డబ్బివ్వాలి. హోటల్లో కప్పు అన్నం ఎక్కువ అడిగినా అదనంగా బిల్లేస్తాడు. ఉపరి సర్వారాయుడికి దక్షిణ ఇవ్వాలి. మీకూ, మీ పిల్లలకూ సొంత పన్ల కన్నా ఎక్కువ శ్రద్ధతో సేవచేసే ఆడది గడపదాటి లోపలికొచ్చేందుకు మాత్రం లక్షలు లక్షలు కట్నం పోయాలి. ఛ! .. ఆ గోట్ మ్యాన్ మాటన్నా వినకబోతిని?

ఈ గోట్ మేన్‌ ఎవడు మధ్యలో ? ఏమన్నాడూ ?

మొగుళ్ళు మోటారుబళ్ళులాంటివాళ్ళు. మొదటి ఏడాదే బాగా పనిచేసేది. మొహమాటాలకుపోయి మీ స్వేచ్ఛ పోగొట్టుకోవద్దు! తస్మాత్ జాగ్రత్త! అన్నాడు.

ఓహో.. మాలాగా పేంట్లూ చొక్కాలు వేసుకో వటం, పొద్దుపోయేదాకా బైట తిరిగి ఇంటికిరా పటం... ఇదేనా మేడమ్. . మీ దృష్టిలో స్వేచ్ఛ? దాని స్వాతంత్య్ర అనరు. ఒకరకంగా మగాడి గొప్పతనాన్ని ఒప్పుకొంటున్నట్లే అన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్.

గురువుగారికిప్పుడు సద్గురు గుర్తుకొచ్చారన్నమాట. ఆయనింకా చాలా మంచి మంచి ముక్కలు చెప్పారు స్వామీ! విజయవంతమైన వివాహానికి నమ్ముకోవా ల్సింది పామిస్ట్రీని కాదు. మొగుడూ పెళ్ళాలమధ్య కెమిస్ట్రీని. పెళ్లయితే అబ్బాయి అమ్మాయి ఒకటవుతారు. నిజమే... ఎవరు ఎవరవుతారనేదే అసలు సమస్య . మొగుడూ పెళ్ళాలు సినిమాహాల్లో సీట్లు వంటి వాళ్లు . రెండింటికీ కలిపి ఒక్క రెక్కే ఉంటుంది. సర్దుకుపోవాలి.. తప్పదు ! స్త్రీ పాత్ర లేకుండా నాట కాలు నడుస్తాయేమోగాని, సంసా రాలు నడవ్వు. అలూమగలు ఆలూ కూరిన సమోసాలాగా కలసి ఉండాలి. ఓడి గెలవటమనే విచిత్రసూత్రం ఒక్క భార్యాభర్తల బంధంలో మాత్రమే ఉంటుంది . మొగుడూ పెళ్ళాలు కాటా కుస్తీ వస్తాదులు కాదుకదా! ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసిననాడే ఒకటైనట్లు లెక్క. అతను ఆకాశమైతే ఆమె భూమి. అతను వాక్కు అయితే, ఆమె మనసు. అతను బైకు అయితే, ఆమె బైకు వెనక సీటు. పెళ్ళి తంతులో వల్లించే ప్రతి మంత్రానికి ప్రత్యేక ఆర్థ ముంది. అలుమగలనేది సీతారాముల్లాగా ఒక అందమైన ద్వంద్వ సమాసం. అనురాగం ఛందస్సు కుదిరి, సరైన పాళ్ళలో యతిప్రాసలు పడితే పోతన పద్యంలాగా సంసారం హృద్యంగా ఉంటుంది. వేలు పట్టుకుని నడిచి వచ్చిన భార్యను వేలెత్తి చూపే ముందు మగవాడు ఆలోచించాలి. భర్త పేరు చెప్పటానికే సిగ్గుపడే భార్య భర్త సిగ్గుపడే పని ఏనాడూ చేయకూ డదు. పెళ్లంటే... అరె... అప్పుడే నూరేళ్ళూ నిండాయా?' అన్నట్లుండాలి. అలుమగల మధ్య కయ్యం అద్దంమీద పెసరగింజ నిలిచినంతనేపే! వాదులాడుకోకుండా ఉన్నంతసేపే ఆదిదంపతులకైనా ఆరాధన. సీతారాములు విడిపోయిన తదనంతర రామాయణమంతా విషాదమే. చూశారా? మొగుడూ పెళ్లాల పంచాయతీ మధ్య
మూడోమనిషి దూరేదికాదని రాయని రాజ్యాంగ సూత్రం ఒకటి అనాదిగామన సమాజంలో ఉంది.

నిజమేనోయ్ ! అందుకే ఈ మధ్య ఒక విడాకుల కేసులో సర్వోన్నత న్యాయ స్థానం కూడా కలగజేసుకునేందుకు ఇష్టపడలేదు. '
పైపెచ్చు ' పెళ్ళాం చెబితే వినాలి. మేమంతా అదే చేస్తున్నాం ' అని సలహామాత్రం ఇచ్చింది ఫుల్‌ బెంచీ!

చూశారా! భూమి ఆకర్షణకన్న భామ ఆకర్షణే మిన్న. భూమికి లొంగి నడవంగాలేనిది.. భామకు లొంగి నడిస్తే తప్పేంది ? చదువులమ్మను భార్యగా పొందీ బ్రహ్మదేవుడు తలరాతలు ఇంత తికమకగా ఎందుకు రాస్తున్నాడో తెలుసా ? పెళ్ళాన్ని అడిగి రాయటానికి నామోషీపడి! ... అందుకే అనేది సార్..

పెళ్ళాంచెబితే వినాలని . అంతేగా! ఓకే డార్లింగ్! బుద్ధిగా నడుచుకుంటామిక.. తమరివ్వక ముందే ఇలా వార్నింగ్!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

పొంగకు... కుంగకు స్థిరంగా ఉండు

పొంగకు... కుంగకు స్థిరంగా ఉండు

కష్టం లేదా ఆపద లేకుండా సాధారణంగా ఏ పనీ పూర్తికాదన్నది వాస్తవం. ఆపద ఎదురైన ప్పుడు దానినుంచి పారిపోవడం సముచితమైన విషయం కాదు. అలాగని, ఆ ఆపదలో చిక్కుకుని బాధపడడమూ వివేకి లక్షణం కాదు. ఈ సంద ర్భంలో స్వామి వివేకానంద బోధించిన వాక్యాలు నిజమైన తెలివిని విజ్ఞతతో అన్నివేళలా ప్రదర్శిం చవలసిన ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. "మన మంతా వేటగాడికి భయపడిన కుందేళ్ళలా ఆపద వచ్చినప్పుడు పరుగులు పెడుతూ ఉంటాం. ఇది సరియైన పద్ధతి కాదు. ఎంతటి ఆపదనైనా సరే, ఎదుర్కొని పోరాటాన్ని సాగించడమే నిజమైన ప్రజ్ఞ. ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడ్డామంటే చాలు, కష్టాలు, భయాలు అన్నీ దూరంగా తొలగి పోతాయి.” అన్న అద్భుతమైన వాక్యాలు ఎప్ప టికీ గుర్తుంచుకోతగ్గవే..!!

"మనిషి స్థిరత్వంతో ఉన్నప్పుడు ఆలోచనా సరళిలో స్పష్టత మరింతగా పెరిగి, సాధనకు మార్గం సుగమమవుతుంది. గజిబిజిగా ఉండే యోచనలన్నీ ఒక కొలిక్కి వచ్చి, సజావుగా పురోగ మించేందుకూ, గమ్యాన్ని చేరేటందుకూ ద్వారాలు తెరుచుకుంటాయి" అంటాడు పర్షి యన్ మేధావి రూమి.

స్థిరత్వాన్ని ప్రదర్శించే ఇటువంటి ధీరుల లక్షణాలను స్వామి వివేకానంద తెలిపిన విధమూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 'దిట వైన ఆలోచనా సరళి కలిగిన వ్యక్తి తన కార్యసాధ నలో ఎటువంటి విమర్శలు ఎదురైనా నిరాశకూ, బాధకూ లోను కాడు. తన మార్గాన్ని అధర్మ వర్త నులు లేదా అసత్య ప్రేలాపనలు చేసేవాళ్ళు అడ్డు కున్నా, శాంతస్వభావంతో వాటిని ఎదుర్కొం టాడు. అనవసరమైన ప్రేలాపనలతో సాగే వారి ప్రేరేపణలూ ధీరుడైన ఇటువంటి వ్యక్తిని ఏమీ చేయలేవు. నిత్యమూ సంతృప్తితో సంతుష్టితో ఉండడమే ఇటువంటివారి లక్షణం. ఫలితాల కోసం ఎప్పుడూ వీరు ఎదురు చూడరు. తమ లక్ష్యాన్ని చేరడానికి నిర్మల హృదయంతో శ్రమి స్తారు." అంటారు వివేకానంద. ఎంతటి అద్భుత మైన వాక్యాలో కదా.. ప్రతివారూ గుర్తుంచుకుని, తమ వర్తనా సరళికి అనువుగా మలచుకోవలసిన వాక్యాలే యివి..!!

సమస్య ఎప్పుడైతే వస్తుందో, దానికి ఖచ్చి తంగా పరిష్కారం ఉంటుందనేది ఆర్యోక్తి. సమా ధానం అనేది మన సందేహానికి సూటిగా దొరక్కపోయినా, దానిని దాటే మార్గం మాత్రం తప్ప కుండా ఉంటుంది. ఇది వాస్తవం. మేరునగధీరు లైన సాధకులు చాటిన జీవనసత్యం.

ఎటువంటి పరిస్థితులకూ చలించకుండా. తన సహజ లక్షణంతో చరించడాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. అంటే, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టమైనా యిష్టమైనా చలించని ధీర లక్ష | ణమే స్థితప్రజ్ఞత. ఇదేదో మనకు కొరుకుడు పడని శబ్దమనీ, అందని బ్రహ్మపదార్థమనీ అను కోనక్కర్లేదు. సాధకునిలో ఉండవలసిన స్థిర మైన వర్తనాశైలిగా దీన్ని అభివర్ణించవచ్చు. భయం, అధైర్యం, అనుమానం, అసూయ. ద్వేషభావం వంటి అస వసర భావవికారాలు స్థిత ప్రజ్ఞునిలో అణుమాత్ర మైనా ఉండవు. స్థిత ప్రజ్ఞుడు ఇను మునూ, బంగారాన్నిసమానంగా చూడగలుగుతాడు. పొగడ్తనూ, విమర్శనూ ఒకే విధంగా స్వీకరిస్తాడు.

తాబేలు తన కాళ్ళూ, చేతులూ, తలా మొద లైన అన్ని అవయవాలనూ సాచి, మళ్ళీ డిప్పలోకి ముడుచుకున్నట్లుగా ఈ తరహా వ్యక్తులు సర్వేం ద్రియాలనూ సర్వావస్థల్లో నిగ్రహించుకో గలుగు తారు. తన కనుల ముందు జరిగే సంఘటనలను చూసి కూడా చలించకుండా, స్థిరమైన ఆలోచన తో ముందుకు సాగుతాడు. అంటే మనసును నియంత్రించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండ డమే వీరి వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణం.

ముఖ్యంగా ఆటంకాలూ, అవరోధాలూ ఎదురైనప్పుడే స్థితప్రజ్ఞుల సుగుణాలు జగతికి తేటతెల్లమవుతాయి. తాను పడిపోయానని తెలి సినా కుంగ, అపజయమనే మాటకు లొంగక ధైర్యంగా లేచి నిలబడే ధీరత్వం వీరిలో కనబడు తుంది. తనకు ఎదురైన ఓటమికి వేరేవారిని నిందించరు. కారణాలను అన్యులకు ఆపాదించరు. సంభవించిన పరాజయ క్రమంలో అవమా నానికి, తృణీకరణకు గురైనా చిరునవ్వుతోనే సాగుతూ వినమ్రంగా మసలుకోవడం ఉత్తము లైన వీరి సహజ లక్షణం. ఈ అపజయం తమ గమ్యంలో ఒక మామూలు విషయమేనని తలుస్తూ, కార్యాన్ని
సాధించగలిగిన బలం తనలో ఉందని అపారమైన నమ్మికతో ముందుకు సాగే తత్త్వం వీరి సొంతం. ఇలాంటి వారే అపూర్వమైన ఆ శక్తితో, ఆసక్తితో, అనురక్తితో ఆసాంతం పరిశ్రమించి విజయాన్ని చేజిక్కించుకోవడంలో చరితార్థులవుతారు.

నిశ్చయాత్మకమైన ఆలోచన సొంతమైన ఇటువంటి వ్యక్తులు తమలో ఉన్న మంచిని నలు గురికీ పంచడం ఒక ఉన్నతమైన సుగుణమైతే, తాము ఆ మంచిని చేశామని చెప్పుకోకపోవడం వీరిలో ఎంచదగిన ప్రత్యేకమైన అంశం. ఫలాలు ఎలాగైతే పక్వానికి వచ్చినప్పుడే పండుతాయో, అదేవిధంగా ఫలితం కూడా రావలసిన సమయం లోనే వస్తుందని వీరు నిశ్చల మానసంతో భావి స్తారు. కార్యసాఫల్యం మీద సహజంగా పిరికి వారికి కలిగే సందేహాలు, అపనమ్మకంవంటివి మచ్చుకైనా వీరిలో కానరావు. మనం తరచు మాట్లాడుకునే నూతన ఆవిష్కరణలకు కార ణంగా, ప్రేరణగా నిలిచేది. వీరి కార్యసాధనా క్రమమనే అపూర్వరణమే..!! నవచేతనకు అర్థాన్నిచ్చేదీ, ఊతంగా నిలిచేదీ వీరి సుదృఢమైన చేతలే..!!
'వ్యాఖ్యాన విశారద' వెంకట్ గరికపాటి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

ఒక చిన్ని కథ. *💥తండ్రి 🔥ఆశీర్వాదం.*

అథ్బుత మ్తెన ఒక చిన్ని కథ. 💥తండ్రి 🔥ఆశీర్వాదం.

అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను.

కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు.
ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు.

తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.

ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.
క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.

త్వరలోనే నగరంలోని సంపన్నులలో, ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు.

తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ, ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి.
ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.

ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?”

ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను."

ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.

సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి.

నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్ కుతూహలపడ్డాడు.
ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.

ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,
ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు .

భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు.
ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.

తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు.
నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.

జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు.
ఎవరని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు.

వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు .

అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను."

సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.
సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా, వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు.

అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది. వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని అడిగాడు.

సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.

ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు.

అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం.

ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.
అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.
" లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్.
అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.
“ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక మీరు ఏం సంపాదిస్తారు? ”
ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”

సుల్తాన్ ఇలా అడిగాడు, “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!"

అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, “మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు."అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు .
ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి, ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.

ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.

సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు.

“ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” .

అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు.
అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు.

ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."

సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.
కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు .

తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.

వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.

అనుభూతి - నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి నేను కృతజ్ఞుడను.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

సహజంగా పుట్టిన ప్రతివాడూ జన్మతః ఏ విశ్వాసాలూ లేని నాస్తికుడే.

సహజంగా పుట్టిన ప్రతివాడూ జన్మతః ఏ విశ్వాసాలూ లేని నాస్తికుడే.

వాడికి దేవుడం టే తెలీదు. దెయ్యం అంటే తెలీదు. మతం అంటే తెలియదు.

వాడు పెరిగే కొద్దీ అల్లరి చేయడం మొదలు పెడతాడు. వాడి అల్లరిని తట్టుకోలేక వాడికి ఓ దెయ్యాన్ని పరిచయం చేస్తారు. వాడి పసి మనసులో ఏదో దెయ్యం ఉంది అని తొలుత నాటేస్తారు.

వాడికి ఎదిగే కొద్దీ ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుణ్ణి పరిచయం చేస్తారు. దేవుడు దెయ్యం నుంచి రక్షిస్తాడని,కష్టాలను గట్టెక్కిస్తాడాని నూరిపోస్తారు.

ఆ భావనకు అలవాటు పడి పోతాడు.ఇంకొంచెం ఎదిగాకా స్కూల్లో వాడికి అచ్చం వీడి ఆలోచనల తోటే ఉండి వేరే రకపు దేవుడిని నమ్ముతున్న వాళ్ళు కనపడతారు.

వాడికి ఆశ్చర్యం వేస్తుంది. కొత్త సందేహం కలుగుతుంది. దానిని పోగొట్టడానికి మతాన్ని పరిచయం చేస్తారు వాడికి. మనం నమ్మేవాడే అసలైన దేవుడు, మనల్ని భయపెట్టే దెయ్యమే అసలు సిసలు దెయ్యం అని నమ్మబలుకుతారు.

వాడిలో పక్కవాడికి ఉన్న నమ్మకాలను గౌరవించక పోవడం అనే బీజాన్ని వేసేస్తారు.

ఇంతలో హైస్కూల్ చదువుకు చేరుకుంటాడు. సైన్స్ పాఠం చదవడం మొదలు పెడతాడు.
గాలి ఆక్సిజన్, నైట్రోజన్,
హైడ్రోజన్ , కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువుల మయం అని, నీరు అంటే ఆక్షిజన్, హైడ్రోజన్ ల సమ్మేళనం అనేదీ తెలుసుకుంటాడు.

సోషల్ పాఠం కూడా మొదలవుతుంది. సూర్యుడు , చంద్రుడు, భూమి దేవుళ్ళు కాదని గ్రహాలనితెలుస్తుంది. కానీ ఇంటికి వెళ్తే అవి దేవుళ్ళని, కావాలంటే మన మత గ్రంధాలలో చదివి తెలుసుకోమని ఆ పుస్తకాలు ఇస్తారు. భక్తి సినిమాలు చూపిస్తారు. ప్రార్థనలు చేయిస్తారు. వాడిలో ఓ గందరగోళాన్ని పెంచి పోషిస్తారు.

ఈ ప్రక్రియతో నూటికి 50 మంది అస్తికులుగా మారిపోతారు. మిగిలిన 50మంది తార్కికంగా వాదించే వాళ్ళు ఇంకా నాస్తికులుగా వుంటారు. ఇంకొన్నాళ్ళు గడుస్తాయి. అతని చదువు పూర్తి అవుతుంది, ఉద్యోగం రాదు.
దేవుణ్ణినమ్ముకో మంటారు, కొన్నాళ్ళకు ఉద్యోగం వస్తుంది.మళ్లీ 50 శాతం అస్తికులు గా మారుతారు.

పెళ్లి వయసోస్తుంది. ఇంకా పెళ్లి కుదరదు, మళ్లీ దేవుడి ఎంట్రీ , పెళ్లి కుదురుతుంది, మళ్లీ 50 శాతం అస్తికులుగా మార్పు. ఈ లోపు ఇంట్లో ఎవరికయినా సుస్తీ చేస్తే మళ్లీ దేవుని పరిచయం , తగ్గగానే 50 శాతం మంది కన్వర్షన్.

దీనికి అదనంగా చూసారా అతను కూడ గతంలో నాస్తికుడే, ఒకరోజు భగవంతుడి లీలలని చూసాడు, మారిపోయాడిప్పుడు పూర్తిగా అంటూ వ్యక్తిగత స్థాయి నుండి సామూహిక స్థాయిలో జరిగే మార్కెటింగ్ టెక్నీక్ ల ద్వారా ఇంకొంత మంది ఆస్తికులై పోతారు.

అలా తమ జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే క్రమం లో భగవంతుడనే భావనకి లొంగిపోయినవారు లొంగిపోగా మిగిలిన ఒక నలుగురు మాత్రం నాస్తికులుగా మిగుల్తారు.

ఆ మిగిలిన నలుగురిని నాస్తికులనుండి, హేతువాదులు ఆనండి, తార్కిక వాదులనండి, సైన్స్ ని నమ్మినవారనండి, ఏధైనా అనండి, మిగిలిన ఆ నలుగురితో తొంబయి ఆరు మంది మనలాంటి అస్తికులం అనునిత్యం విభేధిస్తూనే ఉంటాం మన పిడి వాదంతో.

ఆ విభేదించడమన్నది పెద్ద విషయం ఏమీ కాదు కానీ అది చేయటానికి మనం వాడు తున్న సాధనాలు మాత్రం ఆ సైన్స్ కనిపెట్టిన రేడియో, టేలివిజన్, కంప్యూటర్ , స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ , రాకెట్ , సాటిలైట్ , వాట్ నాట్ ఎవ్రీథింగ్. !!!
ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజాల్ని నిజాయితీగా ఒప్పుకోండి
Think once, Think rationally, don't believe anything without reasoning.

మానవత్వమే అసలైన మతమని గుర్తించండి. హేతుబద్ద ఆలోచన, తార్కికత, ప్రశ్నించడం, నిరూపణ అయిన సత్యాలనే నమ్మడం, మూడ నమ్మకాలను విడనాడటం, సాంఘిక సంస్కరణకు తోడ్పడటం, మంచి పౌరులుగా ఎదగడం వంటి లక్షణాలను విద్యార్దులలో పెంచండి.

సేకరణ

ఒక మంచి కథ

🙏 ఒక మంచి కథ

✍️మురళీమోహన్

👌ఒక వ్యక్తి రాత్రి బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి ఏదో చప్పుడైతే
తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడ ఒక దేవదూత కూర్చోని ఏదో
వ్రాసుకుంటూ ఉంది. ఆమె దగ్గరకి వెళ్ళి " అమ్మా! ఏమి వ్రాస్తున్నారమ్మా!"
అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంది.
" దేవుడంటే ఎంతమందికి ప్రేమ భక్తి ఉన్నాయో తెలుసుకుని ఈ పుస్తకంలో
వ్రాస్తున్నాను. " వెంటనే ఆతురతగా ఆ వ్యక్తి ఇలా అడిగాడు.
" మరి ఆ పుస్తకంలో నా పేరు ఉందా? ఒకసారి చూసి చెప్పమ్మా!"
బాగా వెతికి లేదని సమాధానం చెప్పింది ఆ దేవదూత.....
తనపేరు లేదని చెప్పగానే బాధపడకుండా నవ్వుతూ ఇలా అన్నాడు.
" నా తోటి మనుషులకు సహాయాన్ని అందిస్తూ ఉంటాను. మానవత్వం అనే
పుస్తకంలో నాపేరు ఖచ్చితంగా ఉండి ఉంటుంది " అని అన్నాడు.
దానికి దేవదూత నవ్వుతూ వెళ్ళిపోయింది, మరుసటి రోజు ఆ దేవదూత
మళ్ళీ వచ్చింది. తన చేతిలో ఒక పుస్తకాన్ని కూడా తీసుకుని వచ్చింది.
ఆమె చేతిలోని పుస్తకాన్ని అలాగే చూస్తున్నాడు ఆ వ్యక్తి.
" ఏంటి తదేకంగా చూస్తున్నావు. ఇది దేవుడికి ప్రియమైన భక్తుల పేర్లు
ఉన్న పుస్తకం. దేవుడు నీకు చూపించి తీసుకుని రమ్మన్నారు. చూస్తావా? "
అంది దేవదూత.
" తప్పక చూస్తాను తల్లీ! " అని ఆతృతగా ఆ పుస్తకాన్ని అందుకున్నాడు
ఆ వ్యక్తి. పుస్తకాన్ని తెరిచి చూశాడు. ఆశ్చర్యంగా ఆ పుస్తకంలోని
మొదటిపేజీలో మొదటి పేరు తనదే ఉండటాన్ని గమనించాడు.
ఆనందంతో తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలసాగాయి.
మనం ఎందుకు ఈ ప్రపంచానికి వచ్చామో ముందు తెలుసుకోగలగాలి.
తోటివారిలో దేవుడిని చూడగలగాలి....ఎదుటి వ్యక్తిని హింసించి.....చివరికి
చంపడానికి కూడా మనిషి వెనుకంజ వేయడం లేదు. కొందరైతే ఎదుటివారి
నాశనాన్ని దేవుడి దగ్గరికి వచ్చి మరీ వరం అడుగుతుంటారు.
దేవుడికి ఇష్టమైన వారిగా మనం మారాలంటే మనలో కాస్త మానవత్వం
ఉంటే చాలు...వేలకు వేలు దేవుడికి సమర్పించక్కరలేదు. చేతనయినంతవరకు
ఇతరులకు సహా్యాన్ని చేయండి. చేసిన సహాయాన్ని మరచిపోండి.
దేవుడు గుర్తుపెట్టుకుని మిమ్మల్ని రక్షిస్తాడు....సమయానికి తగ్గాట్టుగా
మనకు ఆశీస్సులు అందజేస్తాడని నేను మనసారా నమ్ముతున్నాను.🙏

సేకరణ

నిజమైన సంతోషం - కథ

🌹నిజమైన సంతోషం
కోసం🍁



ఐశ్వర్య మంచి అందగత్తే .
.
.
ఆమె భర్త హరీష్ కూడా అందగాడే .
.
చూడ చక్కని జంట . ఆన్యోన్యమైన కాపురం . వాళ్ళను చూసి అందరూ ముచ్చట పడేలా ఉండేవారు .
.
.
అనుకోకుండా వాళ్ళ జీవితాలలో ఒక విషాదం జరిగింది
.
.
ఏమయిందో తెలీదు
.
ఐశ్వర్యకు చర్మం కాలినట్టు రంగు మారిపోతోంది . ఆమె అందమైన ముఖం కూడా చర్మవ్యాదివలన రూపం మారిపోవడం మొదలు పెట్టింది . ఆమె అందం అంతా ఏమయిపోతోందో ఆమెకే అర్ధం కావడం లేదు . డాక్టర్ లు ఏమీ చెప్పలేకపోయారు .
.
ఒక రోజు హరీష్ ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళాడు . రిటర్న్ లో వస్తూ ఉంటె ఆక్సిడెంట్ అయింది . అతడి రెండు కళ్ళూ పోయాయి .
.
ఐశ్వర్య దుఃఖానికి అంతే లేదు
.
అయితే ఒక అదృష్టం . వాళ్ళ కాపురం లో కలతలు లేకుండా ముందు లాగే సాగుతోంది . అతడికి కళ్ళు పోయాయని ఆమెకు చింత లేదు . ఆమె కురూపిగా మారినా హరీష్ కు తెలియలేదు .
.
ఆమె వ్యాధి ముదిరిపోతోంది . చర్మం అంతా కమిలిపోయి సాదా సీదా పనులు చెయ్యడానికి కూడా కష్టం అయిపోతోంది . గతాన్ని తలచుకొని ఆమె ఎంతో బాధ పడుతోంది . తన బాధను తనలోనే అణుచుకొని హరీష్ తో మునుపటిలాగే ఉంటోంది .
.
.
ఒక రోజు ఉదయానికి ఐశ్వర్య ఇంక లేవలేక పోయింది . ఆమె బాధను చూడలేని హరీష్ ఆమెకు జ్వరం వచ్చింది అనుకుని తోచినంతలో అనీ తానే చేశాడు . ఆమె ఆ సాయంత్రం మరి ఇక లేవలేదు .శాశ్వతంగా నిద్ర పోయింది.
.
.హరీష్ ఆమె కర్మకాండలు అన్నీ చేశాడు . ఆమె లేని ఇంట్లో ఎలా గడపడం ? ఒక్కడే !
.
ఒక రోజు సామాను అన్నీ సర్దుకుని వెళ్లిపోతుంటే పొరుగు ఉన్న పవన్ వచ్చి ఎలా బ్రతుకుతారు ? ఇక్కడ మీకు అందరూ తెలిసిన వారు కదా ! వేరే చోట మీకు ఇబ్బంది అవుతుందేమో ? ఆలోచించండి అన్నాడు .
.
.
‘నేను గుడ్డివాడిని కాను పవన్ ! నా భార్య బాధ పడకూడదు అని గుడ్డివాడిలా నటించాను . తన శరీరం రంగు మారడం నాకు తెలియనట్టు నటించాను . నాకు తెలిస్తే , నేను తనకు దూరం అయిపోతాను అని తను ఆత్మహత్య చేసుకుని ఉండేది పవన్ . తన శరీర బాధ కన్నా నేను ఏమన్నా అనుకుంటానేమో అనే బాధ ఆమెకు ఎక్కువ అయి ఉండేది . ఆమె నన్ను అంతగా ప్రేమించింది . ఆమెను సంతోషంగా ఉంచడం కోసం నేను నటించాను . ఆమె తృప్తిగా మరణించింది . అది చాలు నాకు “ అన్నాడు.

మ్తె డియర్ ఫ్రెండ్స్. నిజమైన సంతోషం ఎదుటివారిని సంతోష పెట్టడం లోనే ఉంది అని అవతార్ మెహర్ బాబా చెప్పే మాటలు ఆచరణలో చూపిన హరీష్ వంటి వారు మనలో కూడా ఉండే ఉంటారు కదూ !

.
నచ్చితే ఒక మంచి మాట ,
.వీలయితే పదిమందికీ పంచండి .

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

"మార్ష్ మెల్లో సిద్ధాంతం" ప్రకారం, ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు.

ఒక పరీక్ష

స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.

"వినండి పిల్లలూ! మరో పది నిమిషాల వరకు మీరందరూ మీ మిఠాయి తినకూడదు" అని చెప్పి తరగతి గది నుండి వెళ్లిపోయాడు.

క్లాస్‌రూమ్‌లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది.

పిల్లలందరూ తమ ముందు ఉంచిన మిఠాయి వైపు చూస్తున్నారు, గడిచే ప్రతి క్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవటం చాలా కష్టంగా ఉంది.

పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్ లోకి ప్రవేశించారు.

అతను పరిస్థితిని సమీక్షించాడు.

మొత్తం క్లాస్ లో మిఠాయిలు తిననివారు ఏడుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు, మిగిలిన పిల్లలందరూ మిఠాయి తినేసి, దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి, బోధన ప్రారంభించాడు.

ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్.

కొనేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు.

ఈ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు.

అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా, సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు.

వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంలో ముగించాడు –

" కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి, జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు."

ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది.

ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి, "మార్ష్ మెల్లో" అవడంవల్ల, ఇది "మార్ష్ మెల్లో సిద్ధాంతం" అని పిలువబడింది.

ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు.

ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహనశక్తిని పెంచుతుంది కాబట్టి, అతను ప్రతికూల పరిస్థితులలో కూడా నిరుత్సాహపడడు.
తనకు తానుగా ప్రేరేపించుకుంటూ, విజయవంతమైన వ్యక్తి అవుతాడు.

సేకరణ

Never learnt much about Shivaji in history in School. Amazed at what many think of him

Never learnt much about Shivaji in history in School. Amazed at what many think of him:

"From Kabul to Kandahar my Taimur family created the Mogul Sultanate. Iraq, Iran, Turkistan and in many more countries my army defeated ferocious warriors. But in India Shivaji put brakes on us. I spent my maximum energy on Shivaji but could not bring him to his knees.

Ya Allah, you gave me an enemy, fearless and upright, please keep your doors to heaven open for him because the world's best and large hearted warrior is coming to you."

-Aurangzeb (After Shivaji's death, while reading Namaz)

"That day Shivaji just didn't chop of my fingers but also chopped off my pride. I fear to meet him even in my dreams."

--Shahista Khan.

"Is there no man left to defeat Shivaji in my kingdom??"

- Frustrated Begum Ali Adilshah.

"Netaji, your country does not require any Hitler to throw out British. All you need to teach is Shivaji's history."

-Adolf Hitler

"Had Shivaji been born in England, we would not only have ruled earth but the whole Universe."

-Lord Mountbatten

"Had Shivaji lived for another ten years, the British would not have seen the face of India."

-- A British Governer

_If India needs to be made independent then there is only one way out, 'Fight like Shivaji'."

--Netaji

"Shivaji is just not a name, it is an energy source for Indian youth, which can be used to make India free."

- Swami Vivekananda.

"Had Shivaji been born in America, we would nomenclared him as SUN."

- Barrack Obama

The famous war of Umberkhind is mentioned in the Guinness Book of World Records:

"The 30,000 strong army of Kartalab Khan from Uzbekistan was defeated by mere 1000 mawalas of Shivaji. Not a single Uzbeki was left alive to return back home."

Shivaji was a King of International fame. In the span of 30 yrs of his career he fought with only two Indian warriors. All the others were outsiders.

Shahista Khan, who feared Shivaji even in his dreams was King of Abu Taliban and Turkistan.

Behlol Khan Pathan, Sikandar Pathan, Chidar Khan Pathan were all warrior sardars of Afghanistan.

Diler Khan Pathan was the great warrior of Mangolia. All of them bit dust in front of Shivaji.

Sidhhi Jowhar and Salaba Khan were Iranian warriors, who got defeated by Shivaji.

Sidhhi Jowhar later planned a sea attack. In response Shivaji raised a navy, the first Indian Navy. But before accomplishing the task Shivaji left this world. (He was poisoned.)

Google "Shivaji, the Management Guru." It's a full subject in Boston University.

Yet, we Indians know so little about him..... what a pity.... atleast let us make our future generation to know about this great INDIAN.

Pl do the least circulate widely.🙏🙏🙏

సేకరణ

తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.

ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా



నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.
మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాష లో కూడా పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి చెందిన నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.
ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.

11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.

14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.
కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే.
తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి ఆంగ్లం లో తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన.
ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం.
ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు.

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం

సేకరణ

బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఇంగ్లీషులో ఓపెన్ లెటర్ (రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ) మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీని పిఎం నరేంద్ర మోడీతో పోల్చవచ్చా అని తనను తాను నిర్ణయించుకోవాలని ఆమె కోరింది… లేఖ ఈ క్రింది విధంగా ఉంది

బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఇంగ్లీషులో ఓపెన్ లెటర్ (రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ) మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీని పిఎం నరేంద్ర మోడీతో పోల్చవచ్చా అని తనను తాను నిర్ణయించుకోవాలని ఆమె కోరింది… లేఖ ఈ క్రింది విధంగా ఉంది

"ప్రియమైన మిస్టర్ రాహుల్ గాంధీ"

లక్షలాది మంది ప్రజలు తమ నాయకుడిగా నరేంద్ర మోడీని అనుసరిస్తారు, వారు అతనిని తమ ఆదర్శంగా భావిస్తారు. మన దేశంలో ఎంత మంది మిమ్మల్ని (రాహుల్ గాంధీ) తమ ఆదర్శంగా భావిస్తారు?

రాజవంశ అనుచరులకు అధికారాన్ని అప్పగించడానికి ఇష్టపడని దేశంలోని వ్యక్తి, నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు మరియు ప్రజలు తిరస్కరించిన అదే రాజవంశానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాంధీ ట్యాగ్ కాకుండా, జీవితంలో ఏ రంగంలోనైనా మీరు సాధించిన విజయం ఏమిటి? వాస్తవానికి, చాలా కాలం నుండి ప్రజలను మోసం చేశారు, దయచేసి మాకు చెప్పండి మీరు నిజంగా ఏమి సాధించారు?

ప్రతి సంవత్సరం, నరేంద్ర మోడీ, తన పుట్టిన రోజున, తన తల్లిని కలుస్తాడు మరియు తల్లి సరైన మార్గంలో నడవడానికి సంకేతంగా భగవద్గీత కాపీని అందజేస్తాడు. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు

నరేంద్ర మోడీ మొదటిసారి పార్లమెంటులోకి ప్రవేశించినప్పుడు, ఆయన సభకు నమస్కరించారు మరియు దానిని ప్రజాస్వామ్య దేవాలయం అని పిలిచారు. మీరు అదే నమ్ముతారా? మీరు ఎప్పుడైనా పార్లమెంటును గౌరవించారా?

ప్రధాని అయిన తరువాత, గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తన జీతం రూ. 21,00,000 ను పిల్లల విద్యా నిధికి విరాళంగా ఇచ్చారు. రాహుల్ మీరు ఎప్పుడైనా దేశం కోసం ఏదైనా సహకరించారా?

ప్రధాని మోడీ నాయకత్వంలో కేవలం 4 సంవత్సరాలలో 600 మంది ఉగ్రవాదులు నిర్మూలించబడ్డారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉగ్రవాదులు చంపబడ్డారు?

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, పేదలకు వంట గ్యాస్ కనెక్షన్లు లభించలేదు, కానీ 4 సంవత్సరాల కాలంలో, 50 మిలియన్లకు పైగా పేద ప్రజలకు మోడీ వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.

అదే విధంగా, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిర్ధారించబడింది, మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయింది?

మోడీ ఏ కుటుంబానికి అనుకూలంగా లేదా స్వపక్షపాతాన్ని ప్రోత్సహించరు, కానీ మీ కుటుంబం మొత్తం పార్టీపై ఆధిపత్యం చెలాయించింది మరియు పార్టీని వారి వ్యక్తిగత ఆస్తిగా భావిస్తుంది. ఎందుకు? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాబర్ట్ వాద్రాకు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎలా వచ్చింది?

ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డోక్లాం సమస్య ప్రారంభం కాలేదు. ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. తమ సైనికులను తిరిగి పిలవాలని చైనీయులను బలవంతం చేసినది ప్రధాని మోడీ. మీ ప్రభుత్వం మరియు మీరు దీన్ని చేయగలిగారు?

6 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ లేదా ఆయన ప్రభుత్వంపై ఒక్క అవినీతి కేసు కూడా లేదు. అవినీతి లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు దశాబ్దాలలో (60 సంవత్సరాలు) ఏదైనా కాలాన్ని చూపించగలరా? లేదు!

మీరు మరియు మీ పార్టీ ప్రజలు పిఎం మోడిని చైవాలా అని పిలుస్తారు. అవును, అతను టీ అమ్మినట్లు ఒప్పుకున్నాడు. మేము వారి ఆదాయాన్ని మరియు నిజాయితీతో కూడిన జీవితాన్ని ఏదైనా తప్పుగా పరిగణించము. మీ ఆదాయం మరియు జీవనం కోసం మీరు ఏ పని చేశారో మాకు చెప్పగలరా?

నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు వెళతారు. మీరు ఏ ప్రయోజనం కోసం విదేశాలకు వెళతారో మాకు చెప్పగలరా?

ప్రధాని మోడీ సైనికుల కోసం OROP ను ఆమోదించారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు మరియు మా సైనికులకు ఇతర భద్రతా, సైనిక సామగ్రిని కొనుగోలు చేశారు. మీ ప్రభుత్వం వారి కోసం ఏమి చేసింది?

అతను 3 సంవత్సరాలలో 300 మిలియన్లకు పైగా ప్రజలను "జన ధన్ యోజన" లో చేర్చాడు. మీ పార్టీ పదేళ్ల పాలనలో ఇది ఎందుకు సాధ్యం కాలేదు?

ఆడపిల్లలను కాపాడటానికి పిఎం మోడీ "బేటీ బచావో, బేటి పధావో" ప్రచారాన్ని ప్రారంభించారు. దేశంలో బాలికలను కాపాడటానికి కాంగ్రెస్, లెఫ్ట్, ఆప్, 🥄🥄లు ఏమి చేశారు?

దేశంలోని లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే "ముద్ర జీవన్ బీమా యోజన" ను మోడీ ప్రారంభించారు. ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం, పదేళ్లలో కాంగ్రెస్ ఎన్ని పథకాలను తీసుకువచ్చింది?

మన సరిహద్దులను పరిరక్షించడానికి పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించడానికి మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా సరిహద్దులను రక్షించడానికి మీ పార్టీ ఏమి చేసింది?

తన పార్లమెంటులో ప్రసంగించడానికి అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మరియు జపాన్ ఆయనను ఆహ్వానించారు. ప్రధాని మోడీ కృషి మరియు నాయకత్వాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పటి ప్రధానమంత్రిని ఎన్ని దేశాలు ఆహ్వానించాయి?

కొద్ది సంవత్సరాలలో, ప్రధాని మోడీ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయ్యారు మరియు "టైమ్స్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్" గా పేరు పొందారు. మీరు 2004 నుండి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఇప్పటివరకు ఏమి సాధించారు?

న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో 22,000 మంది ప్రజల ముందు నరేంద్ర మోడీ ప్రకటించారు, మేము బిచ్చగాళ్ళు మరియు పాముల దేశం కాదు, పాలక దేశం. రాహుల్ లాంటి ఆయన మన దేశాన్ని స్తుతించే ధైర్యం, ధైర్యం మీకు ఉందా?

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, మీ కుటుంబం నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం "పేదరికాన్ని తొలగించు" అని చెప్పడంలో ఎప్పుడూ బిజీగా ఉంది మరియు మన భారతదేశం చాలా పేద దేశం అని నిరూపించడంలో ఎల్లప్పుడూ విజయం సాధించింది. విదేశాలలో మన దేశం యొక్క అహంకారం మరియు ప్రభావాన్ని మెరుగుపరచడానికి మీ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రయత్నించారా ?

ప్రతి రంగంలో మీ పార్టీ తన కార్మికులను సహకారం కోసం ప్రేరేపిస్తూ, వారి కాళ్ళను లాగుతున్నప్పుడు, కేవలం 6 సంవత్సరాలలో, మోడిజీ మీరు కోరుకున్న విధంగా ఆ మార్పును ఎలా తీసుకురాగలరు.

పీఎం మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు, సమయం మరియు డబ్బు ఆదా చేయడానికి ఫ్లైట్ సమయంలో నిద్రపోతాడు. రాహుల్ మీరు దేశం కోసం ఎన్ని గంటలు పని చేస్తారు?

ప్రధాని మోడీకి బలమైన రాజకీయ నేపథ్యం లేదు. ఆయన కృషి, నిబద్ధత, అంకితభావం తరువాత దేశ ప్రధాని అయ్యారు. గాంధీ ట్యాగ్‌ను వదలిపెట్టిన తర్వాత మీ సామర్ధ్యాల బలం మరియు కృషిపై మీరు ఏదైనా సాధించగలరా?

18 ఏళ్ళ వయసులో, దేశానికి సేవ చేయడానికి మోడీ తన ఇంటిని వదిలి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. రాహుల్ గాంధీ 18 ఏళ్ళ వయసులో మీరు ఏమి చేస్తున్నారు?

ఈ దేశంలోని మెజారిటీ పౌరులు ప్రధాని మోడీ లాంటిది సాధించాలని కలలుకంటున్నారు. ఎంత మంది మిమ్మల్ని అనుసరించాలని మరియు మీలా ఉండాలని కోరుకుంటారు?

రాహుల్ ఈ దేశాన్ని నడపడానికి గాంధీ ట్యాగ్ మాత్రమే అవసరం లేదు, కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంకల్పం మరియు నిబద్ధత చూపించగల వ్యక్తి అవసరం.

దేశం మొత్తం దీన్ని చదవాలి, కాబట్టి దయచేసి ఇతర ప్రాంతీయ భాషలలో కూడా అనువాదాన్ని పోస్ట్ చేయండి.*

సేకరణ

మనసు మాటల ముత్యాలు

మనసు మాటల ముత్యాలు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సేకరణ:

🌹 మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు,
తిట్టేవారందరూ పరాయివారు అనుకోకూడదు...
ఏ మెప్పువెనక ఏ మోసముందో
ఏ తిట్లవెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి."

🌹 కొన్ని బంధాలు
మన పుట్టుకతోనే ఏర్పడతాయి
కొన్ని బంధాలు
మనం ఏర్పరచుకుంటాం..
కానీ కొందరు మాత్రం
ఏ బంధం లేకుండా మనతో
ఆత్మబంధువుల్లా ఉంటారు.
అలాంటి వారిని
ఎప్పటికీ వదులుకోకండి.

🌹 కాలం ఎప్పుడూ
ఒకేలా ఉండదు.
తలపొగరుతో తిరిగిన వాడిని
తలదించుకునేలా చేస్తుంది.
తలదించుకుని బ్రతికినవాడిని
ధైర్యంగా బతికేలా చేస్తుంది.
నవ్విన వాడిని ఏడిపిస్తుంది.
ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది.
కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే..!!

🌹 లోకం పోకడ.....

బంధం బాగున్నప్పుడు
అందరి విషయాలు నీకు చెప్తారు.
బంధం వీగినప్పుడు...
నీ విషయాలు అందరికీ చెప్తారు....!!

🌹 గెలవాలి అనే స్ఫూర్తితో పోరాడు...
ఓడినా...తట్టుకోగలవు...
గెలిచి తీరాలనే అహంతో పోరాడకు...
ఓడిపోతే తట్టుకోలేవు...
అది పోటీ అయినా...జీవితమైనా...!!

🌹 ముఖంపై చేదుగా మాట్లాడే వారు
ఎప్పుడూ మోసం చేయరు.
భయపడవలసింది తియ్యగా
మాట్లాడే వారితోనే..
మనసులో అసూయ
పెంచుకుంటారు,
సమయం వచ్చినప్పుడు
మారిపోతారు.
అద్దం బలహీనమైనదే
కానీ నిజాన్ని చూపడంలో
ఎప్పుడూ భయపడదు..!!

🌹 కోపం, బాధ, ప్రేమ
ఇవి అందరి మీద చూపించలేము.
మనం ఇష్టపడే వారి మీద,
ప్రేమించే వారి మీద
మాత్రమే చూపించగలం.
మీరు ఎంత తిట్టినా,
బాధ పెట్టినా
నీకోసం ఏదైనా భరిస్తారు.
అలాంటివారిని వదులుకోకండి.
మీరు దూరం అయితే వాళ్లు తట్టుకోలేరు
అని గుర్తుంచుకోండి.

🌹 ఎప్పుడూ సంతోషంగా
ఉండాలి అనే కోరిక కన్నా
ఎప్పుడూ సంతృప్తి గా ఉండాలి
అనే కోరిక చాలా విలువైనది.

🌹 విద్య నేర్చుకున్నాక
గురువుని మరచిపోకు.
ధనం వచ్చాక
మిత్రులని మరచిపోకు.
భార్య వచ్చాక
కన్న వారిని మరచిపోకు.
గౌరవం వచ్చాక
గతం మరచిపోకు.
అవసరం తీరాక
సహాయం చేసిన వారిని
*మరచిపోకు.

సేకరణ

Thursday, November 25, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

ఒక ఊళ్లో రాజయ్య తన కుటుంబ సభ్యులు కూతురు చిన్నారితో కలిసి జీవించేవారు, చిన్నారి రెండవ తరగతి, రాజయ్య రూపాయి ఆదాయం ఉంటే వంద రూపాయలు ఖర్చు చేసి ధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం వలన పేదవాడు అయినాడు, జీవనం గడపటానికి పెద్ద ఆధారాలేమీ లేవు, వాళ్ళ ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్లు తప్ప ...

రోజూ రాజయ్య చిన్నారి ఇద్దరూ కలిసి కరివేపాకు చెట్టు నుండి కరివేపాకును తెంపుకొని, ఊళ్లో వీధి వీధినా తిరిగి అమ్ముకునేవాళ్ళు, అలా వచ్చిన డబ్బుతో, తమకు అవసరమైన సరుకులు తెచ్చుకుని జీవించే వారు ..

ఒకరోజున, చిన్నారికి ఒక సందేహం వచ్చింది, కరివేపాకు చెట్టుకు కూడా ప్రాణం ఉంది కదా? దాని కొమ్మలు విరిస్తే దానికి బాధ కలుగుతుంది గదా ? మరి మనం ఇలా రోజూ కరివేపాకు కోసుకుంటుంటే ఎలాగ అని ..?

ఆపైన ప్రతిరోజూ చిన్నారి తన తల్లిదండ్రులు ఇదే ప్రశ్న అడిగేది, వాళ్ళకు ఏమి జవాబివ్వాలో తెలిసేదికాదు, నన్నుడిగితే నేనేం చెప్పాలి తల్లీ! నువ్వడిగేదేదో ఆ కరివేపాకు చెట్టునే అడుగు ! అన్నారు చివరికు...

చిన్నారి కరివేపాకు చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టూ, చెట్టూ, రోజూ నీ కొమ్మలు విరుస్తున్నాం, నీకు బాధ కలగటం లేదా ? అని అడిగింది ..

బాధగానే ఉంటుంది చిన్నారీ! కానీ నన్ను జాగ్రత్తగా చూసుకునే మీరు కూడా బ్రతకాలి గదా? నేను కొంచెం కష్టపడినాగానీ, మీరు సుఖపడుతున్నారు, నాకు తృప్తి, సంతోషంగా కలుగుతుంది, అందుకే మీరు నా కొమ్మ ఒకటి విరిస్తే నేను నాలుగు కొమ్మలు వేసి అందిస్తున్నాను

చిన్నారికి పెద్దగా అర్థం కాలేదు కానీ, ప్రక్కనే నుంచి వింటున్న రాజయ్యకు తన కుటుంబం కోసం ఎలా కష్టాలు సహించాలో ధనాన్ని ఎలా పొదుపు చేయాలో అంటే ఒక రూపాయిని పది రూపాయలుగా చేసుకునేందుకు ఎలా ప్రయత్నం చేయాలో అర్థం అయ్యింది ..

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

అందరికీ స్ఫూర్తి కలిగించే సత్యం. *💥Paytm CEO:కథ

అందరికీ స్ఫూర్తి కలిగించే సత్యం.

💥Paytm CEO:కథ వీరి సంపాదన చూసి పిల్లను కూడా ఇవ్వలేని స్థితిలో
రూ.10వేల సంపాదన నుంచి బిలియనీర్‌ స్థాయికి ఎదిగిన వైనం..

ఐపీఓ సందర్భంగా భావోద్వేగానికి గురైన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కథ.
అనతికాలంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోకి విస్తరించడంతోపాటు డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న పేటీఎం..

తాజాగా భారత్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో (స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కావడం) స్థాయికి ఎదిగి యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం కొంతకాలంలోనే కోటీశ్వరుడిగా మారడమే కాకుండా వేల మందికి ఉపాధి కల్పిస్తోన్న తీరు కూడా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది..తాజాగా బాంబే స్టాక్‌ ఎక్ఛేంజీలో లిస్టింగ్‌ సందర్భంగా మాట్లాడిన పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ (43).. సంస్థ ఎదిగిన క్రమాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు..

పిల్లనిచ్చేందుకు వెనుకడుగు..

అంతకుముందు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్‌ శర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..

ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత 27ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఓ సంస్థను స్థాపించి మొబైల్‌ కంటెంట్‌ను విక్రయించడం మొదలుపెట్టాను. ఆ సమయంలో సంస్థ నుంచి వచ్చే ఆదాయం నెలకు కేవలం రూ.10వేలు మాత్రమే. ఈ విషయం తెలుసుకొని నాకు పిల్లను ఇచ్చేందుకు (వధువు కుటుంబాలు) కూడా ఎవరూ ముందుకు రాలేదు.. అలా నా కుటుంబానికి అర్హతలేని బ్యాచిలర్‌గా మారాను. దీంతో (2004-05 సంవత్సరంలో) కంపెనీ మూసేసి.. కనీసం రూ.30వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని చూసుకొమ్మని నాన్న చెప్పారు’’ అని సంస్థ సీఈఓ విజయ్‌శేఖర్‌ శర్మ పేర్కొన్నారు.. అలాంటి పరిస్థితుల నుంచి రూ.18వేల కోట్ల ఐపీవోతో భారత స్టాక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు విజయ్‌ శేఖర్‌..

వారికి నా సంపాదనే తెలియదు..

పేటీఎం తర్వాత నేను ఏం చేస్తున్నాననే విషయం చాలాకాలం పాటు నా తల్లిదండ్రులకే తెలియదు. ముఖ్యంగా నా సంపాదన ఎంతనే విషయంపైనా వారికి అవగాహన లేదు. నా సంపాదనపై ఓసారి వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి అమ్మ నన్ను అడిగింది. ‘విజయ్‌.. వాళ్లు చెబుతున్నంత డబ్బు నిజంగా నీ దగ్గరుందా..? అని తన తల్లి అడిగినట్లు విజయ్‌ శేఖర్‌శర్మ చెప్పుకొచ్చారు..

రోడ్డుపక్కన ‘టీ’ అంటేనే ఇష్టం..

ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన విజయ్‌శేఖర్‌ శర్మ తండ్రి ఉపాధ్యాయుడు కాగా తల్లి ఓ సాధారణ గృహిణి. 2005లో వివాహం చేసుకున్న శేఖర్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. అత్యంత సాదాసీదాగా ఉండే విజయ్‌శేఖర్‌.. రోడ్డుపక్కన ఉన్న బండిమీద ‘టీ’ తాగేందుకే ఇష్టపడుతారు. అంతేకాకుండా పాలు, బ్రెడ్‌ తీసుకునేందుకు ఉదయం పూట తానే స్వయంగా బయటకు వెళ్తానని విజయ్‌శేఖర్‌ పేర్కొనడం విశేషం.

స్వల్పకాలంలోనే రికార్డు స్థాయికి..

ఇక One97 కమ్యూనికేషన్‌ (పేటీఎం మాతృసంస్థ) పేరుతో 2000 సంవత్సరంలో ఓ కంపెనీని స్థాపించారు విజయ్‌శేఖర్‌ శర్మ. తొలుత టెలికాం ఆపరేటర్లకు కంటెంట్‌ను అందించే సంస్థగా ఉన్న వన్‌97.. 2010లో పేటీఎంగా మారింది. అనంతరం ఆన్‌లైన్‌ పేమెంట్స్‌లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. 2014లో వాలెట్‌ పేమెంట్స్‌ లైసెన్స్‌ పొందింది. ఇదే సమయంలో 2015లో చైనాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ పేటీఎంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం సంస్థ గతిని మార్చేసింది..

అనంతరం భారీ స్థాయిలో సేవలను ప్రారంభించిన పేటీఏం.. అనతికాలంలోనే దేశం నలుమూలలా విస్తరించింది. వీటికితోడు 2016లో కేంద్రప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేయడం.. డిజిటల్‌ పేమెంట్స్‌ విపరీతంగా పెరగడం సంస్థకు కలిసొచ్చింది. ఇలా అనతికాలంలోనే (2017 ఏడాదిలో) యువ బిలియనీర్స్‌ జాబితాలో విజయ్‌శేఖర్‌ స్థానం సంపాదించుకున్నారు..

ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.18వేల కోట్లు (2.4 బిలియన్‌ డాలర్లు). వ్యాపారంలో ఎటువంటి కుటుంబ నేపథ్యం, భారీ నగదు, ఆంగ్లభాషపై పట్టు లేనప్పటికీ ఓ బిలియనీర్‌ స్థాయికి ఎదిగిన విజయ్‌శేఖర్‌ ప్రస్థానాన్ని ఎంతో మంది ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి మంచిమాట. *అసలు మనసు తత్వం ఏమిటి ?*

నేటి మంచిమాట.
అసలు మనసు తత్వం ఏమిటి ?

అగ్నికి గంధపు చెక్క , తుమ్మ చెక్క రెండూ సమానమే.!

అలాగే మనసుకు ప్రపంచ విషయమైనా, భగవంతుడి విషయమైనా ఒకటే. తన సహజ స్వరూపంగా ఉన్నప్పుడు అది ఈ రెండింటిని వదిలేస్తుంది.

పాదరసాన్ని చేతితో పట్టుకోవటం ఎలా సాధ్యం కాదో, మనసులో కూడా ఏ విషయాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచటం సాధ్యంకాదు.

ఉదయం చేసిన పనులన్నింటినీ రాత్రికి మనసు వదిలేస్తుంది. దాన్ని నిద్ర అంటున్నాం.

అలాగే మంత్రజపంచేస్తూ వెళ్ళినా కొద్దిసేపటికి తిరిగి అదే జరుగుతుంది.

మనసుకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు ఉన్నాయి. అందువల్ల మనిషి ప్రతిదీ తాను స్వయంగా తెలుసుకోవాలనుకుంటాడు. అది మనిషి లక్షణం.

అటుగా వెళ్తే కుక్క కరుస్తుందని ఎవరైనా చెప్పినా పూర్తిగా నమ్మడు. ఎప్పుడో ఒకసారి ఆ కుక్క వెంటపడితే గానీ ఆ విషయం అర్థంకాదు.

ఏదైనా మనంతట మనంగా కనుక్కున్నది జ్ఞానం.

మనసు దేన్నైనా వదిలేస్తుందని మంత్రజపంతో మనం స్వయంగా తెలుసుకుంటాం.

మనసే భగవన్నామంగా ఉంది...!✍️

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. *కాస్త ఓర్చుకో..!*

నేటి జీవిత సత్యం. కాస్త ఓర్చుకో..!


ఓశిష్యుడు తన గురువు దగ్గర శిక్షణ పొందుతున్న రోజులవి.
గురువు శిష్యుడిచే ఇంటిని కట్టిస్తున్న సందర్భం.
శిష్యుడికి శరీరమంతా పుండ్లు పుండ్లు అయి వుంది.
భుజాలలోంచి ఎముకలు కనిపిస్తున్నాయి ఇంటిని కట్టడానికి రాళ్లు మోసి..మోసి.

గురువుగారు.. నేను నీకు అలా చెప్పలేదు ... ఇలా కట్టమని చెప్పాను అని ఉద్దేశపూర్వకంగానే కూలదోయిస్తున్నారు.ఇల్లు కడితే గాని జ్ఞానోపదేశం ఇవ్వరు శిష్యుడికి.

ఇంక గురువుగారు తనకు జ్ఞానస్వీకరణ ఇస్తారో ఇవ్వరో అని మహా సందిగ్ధంలో వున్నాడు శిష్యుడు.
పోనీ తన గురువు చెప్పినట్లు ఇల్లు కట్టి ఇవ్వడానికి తన శరీరం మహా పుండుగా మారిపోయింది.
ఓపిక లేదు. వేరే ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది మార్పా శిష్యులు గురువుగారికి కొన్ని బహుమతులు తినుబండారాలూ తెచ్చారు. అందులో ఒక శిష్యుడు ఒక అందమైన కూజా ఒకటి గురువుగారికి బహుమానంగా తెచ్చారు.
గురువుగారి భార్య దాని నిండా తినుబండారాలూ నింపి కష్టపడి ఇల్లు కడుతున్న శిష్యుడికి ఇస్తుంది...

రాత్రి భోజన సమయంలో కూజా తెచ్చుకుని వాటిలో ఉన్న తినుబండారాలను తింటున్నప్పుడు అతని చూపు కూజా మీదికి వెళుతుంది.
చాలా అందంగా బహు ముచ్చటగా ఉంది ఆ కూజా.

తినడం ముగించి నిద్రకు ఉపక్రమిస్తాడు శిష్యుడు.. అయితే పక్కనే వున్న కూజాను చూస్తూ వుండగా ఆ జడపదార్థం మాట్లాడుతున్నట్టుగా భావిస్తాడు.
కూజా మాట్లాడడం మొదలు పెడుతుంది…

’మిత్రమా నేను ఇంత అందంగా ఎలా తయారయ్యానో తెలుసా?’అని అడుగుతుంది.

తెలీదు అన్నట్లు తల ఊపుతాడు.

నేను మా అమ్మ ఒడిలో ఉంటిని బంకమట్టిగా చెరువు గట్టున. ఒక కుమ్మరి వచ్చి గునపంతో పొడిచి నన్ను మా అమ్మ ఒడినుంచి వేరుచేసి తనబండీలో వేసుకుని వెళుతుండగా నేను అడిగాను. "అయ్యా ఏం చేస్తున్నావు?” అని అడిగాను.

దానికి ఆ కుమ్మరి "కాస్త ఓర్చుకో!" అన్నాడు.

నా మీద నీళ్లుపోసి కాళ్లతో బాగా తొక్కాడు. "అయ్యా ఎం చేస్తున్నావు"? అని అడిగాను.

దానికి ఆ కుమ్మరి "కాస్త ఓర్చుకో!" అన్నాడు.

నన్ను ఓ చట్రం మీద వేసి గిర్రున తిప్పాడు. "అయ్యా ఏం చేస్తున్నావు?నన్ను?” అని అడిగితే…

"కాస్త ఓర్చుకో!" అన్నాడు.

తన చేతులతో నన్ను తన ఇష్టం వచ్చినట్లు అదుముతూ ఉంటే అడిగాను… "ఆయ్యా నన్నేం చేస్తున్నావు"? అని.

దానికి అతనన్నాడు "కాస్త ఓర్చుకో!" అని.

నన్ను ఓమట్టి కూజాగా తయారు చేసి ఎండలోబెట్టాడు..

"అయ్యా" అనేలోపే "కాస్త ఓర్చుకో!" అన్నాడు.

ఎండిన తర్వాత నన్ను నిప్పుల కొలిమిలో పెట్టి కాల్చాడు.
"అయ్యా నన్నెందుకు ఇలా కాలుస్తున్నావు"? అంటే…"కాస్త ఓర్చుకో" అన్నాడు.

మళ్లీ నా మొఖానికి ఏవో రంగులన్నీ పూసాడు.
"అయ్యా ఏంటి నా మొఖానికిది"? అంటే… "కాస్త ఓర్చుకో " అన్నాడు.

నన్ను తీసుకెళ్లి అద్దం ముందు ఉంచాడు. నన్ను నేను నమ్మలేకపోయాను. ఇంత అందంగా తయారయ్యానా అని.

కుమ్మరి మహా గొప్పవాడు. అతడు చేసే ప్రతిగాయం, అతడు పెట్టే ప్రతి కష్టం, అతడు పెట్టే ప్రతి పరీక్షకు నేను ఓర్చుకోవడం వల్లే నేనింత అందంగా తయారయ్యాను.

”శిల్పి ఉలి పోటును భరించలేని రాయి శిల్పం కాలేదు! గురువు పరీక్ష కాలాన్ని భరించలేని శిష్యుడు జ్ఞాని కాలేడు!” అన్నది ఆ కూజా.

శిష్యుడు ఈ విధంగా ఒక ప్రాణంలేని అందమైన కూజా గురించి మనో విశ్లేషణ చేసి తనను తాను ఆత్మావలోకనం చేసుకున్నాడు.

గురువుసారం తెలుసుకుని మహాజ్ఞానిగా నిలిచాడు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

బుద్ధుని తలపై కనిపించేవి వెంట్రుకలు కావు... మరి ఏమిటి అవి?

బుద్ధుని తలపై కనిపించేవి వెంట్రుకలు కావు...
మరి ఏమిటి అవి?
==============================
అజ్ఞానానికి వెంట్రుకలు ప్రతీకలను కొందరు విశ్వసిస్తారు. వాటిని అజ్ఞానపు కలుపుమొక్కలుగా భావిస్తారు. అందుకే తలపై వెంట్రుకలు లేకపోతే శరీరం, మెడడు స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు. అందుకే బుద్ధిజం (Buddhism) పాటించే వారు తలపై వెంట్రుకలు ఎప్పటికప్పుడు తీసేయించుకుంటారు. చరిత్రను పరిశీలిస్తే.. గౌతమ బుద్ధుడి తలపై కూడా వెంట్రుకలు ఉండవు. తన రాజ భవనాన్ని వీడే ముందు బుద్ధుడు శిరోముండనం (వెంట్రుకలు తీసేయించుకోవడం) చేయించుకున్నాడు.
మరి ప్రతీ బుద్ద విగ్రహం, ఫొటోల్లో ఆయన తలపై వెంట్రుకల్లా.. రింగులు.. రింగులు కనిపిస్తుంది. ఆయనకు రింగుల జుట్టు ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం 108 రింగులు ఉంటాయి.
కానీ అవి వెంట్రుకలు కావు. అయితే మరి ఆయన విగ్రహాలను, ఫొటోలను ఎందుకలా చూపిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది కదా. నిజానికి బుద్ధుడి తలపై ఉన్నది జుట్టు కాదు.. చనిపోయిన 108 నత్తలు.
కథ ఇదే..
అత్యంత వేడిగా ఉన్న ఓ రోజు మధ్యాహ్నం సమయంలో బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు. ధ్యానంలో మునిగిపోయి ఆయనకు సమయం తెలియలేదు. సమయం గడుస్తున్న కొద్ది ఎండ ఆయన నడినెత్తిపైకి వచ్చింది.
ఆ సమయంలో అటువైపు వెళుతున్న ఓ నత్త (Snail) బుద్ధుడిని చూసింది. తీవ్రమైన ఎండలో ఆయన కూర్చోవడాన్ని గమనించింది. సూర్య కిరణాల వల్ల ఆయన ఏకాగ్రత దెబ్బ తింటుందోమోనని ఆలోచించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా బుద్ధుడి తలపైకి ఆ నత్త ఎక్కింది. శరీరంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా చేసింది. దాన్ని మరిన్ని నత్తలు అనుసరించాయి. అవన్నీ బుద్దుడి తలపై చేరి ఆయనకు చల్లదనాన్ని కలిగించి ధ్యానానికి భంగం కలుగకుండా చేశాయి.
గంటల పాటు ఆ నత్తలు అలాగే బుద్ధుడి తలపైనే ఉన్నాయి. ఆయన ధ్యానం కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే సూర్య కిరణాలు మరింత వేడిగా మారడంతో నత్తలు తీవ్రంగా నీరసించిపోయాయి. వాటి శరీరాల్లోని నీటి శాతం మొత్తం పడిపోయింది. దీంతో ఒక్కొక్కటిగా మరణించాయి. ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తలపై 108 నత్తలు చనిపోయి ఉన్నాయి. ధ్యానం నుంచి లేచాక ఆయన ఈ విషయాన్ని గుర్తించాడు. తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని అనుకున్నాడు.
బుద్ధుడి కోసం ప్రాణాలు అర్పించిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు. అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్దుడి విగ్రహాలను, ఫొటోలను, చిత్రాలను తయారు చేస్తారు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

🙏“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే” .. ఎక్కువ తక్కువలు లేవు ఆ ప్రత్యక్ష దైవాల లో🙏 ఈ వ్యాసం తల్లిదండ్రు లందరికీ అంకితం🙏

బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.

“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.

“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.

దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.

“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.

“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.

మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.

అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.

బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.

“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.

“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.

“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.

ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.

ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.

ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.

మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.

కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.

నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.

నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.

“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.

నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.

ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.

“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.

“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.

“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.

“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.

ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.

🙏“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”
.. ఎక్కువ తక్కువలు లేవు ఆ ప్రత్యక్ష దైవాల లో🙏
ఈ వ్యాసం తల్లిదండ్రు లందరికీ అంకితం🙏

Source - Whatsapp Message

ఎరుకతో ధ్యానం

ఎరుకతో ధ్యానం

మనిషి ఉనికి ఆత్మశక్తిపై ఆధారపడి ఉంది. అది ఉన్నందుకే ‘నేను ఉన్నాను’ అని మనిషి భావించగలుగుతున్నాడు ఇతరులతో ఉన్నప్పుడు ‘నేను’ అనే మాట పలుకుతాడు. సర్వకార్యాలు నిర్వర్తించగలుగుతాడు.

‘విలువలతో చక్కగా జీవించే మనిషికి ఉనికి మొదటిస్థానం, హృదయం రెండోస్థానం, మనసు మూడోస్థానంలో ఉంటాయి’ అని ప్రసిద్ధ తత్వవేత్త ఓషో అనేవారు. హృదయం స్పందిస్తుంది. మనసు ప్రతిస్పందిస్తుంది. ఉనికి గమనిస్తుంది. కేవలం ‘గమనించడం’ మాత్రమే తెలిసిన ఏకైక గుణం ఉనికిది. ‘గమనించడం’ అంటే చూడటమే! కాని, చూడటంకన్నా ‘గమనించడం’ ఉన్నతమైంది. ‘గమనించడంలో- చూడటం, వినడం రెండూ ఉంటాయి’ అని అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి!

పశుపక్ష్యాదులు ఎప్పుడూ గమనింపుతో జీవిస్తాయి. అందుకనే అవి ఎరుకతో ఉంటాయి. ఫలితంగా, రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఎన్నో తెలివితేటలున్న మనిషి మాత్రం ప్రమాదాల బారిన పడుతుంటాడు. కారణం, అనవసరమైన ఆలోచనల వలలో అతడు చిక్కుకోవడంవల్లే! అంటే, పరధ్యానంలో పడటమన్నమాట.

ప్రస్తుత క్షణాల్లో ఉండకుండా గతానికి సంబంధించిన ఆలోచనలతో గడపడమే పరధ్యానమంటే! మనిషి పరధ్యానంలో ఉంటే ఎరుక తప్పుతాడు. అప్పుడు సమస్యలు కాకుల్లా వచ్చి అతడిపై వాలతాయి. మనిషి ఆలోచనలతో ఉన్నంతవరకు, మనసు బయట సంచరిస్తూ ఉంటుంది. అదే మనిషి ఒక పనిలో నిమగ్నమైతే ఆ వెంటనే మనసు నిశ్చలమవుతుంది. అప్పుడది లోపలికి చూస్తుంది. చేపట్టిన పనికి కావాల్సిన జ్ఞానం అంతశ్చేతనలో నుంచి తీసి ఇస్తుంది.

మనసు సముద్రగర్భం వంటిది. సముద్రం లోపల అప్పుడప్పుడూ హిమ ఖండాలు(ఐస్‌బర్గ్స్‌) తయారవుతాయి. అవి పర్వతాల్లా పరచుకొని పెరుగుతాయి. పైకిమాత్రం కొనతేలి చిన్న మంచుముక్కలా కనబడతాయి. వాటిని సరిగ్గా గమనించకపోతే సముద్ర ప్రయాణికులు ఆపదల్లో చిక్కుకున్నట్లే! మనిషికి వచ్చే వ్యాధులూ హిమ ఖండాల్లా మనసు లోతుల్లో ప్రాణం పోసుకుంటాయి. తదుపరి మనసులోపలే పర్వతాల్లా పెద్దగా అవుతాయి. ఆ తరవాత శరీరాన్ని తాకుతాయి. అంటే, ముదిరిన తరవాత వ్యాధి బయటపడటమన్న మాట! అప్పుడుగాని మనిషి తనకు జబ్బు చేసిందని గ్రహించడు. ఇలా ఎందుకు జరుగుతుంది? మానసిక స్థిరత్వం లేకపోవడం వల్లే! ఎప్పుడైతే మనసు నిలకడగా ఉండదో అప్పుడు ఎరుక ఉండదు. ఎరుక లేనప్పుడు తన ఉనికిపట్ల స్పృహ ఉండదు. అంటే తనతోతాను ఉండనప్పుడు, తన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండటం అన్నమాట!

రాత్రిపూట ఇంట్లో హఠాత్తుగా దీపాలు ఆరిపోతే ఏమవుతుంది? ఆ చిమ్మచీకట్లో ఎవరికీ ఏమీ కనపడదు. అప్పటివరకూ ఏవేవో పనులు చేసుకుంటున్న మనసు ఆ క్షణంలో నిశ్శబ్ధమై పోతుంది. అప్పుడు మనిషి ఉనికి అతడి స్పృహలోకి వస్తుంది. ఎరుక మేల్కొంటుంది. చీకట్లో కొవ్వొత్తి కోసం చేసే వెతుకులాటలో గమనింపు సహకరిస్తుంది. ఇదంతా ధ్యానమే! అందువల్లే ‘ధ్యాన సాధనలో గమనించడమే ప్రధానం’ అంటారు తత్వవేత్తలు!

మనిషి ఏ పనిచేసినా, చివరలో ఒక ఫలితం కచ్చితంగా వస్తుంది. అది ప్రకృతి సూత్రం! ఒక అంకురం మట్టిలో నాటితే అది పెరిగి పెద్దదవుతుంది. పువ్వులు, ఫలాలు ఇస్తుంది. కనీసం రెండు ఆకులైనా ఇస్తుంది. ఏదీ ఇవ్వలేదంటే అసలక్కడ మొక్కే నాటలేదు, లేదా నాటిన మొక్కను బాగా చూసుకోలేదని నిర్ధారించుకోవచ్చు.

ధ్యానసాధనలో సాధకుడు కరుణామూర్తిగా మారాలి. ప్రేమికుడై పోవాలి. ఆనందపరవశుడు కావాలి. కొత్తగా నాటిన మొక్కకు పువ్వు పూసినట్లుగా, ధ్యానం చేసేవారికి ఒకరోజు ప్రేమ వికసించాలి. అలా జరగకపోతే ధ్యానంలో ఏదో లోపం ఉందని భావించాలి. గమనింపు- రెప్పలేని ‘కన్ను’ లాంటిది. మనసు- ఆ కంటికి ‘రెప్ప’వంటిది. రెప్ప తెరిస్తేనే చూడటం ఆరంభమవుతుంది. అప్పుడు ‘ఆనందం’ మనిషి సొంతమవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. పూజ్య గురుదేవుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.. 💐💐💐
గురువారం --: 25-11-2021 :-- ఈరోజు మంచి మాట..లు

పూర్యం రోజుల్లో మనషులు రాళ్ళతో నిప్పు పుట్టించేవారట , ఇప్పటి రోజుల్లో మనషులు మాట లతో ఏకంగా తగల బెట్టిస్తున్నారు ఆయుధం లేకుండా చంపేది నాలుక బతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైనవాడిని పిచ్చి వాడిగా చేసేది ద్రోహం వీటితో జాగ్రత్త సుమా !

ఈ ప్రపంచమంతా అవకాశ వాదులతోనే నిండి ఉంది ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది పక్క వాళ్ళ మిద ఏడ్చే మనుషులు మూడు రకాలుగా ఉంటారు వాళ్ళకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు , ఎదుటివాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు మరి కొందరు .

నీ జీవితం సుదూరపు ప్రయాణం మనమందరం కూడా బహుదూరపు బాట సాటసారులమే ఎప్పుడైనా మంచి జరిగితే వేడుక చేసుకొని ముందుకు సాగిపో ఏమైనా చెడు జరిగితే మర్చిపోయి ముందుకు కోనసాగించు అసలేం జరగలేదనుకో అయినప్పటికి అడుగులు ఆపకుండా ముందుకు వెయ్ ఏదోఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది ఏం జరిగినా ఎడతెగని ప్రయాణం మాత్రం ఆపద్దు .

మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు , ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు . నీ జీవితం ప్రశాంతంగా ఉండా లంటే నీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో నీవు తల దూర్చ కూడదు .

సేకరణ 🖊️మీ ..ఆత్మీయుడు AVB సుబ్బారావు

Source - Whatsapp Message

మంచి మాట....లు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🤝.. అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. అలానే వానలు వరదల వలన నష్టపోయిన కుటుంబాలవారిని.. చిరు వ్యాపారాలు.. చిరు ఉద్యోగులను ప్రభుత్వం తో పాటు మానవత్వంతో అందరు ఆదుకోవాలని కోరుకుంటూ..
సోమవారం --: 22-11-2021 :--

రెండు పదాలు నీ జీవితాన్నే మార్చేయ గలదు ఒకటి చేయగలననే ఆత్మవిశ్వాసం రెండు చేయలేననే అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తారో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది .

నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది , నువ్వు నిజాయితీగా ఉంటే చాలా మంది నీతో పాటు ఉండక పోవచ్చు కానీ కచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు ,

ఆపదకి సంపద నచ్చదు సంపదకు బంధం నచ్చదు బంధానికి బాధ నచ్చదు బాధకు బ్రతుకు నచ్చదు బ్రతుకుకి చావు నచ్చదు చావుకి పుట్టుక నచ్చదు కానీ వీటిన్ననింటిని మనం అనుభవించాలి .

అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం అలిసిపోయి కన్నుమూస్తే బ్రతికించ లేదు ఏ బంధం దారిలోన చీకటైతే తోడు రాదు నీ నిడ జారిపోయి దూరమైతే చేరుకోదు నీ ప్రేమ అందుకే నిన్నే నమ్ముకో నీకు నువ్వు గానే సాగిపో ఓ నా ప్రియ నేస్తమా జాగ్రత్త సుమా ఈ జీవితం .

సేకరణ 🖊️*మీ ...ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

మంచి మాట....లు

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు, తిరుత్తని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..మంగళవారం --: 23-11-2021 :-- ఈరోజు మంచి మాట....లు

బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమలు స్నేహాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకండాలి నలుగురితో కలిసుండాలంటే చిన్న చిరు నవ్వుతో పలకరింపులు ఉండాలి ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది .

మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటపుడు హృదయాన్ని తీసుకెళ్ళండి ఎఃదుకంటే మీ కుటుంబం మీ కోసం ప్రేమని పంచాలని ఎదురు చూస్తుంది .

నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మనల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం .

కేవలం డబ్బుకి విలువ పెరిగి మనిషి విలువ తగ్గింది కదా ! అందుకే స్వార్థం అసూయలు పెరిగి ఆప్యాయతలకి దూరమై రోజు రోజుకి మనలో ఆనందం దూరమైపోయింది ఇది అర్థమవ్వాలంటే పాత ఆప్యాయతలు ఆనందాలు గుర్తుకు వస్తాయి మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడువకు ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే .

సేకరణ 🖊️మీ .ఆత్మీయుడు .. AVB సుబ్బారావు

Source - Whatsapp Message

Monday, November 22, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు. ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం తో మీరు మీ కుటుంబగసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..అందరం బాగుండాలి అందులో మీరు మరీ బాగుండాలి
ఆదివారం --: 21-11-2021 :--

ఈ రోజు AVB మంచి మాట...లు


నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికి నమ్మకు ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే, ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు , కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడుతాము.. గడిచిన కాలం ఎన్ని కోట్లు పెట్టినా వెనకకు తీసుకురాలేము

ఎన్ని భూములు కొన్నామన్నది కాదు ముఖ్యం ఎదుటివారి మనసులో ఎంత స్థలం సంపాదించామన్నది ముఖ్యం మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం,అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం .

వెంటుంటాం అనే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనే వాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందరనటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకూ వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే ఈ లోకం తీరు
సేకరణ. 🖊️మీ.ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులకు కార్తీక శనివారపు శుభోదయశుభాకాంక్షలు 💐🤝 లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు మరియు తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ. చెప్పుడు మాటలు చెవులకు ఇంపుగా నే ఉంటాయి కానీ వాటిని ఇంకొకరికి చెప్పినప్పుడు మీ గౌరవం తగ్గిపోతుంది జాగ్రత్త మిత్రమా అవే మాటలు మన విషయంలో చెప్పినప్పుడు మనం ఎంత క్షోభ కు గురవుతామో అర్థమైతే ఇంకొకరు విషయంలో మనం అలా చెప్పలేము..

శనివారం --: 20-11-2021 :--

ఈ రోజు AVB మంచి మాట...లు
. మంచి తనం ఎప్పటికి కష్టం గానే ఉంటుంది అంత మాత్రన మంచితనాన్ని వది లేస్తే అసలు మీలో మంచితనమే లేనట్టు మంచితనానికి ఓపిక చాలా ఎక్కువ ప్రొణం పోయే పరిస్థితి వచ్చినా మంచితనం పోకూడదు మీలో నిజంగా మంచితనం అనేది ఉంటే

అబద్దాలతో మోసాలతో కీర్తి ఫ్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకొన్నా అది కుప్పకూలి పోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం

సంపాదించడం అంటే కేవలం డబ్బు నే కాదు మనషుల్ని విలువల్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు మనల్ని అదుకునే వాళ్ళని బాధల్లో ఉన్నప్పుడు దైర్యాన్ని నింపేవారిని మన కోపాన్ని అర్థం చేసుకునెవరిని సంపాదించడం అని తెలుసుకోండి

రాజకీయాలను ఎవరుకూడా వ్యక్తిగతంగా తీసుకోకండి స్నేహలు కుటుంబం బంధాలు బంధుత్వాలు చాలా గొప్పవి అనవసరంగా రాజకీయల కోసం మంచి స్నేహితులను వదులుకోకండి రేపు మనకు సమస్య వస్తే రాజకీయ నాయకులు వస్తారో లేదో కానీ స్నేహితులు కుటుంబం బంధాలు బంధుత్వాలు తప్పక మన వెంట ఉంటారు అని తెలుసుకుందాం నేస్తమా

సేకరణ 🖊️*మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝💐

Source - Whatsapp Message

Sunday, November 21, 2021

90℅ అర్ధ నగ్నంగా ఉన్న స్త్రీలను చూసి ఆనందించేవారు ఎవరో తెలుసుకోండి, స్త్రీ స్వేచ్ఛవిషయమై నిజం తెలుసుకోండి, ఈ లేఖను చదివి సత్యాన్ని అర్థం చేసుకోండి.

90℅ అర్ధ నగ్నంగా ఉన్న స్త్రీలను చూసి ఆనందించేవారు ఎవరో తెలుసుకోండి, స్త్రీ స్వేచ్ఛవిషయమై నిజం తెలుసుకోండి, ఈ లేఖను చదివి సత్యాన్ని అర్థం చేసుకోండి.
-------------
ఒకరోజు ఓ విశేష కార్యక్రమంలో స్థానికంగా మహిళా సభ ఏర్పాటు చేయగా సభాస్థలికి వచ్చిన మహిళలు ఎక్కువ, పురుషుల సంఖ్య తక్కువ..!!
దాదాపు ఇరవై ఐదేళ్ళ సుందరి వేదికపై మోడ్రన్ దుస్తులు ధరించి మైక్ పట్టుకుని మగ సమాజాన్ని తిట్టిపోసింది..!!

అదే పాత గోల... మగవారి దుష్టపు ఆలోచన చెడు ఉద్దేశాలను నిందించింది, పొట్టివి చిన్నవైన బట్టలు ధరించే స్వేచ్ఛను వెనకేసుకువస్తూ, అది లేకపోవటం జనాల ఆళోచనలలో లోపం, రోగం అని చెప్పింది.. ఏదికావాలంటే అది ధరించే స్వేచ్ఛను సమర్థించింది.

ఆ తర్వాత హఠాత్తుగా సభాస్థలం నుంచి ఆకర్షణీయంగా మంచి దుస్తులు ధరించి ఉన్న ముప్పై, ముప్పై రెండేళ్ల యువకుడు లేచి నిలబడి తన అభిప్రాయాలు చెప్పేందుకు అనుమతి అడిగాడు..!!

అనుమతి తీసుకుని మైక్‌ను ఆయన చేతులకు అందజేశారు. మైక్ చేతికి రాగానే మాట్లాడటం మొదలుపెట్టాడు..!

తల్లులారా, అక్కా చెల్లెళ్ళారా, మీరందరూ ఎవరో నాకు తెలియదు. మీకెవరికీ నేను తెలియను, కానీ చూస్తే నేను ఎలాంటి వ్యక్తినో చెప్పగలరు. నా దుస్తులపరంగా మీరు నా గురించి ఎలా భావిస్తున్నారు- రౌడీషీటర్ లాగా ఉన్నానా లేక డీసెంట్ గానా..??

సభా స్థలం నుండి అనేక స్వరాలు ప్రతిధ్వనించాయి- మీరు దుస్తులు, సంభాషణలో మర్యాదగా కనిపిస్తున్నారు... మీరు గౌరవంగా ఉన్నారు... మీరు గౌరవంగా కనిపిస్తున్నారు....

ఇది వింటూనే ఒక్కసారిగా అతను వింతగా ప్రవర్తించాడు... హాఫ్ ప్యాంట్ టైపులో ఉన్న తన లోదుస్తులను మాత్రమే వదిలేసి స్టేజిపైనే మిగతా బట్టలన్నీ తీసేసాడు..!!

ఇది చూసి.... సభా స్థలమంతా ఆగ్రహావేశాలతో దద్దరిల్లింది. మోసగాడు, గుండా, సిగ్గులేని వాడు, అసలు ఏమాత్రం లజ్జలేదు.. వీడికి లజ్జా అభిమానం అంటూ ఏమీ లేదు....వీడిని వదలొద్దు...

ఈ కోపంతో కూడిన మాటలను విని అతను ఒక్కసారిగా మైక్‌లో గర్జించాడు...

“ఆగండి... ముందు నా మాట వినండి, ఆ తర్వాత చంపండి, నన్ను సజీవ దహనం చేయాలన్నా చేయవచ్చు..!!

ఇప్పుడే.... ఈ సోదరి- చిన్న బట్టలూ, బిగుతుగా, పొట్టిగా ఉన్న బట్టల పక్షం తీసుకుని, వస్త్ర స్వాతంత్య్రం కోసం వేడుకుంది... వస్త్రస్వతంత్రం లేకపోవటం "ఉద్దేశం మరియు ఆలోచనలో తప్పు" అని చెబుతోంది...!!

అప్పుడు మీరంతా చప్పట్లు కొట్టి సమ్మతిని తెలియజేసారు.. మరి నేనేం చేశాను..??

బట్టల స్వేచ్చ మాత్రమే చూపించాను..!!

"ఉద్దేశం, ఆలోచనలలో" లోపమేమీ లేదు కదా, పైగా నేను మిమ్మల్ని ఉద్దేశించి ... అమ్మా అక్కా చెల్లెలు, అన్నా తమ్ముడు అనే సంబోధించాను కూడా కదా.. ఇప్పుడు నేను అర్ధనగ్నంగా ఉన్న వెంటనే ... "తమ్ముడు మరియు కొడుకు" ఎందుకు కనిపించలేదు. .??

నా ఉద్దేశంలో లోటు ఉన్నదని మీకెందుకు అనిపించింది..??

మీరు నాలో "మగవాడిని" మాత్రమే ఎందుకు చూస్తున్నారు? తమ్ముడు, కొడుకు, స్నేహితుడు ఎందుకు మీకు కనిపించలేదు? మీలో ఎవరికీ "ఆలోచనా ఉద్దేశ్యం"లో లోపం కూడా లేదే... అలాంటప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది?? ,

నిజం ఏంటంటే..... ప్రజలు అబద్ధాలు చెబుతారు... "బట్టలు" మరియు "వస్త్రధారణ" వల్ల ఏమీ తేడా రాదు, పట్టింపు ఉండదు అని..

వాస్తవమేమిటంటే, మానవ స్వభావం ప్రకారమే ఒకరిని "పూర్తిగా ఆవరణ" లేకుండా అర్ధనగ్నంగా చూడటం వల్ల మనస్సులో లైంగిక భావన మేల్కొంటుంది...

రూపం, రుచి, శబ్దం, వాసన, స్పర్శ, ఇవి చాలా ప్రభావవంతమైన కారకాలు, వాటి ప్రభావం వల్ల "విశ్వామిత్ర" వంటి మహర్షి మనస్సులో ఒక రుగ్మత తలెత్తింది.. అతను రూపాన్ని మాత్రమే చూశాడే.. ఇక మామూలు మనుషుల సంగతి ఏమని చెప్పాలి?

దుర్గా సప్తశతి దేవీ కవచంలో, 38వ శ్లోకంలో, భగవతిని ఈ కారకాల నుండి రక్షించమని ప్రార్థన చేయబడింది.

“రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగిని.
సత్వరజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా.

రుచి, వాసన, శబ్దం తాకడం వంటి ఈ విషయాలను అనుభవిస్తూ ఉన్న వేళ, యోగినీ దేవిని రక్షించుగాక.. సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని నారాయణీ దేవి రక్షించుగాక.

ఇప్పుడు చెప్పండి, భారతీయ హిందూ స్త్రీలను "హిందూ సంస్కారం"లో బ్రతకమని చెప్తే, ఏ స్త్రీల "స్వేచ్ఛ"ను హరించుకుపోయిందిటా..??

సోషల్ మీడియాలో అర్ధనగ్నంగా ఎగురుతున్న గెంతుతున్న 90% మంది అమ్మాయిలు-మహిళలు.. హిందువులే.. మరి 90% మంది సరదాగా ఆనందిస్తున్న మగవారెవరో చెప్పాలా?

* కళ్ళు తెరవండి... మిమ్మల్ని మరియు మీ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే భారతీయ సమాజం సంస్కృతికి ఆధారం మహిళా శక్తి.. మత వ్యతిరేకులు, అధార్మిక, చండాలు (బాలీవుడ్, వామపక్షాలు) మన సమాజపు పునాదిని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నారు..!! ?
[వాట్సాప్ లో వచ్చిన ఓ హిందీ లేఖకు తెలుగు అనువాదం]

Source - Whatsapp Message