Saturday, June 14, 2025

 ✡ *జపతో నాస్తి పాతకం!!!* ✡


*ఒక భక్తుడు గాయత్రి దేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా వుండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మెదలుపెట్టాడు. అతను నిర్మించుకున్న పర్ణశాలను చూసి దారినపోయె ఓ గొల్లవాడు రోజు వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళుతుండే వాడు. అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయటపెట్టి అయ్యా ... అని అరిస్తే ధ్యానంలో వుండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చినచెంబుని బయట ఇచ్చే వాడు.*
*రోజూ ఇలా జరుగుతుండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేసాడు. అయినా అమ్మ దర్శనం కాలా విసుగెత్తిపోయాడు. ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోసంపక్కన వున్న అడవికి వెళ్ళాడు.*
*ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంబు అక్కడపెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు.* *ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు.* *అయన్ని చూసి అడిగాడు గొల్లవాడు ఏంస్వామి మీరు వివాహం చేసుకున్నారు అమ్మ వుందని నాకు చెప్పలేదు.*
*ఆశ్చర్యపోయిన స్వామి నేను వివాహం చేసుకోవడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ?అని కోపంతో ఊగిపోయాడు*
*అందుకు గొల్ల వాడు మీరు అబద్దం చెపుతున్నారు ఇప్పుడు నేను పాల చెంబు* *ఇక్కడ పెట్టి కేకేశా అమ్మ వచ్చి చెంబు* *తీసుకేళ్ళింది అన్నాడు*
*అదిరిపోయిన స్వామి* *నువ్వు అమ్మను చూశావా? అని* *అడిగాడు అందుకు గొల్ల వాడు అమ్మ బయటకు రాలా కానీ చేతితో తీసుకుంది నాఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది.*  *అన్నాడు*
*ఆ చేతి ని వర్ణించ* *మన్నాడు స్వామి గొల్ల వాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా వుంది.* 
*వళ్ళు పులకరించిన స్వామి లోనికి* *పరుగేత్తేడు గొల్లవాణ్ణి* *లోనికి రమ్మన్నాడు*
*లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా వుంది.* 
*చూసావా స్వామి మీరు అబద్దం చెపుతున్నారని బయటికి వెళ్ళాడు గొల్ల వాడు.* 
*ఏడ్చాడు స్వామి.*
*ఇంత దయలేదా* *నామీద మాతా అని* *భోరున విలపించాడు*
*అప్పుడు జగన్మాత వాక్కు ఇలా* *వినిపించింది "నువు చేసిన పాప ప్రక్షాళనికే ఇన్నేళ్ళు పట్టింది.* *అది తీరిపోయింది ఇక నీకు దర్శనమౌతుంది. మరలా నా మంత్ర జపం చేయి" అని అంది అమ్మ.*
*బయట వున్న గొల్ల వాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ భ్రాంతిలో వెళ్ళి పోయాడు.*
*జపతో నాస్తి పాతకం.*

      ♥ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః♥
   ✡✡✡✡✡✡

No comments:

Post a Comment