*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *శ్రీమద్మహాభారతంలోని పాత్రలు మన నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు.*
💕*మహా భారతం మనకి మన దేశ చరిత్రని చెప్పటంతో పాటు జీవితంలో విజయాలను సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది.*
💞 *ధృతరాష్ట్రుడు తనబిడ్డల మీద ప్రేమ, తాను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య చాలా నలిగిపోయాడు. కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారిని తప్పులు చేయకుండా ఆపలేకపోయాడు. ఆయన తన బిడ్డలమీద అంత ప్రేమను పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టిఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరిమీద ఐనా అతిప్రేమ, అతి నమ్మకం వినాశనానికీ, మోసానికీ దారితీస్తాయి.*
❤️ *కౌరవుల తల్లి గాంధారికి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు.*
💓 *శకుని... పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి, వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వారు జీవితంలో చాలా మంది మనకు బంధుమిత్రుల రూపాల్లో ఎదురౌతారు.*
💖 *కర్ణుడు అంటేనే మంచితనానికి, దానధర్మాలకి పెట్టింది పేరు. కాని సమయాన్ని బట్టి తగిన నిర్ణయాలను తీసుకోకపోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కనుక జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులనీ, సమయాన్నీ బట్టి మార్గాన్ని ఎంచుకోవాలి. చెడుస్నేహం ఊహలకి కూడా అందని విధంగా జీవితాలను నాశనం చేస్తుందనడానికి కర్ణుడే ఉదాహరణ.*
💕*అర్జునుడు జీవితమంతా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యులవారి నుండి యుద్ద శాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతిదశలోనూ అభ్యసించడంతో అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవడం వలన విజయాలు వరిస్తాయి.*
💖 *కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులనీ, వాళ్ళ సామ్రాజ్యాన్నీ నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం వాళ్ళని అవమాన పరచడం అనేది చాలా పెద్ద పాపం.*
💓 *పద్మవ్యూహం లోనికి ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడివంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. అలా కాకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలి వేయాల్సిన పరిస్థితి వస్తుంది.*
💞 *మనకు తెలిసినంతవరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలుకాడు. కానీ కుటిల రాజకీయాలవల్ల తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురుశిక్షణ లేకున్నా అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది.*
💖 *కనుక ఏది సాధించాలన్నా ముందుగా మనకు దానిమీద అమితమైన ఆసక్తి ఉండాలి. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యాలౌతాయి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment